*శ్రీమద్రామాయణం మీద 108 ప్రశ్నలు*

*శ్రీమద్రామాయణం మీద 108 ప్రశ్నలు*


  ౼> రామాయణం చదవాలనుకున్న వారి కోసం తయారు           చేయబడిన ప్రశ్నలు...

1. శ్రీ మద్రామాయణము రచించిన మహర్షి ఎవరు?
    = వాల్మీకి.

2. వాల్మీకి మహర్షికి రామాయణ గాథను ఉపదేశించిన            ముని ఎవరు?
    = నారదుడు.

3. రామకథను వినిన తర్వాత వాల్మీకి మహర్షి, మధ్యాహ్న      స్నానానికి ఏ నదికి వెళ్లాడు?
    = తమసా నది.

4. శ్రీమద్రామాయణంలో మొత్తం ఎన్ని శ్లోకాలు వున్నాయి?
    =24,000.

5. శ్రీమద్రామాయణాన్ని గానము చేస్తూ మొదట ప్రచారం           చేసిందెవరు?
     =కుశలవులు.

6. అయోధ్యా నగరం ఏ నది ఒడ్డున ఉన్నది?
    =సరయూ నది.

7. అయోధ్య ఏ దేశానికి రాజధాని?
    =కోసల రాజ్యం.

8. దశరథ మహారాజుకు ఆంతరంగికుడైన మంత్రి ఎవరు?
    =సుమంత్రుడు.

9. దశరుథుని భార్యల పేర్లు ఏమిటి?
    =కౌసల్య, సుమిత్ర, కైకేయి.

10. సంతానం కోసం దశరథుడు చేసిన యాగం పేరు?
     =పుత్రకామేష్ఠి.

11. యజ్ఞకుండమునుండి వెలువడిన దివ్య పురుషుడు             ఇచ్చిన పాయసాన్ని దశరథుడు తన భార్యలకు ఎట్లు         పంచెను?
       = కౌసల్యకు 50%, సుమిత్రకు 25%, కౌకేయికి                   12.5%, మిగిలిన 12.5% మళ్లీ సుమిత్రకు.

12. బ్రహ్మదేవుని ఆవలింత నుండి పుట్టిన వానరుడెవరు?
      =జాంబవంతుడు.

13. వాలి ఎవరి అంశతో జన్మించెను?
       = దేవేంద్రుడు.

14. వాయుదేవుని వలన జన్మించిన వానరుడెవరు?
     =హనుమంతుడు.

15. కౌసల్య కుమారుని పేరేమిటి?
      =శ్రీరాముడు.

16. భరతుని తల్లి పేరేమిటి?
      =కైకేయి.

17. రామలక్ష్మణ భరత శత్రుఘ్నలలో కవలలు ఎవరు వారి         తల్లి పేరేమిటి?
       =లక్ష్మణ, శత్రుఘ్నులు- తల్లి సుమిత్ర.

18. రామలక్ష్మణ భరత శత్రుఘ్నులకు నామకరణము                 చేసిన మహర్షి ఎవరు?
      =వసిష్ఠుడు.

19. విశ్వామిత్రుడు వచ్చేనాటికి రాముని వయస్సు?
      =12 సంవత్సరములు.

20. విశ్వామిత్రుని యజ్ఞానికి విఘ్నాలను కల్పిస్తున్న                  రాక్షసులెవరు?
      =మారీచ, సుబాహులు.

21.  రామునికి అలసట, ఆకలి లేకుండా వుండుటకు                 విశ్వామిత్రుడు ఉపదేశించిన మంత్రం పేరేమిటి?
       =బల-అతిబల.

22. విశ్వామిత్రుని ఆశ్రమం పేరు?
      =సిద్ధాశ్రమం.

23. తాటక భర్త పేరేమిటి?
      =సుందుడు.

24. తాటకను శపించిన మహర్షి ఎవరు?
      =అగస్త్యుడు.

25. గంగను భూమికి తెచ్చుటకు తపస్సు చేసినదెవరు?
       =భగీరథుడు.

26. గంగకు జాహ్నవి అనే పేరు ఎందుకు వచ్చెను?
      =జహ్ను మహర్షి చేత త్రాగివేయబడుటచే.

27. అహల్య భర్త ఎవరు?
      =గౌతమ మహర్షి.

28. జనక మహారాజు ఆస్థాన పురోహితుడెవరు?
      =శతానందుడు.

