kattula vanthena novel/ కత్తుల వంతెన నవల
కత్తుల వంతెన - మహీధర రామమోహనరావు
విశాలాంధ్ర ప్రచురణాలయం 1961లో నిర్వహించిన నవలల పోటీలో ప్రథమ బహుమతి పొందిన
నవల. అమ్మకు నాన్నకు 'కంత్తులవంతెన' అందిస్తూ
భూతకాలప్తు అలవాట్లూ, ఆచారాల నుంచి, భావికాలపు ఆదర్శాలనందుకొనటందుకు మానవుని ప్రయత్నం అనవరతం సాగుతూనే వుంటుంది. ఈ రెండు కాలాలనూ కలుపుతున్న వర్తమాన కాలాన్ని ఒక వంతెనతో పోల్చువచ్చు. అయితే ఈ వంతెనమై మానవుని ప్రయాణంలో క్షణక్షణం ఎదురు దెబ్బులు తగులుతాయి. తల బొప్పికడుతూంటుంది.
అలవాటయిన భూతకాలపు పరిధుల్లో నిలబడలేడు. కనిపించని భయాలతో అదురు పుట్టించే భవిష్యత్తు మీద ఆశ వదులుకోలేడు. ఆతని ప్రయాణం ఆగదు. కాని, బంధనాలేవో, ఇంధనాలేవో భేదం చూడలేని సందిగ్రస్టితి ఆతని ఆడుగడుగునా వేధిస్తుంది. ఆతడు అడుగు పెటిన వంతెన మామూలు వంతెన కాదు. కత్తులవంతెన !
కాని ఆ కత్తుల వాడీ, వంతెన నిడివీ ఆతని ఆ వేగోద్వేగాల్ని నిలవరించలేవు. మందంగానో, దురితంగానో అతని అడుగు ముందుకే. మున్తుందుకే. వారి వారి రచనల నుంచి గీతభాగాల నుపయోగించుకొంటూ, మిత్రులు శ్రీశ్రీ , ఆరుద్ర, దాశరథిగార్లకు కైమోడ్పులు సమర్పిస్తున్నా.
,. కట్టిరి
కాలానికి కత్తులవంతెన.
- అజ్జానపుటంధయుగంలో
ఆకలిలో ఆవేశంలో
తెలియని ఏ తీవ్రశక్తులో
నడిపిస్తే నడిచి మనుష్యులు -
- అంతా తమ ప్రయోజకత్వం
తామే భువి కధథినాదులమని,
వాపించిన స్వామాజ్యాలూ,
నిర్మించిన కృతైమ చట్టాల్ -
- ఇతరేతర శక్తులు లేస్తే
పడిపోయెను పేకమేడలై!
- చిరకాలం జరిగిన మోసం,
బలవంతుల దౌరన్యాలూ,
ధనవంతుల పన్నాగాలూ
ఇంకానా! ఇకకై చెల్లవు.
_ ఒక వ్యక్తిని మరొక వ్యక్తీ,
ఒక జాతిని వేరొక జాతీ
పీడించే సాంఘిక ధర్మం
ఇంకానా! ఇకకై సాగదు.
ఒకటో ప్రకరణం:-
"ఎన్ని చెప్పినా వినిపించుకోవు చూడు, మీ ఇంజనీయరుగారి యోగ్యత. ఉ(దేకంతో సుజాత కంఠం పట్టేసింది. ఆ ఆవేశానికి వంతపలుకుతున్నట్లు కట్టుకొన్న తడిబట్ట బుసబుసలాడింది. నిలువు నీళ్ళతో విసవిసా వచ్చి ఎదుట నిలబడిన సుజాత సవ్వడికీ, ఆమె కుపిత స్వరానికీ వలికిపడి కల్యాణి తల ఎత్తింది. తడిసి, వంటినంటియున్న వలిపంలో ఆమె మొగ్గ విడుతున్న పువ్వులా వుంది.
ఆరోగ్యం చిందుతున్న (స్త్రీత్వం వొంపులు తీరలేదు ఇంకా. ఆమె పెదవులు కోపంతో వణుకుతున్నాయి. అభిమానరేకలు కళ్ళల్లో నీలిగా మసలుతున్నాయి. "బట్టలన్నా మార్చుకోకుండా వచ్చేశావేం?” సుజాత 'గంయ!' మంది. "అదిగో మాట మరిపిస్తున్నావు. నువ్విస్తున్న అలుసుదనమే. "” కల్యాణి చిరునవ్వు నవ్వింది. ప్రక్కవాటాలో కాపురం వున్న ఇంజనీరు యువకుడు వట్టి జడభరతుడని ఆమె అవహేళన చేస్తుంది.తామెవ్వరూ లేవకపూర్వమే అతడు పని మీదకు వెళ్ళిపోతాడు. అంతా న్నిదలు పోయాక ఎప్పుడో అపరాత్రి వేళ తిరిగి వస్తాడు. డ్యూటీలేని రోజుల్లో తప్పు ఆయన కనిపించడు.
మనిషి నమ్శదైనవాడు. ఫలితంగా సుజాత ఆయనకు 'జడభరతుడ'ని పేరు ప్రసాదించింది. ఆ జడభరతుడు ఈవేళ తాను నూతి వద్ద నీళ్ళు పోసుకుంటుండగా చూసేడని కోపం చేస్తూంకే కల్యాణి చిరునవ్వు నవ్వింది. రాత్రి పదిగంటలయింది. ఆయన ఇప్పుడే వచ్చాడు. ఆ మనిషికి సుజాత ఏం చేస్తూందో తఆలుసుననడానికి అవకాశం లేదు. మగా రాజగోపాలం అంటే కల్యాణికి ఒక సదభ్శిప్రాయం వుంది. మిగిలిన రెండు వాటాల్లోనూ ఆడవాళ్ళే గాని, మగవాళ్లు లేరు.
వున్నవాళ్ళు రూడ ఒక్క రామలక్ష్మమ్మ తప్పు వయసులో వున్నారు. దానినాతడవకాశం చేసుకొని అతిపరిచయం పెంచుకోడానికి ప్రయత్నించలేదు. కొంతమందిలాగ తన వాటాలో నలుగురినీ చేర్చి అల్లరి చేయడం లేదు. ఆ భయంతోనే తాను మొదట అతనిని మూడోవాటాలో చేర్చుకోడానికి ఒప్పుకోలేదు. తన స్నేహితులొకరి మాట తోసెయ్యలేక సాహసించింది. రాజగోపాలం తానుంచిన విశ్వాసాన్ని కాపాడుకొంటున్నాడు. ఇప్పుడు సుజాత అతడు మగపోడిమలు మొదలెట్టాడంటూంది. తనకు నమ్మకం లేదు. కాని, ఆ మాట పైకి అనలేదు.
"బట్టతోనే పోసుకుంటున్నావు కదా!”తన అభిమానాన్ని చులకన చేస్తున్నట్లు తీసుకొని సుజాత చ్యరుమంది."ఒంటినంటుకున్న తడిబట్టలతో వీధులనిండా మగవాళ్ళున్నా ఏ చెరువునుంచో నీళ్ళు తెచ్చుకోవడంమీ [బాహ్మలకి అలవాటు. ”తమ అగ్రహారం జీవితపు అలవాట్లను గురించి ఈ మాదిరి అవహేళనలు వీరేశలింగంగారి కాలం నుంచీ వినబడుతూనో వున్నాయి. తమ వూరు
అంతకూ మంచినీళ్ళకు ఆధారం తూర్పు దిక్కునున్న పెద్దచెరువు. మొన్నటి వరకూ వాడకం నీళ్లక్కూడా దొడ్లో నూతులుండేవి కావు. స్నానం చేసి రెండు బిందెల నీళ్ళు తెచ్చుకొని వంటలకుష్మకమించేవారు. ఆచారం, ధనహీనతమూలంగా నీళ్ళకు మనుష్యుల్నిపెట్టుకోలేరు. ఫలితంగా ఎందరెన్ని వెక్కిరించినా, మంచినీళ్ళ సరఫరాకు తగిన సౌకర్యాలు ఏర్పడితే తప్పు అక్కడ ఈ అలవాటు పోవడం లేదు.
ఈ అలవాటును గురించి తప్పు పట్పకొంకునూ, అవహేళన చేశారని కోపం తెచ్చుకొంకునూ లాభం లేదు. కల్యాణి ఇంత వరకూ సుజాత అభిమానాన్ని పెద్దగా ఆక్క చేయలేదు. సుజాత మాట దురుసుతనం వున్నా ఇంతవరకు కులం పేరు పెట్టి మాటలని వుండలేదు. తమ భిన్న కులాల్ని పేర్కోనూలేదు. ఆ మాటతో కల్యాణి సర్దుకు కూర్చుంది.
"ఏం జరిగిందేం. ...?” ప్రశ్నించిందే గాని, ఆ సమయంలో ఆమె ముఖ భంగిమ చూస్తే నవ్వు వచ్చింది. "ఎందుకల్లా పుష్పిపన్ను సలుపుతుంకే పెట్టినట్లు మొహం అల్లా పెడతావు?” .... సుజాత మరీ మండిపడింది. "నీకు నవ్వులాటగా వుండదూ? నీళ్ళు పోసుకొనేటప్పుడు మగాళ్ళు చాటు నుంచి....”కల్యాణి పక్కున నవ్వింది.
"జన్మ తరిస్తుంది పోదూ?” సుజాత మహా కోపంతో దులపరించుకొంది. "”సిగూ-ఎగ్గూ లేకపోతే సరి." ఆమె ఆవేశంతో కాలు నేల తాటించి గిరుక్కున తిరిగింది. ఊసలా దూసుకుపోయింది. కల్యాణి చదువుతున్న పుస్తకం మూసి లేచింది. సుజాత నుంచి జరిగిందంతా విన్నాక తప్పు ఆమెదేననిపించింది కల్యాణికి. పచ్చుపువ్వులా వుంది వెన్నెల. ఆ వెల్తురు కంటికి చల్లగా వున్నా వేసవి కాలపు బెజవాడ వేడికి ఒళ్ళంతా ఆవిర్లు వస్తూంది. సుజాత పడుకునో ముందు నీళ్ళు పోసుళోవాలనుకొంది.
ఇంటి చుట్టా ఎత్తయిన గోడ. దొడ్పి నిండా నారింజలూ, బత్తాయిలూ అరటి బోదెల మధ్య నూయి. వెన్నెల నీడల్లో గచ్చు వేసిన నూతి పళ్ళాం మిలమిలలాడుతూ ఆహ్వానించింది. అయితే ఆమె ఒక్క విషయం మరిచింది. మగవాళ్ళావరూ లేని తమ రెండు వాటాల వాళ్ళకే గాక, ఆడవాళ్ళావరూ లేని మూడో వాటా మనిషికి కూడా ఆ పెరట్లోకి వచ్చే అధికారమూ వుంది. అవకాశమూ వుంది. ఆ యింట్లోకి వచ్చిన ఏడెనిమిది మాసాల్లోపూ అతడా "పెరటి చాయలకే అడుగు పెట్టలేదంటే అది వేరు మాట. అవసరం లేకపోయింది. ఈ వేళనే వచ్చాడు.
నగ్నంగా తాను నీళ్ళు పోసుకొంటున్నట్లు తెలిసే అటు వచ్చాడంటుంది సుజాత. ”ఈ మగాళ్ళుందరికీ ఇదో తెగులు.”కల్యాణికి ఆమె ధోరణి సమ్మతం గాలేదు."మన అందం మీద మనకి మమకారం వండడంలో తప్పేం లేదు. ఆ మమకారాన్ని సిగ్గూ- అభిమానమూ రూపంలో కాపాడుకొంటూనో వున్నాం. కాని సుజాతా! ఎదుటి వాళ్ళ యోగ్యత మీద కూడా కనీసవిశ్వాసం వుంచాలి.”
సుజాత నిష్ణురం ఆడింది."అంతే నువ్వలా అనవా? రాధక్కా!”ఆ మాటకేమనాలో కల్యాణికి తోచలేదు. సుజాతదంతా వేప నాగలి పన్ను. ఆమెకెప్పుడేం గుబులు పుడుతుందో ఎవరికీ అర్దం కాదు. డబ్బుంది. తల్లిదండ్రీ గారాం చేశారు. ఫలితంగా చిలిపితనం-చినతనం వయస్సు వస్తున్నా మారలేదు. ఈ వేళ నెత్తిన పెట్టుకొన్న మనిషిని రేపు ద్వేషించదనే నమ్మకం లేదు. రాజగోపాలంతో వ్యవహారం అంతే జరిగింది.
ఓ నాలరోజులు పాఠాలంది, కబుర్గంది. చుట్టూ తిరిగింది. అప్పుడాయనలో కనిపించని మగతనం హఠాత్తుగా ఓ రోజున ప్రత్యక్షమయింది. ఆడవాళ్ళే వున్న యింట్లో మగాడిని అద్దెకు చేర్చడమేమిటంది. ఒక దశలో లేనిపోని ఇబ్బుందులు కలిగించి ఆతడే లేచిపోయేటట్లు చేయాలని చూస్తూందా అనిపించింది. కాక చిన్నతనపు అల్లరి చేస్టే కావచ్చు. ఏదయినా ఫలితం అంతే.
రాజగోపాలం డ్యూటీ మార్పుల్లో ఒక్కొక్కప్పుడు రాత్రి పన్నెండు ఒంటిగంటకు గాని రాడు. అంత రాత్రి వేళ తమరిని పిలువడానికి సంకోచిస్తాడని వరండాకున్న కటకటాల తలుపు తెరచి వుంచేది. వానిని సుజాత అతి శ్రద్దగా మూస్తూందనే సంగతి ఒకటి రెండు రోజులకు గాని ఆమెకు తెలియలేదు. ఇదేమిటంకే, "ఏ అర్దరాతో ఆయన వస్తాడని తెరిస్తే దొంగలు దూరరా?” అంది.
మరల అటువంటి పరిస్థితి ఏర్పడకుండా కల్యాణీ జాగ్రత్తపడింది. అతడు వచ్చి బటను నొక్కితే ఆమె గదిలో గంట మోగుతుంది. వెంటనే లేస్తుంది. తలుపు తీసి పలకరిస్తుంది.”మీదీ వేళ పెంద్రాళే వచ్చినట్లున్నారే. ” "భోజనం అయిందా?” "చేతిలో ఆ పత్రికలేమిటి?”ఇల్లాగే ఏవేవో ప్రశ్నలు వేస్తూండేది. ఆతడు 'ఊ' అన్నాడో, 'ఉహూ' అన్నాడో ఆమె వినిపించుకొనోది కాదు. అతడేదో అనోవాడు. ఆమె చిరునవ్వు నవ్వేది.
కమంగా ఆ ఇద్దరూ అటువంటి అర్హంలేని సంభాషణలకు ఎదురు చూడడం అలవాటయింది. ఏడెనిమిది గంటలకే వచ్చిన రోజున కూడా, తలుపు తియ్యవలసిన అవసరం లేని సందర్పుంలో కూడా ఆయన సైకిలు చప్పుడు వినబడేసరికి కల్యాణీ గుమ్మంలోకి వస్తూంది.
ఒక్కొక్కప్పుడాతనిని తన హాలులోకి ఆహ్వానించి చర్చలూ, కబుర్లూ వేస్తూంది. పక్క వాటాదారుతో ఆమె ఆ విధంగా చనువుగా వుండడం సుజాతకు నచ్చలేదు. కల్యాణి చూపుతున్న ఈ ప్రత్యేక శ్రద్ధను సుజాత యున్నోసార్లు వేళాకోళం చేసింది. చిన్నప్పుడు నర్చుకొన్న డాన్సులకు పర్యవసానంగా మనస్సులో ఏర్పడ్డ కృష్ణ డ్రేమా, కాలేజీలో తెలుగు అెక్సరరు దేశంలో వ్యాపిస్తున్న భగవద్విరోధాన్ని ప్రతిఘటించేటందుకు తీసుకొన్న శ్రద్దా ఫలితంగా ఆమెలో ఏర్పడ్డ కృష్ణ భక్తీ ఈ వేళాకోళాలకు కావలసినంత పు్రప్టినిన్తూ వచ్చాయి.
కల్యాణీ మీద కోపం వచ్చినపుడూ, ఆప్యాయత పెరిగినప్పుడూ ఆమెను 'రాధక్కా' అని పిలిచేస్తూంది. అది అమాయకత్వమో, చిన్నతనమో, అభంధ్రాతనమో - అతి గడుస్తనమో అర్జం కాదు. అల్లాంటి సందర్చాలలో కల్యాణి ఒక్క మందహాసంతోనో ఆమె నోరు కుక్వేస్తూంది. కాని, ఈమారు చిరాకు కలిగింది. చివాలున లేచి నిలబడింది.
"పొరపాటు జరిగింది దిద్దుకొందాం. ” "నీకెందుకులే అంత కష్టం.”అప్పుటికే గుమ్మం వరకూ వెళ్లిన కల్యాణి నిలబడింది. "న్సీ కృష్ణపరమాత్మ పుట్టిన పవిత్ర భారత భూమిలో ఇల్లాంటి అప్యభ్రంశపు పనులు జరగడం మఘోరం....” "మనం చేసే అవకతవకలు....”కల్యాణీ నిలబడకుండా వెల్లిపోతూనే సమాధానం ఇచ్చింది."ఆదర్శ పురుషుల్ని పప్పు....”అప్పుటికే ఆమె వీధి తలుపులు తీసిన చప్పుడు వినిపించింది.
మెట్ల మీద నుంచి చూస్తే డాబా మీద ఎవరూ వున్నట్లు లేదు. కల్యాణి గబగబా కైకి వచ్చింది. మైన అడుగు పెట్టగానే వెనక నుంచి పలకరింపు వినబడి వు్రలికిపడింది. "సావట్లో దీపం లేకుంకే న్మిదపోయారనుకొన్నా .”కల్యాణి ఆ ప్రశ్నకు సమాధానం ఇవణేదు."మీరిక్కడున్నారా?”గూడకట్టు పంచా, భుజాన తుండూ, ప్రక్కన పిట్టగోడ మీద సబ్బుపెక్పై - ఆతడు స్నాన ప్రయత్నంలో వున్నాడని చెప్తున్నాయి.
"స్నానానికి సన్నాహంలో వుండి ఇక్కడ నిలబడ్డారేం? పొద్దు పోలా?”"ఉదయం మవెో్లేటప్పుడు కుళాయి [కింద కడవ పెట్టడం మరిచా"తన అజాగ్రత్తకు క్షమాపణ చెప్పుకుంటున్నట్లు వినిపించాయి ఆ మాటలు. "మా పనిమనిషితో చెప్తా వుండండి, మాకు పటప్రుటప్పుడే నీళు మీకూ పట్టి పెడుతూంటుంది. "మల్ళీ అదో శ్రమా. " శ్రమేముంది, పనిమనిషి చేసేదానికి నా శ్రమేముంది. ...ఇంత రాత్రి ఆయినా ఈవేళ వేడిగాలి తగ్గలేదు....”