29. సీత ఎవరికి జన్మించెను?
      =నాగటి చాలున జనకునికి దొరికెను.

30. శివుడు తన ధనుస్సును ఏ మహారాజు వద్ద వుంచెను?
      =దేవరాతుడు.

31. శివధనుస్సును తయారు చేసినదెవరు?
      =విశ్వకర్మ.

32. భరత శత్రుఘ్నల భార్యల పేర్లు?
       =మాండవి, శృతకీర్తి.

33. లక్ష్మణుని భార్యయైన ఊర్మిళ తండ్రి ఎవరు?
       =జనకుడు.

34. జనకుడి తమ్ముడి పేరు ఏమిటి?
      =కుశధ్వజుడు.

35. పరశురాముడు శ్రీరామునికి యిచ్చి ఎక్కుపెట్టమన్న             ధనుస్సు పేరేమిటి?
       =వైష్ణవ ధనుస్సు.

36. భరతుని మేనమామ పేరు ఏమిటి?
      =యధాజిత్తు.

37. దశరధుని వరాలు కోరమని కైకను ప్రేరేపించినదెవరు?
      =మంధర.

38. కైక దశరథుణ్ణి వరాలు కోరినపుడు భరతుడెచట                వుండెను?
      =గిరివ్రజపురం, మేనమామ యింట.

39. రాముని మిత్రుడు గుహుడు వుండే ప్రాంతమేది?
      =శృంగిబేరపురం.

40. సీతారాములు తమ వనవాసం మొదటిరోజు రాత్రి ఏ          వృక్షం క్రింద నిద్రించెను?
      =గారచెట్టు.

41. శ్రీరాముని వనవాసమునకు చిత్రకూటము తగినదని             సూచించిన ముని ఎవరు?
       =భారద్వాజ ముని.

42. పర్ణశాలకు సమీపములోని నది పేరేమిటి?
       =మాల్యవతీ.

43. దశరథుని శవమును భరతుడు వచ్చే వరకు ఏడు              రోజులపాటు ఎక్కడ భద్రపరిచారు?
      =తైలద్రోణములో.

44. శ్రీరామునితో నాస్తికవాదన చేసినదెవరు?
      =జాబాలి.

45. భరతుడు రాముని పాదుకలనుంచిన పట్టణమేది?
      =నందిగ్రామము.

46. అత్రిమహాముని భార్య ఎవరు?
     =అనసూయ.

47. దండకారణ్యంలో రామలక్ష్మణులను ఎదుర్కొన్న                 మొదటి రాక్షసుడెవరు?
       =విరాధుడు.

48. పంచవటిలో నివసింపుమని రామునికి సలహా                    ఇచ్చినదెవరు?
       =అగస్త్యుడు.

49. పంచవటి ఏ నదీతీరమున ఉన్నది?
      =గోదావరి.

50. లక్ష్మణుడు ఎవరి చెవులు ముక్కు కోసెను?
       =శూర్ఫణఖ.

51. ఖరదూషణాది పదునాలుగు వేల మంది రాక్షసులు            ఎక్కడినుండి పంచవటికి వచ్చెను?
       =జనస్థానము.

52. సీతను అపహరించుటకు రావణుడు ఎవరి                         సహాయము కోరెను?
        =మారీచుడు.

53. సీత రాముడిని కోరిన మాయా మృగం ఏది?
       =బంగారులేడి.

54. సీతను తీసుకుపోతున్న రావణునితో యుధ్ధము చేసిన         పక్షి ఎవరు?
       =జటాయువు.

55. సీతను అన్వేషించుచున్న రామలక్ష్మణులకు                       అరణ్యములోని మృగములు ఏ దిక్కుకు సంకేతము            చూపెను?
       =దక్షిణపు దిక్కు.

56. సీతాన్వేషణలో వున్న రామలక్ష్మణులు ఏ రాక్షసుని              హస్తములలో చిక్కుకొనెను?
      =కబంధుని.

57. సీతాన్వేషణలో రామలక్ష్మణులు చేరుకున్న శబరి                 ఆశ్రమం ఏ నదీ తీరాన, ఏ వనంలో వున్నది?
       =మతంగ వనం, పంపానదీ.

58. సుగ్రీవాదులు ఏ పర్వత ప్రాంతంలో నివసించు                    చుండెను?
      =ఋష్యమూక పర్వతం.

59. రామలక్ష్మణులను గురించి తెలుసుకొనుటకై                       వారివద్దకు సుగ్రీవుడు ఎవరిని పంపెను?
       =హనుమంతుడు.

60. రామసుగ్రీవుల మైత్రి ఎవరి సాక్షిగా జరిగెను?
       =అగ్ని సాక్షిగా.

61. రాముడు తన బాణములు దేనితో తయారు                      చేయబడినవని సుగ్రీవునికి చెప్పెను?
      =కుమారస్వామి జనించిన వనములోని బంగారు                 కాండములు.

62. సుగ్రీవుని భార్య పేరు?
      =రుమ.

63. వాలి భార్యపేరు?
      =తార.

64. వాలి సుగ్రీవుల రాజ్యము పేరేమిటి?
      =కిష్కింధ.

65. వాలిని కవ్వించి పారిపోయి బిలంలో దాక్కున్న                  రాక్షసుడు పేరేమిటి?
      =మాయావి.

66. హిమవంతుని సలహాతో వాలితో యుద్ధానికి వచ్చిన             రాక్షసుడు ఎవరు?
       =దుందుభి.

67. వాలి విసిరిన దుందుభి కళేబరం ఎవరి ఆశ్రమంలో              పడెను?
      =మతంగముని.

68. వాలి కుమారుని పేరేమిటి?
      =అంగదుడు.

69. రాముడు ఒకే బాణంతో ఎన్ని సాలవృక్షములను                భేదించెను?
      =ఏడు.

70. సుగ్రీవుని రాజ్యాభిషేకము తర్వాత రామలక్ష్మణులు            ఎక్కడ నివసించెను?
      =ప్రసవణగిరి.

71. సీతాన్వేషణ కోసం సుగ్రీవుడు *తూర్పు* దిక్కుకు              పంపిన వానర సేనకు నాయకుడెవరు?
      =వినతుడు.

72. సీతాన్వేషణ కోసం సుగ్రీవుడు *దక్షిణ* దిక్కుకు                  పంపిన వానర సేనకు నాయకుడెవరు?
      =అంగదుడు.

73. సుగ్రీవునికి, సీతాన్వేషణ కోసం *పశ్చిమ* దిక్కుకు            పంపబడిన సుషేణునికి బంధుత్వమేమిటి?
      =మామగారు, తార తండ్రి.

74. సీతాన్వేషణ కోసం సుగ్రీవుడు *ఉత్తర* దిక్కుకు                  పంపిన వానర సేనకు నాయకుడెవరు?
      =శతబలుడు.

75. సీతాన్వేషణ కోసం సుగ్రీవుడు వానరులకు ఎంత                 సమయం గడువిచ్చెను?
       =మాసం (ఒక నెల).

76. హనుమంతుడు ఏ దిక్కుకు వెళ్లిన వానరసేనలో                వుండెను?
      =దక్షిణ దిక్కు.

77. సీతకు ఆనవాలు కొరకై రాముడు హనుమంతునికి              ఏమిచ్చెను?
      =తన (రామ) పేరు చెక్కబడిన ఉంగరము.

78. హనుమంతుడు మొదలైన వానరులు చిక్కుకున్న                బిలం(లోయ)లో వున్న తాపసి పేరేమిటి?
      =స్వయంప్రభ.

79. సముద్రమవతల వున్న రావణునిని, సీతను                      చూడగల్గుతున్నానని వానరులకు చెప్పిన పక్షి                     పేరేమిటి?
      =సంపాతి.

80. హనుమంతుని తల్లి యైన అంజన అసలు పేరు?
       =పుంజికస్థల.

81. హనుమంతుడు సముద్రమును లంఘించుటకు ఎక్కిన        పర్వతం పేరేమిటి?
      =మహేంద్రపర్వతము.

82. హనుమంతుడు సముద్రం దాటుతున్నపుడు                       విశ్రమించమంటూ ఆతిధ్యమిచ్చిన పర్వతం ఎవరు?
       =మైనాకుడు.

83. హనుమంతుని శక్తిని పరీక్షించుటకు దేవతలు                    సముద్రంలో నియమించిన నాగమాత పేరేమిటి?
      =సురస.

84. హనుమంతుని నీడను ఆకర్షించి హనుమంతుని                 తనవైపు లాగిన సముద్ర జంతువు పేరేమిటి?
       =సింహిక.

85. హనుమంతుడు లంఘించిన సముద్రం పొడవెంత?
      =నూరు యోజనములు.