ఆమె అడగని ప్రశ్నకు రాజగోపాలం సమాధానం ఇచ్చాడు."నూటపదిహేను డిగ్రిలుంది వేడి ఈవేళ?” "అందుకే అంత తాపం ఎత్తిపోతూంది. పోయి స్నానం చేయండి ఆలస్యమయింది. ” "నూతి వద్ద ఎవరో వున్నట్లనిపించింది. వచ్చి ఇక్కడ కూర్చున్నా”
ఆతడు బుద్ధిపూర్వకంగా అటు వెళ్ళలేదు. అంతవరకు స్పష్టమయింది. అయితే స్నానం చేస్తున్నవారిని చూశాడా? సుజాత బహుశా తన తెలివితక్కువతనానికి ఏడుస్తూందేమో."పట్నంలో పదేళ్ళనుంచి వుంటున్నా మా పల్పెటూరి అగ్రహారపు అలవాట్లు పోలేదు. మా వారెడితే చెరువుకెళ్ళి పీకలబంటిగా నీళ్ళలో దిగితే తప్పు ఏదో లోపం అనిపిస్తూనే వుంటుంది. అభావంలో నుయ్యి. చేద క్రింద పెట్టాలనిపించదు. ఎవరికన్నా ఇబ్బంది కలిగిస్తానేమోనని గాని నూతెడు నీళ్ళు అవగొట్టాలనిపిస్తూంటుంది. ”
"అబ్బెబ్బ్పే! ఇబ్బుందేముంటు౦ది?” ఆ మాట అనేశాక గాని ఆమె చెప్పిందంతా ఒక సామాన్యాంశం మాత్రమేనని తోచలేదు, చటుక్కున మాట మార్చేడు. అతనికి తల నుంచి పెద్ద భారం దింపినట్లయింది. అయితేనేం ఒక పడుచు నీళ్ళు పోసుకొంటుండగా తానక్కడికి వెళ్ళడు. తప్పెవరిది, ఎటువంటిది - అని ఆలోచించకుండా ఇల్లాంటి సందర్పాలలో పల్లిటూళ్ళులో పెద్ద పెద రభసలు జరగడం అతడెరుగు.
ఇందాకటి నుంచీ అతని మనస్సులో అదే బెరుకుతూంది. నిజంగానే రభస [ప్రారంభమయిందని అతడెరగకపోయినా
ఇప్పుడు మాతం ఆ భయం లేదు. కల్యాణిని అతడు మనస్సులోనే అభినందించాడు. నూతి వధ వున్న మనిషి కల్యాణి. మూడో వాటా అమ్హాయి అయితే! సుజాత ఈమధ్య తన మీద ఏదో కసి పూనినట్లు వ్యవహరిస్తూందని అతనికెందుకో అనిపిస్తూంటుంది. ఆమె కాకపోవడం సంతోషకరం. కల్యాణి తన తప్పును కప్పి పుచ్చుకునేటందుకు ఇతరుల్ని అల్లరి పెట్టదు. అదీ అతని ఆలోచనో. దానికీ కారణం లేదు. అతనికి అనిపించింది, అంతే.
భయం తీరాక ఆతనిలో ఒక ఉత్కంఠ కలిగింది. నూతి వద్ద తాను చూసిన ఆమె నగ్నంగా వున్నట్లనిపించింది. ఆ దశలోనే స్నానం చేస్తూండి వున్నట్లయితే ఇంత నిస్సంకోచంగా కల్యాణి మాట్లాడుతుందా? అందుచేత తన భావనపొరపాశకేననిపించింది. "పోయి స్నానం చేసి వస్తా.” ఆమె (ప్రక్కకు తప్పుకొని దారి ఇచ్చింది. సన్నని చందన పరిమళ పరివేష్టనం ఆమె చుట్టూ ఒక అదృశ్య వలయాన్ని కల్పించింది. ఆ వలయంలోంచి మెట్ల వేపు అడుగుపెడుతూ వెనక తిరిగేడు.
"తాలియకుండానే అయితేనం అటువేపు వచ్చినందుకు చాల విచారంగా వుంది.” "ర్నల్లా ఎంత కాలం ఇబ్బంది పడతారు? సాయం రాగలవారెవ్వరూ లేరూ యింట్లో?”ఆమె వాక్యాన్ని రాజగోపాలం మరోలాగ అర్దం చేసుకున్నాడు. ఒక్క నిముషం ఆలోచించేడు."మిమ్మల్ని ఎంతో కాలం ఇబ్బంది పెట్టను” కల్యాణి అతని ముఖం వేపు చూసింది.
"త్వరలోనే శుభలేఖలు. ...”రాజగోపాలం సిగ్గు ప్రకటించాడు. "అబ్బబ్బే! ”ఒక్క క్షణంలో సర్పుకున్నాడు. "గది మారుస్తా.” ఆతడు వుండడం తమకు బాధాకరంగా లేదని చెప్పుడానికి కల్యాణి చాల ఆదుర్దా చూపింది. మాకేదో కష్టం కలిగిస్తున్నామనుకొని ఇల్లు మార్చునక్కరల్లేదు. మీకు కష్టంగా వుంకే అది వేరు మాట.” "నేనే మీకు ఇబ్బంది కలిగిస్తూంది. ...”
"అదేం లేదు. ప్రాద్రుట ఎప్పుడో ఏడుగంటలకెడతారు. రాతి పదన్నా అవుతూంది వచ్చేసరికి. మేము బాధపడిపోతున్నామని మీరు ఇంటికి రావడం మానుకొంటున్నారేమిటి? "బాగుందండోయ్” "అయితే మరో విధమైన ఇబ్బుంది లేకపోదు సుమండీ.” రాజగోపాలం అదేమిటోనని కంగారు పడ్డాడు. కల్యాణి చిరునవ్వు నవ్వింది. "మాటక్కూడా పారుగున మనిషి తోడు వండడం లేదని తప్పు....” రాజగోపాలం అమ్శుయ్య అనుకొన్నాడు. "అది మాతం తక్కువ ఇబ్బుందా?”
"మీరల్లా అనుకోవద్దు. మీరు వెడితే వచ్చేవాళ్ళాలాంటి వాళ్ళవుతారో. దుంగరాజుని వద్దని కొంగరాజుని తఆచ్చుకొన్న కప్పల బతుకవుతుంది. మాకేం బాధ లేదు. ఇల్లు మార్చుకోకండి.” దుంగరాజు పోలిక తెచ్చినందుకు కల్యాణి వేలు కొరుక్కుంది. రాజగోపాలం నవ్వుకొన్నాడు.
కల్యాణి తిరిగి వచ్చేసరికి సుజాత పడకకుద్చీలో పడుకొని వుంది. కైన తిరుగుతున్న పంకా గాలికి ముంగురులు ముఖాన కదులుతున్నాయి. మూసిన కనుగొలుకుల్లో ఒక్కొక్క ముత్యం దీపపు వెలుతురులో మిల మిలలాడుతూంది. ఆ కన్నీరు చూసి కల్యాణీ జాలి పడింది. తన అనాలోచితపు పనికీ, అనాగరికమైన అలవాటుకీ దుఃఖస్తూందని (గ్రహించింది. కనురెప్పల కదలికలలో ఆమె మేలుకొనే వున్నదనీ, తన రాకను గమనించిందనీ అర్హమయింది.
కాని ఏమీ అనలేదు. కల్యాణీ మనసులో కొంకశెతనం పొాటమరించింది."అడిగేశా. భయమా ఏమిటి? ఎందుకీ తుంటరి పని చేశావు-అనేశాను. సుజాత ఏమీ అనలేదు. ఒకమారు కళ్ళు తెరచి చూసి, మళ్ళీ మూసుకుంది. "మన దేశంలో పడుచు వాళ్ళంతా ఇల్లా తయారవుతున్నారు. ఆశ్చర్యం ఏం వుంది? చుట్టుప్రక్కల మగాళ్ళావరూ లేకుండా చూసి చీరలు పట్టుకు చెప్పక్కాయ్యడం ఒక్కశ్రేనా? చేయి చాటు పెట్టుకొంకు ఆ కాస్తా మాత్రం అడ్డం ఎందుకని యుద్ధ ఖైదీల్ని నడిపించినట్లు చేతులెత్తించిన శ్రీకృష్టుడు మనకు భగవానుడు. ఆ వంశీమోహనుడు మనకాదర్శం.
ఇంక పడుచువాళ్ళుల్లో ఉన్నత భావాలు కలగాలంకేనూ, కలిగించాలంకేునూ మన తరమా? మన దురదృష్టం, ఈ పుచ్చు వంకాయల్లోంచే తక్కువ పుచ్చులు ఏరుకోీవడం తప్పు వేరుగతి లేదు." కల్యాణి తనను ఎగతాళి చేస్తూందని [గ్రహించి నుజాత కళ్ళు విప్పింది. "మనిషిలోని బలహీనతల్ని కన్న ఉదాత్తతలను ఆదర్శంగా తీసుకో. ...” కల్యాణి ఆ మాట పూర్తిగాకుండానో నవ్వేసింది.
"రాధ మహత్వం గీతాబోధ విన్నదాని ఫలితం కాదు మరి. ఆమెకు మహత్వం కల్పించిన గుణాన్ని కృష్ణుడి బలహీనతగా జమకడితే ఎట్టాగే చిట్టితల్లీ! సుజాత నోరు తెరిచింది, కల్యాణి మళ్ళీ బుకాయించింది. "కనీసం మన ఆడంగితనాన్ని కాపాడుకోకపోతే ఎల్లాగ? ఇల్లు ఖాళీ చేసి పొమ్మన్నా.”"నీకంత కష్టం వద్దు.” "మళ్ళీ ఇప్పుడీ మాకేమిటి?”
సుజాత ఒక్క నిముషం వ్లరుకొంది. "రేప్రోో ఎల్లుండో నాన్నగారొస్తారు. అటు తర్వాత నేనో మారుతా.”
కల్యాణికి ఆమె సెంకితనం చూశాక కోపం వచ్చింది.”నీవేం సిగ్గు పడక్కర్లేదు. నూతి దగర స్నానం చేస్తున్నది నేనని చెప్పా, ఆ సిగ్గేదో నన్నే చుట్టుకొంటుంది. ”కల్యాణి వెనుతిరిగి చూడకుండా గది వదలి పోయింది.