86. లంకలో హనుమంతుడు దిగిన పర్వతం పేరేమిటి?
       =లంబ పర్వతం.

87. హనుమంతుడు సీతను కనుగొన్న వనం పేరేమిటి?
      =అశోక వనం.

88. రావణుడు సీతకు ఎన్ని మాసములు గడువిచ్చెను?
      =రెండు.

89. రామునకు విజయము, రాక్షసులకు వినాశము                   వచ్చునని కలగన్న రాక్షస స్త్రీ ఎవరు?
      =త్రిజట.

90. హనుమంతుడు చెట్టుపై దాగివుండి సీతకు                        వినబడునట్లు ఎవరి కథ వినిపించెను?
      =రామ కథ.

91. రామునికి నమ్మిక కలుగుటకై సీత హనుమంతునికి              యిచ్చిన ఆభరణం పేరేమిటి?
     =చూడామణి.

92. హనుమంతుడు లంకలో ఎంతమంది రావణుని                   కింకరులను వధించెను?
       =ఎనభై వేలమంది.

93. హనుమంతుడు ఎవరి అస్త్రముచే బంధింపబడి                  రావణుని వద్దకు పోయెను?
      =ఇంద్రజిత్తు సంధించిన బ్రహ్మాస్త్రం.

94. దూతను వధించుట తగదని రావణునికి                             బోధించినదెవరు?
       =విభీషణుడు.

95. తిరిగి వచ్చిన హనుమంతునితో కలసి వానరులు                 ఆనందంతో ధ్వంసం చేసిన సుగ్రీవునికి యిష్టమైన               వనం పేరేమిటి?
       =మధువనం.

96. వానరులు వనం ధ్వంసం చేస్తున్న విషయం సుగ్రీవునికి        చేరవేసిన దెవరు?
      =మధువన రక్షకుడూ, సుగ్రీవుని మేనమామ ఐన                  దధిముఖుడు.

97. సీతజాడ తెలుసుకుని వచ్చిన హనుమంతునికి                  రాముడిచ్చిన బహుమతి?
       =ఆలింగన సౌభాగ్యం.

98. సముద్రం దాటుటకు నూరు యోజనములు సేతువు            నిర్మించిన వానర ప్రముఖుడి పేరేమిటి?
      =నీలుడు.

99. ఇంద్రజిత్తు ఏ ప్రదేశంలో హోమం చేయుచుండగా                 లక్ష్మణుడు వధించెను?
       =నికుంభిల.

100. రామునికి ఆదిత్యహృదయం స్తోత్రమును                          ఉపదేశించిన ముని ఎవరు?
        =అగస్త్యుడు.

101. రావణుని వధించుటకు రామునికి రథం                            పంపినదెవరు?
         =ఇంద్రుడు.

102. రామ రావణ యుద్ధంలో రాముని రథసారధి ఎవరు?
          =మాతలి.

103. రావణ వధానంతరం లంకనుండి సీతారామ లక్ష్మణ            వానరులతో బయలుదేరిన పుష్పకవిమానం                      అయోధ్య చేరేలోపు ఎక్కడ, ఎవరికోసం ఆగుతుంది?
        =కిష్కింధలో, వానరుల భార్యలు కూడా                              పుష్పకవిమానంలో ఎక్కడం కోసం!

104.  గుహునకు, భరతునికి తన రాకను                                   తెలియచేయుటకు శ్రీరాముడు ఎవరిని ముందుగా               పంపెను?
         =హనుమంతుడు.

105.  అయోధ్యలో సీతారాముల ఊరేగింపు సమయంలో             సుగ్రీవుడు ఎక్కిన ఏనుగు పేరేమిటి?
         =శత్రుంజయం.

106. శ్రీరాముడు అయోధ్యలో సుగ్రీవునికి అతిధి గృహంగా          ఎవరి భవనము నిచ్చెను?
        =స్వయంగా తన భవనమునే యిచ్చెను.

107.  పట్టాభిషేక సమయంలో శ్రీరామునికి అలంకరించిన             కిరీటం పూర్వం ఎవరిచే తయారు చేయబడినది?
         =బ్రహ్మ.

108.  శ్రీరామ పట్టాభిషేకం తర్వాత సీతాదేవి                                హనుమంతునికిచ్చిన బహుమతి ఏమిటి?
          =తన మెడలోని ముత్యాలహారం.

కామెంట్‌లు లేవు

Blogger ఆధారితం.