రెండో ప్రకరణం:-
సుజాత అన్నట్లు ఒకటి రెండు రోజుల్లో కాకపోయినా వారం తిరగకుండానే శేఖరం వచ్చేడు. వచ్చేటప్పుడు పెద్ద బుట్టనిండా మామిడిపళ్ళూ, బస్తాలో మామిడికాయలూ, కొబ్బరికాయలూ, బియ్యం, పప్పులు, వారగాయలు ఒక రిక్షా సామాను వేసుకు వచ్చాడు. గుమ్మంలో అడుగు పెడుతూనే శేఖరం కూతుర్ని కుశల ప్రశ్న వేశాడు."ఏమిటమ్మా! అంత త్వరగా రమ్మని వ్రాశావు. ఒంట్లో బాగుందా?”
ఎదురుగా కల్యాణి వుండడమూ, వస్తూనే ఆ ప్రశ్న అడగడముతో సుజాత ఉక్కిరిబిక్కిరి అయింది. తన తండి వెంట రాజగోపాలం కూడా వుండడంతో అబద్దమే ఆడక తప్పింది కాదు."మామిడిపళ్ళ రోజులయిపోతున్నా మీకు మా సంగతే జ్ఞాపకం రాలేదు.”సుజాత మీకోసం బంగెట్టుకొంది. పాపం! బుచ్చిపాప!” కల్యాణీ పరాచికమాడింది. కాని, సాధారణమైన ఆ పరాచికంలో సుజాతకు ఎత్తిపొడిపే వినబడింది.
రాజగోపాలం సెలవు పుచ్చుకొని తన వాటాలోకి వెళ్ళిపోయాడు. శేఖరం అతని గుణగానం చేశాడు. "చాల మంచి కుర్రవాడు. ఎర్జిక్యూటివు ఇంజనీరు ఆఫీసులో పనుండి వచ్చా. వెళ్ళేసరికి కనిపించేడు. ఎక్కడో చూసినట్టనిపించింది. వెళ్ళి అయ్యా నాకు ఫలానా పని కావాలన్నా. దగ్గరుండి ఆ పని పూర్తి చేయించినాడు. ఈ కుర్రవాడే దొరికి వుండకుంటే వారం రోజులు ఆఫీసు చుట్టూ తిరిగినా పని జరిగేదే కాదు.”
తన తండ్రి పాగుడుతూంకే సుజాత మొగం చిటించింది. దానిని గమనించి కల్యాణీ చిరునవ్వు నవ్వింది."ఏ ఆఫీసులోనూ పనులేమిటో. . తెగ పెరిగి పోతున్నాయి. దానితో సమానాంతరంగా పనిచేసే వాళ్లల్లో బద్ధకం బలిసిపోతుంది. యూనియన్లంటారు. సమ్మెలంటారు. జీతాలు ఎక్కువ కావాలంటారు. కానీ లంచాలు పుచ్చుకోకూడదనీ, పని జరిపించడంలో శ్రద్ద చూపాలనీ చెప్పేవాళ్లు ఒక్కరూ కనిపించరు! అన్నాడు శేఖరం.
శ్రుతి చిన్న పనికీ త్వరగా కావాలని నాన్నగారే లంచాలు పెడతారు. ఇంజినీర్లకు ఈ వేళ మామిడిపళ్ల గంపలు తెచ్చారా లేదా నాన్నగారూ! శేఖరం కూతురు మాటలకు సిగుపడలేదు. నొచ్చుకోలేదు. సన్నగా నవ్వాడు. డబ్బు ఇవ్వడానికీ ఖర్చు పెట్టడానికీ బాధ ఏముంటుందమ్మా! డబ్బు ఇచ్చినా పనులు జరగడం లేదని కాని... ! పనివాళ్లలో పని ఎగ కొస్తే స్వభావం పెరుగుతూండడం, సంఘ శక్తిని దుర్వినియోగం చేస్తూండడం మీద వాక్యోపవాక్యంగా చర్చ నడిచింది.
రైలు పెస్పెలుంటున్నాయి. పాకీ దొడ్ల కన్నా కనాకష్టంగా వదిలేస్తున్నారు. ప్లాట్ఫారం మీద చీపురు కట్టలతో మనుషులు కూర్చొని ఉంటారు. బాగు చేయండరా అంకే.. తాము డ్యూటీలో లేమంటారు. క్రిందటి మాటొచ్చినప్పుడు చూడలేకా, చెప్పులేకా, కంప్లెయింట్సు బుక్కులో రాశాను. ఇంక చూడు. వాళ్ల యూనియను వాళ్లట. వచ్చి పడ్డారు!రాజగోపాలం తన అనుభవాన్ని జత కలిపి ఆ మాటను ఆమోదించాడు. మా వర్కుషాపులోనూ అదే ఫ్ధితి. !
మొన్న స్రేట్ బస్ (డైవర్ ఒళ్లెరుగని సివాలాడిపోయేడు. బఫ్సాండు దగ్గర్లో ఫుట్పాత్ మీద ఒక కుటుంబం సామాన్లు పెట్టుకుని కూర్చుంది. మగవాడు రిక్షాకోసం వేళ్లాడు. ఇంతలో ఓ బస్సు బ్మురున వచ్చింది. ఆవిడ పిల్లని లాగేసి వెనక్కి పారిపోయింది. బస్సు ఫుట్పాత్ ఎక్కి సామాన్లను దున్నోసింది. పెద్దగండం తప్పింది. ఆ బెదురుతో ఆవిడ బస్సువాడిని చెడామడా తిట్టింది.
కండక్టరు "మీద నుంచి పోలేదని సంతోషించక తిడతావా?! ' అంటూ ఆమె మీదకు లేచాడు. చుట్టా ఉన్న వాళ్లం కలుగచేసుకున్నాం. రిపోర్టులు చేశాం. ఆ క్షణం నుంచి యూనియన్ వాళ్లు నా వెంట పడ్డారు. విన్నారుగా... నిన్న వాళ ధోరణి, బండిని మీదకు తోలడం, ఈ మారు మీదనుంచే తోలుతామని ఆమెను కొట్టబోవడం అన్నీ వెనక్కి పెట్టి ' 'తిట్టడమేమ'! 'ని వాళ్ల వాదం. కల్యాణి ఎంతో ఆవేశంతో చెప్పుకొంటూ పోయింది. సుజాత అన్నీ విని చిన్న వ్యాఖ్యానం చేసింది.
ఊళ్లో పనులన్నీ నెత్తినేసుకోవడం, జైళ్లకెళ్లడం, ఆస్తులు నాశనం చేసుకుని పెళ్లాం పిల్లల్ని ఏడిపించడం ఒక గొప్ప ఆదర్శమని వీరంతా నేర్పిందేగా? చదువులు పాడుచేసుకొనీ, ఉద్యోగాలు వదులుకొనీ ఏదో పెద్ద త్యాగం - మహాకార్యం చేసేసినట్లు చెప్పుకొంటూ కూలాళ్ల కూలి డబ్బుల్తో వాటాలకు సిద్దపడుతున్న జనం వేలమంది మీ అడుగుజాడల్లో నడుస్తున్నారు.
ఇప్పుడు విచారపడి ఏం లాభం?'తన జీవితం మీదనో కూతురు చేసిన వ్యాఖ్యలకు శేఖరం నిర్హాంతపోయాడు. తన పదమూడో ఏట చదువు మధ్యలో వదిలేసి, గాంధీగారి వుద్యమంలో చేరాడు. ఆ నాటి నుంచి తాను జైలుకు వెళ్లని వుద్యమం ఏదీ లేనేలేదు. దానివల్ల తాను చాలానే నష్టపోయాడు. కానీ, దానికి తాను ఎన్నడూ విచారించలేదు. కాంట్రాక్తులో మళ్లీ బోలెడు సంపాదించాడు. అది వేరు. కానీ దేశం స్వతంత్రమయిందంటె అది తన శ్రమ ఫలితమేనన్నంత ఆనందం కలుగుతోంది.
కానీ, ఈ వేళ తన కన్నకూతురు నోట విన్న మాటతో చబుకుతో కొడుతున్నట్లనిపించింది. బోర్సుల్ జైలులో అల్లరి చేసినాడని తగిలించిన కొరడా దెబ్బలు కూడా అంత బాధ అనిపించలేదు. కల్యాణికి ఆ వ్యాఖ్య రుచించలేదు. ఏదో నష్టం కలిగించిందనే ఆలోచనతో మంచిపని మంచిపని కాకుండా పోతుందా? త్యాగాన్నీ, ప్రజాసేవను....'!సుజాత ఆమె మాటను పూర్తి కానివ్వలేదు.
నాన్నగారు త్యాగం చేసిందేమిటి? చదువు, ఆస్తి, కుటుంబ సుఖం. మీరంతా త్యాగం అనేదానిని ఆయన చేయకుండా ఉంకే బాగా చదువుకోగలిగేవాడు. మంచి ఉద్యోగంలోనో, మంత్రిపదవిలోనో ఉండేవాడేమో. ఆ రోజున ఆయన చేసిన త్యాగాలే, ఈ వేళ త్యాగ ఫలితంగా వచ్చిందన్న స్వాతంత్రంలో సుఖపడ్డానికి కావాల్సిన హంగులు లేకుండా చేసింది. నాన్నగారు ఆ రోజున ఏ పని చేశారో..
ఈ వేళా అదే పని చేస్తున్నారు. తేడా మాత్రం ఆ రోజుల్లో పికెటింగులకోసం వెళ్లిన ఆఫీసులకు దరఖాస్తులతో వెళ్తున్నాడు. ఆ రోజుల్లో జైలుకెళినందుకు సంతోషించారు. ఈ వేళ డబ్బు ఇచ్చి పని త్వరగా జరిగినందుకు సంతోషిస్తున్నారు. ఆఫీసుల్లో పని జరక్కుండా గాని, త్వరగా చేయించగల శక్తిగానీ నాన్నగారికప్పుడూ, ఇప్పుడూ కూడ లేదు. మీరు దేశాన్ని ఏం మరమ్మతు చేయగలిగారు? నా వృద్దేశంలో చట్టాలంకేనూ. . ప్రభుత్వం అంకేనూ అవిధేయత చూపడం ఆదర్శంగా నిలిపేరు.
దాని ఫలితం ఈ వేళ వేయింతలుగా కనిపిస్తోంది. మీరు సృష్టించిన దయ్యప్పిల్ల బేతాళుల్లాగా పెరిగింది. అనుభవించాలి...మరి!!!ప్రపంచం, మానవజాతి అంక ఏదో కసి, ద్వేషం నింప్రుకొంటున్నట్లు మాట్లాడుతున్న కూతురు వంక శేఖరం నోరు తెరిచి చూశాడు. తన కూతురు నోట్లో నాలికలేని మెత్తని కూచి అనే భావం అతనికెన్నడూ లేదు. ఆమె మాటకారితనం, చురుకుదనం చూసి ఆయన చాలమాట్లు గర్వపడ్రాడు.
ఇంకా పెద్దకూతురు చాలా మేదకురాలు. ఏదో బీ.ఏ. అయిందనిపించిందేగానీ, చల్లగా మొగుడితో కాపురం చేసుకొంటోంది. ఈ రెండో కూతురు చురుకుదనం మీద ఆయన తన జీవిత సార్దక్యాన్ని కల్పించుకొంటున్నాడు. కానీ, ఇప్పుడామె దాని ప్రునాదినే తవ్వేస్తుంది. ఆమెలో ఇటువంటి భావనలు కలిగించినదెవరో ఆయనకు అర్దం కాలేదు. మనిషి గిలగిలలాడిపోయాడు..
ఆ మాటే తనను ప్రశ్నిస్తే కల్యాణి ఏం చెప్పగలదు? మన దేశానికి స్వాతంత్ర్యం తీసుకొచ్చిన వాళ్ల త్యాగాల్ని అవహేళన చేయడమే... ఈ కాలేజీల్లో చెబుతున్న చదువైతే.. నా కూతురికి చదువు లేకపోవడమే మేలంటాను. దీనిచేత చదువు మాన్పించేస్తాను... శేఖరం మండిపడ్డాడు. సుజాత చదువు పోవడం ఆ సమస్యకు పరిష్కారం కాదని, కల్యాణి ఎరుగును. కానీ, ఆ మాట ఎలా చెప్పాలో ఆమెకు అర్దం కాలేదు.
అవే మాటలు నవలల్లోకి ఎక్కించినా... తెలుగుదేశం మాట్లాడ్డం లేదు. నాయకులూ, మహానాయకులు విద్యార్థుల్ని, దేశ సమస్యలకు దూరంగా ఉండండని చెప్పుడానికి ఆ వాదాల్నే కొద్ది తేడాలో తెస్తున్నారు. త్యాగాలకు, పార్లీ బేధాలు, పద్దతి బేధాలు తెస్తున్నారు. కొన్ని రకాల త్యాగాలకు అయిదెకరాల విలువ కల్పించారు. ఇవన్నీ సుజాత ఆలోచనా ధోరణికి మూల కారణాలు కావా?
శేఖరం తన కూతురు విద్యావిషయంలో శ్రద్ద తీసుకోనందుకు అప్పుడు విచారపడ్రాడు. కానీ, వానిని తెలియపరిచిన ధోరణి విన్నాక సుజాత ధోరణికి తండి కూడా కారణం కాకపోలేదని గ్రహించింది. ఎల్లా అయినా మీ బ్రాహ్మలకున్న విజానం మా వాళ్లకు వాదర పెడితేమాత్రం వస్తుందటమాా???' ఆ మాటలకు కల్యాణి చచ్చౌేటంత సిగ్గుపడిపోయింది. కులాల్ని పట్టి ఆలోచనాధోరణులు ఏర్పుడవు బాబుగారూ?!
ఎలా ఏర్పడతాయనే దానిమీద మాట అెందుగాని, ఇప్పుడెల్లాగ దాని మనస్సులో సరియైన విలువల్ని కల్పించడం? అది దేశాన్నే ఎదుర్కొంటున్న సమస్య' ' అనడం తప్పు కల్యాణికి మరో సమాధానం దొరకనోలేదు.
మూడో ప్రకరణం:-
భోజనం వద్ద కూర్చున్న తర్వాత శేఖరం నెమ్మదిగా కూతుర్ని కబుర్లలో దించడానికి ప్రయత్నించాడు. కాని, ఆమె నిరాకరించినట్లు కిమ్మనకుండా కూర్చుంది. అన్నీ విని చిట్టచివర 'గంయ్!' మంది. మీ కూతురు ఎం.ఏ. చదివిందనీ, మంచి వుద్యోగంలో వుందనీ చెప్పుకోగల ప్రతిష్ట కావాలి మీకు. అంతకు మినహా మా యోగక్షేమాలు మీకు పట్టేయా?! !ఆ అభియోగానికి శేఖరం అదిరిపోయాడు. రామలక్ష్మమ్మ చారు గిన్నాలో పోస్తూ సమాధానం ఇచ్చింది.
తమ బిడ్డలు బాగున్నారనే ప్రతిష్ట కోరడంలో తప్పేముందే? పదిమందీ తన కూతుర్ని వేలు పెట్టి చూపి, చెడ్డగా మాట్లాడుకోవడం సంతోషంగా ఉండాలంటావా? శేఖరం అక్కగారిని వారుకోమన్నట్ట్లు సైగ చేశాడు. ఈ పూట చారు అంత రుచిగా లేదే అక్కా! సుజాత తండ్రి ముఖం వంక ఆశృర్యంగా తేరిపారి చూసింది. ఏం లోపం? చక్కగా వుంకేను? రామలక్ష్మమ్మ నవ్వింది.
ఏ పూట కాపూట గిన్నె ఖాళీచేసే వెధవచారు బాగులేదంటే చూడు అత్తయ్య మాట్లాడ్డం లేదు. నూరేళ్ల బతుకు బాగుండాలనుకోవడంలోనూ, బాగుండేట్టు చేయాలనుకోవడంలోనూ తప్పేముందమ్మా! సుజాత పెంకితనంగా మారాం చేసింది. నాకింక ఈ పాడు చదువు వొద్దు. నాకు చదవాలని లేదు! శేఖరం కూతురు మురిపింపును అక్కచేయలేదు. తమ బవిడ్తలు తమకంకశే సుఖపడాలని, బాగుండాలని కోరడం సహజం.
కాకపోతే మనుష్య జాతి ఈనాడున్న దశకి రాకనోపోవును. మాట్లాడుతూ మాట్లాడుతూ చటుక్కున కూతురువైపు తిరిగేడు. ఇష్టంలేని చదువు సాగించడంలో అర్జం లేదు. మా నాయ్యి పోనీ! పెళ్లి చేసుకొందుగాని...!తన మాటను అంత శీఘ్రంగా తండ్రి ఒప్పేసుకోవడంతో సుజాత ఏమీ అనలేకపోయింది. నిజంగానేనా? ఆ అనుమానం ఎందుక్కలగాలి? నాలకి నూరు రూపాయలు ఆదా జరిగే పద్దతిలో...చూసేరా? కేవలం డబ్బు లాభం....”! శేఖరం నవ్వేడు.
ఈ వేళ నీ మనస్సు బాగోలేదు. చదువుకోమంటే మా ప్రతిష్ట కోసం బాధపడుతున్నానన్నావు. పోనీ డబ్బు మిగులుతుందంకే పిల్లల బాధ చూఢడంలేదంటావు. చదువుకున్న కూతురుతో అన్నీ చిక్కేలా ఉంది! పారపాటున మాకు చదువు చెప్పిస్తున్నారు. అంకే మరి కాదంటారేం? సుజాత పేచీకి కాలుదువ్వుతున్నట్లనిపించి శేఖరం సంతృప్తిపడ్డాడు. ఆమె మనస్సులో ఏదో ఉంటుంది. చెప్పడు. పెద్దవాళ్లు తెలుసుకోవాలి. ఊహకొచ్చినవేవీ కాదంటుంది. ఆమె మనస్సులో ఉన్న అంశం కూడా వాటిలో వుండొచ్చు. కాని, ఒప్పుకోదు.
ప్రతిదానికి అడ్డం వేస్తుంది. ప్రస్తుతం ఆ ధోరణిలో ఉందన్నమాట. ఇందాక కల్యాణివద్ద తెలిపిన భయాలన్నీ వట్టివేననిపించి, అతనొక నిట్టూర్పు తీసుకున్నాడు. ఇంకా తానుకూడా చెలగాటం ధోరణిలోకి జారేడు. గమ్మున సుజాత అడ్డుకుంది. అదిగో చూడండి. . మీరు చెప్పింది చేయించడానికి ఎంతలా మారుతున్నారు? ఆ మాట మీదనిలబడండి.
నా ఇష్టం వచ్చినవాడిని...!కనీసం ఆ మొగుడెవరో నాన్నకేనా చెప్తావా, చెప్పవా?" ' - అంది రామలక్ష్మమ్మ. సుజాత పులుకూ పులుకూ చూసింది. మెల్లి చేసుకొనేది నేనా...!!ఆమె తన మాట పూర్తిచేయకపోయినా శేఖరమే పూర్తిచేశాడు. ఈ రోజుల్లో అల్లుళ్లు మామగార్లకే మొగుళ్లు. వాళ్ల కోరికలన్నీ తీర్చలేక మా గుండెలు గరిసెలు పడిపోతున్నాయి. కట్నం కావాలనే మగవాళ్లీ మీరు ఎన్ని (బతిమాలినా నోనొప్పుళోనండోయ్.
మేం (బతిమాలడం ఏం వండదమ్మా. అంతా నీ యిష్టం అన్నాం కదా?” శ్రొప్పుడానికేం! తీరా మోసి ఎదుట పడేసరికి కమ్మారి అబ్బాయేనా? అందులో పెద్దకమ్మారా? చిన్న కూమారా? ఎన్ని ప్రశ్నలు...? అయితే కులం కూడా దాటిస్తానంటావా యేమే?! ' అంది భయంభయంగా రామలక్ష్మమ్మ. కూతురుతో చెలగాటం ఆడుతున్న ధోరణి నుంచి శేఖరం బయట పడనేలేదు.
నువ్వూ సరే. దాని ఇష్టం అన్నప్పుడు ఏ కులం అయినా ఒప్పుకోవలసిందే... అయితే ఒక్క షరతు, ముందు మాత్రం కాస్త మా చెవిని వేస్తే అవసరమైన కాపులో వుంటాం! దానికి సుజాత ఇచ్చిన సమాధానాన్ని మాత్రం అతడు సున్నితంగా తీసుకోలేకపోయాడు. ధోరణి చూస్తే ఏదో వాదం కోసం చెప్పినట్లు అని అనిపిస్తుంది. కంఠం చూస్తే వెనకనేదో కథ వుందనిపిస్తూంది. మీరు షరతులు పెట్టండి. మరో డజను షరతులు నేను పెడతా. కానీ, జరగాల్సిన దానికీ షరతులతో నిమిత్తం లేదు.
ఫలానా మనిషిని పెళ్లి చేసుకోవాలనో ఇష్టం తన జ్ఞానానికి అందేసరికి అడుగు తీసుకునే దారులు ఏవీ కనిపించే అవకాశమే వుండదు. ఇతరుల అభిప్రాయం తెలుసుకొని నిర్ణయానికి వచ్చే ధోరణిలో మనిషి ఉన్నాడంకే... ఆ మనిషి విషయమై అతనికి శ్రద్ద కలగలేదనుకోవాలి. ఫలితం ఏమిటి? నేను పెళ్లి చేసుకొనే ముందు ఆ మాట చెప్పినా నమ్మొద్దు. పెళ్ళి చేసుకొన్నాక చెప్పినా విచారపడొద్దు.
చెలగాటం కొనసాగించాలనే వుత్సాహం శేఖరం మనస్సులో ఇగిరిపోయింది. ఆలోచించి ఆలోచించి అక్కను సంప్రదించాడు. ఏమిటి దీని ధోరణి? రామలక్ష్మమ్మ నిర్లక్ష్యంగా తోసేసింది. ఏమీలేదు. అదెప్పుడూ అంతే. రాలుగాయి!అంతకంటే ఆమెనుంచి అతనికి సహాయం లభించదు. ఈ మారు మళ్లీ కొత్త సమస్యతో కల్యాణిని సలహా కోరాడు. ఆమెకు ఏమీ తెలియదు. కానీ, ఆమె ప్రశ్నలతో మాత్రం ఏదో తెలుసుననే అనుమానం కలిగింది.
కులాంతరం అయితే మీకు ఇష్టం కాదా? నాకైతే ఆ పట్టింపులు లేవు. కానీ, వాళ్ల అమ్మ వుంది. దాని అన్నదమ్ములున్నారు. వాళ్లెవరూ ఒప్పుకోరు. కష్టాలకూ - సుఖాలకూ ఆదుకొంటున్న వాళని వొదులుకోవాలంటే...!!సుజాత ఏ వుద్దేశంతో మాట్లాడినా... ఆమె ఆలోచనలకు కారణం లేకపోలేదని కల్యాణి గ్రహించింది. దానిని గురించి ఇంకా చర్చ కొనసాగించదలచుకోలేదు.
నాలుగో ప్రకరణం:-
నమస్కారమండీ! ' ' అంటూ తెల్లవారేసరికి గుమ్మంలో హాజరయిన మంగారావును చూడగానే కల్యాణికి చాలా విసువు కలిగింది. అతని వెనకే నిలబడ్డ ఆర్.టి.సి. కండక్షరు, మరో ఇద్దరు ఆమె క్రోధాన్ని ద్విగుణీకృతం చేశారు. ఆ కండక్టరు ముఖాన విచారం గాని, పశ్చాత్తాపం గాని వున్నట్లు ఆమెకు అనిపించలేదు. తన నిర్లక్ష్యం వల్ల ఒక కుటుంబం నిష్కారణంగా చచ్చిపోయి ఉండేదే... అనో బాధకు బదులు తనకే ఏదో అన్యాయం జరిగిపోయిందన్నట్ట్లు బుంగమూతి పెట్టెడు.
వారిని వీధిలోంచే పంపెయ్యడానికి కల్యాణి ప్రయత్నించి విఫలురాలయింది. ఇంక మర్యాద కోసం వారిని లోనికి పిలవక తప్పులేదు. ఏమిటి మళ్లీ వచ్చారు? తమరిని...! ఇలాంటి విషయాల్లో మీ యూనియను వాళ్లు కలుగచేసుకోవడం అప్రతిష్ట సుమీ అని మొదటి రోజుననే చెప్పాను. యూనియన్ సభ్యుడు హత్యలు చేసినా సమర్దించే ఫ్థితికి వచ్చేరా అవి యూనియన్లు అనిపించుకోవు. రౌడీ గ్యాంగులకు, వాటికీ పేరు తేడా మాత్రమే మిగులుతుంది.
ఆ మాటకు ఆ రోజున వచ్చిన వెంకకేశ్వర్లుగారట, ఆయన పెనన్నాడు. యూనియను ఈ విషయంలో కలుగచేసుకోదన్నాడు. మరి మిమ్శత్నెందుకు పంపేరో?చందాలన్నీ ఇన్నాళ్లూ జేబులో వేసుకుని, ఈవేళ నీ పాట్లు నువ్వు పడమన్నారు. లంజకొడుకులు. ..'' అంటూ కండక్టరు దుబ్బు కాపు ఎగరేసేడు. మంగారావు కోప్పుడ్డాడు."నోరు ముయ్యవోయ్. .. మొనగాడివి బయలుదేరేవు!
కండక్టరు భద్రం గప్చిప్మని ఊరుకోవడం కల్యాణికి ఆశ్చర్యమనిపించింది. ఆమె ఎదుట, వారిచేత తనదే పొరపాటనే మాట చెప్పించలేకపోయాడు వెంకకేశ్వర్లు. అలా చెప్పమనో సరికి ఎంత ఎగిరేడు? ఈ వేళ మంగారావు ' నోరుమూయమన్నా' వూరుకోవడం ఆశ్చర్యమే అనిపించింది. మంగారావే ఆ సందేహం తీర్చేడు. యూనియను కమ్యూనిస్టులది. తల్లిగొంతు కోయగలవాడికి పినతల్లి చెవులు బీరపువ్వులంటారు.
దేశానికే (ద్రోహం చేసేవాళ్లు మనిషికి హాని చేయడంలో ఆశర్యం లేదు. అమాయకుల్ని సంఘాలనే పేరెట్టి ఆడించినంతకాలం ఆడించారు. తీరా సమయం వచ్చేసరికి తప్పుకొన్నారు.! కల్యాణికి పరిస్టితి అర్ధమైంది. ప్రజల ప్రాణాలు, బాధ్యతలు సమస్యలలోకి రాజకీయాలు ప్రవేశింంచాయన్నమాట. ఈ మాట నిన్ననో చెప్పి ఉంటే... ఇంత తకరారు ఉండేదికాదు! !
మంగారావు సంతోషించాడు. కండక్టరు భదం యూనియన్ను ఒక వరస తిట్టాడు. లంజకొడుకులు... పేటలోకి ఎల్లా వస్తారో చూస్తా! ఈ మారు మంగారావు అతడిని నిరోధించలేదు. తమరు పొరపాటులో వున్నారనిపించింది. ఈ కేసెంతటిది? మంత్రి దగ్గరికెడితే ఒక్క నిమిషంలో ఆర్డర్లు పాసై పోతాయి. కానీ, తమ మంచితనం మీద మచ్చు తొలగదు. అందుకోసం ఆఖరు పర్యాయం. మోదరాబాద్కు వెళ్లోలోపున మరో ప్రయత్నం చేద్దామని వచ్చా!
కల్యాణీ నిశ్శబ్దంగా అన్నీ విని, ఓ మాట అందించింది. యూనియన్లంకే ఇంతవరకు...! ఆమె ఏమనుకుంటుందో వినగల ఓపిక మంగారావుకు లేదు. ఆమె తనను యూనియను ప్రతినిధిగా భావించడం చేతనే అంత మొండిగా మాట్లాడిందనే భావం అతనికి ఏర్పడింది. యూనియన్లలో కమ్యూనిస్టులు చేరి వాటినాలా దుర్వినియోగం చేస్తున్నారో గుక్కతిప్పుకోకుండా చెప్పాడు.
ఈ మధ్య రైల్వే వాళ్లలోనూ ఇలాంటిదే వచ్చింది. పెక్పైలు బాగు చెయ్యలేదని ఎవరో ప్రయాణీకుడు కంప్లెయింటు చేశాడట. అధికారులు వెంటనే ఇద్దరిని సస్పెండు చేశారు. వాళ్ల తరఫున నిలబడడానికి బదులు యూనియను పని అశ్రద్ద చేశారని వాళ్లని కోప్పడింది. రెండో వైపున ఫ్లాఫ్ చాలడం లేదని, మరికొందరిని వేయాలని మహజర్తూ గందగోళం ప్రారంభించారు. అబ్బే!
ఏ అవకాశం దొరికినా చాలు, గవర్నమెంటు మీద బహ్మాస్తంలా ప్రయోగించడమే గాని ... కల్యాణి ఇంక భరించలేకపోయింది. గతరాత్రి జరిగిన సంభాషణ గుర్తుకొచ్చింది. వెంటనే వెల్లి శేఖరాన్ని పిలిచింది. ఆ హడావుడి చూసి రాజగోపాలం వచ్చాడు. అంతమంది శ్రోతల ముందు తన సిద్దాంతాలను చెప్పగల అవకాశం దొరకడం మంగారావుకు ఎంతో ఉత్సాహం కలిగించింది.
కానీ, దాని ఫలితాలు మాత్రం అతననుకొన్న విధంగా వుండకపోవడంతో అతనికి ఎంతో క్రోధం కలిగింది. దేశాన్ని ఏ గతికి తెచ్చావురా దేవుడా?! ' అని శేఖరం ఆకాశంకేసి చూసి అంగలార్చాడు. కల్యాణి ఇంక భరించలేకపోయింది. మిష్టర్! ” మంగారావు ఆమె వంక చూశాడు. ఇంక నాకు పనుంది. క్షమించి...'' మేం వచ్చిన పనిమాట ఏమన్నారు?' !
అదెల్లా సాధ్యం?.... అన్నాడు రాజగోపాలం అమాయకంగా. మంగారావు సగర్వంగా సలహా ఇచ్చాడు. చుట్టుపక్కలవాళ్తు కండక్టరు పేరు తప్పుచెప్పారనీ, ఈ పేరు గలవాడు ఆరోజున తమరు చూసిన వారూ ఒకరు కాదనీ...!కల్యాణి ఒక నిశ్చయానికి వచ్చినట్లు ఖండితంగా చెప్పింది. అలా జరగదు! మంగారావు భద్రాన్ని అతనితో వాల్లిద్దిరినీ బయటకెళ్లమన్నాడు. మీరు నడుస్తుండండయ్యా! అమ్మగారితో మాట్లాడి వచ్చేస్తా.
భద్రం రుంజుకున్నాడు. ఈ బతిమాలుకోడాలు. ...! మంగారావు గర్జించాడు? వెల్లాలి! మిత్రులిద్దరూ భద్రాన్ని తీసుకుపోయారు. మంగారావు నెమ్మదిగా ప్రారంభించేడు. కల్యాణి ఆడది. పొరుగూల్లో వుద్యోగం చేసుకుంటూంది. అటువంటి వాళ్లు నలుగురితో, అందులోనూ భద్రం లాంటి వాళ్లతో పేచీ పెట్టుకోకూడదు. అదిగాక ప్రతి చిన్నదానికీ ఇల్లా సాగదియ్యకూడదు. భాణాలు తియ్యడానికి సిద్ధం కావడం చిన్న విషయమా?! !
ఇక్కడెవరూ చావలేదుగా' అన్నాడు మంగారావు. శేఖరం, రాజగోపాలం నోరు తెరిచారు. కల్యాణి ప్రశ్నించింది. "ఆడదాన్ని, పారుగూళ్లో ఉన్నాగనక ఈ కేసు తీసేసుకోవాలంటారు. శేఖరం అలా కాదు. కొంచెం ఆలోచించమంటాను. అంతే! మనం ఏ కాంగోలోనో లేము. బెజవాడలాంటి పట్నంలో... ఒక్కొక్క సందర్భంలో ఎంతో బలమైన ప్రభుత్వం కన్నా కాంగోలాంటి అనాగరిక దేశమే మేలు.
అక్కడ ఒకరికి ఏదన్నా మంచి చెడ్డా జరిగితే వాళ్ల తెగవాళ్లంతా ఆసరా అవుతారు. ఇంక బెజవాడ అయితేనం... హైదరాబాద్ అయితేనం. మహాపట్నం కన్నా మహారణ్యం క్షేమమనిపించే ఘట్టాలుంటాయి! తన విజ్ఞానానికి తానే ఆనందిస్తున్నట్లు మంగారావు పకపకా నవ్వాడు. రాజగోపాలం వైపు తిరిగి ఏమంటారు? అన్నాడు. అతని ముఖంలో అసహ్యమే గానీ అంగీకారం కనబడలేదు. వున్నట్లుండి మంగారావు గంభీరంగా ముఖం పెట్టాడు.
మరి నో సెలవు తీసుకుంటా! కల్యాణి లేచింది. మంగారావు రెండడుగులు వేసి ఆగాడు. ఇంకోమారు ఆలోచించండి! కల్యాణి ఇంక పట్టలేకపోయింది. హంతకులకు రాజకీయపు ముసుగు వేయకండి. దేశాన్ని అడవి మృగాలతో నింపొద్దు! నేననుకుంటూనో వున్నా. మీరంతా కమ్యూనిస్టులు. మంగారావు విసవిన వెళిపోయాడు. ఆడదానివి, వాడన్నమాటా నిజమే. పారుగూళ్లో వున్నావు. రౌడీ వెధవలతో పని...''శేఖరం మాటలతో కల్యాణి గుండెల్లో నిజంగానే బెదురు పుట్టింది.
బెజవాడలో రౌడ్రీగ్యాంగులు చేస్తున్న అల్లరి కథలు ఆమె చాలా వింది. ఆ నాయకుడు వారికి అండ. ఈ షావుకారు కొడుకులు వీళ్లు. ఆ కులం వాళ్లంతా ఇలాంటి పనులకు మద్దత్తే. అంటూ అనేకరకాల కబుర్లు చెబుతుంటారు. నిజం ఏమిటో తెలియకపోయినా వాటిని విన్నాక పాడు బెజవాడ వదిలిపోదామని ఎన్నో మాట్లనిపించింది. అయితే ఇంతమంది ఆడవాళ్లు వుద్యోగాలు చేస్తున్నారు. ఏకుటా ఇన్నివేల మంది జనాభా పెరుగుతూనే ఉంది.
వాళ్లకి లేని భయం నాకేమిటని సర్పుకొంటూంటుంది. శేఖరం మాటలు విన్నాక భయం పుట్టినా...రాజగోపాలం అభినందనతో మరల మనస్సు నిలదొక్కుకుంది. ఇల్లాంటి దౌర్దన్యాలు మనం భయపడ్డకొద్దీ పెరుగుతాయి. మంచి పనిచేశారు.
అయిదో ప్రకరణం:-
రాజగోపాలం గారి కోసం ఎవరో వచ్చినట్లున్నారని రామలక్ష్మి చెప్తుంటే కల్యాణి తలుపు తీసింది. రాజగోపాలం అనే జూనియరు ఇంజనీరు....! పక్కవాటాయేనండి. వారు....నా కుమారుడు. ఆఫీసుకు వెళ్లేరనదలుచుకొని కూడా ఆగి లోనికి ఆహ్వానించింది. దయచేయండి. వారు ఆఫీసుకు వెళ్ళేరు! లోనికి తప్పుకోబోతున్న కల్యాణి ఆయన పిలుపునకు నిలబడింది...చూడండి' !ఎండలో నిలబడ్డారు.
ఫర్వాలేదు, మా వాళ్లు కూడా వచ్చారు. ఆమెగారు ఇక్కడుంటుంది...కలసివస్తా! ఇంకా చెప్పేరు కాదేం, ఎక్కడున్నారు వారు? కల్యాణీ ఆయన వెనువెంట వెల్లింది. మీ అబ్బాయిగారున్న ఇల్లు ఇదే. దయచెయ్యండి. అబ్బాయి వున్నాడా? కృష్ణంరా బే సమాధానమిచ్చాడు. వారు పక్కవాటా వారు. అతడిని నోను తీసుకొస్తా. నువ్వు వారింట్లో నేను పోయి అతన్ని .....ఉండు!
వెడుదురు గాని తెండి, దిగి కాస్సేపు కూర్చోండి. '' అంటూ కల్యాణి ఆహ్వానించింది. ఆమె చేతి ఆసరా తీసుకుని సావిత్రమ్మ రిక్షా దిగింది. వెయ్యి కాలాల పాటు వర్దిల్లు తల్లి!కల్యాణి చిరునవ్వుతో ఆశీర్వచనం స్వీకరించింది. ఇలా రండి! గుమ్మంలో రామలక్ష్మమ్మ స్వాగతం ఇచ్చింది. సావిత్రమ్మ చిరునవ్వుతో ప్రశ్నించింది. మీ కూతురా? మంచిదమ్మా! అదృష్టవంతులకు గాని అల్లాంటి సంతానం లభించదు?!
ఈ రోజుల్లో మాటా మర్యాదా తెలిసిన వాళఖెందరమ్మా! '' అని మొచ్చుకోలులో భార్యకు వంత కలిపాడు కృష్ణంరాజు. కల్యాణి చిరునవ్వు నవ్వింది. రామలక్ష్మమ్మనూ, సనుజాతనూ పరిచయం చేసింది. తమరిప్పుడు ఆయనకోసం వెళ్లొద్దు. ఆఫీసైతే దగ్గరే అనుకోండి. కాని, ఎండ మండిపోతోంది. ఒక్కక్షణం కూర్చోండి. స్నానం చేయండి!
రామలక్ష్మమ్మ ఆమెను బలపరిచింది. అల్లా చెయ్యండి. ఎప్పుడు బయలుదేరేరో కాస్సేపు విశ్రాంతి తీసుకోండి! సావిత్రమ్మ అంగీకరించింది. తెల్లవారగట్ల ఎప్పుడో బయలుదేరాం! ఎప్పుడో తొమ్మిదింటికి రావాల్సిన బండి. యిప్పుడు మూడయింది.! కృష్ణంరాజు దంపతులు కబుర్లలో కలిసిపోయారు. కేవలం ఆడవాళ్ల మధ్య కూర్చుండి కబుర్లు చెప్పుడానికి ఏలాగో ఉన్నా...
అరవయ్యేళ్లు దాటాక బెజవాడ వేడిని తట్టుకోవడానికి జంకే కలిగింది. పట్నంలో ఒకరి సంగతి వేరొకరు పట్టించుకోవడమే అరుదమ్మా. ఇది వరకు మా వాడు మరోచోట ఉండేవాడు. అదెక్కడో నాళ నడుమ ఉంది. చీకటి పడింది. వెతికి వేసారా. ఒక ఇంట్లో జరిగింది చెప్తా. ఇంట్లో ఆడమనిషి ఎదురుగా కనిపిస్తూంది. మాట్లాడదు! మోషా యేమో' అంది సుజాత. కృష్ణంరాజు అసంతృప్తిగా తలతిప్పేడు.
రాజసాలు సాగినప్పుడు, దివాణంలో ఏ మారుమూలనో ఉండేటందుకు అవకాశం ఉన్నప్పుడు ఘోషా సాగించినా అర్దం ఉంది. కాసావాడో, దాసీ మనిషో సమాధానమిస్తుంది. దోసెడు కొంపలో మా బట్టలేని దర్శిదంలో...మోషా అనేది సరైన పద్దతే అనుకుంకేు... ఇంటి వైశాల్యంతో, మనిషి ఐశ్వర్యంతో పనేముంటుంది? జరిగించుకోవాలసిందే! ' అంది...కల్యాణి.
సావిత్రమ్మ నవ్వింది. మంచి వృజ్జీవే దొరికావు. వారికి వాదం ఉంకే ప్రసాదం కూడా అక్కర్లేదు! భార్య మాటలు రుజువు పరుస్తున్నట్లు కృష్ణంరాజు హుషారుగా అందుకొన్నాడు. మన ఆచారాలూ, అలవాట్లూ మధ్యలో వచ్చినవే. మధ్యలో పోయవే. ఆడుదాన్ని చేలోప్రగా ఉంచుకొనోేటందుకు ఇంట్లో మూసి పెట్టాల్సిందేననుకొన్నారు . ఆడదాన్ని కష్టపడకుండా చేసేటందుకూ మూసి పెట్టారు కొందరు. మూసిపెట్టి నిభాయించుకోగల వాళ్ళు ఘోషా పెట్టారు.
లేనివాళ్ళకది లేదు. అదే గొప్పునుకొనో, అలవామకైపోయో సాగకపోయినా జరిగించే వాళ్ళు కొందరు. అనుభవించిన వాళ్ళం దాని బెడద వదల్సుకొంటూంకే, అదేదో మంచి పద్ధతీ, మర్యాదైన పద్ధతీ అని ఎగబ్రాకే వాళ్ళు కొందరు...!బాగుంది మీ ధోరణి. మీకేదో వెరి అనిపించింది గనక ప్రపంచానికంతకూ అనిపిస్తుందా ఏం? అని సావిత్రమ్మ మాట కలిపింది.
బాబయ్యగారింట్లో కోడళ్లకీ ఘోషాలు లేవన్నమాట! లేకపోలేదు. కొంత నయం. పుటిళ్ళ అలవాట్లు ఓ పట్టాన పోతాయా? అంది సావిత్రమ్మ. ప్రుట్టిళ్ళ అలవాట్లంటావేం? చదువు సంధ్యలు లేని పల్లెటూళ్ళ అలవాట్ట్లు అనక! ఈ మారు ఈ కొడుక్కి చదువుకొన్న పిల్లనే వెదికిచేద్రురుగాని తండి! ! అని సావిత్రమ్శ మగళ్లీ వేళాకోళం చేసింది.
సుజాత లోపలి గదిలోంచి కల్యాణిని పిలిచింది... ''అక్కా! కల్యాణి లేచింది. తమరిద్దరూ స్నానాలు చేయాలి. అంతవరకూ ఆ నీరసం అల్లాగే ఉంటుంది. లేవండి! వృద్ధ దంపతులిద్దరూ స్నానం చేసి, బట్టలు మార్పుకొనో వేళకి కల్యాణి ఫలహారాలు అమర్చింది. కృష్ణంరాజు అభ్యంతరం చేప్పాడు. మీకీ శ్రమ ఎందుకు తల్లీ. మాతో కూడా మిఠాయిలున్నాయి! ఉండనివ్వండి. అబ్బాయి వున్నారు' ' అంది రామలక్ష్మమ్మ.
కల్యాణి వారి అభ్యంతరాన్ని చొరనివ్వలేదు. మీకు బరువైన ఆహారం పెట్టడం లేదు. ఫలహారం అంకే కేవలం ఫలాహారమే. ఈ మామిడి పళ్లు సుజాతగారి పొలంలో పండాయి. వాళ్ల నాన్నగారు మొన్ననే తెచ్చి ఇచ్చారు! కృష్ణంరాజు హాస్యమాడేడు. ఈ కేకులు, బిస్కట్లు మీ పొలంలో పండలేదు గదా? కల్యాణి చిరునవ్వు నవ్వింది.
అంతేమరి. మాకు పొలాలంటూ లేవు. ఊళ్లో దుకాణాలే మా పొలాలు. కప్పుల్లో ఐస్క్రీమ్ వారి ముందుకు వచ్చింది. ఇదొక విధంగా మీ అబ్బాయిగారు ఇచ్చిందే అనుకోండి. ఐస్ కావాలని వెళ్ళేటప్పుడు చెప్పేం. మీరు వచ్చే ముందే ప్యూన్ చేత పంపేరు. కూమారుడు పంపిన ఐస్తో తయారు చేసిన ఆ ' క్రీమ్! ఆ దంపతులకు ప్రోత్సాహకరం కాలేదు.
ఉన్న మూడు వాటాల్లో ఒక్క రామలక్ష్మమ్మ తప్పు మిగతా ఇద్దరూ పడుచువాళ్లు. పెళ్ళిళ్లు కానివాళ్లు. ఉద్యోగాలకనో,చదువులకనో ఒంటరిగా కాప్రరాలున్నారు. వెనక పెద్దతోడు కనిపించదు. పైగా ఏ వస్తువులో కావాలని చిప్పేటందుకూ, పంపించేటందుకూ చనువుకూడా ఏర్పడింది. ఇదేమీ ఆ వృద్ధ దంపతులకు బాగా అనిపించలేదు. కానీ, పైకి అనలేరు. ఒకరి మొహాలొకరు చూసుకున్నారు.
కల్యాణి ఇంత మర్యాద చేయడంలో కూడా గూఢమైన భావం ఉందనే వారికి తోచింది. సావిత్రమ్మ కొడుకు జీవిత పద్దతుల వివరాలు ప్రశ్నించింది. అందులో కొడుకకు ఉన్న గ్రేమా, ఆతురతనో కల్యాణీ గమనించింది. వచ్చేసరికి బాగా రాత్రవుతుందా అమ్మా? పదీ, పదకొండూ, ఒక్కొక్కసారి రెండూ అవుతుంది! తల్సిప్రాణం ఆ మాటకు తల్లడిల్లిపోయింది. అంత రాత్రి వరకూ పన?
కల్యాణి వివరాలు తనకు తెలియవంది. డ్యూటీలుంటాయి. ఇతర సమయాల్లో స్నేహితులనో... ఏ సినిమాలకన్నా వెడతారు! ఇంటి దగ్గర కనిపెట్టుకొని ఉండేవాళ్ళు ఎవరూ లేరు కదా?'' అని రామలక్ష్మమ్మ వ్యాఖ్యానించింది. సావిత్రమ్మ లేచి ఓ మారు ఇల్లంతా చూసొచ్చింది. మూసిఉన్న తన కొడుకు వాటాలోకి ఉన్నతలుపులన్నింటివద్ర్దా ఒక్కో క్షణం నిలబడి కళ్లు వత్తుకుంది.
వేళకాని వేళల్లో తిండి వింటున్న కొడుకు ఏం చిక్కిపోయాడో! అని ఆమె ఆదుర్దా. త్వరలోనే ఓ ఇంటివాడైతే...కల్యాణి చిరునవ్వు నవ్వింది. పెళ్లి అయితే వేళలు తప్పించే డ్యూటీలు ఏమవుతాయనుకుంది. రామలక్ష్మమ్మ ప్రశ్నించింది. బంధువుల్లో ఈడూ జోడూ అయిన అమ్మాయిలున్నారా?! !
లేకేం.. బోలెడంత మంది. పదేసి వేలు కట్నాలు ఇస్తామంటున్నారు! మరింకేం? అంది రామలక్ష్మమ్మ. కానీ, వాళ్లెవ్వురూ చదువుకోలేదు! ''ఆ పట్టుదల తండిగారిదా? కొడుకుగారిదా?' తన కొడుక్కి చదువుకొన్న పిల్లనే చేయబోతున్నానని ఒక అరగంట క్రితమే చెప్పిన మాటను కృష్ణంరాజు మరచాడు. కొడుకు కోరిక మీద అసంతృప్తి ప్రకటించాడు.
మా తరం వరకూ భార్య చదువుకొందా? లేదా? అనే ప్రశ్న మాకు రాలేదు. సంప్రదాయం,మర్యాద, ఆస్తిపాస్తులు. .. ఇవే చూశాం. మా వాళ్ళున్నారు. ఆవిడ పేరు నావిడ గుర్తుపట్టలేదు! ఆయన మనస్సులోని ద్వైవిధ్యాన్న్ సర్ధుబాటు చేయబోయింది కల్యాణి. మీ రోజులు వేరు. ఆ కాలంలో చదువుకొన్నా చదువుకోకున్నా మనిషికి భూములే జీవనాధారం.
వ్యవసాయం చేసుకునవారు. వ్యవసాయం అనేసరికి కుటుంబంలో నలుగురన్నదమ్ములూ కలిసి మెలిసి కాపురం చేయాలి. ఆ కుటుంబాన్ని తీర్చిదిద్దే ఆడవాళ్లకి కావలసింది. పని ఓర్పు. వంటావార్పుల్లో దక్షత. ఇల్లు చక్కబెట్టుకునే మెలకువ. పనినేర్పూ, వంటావార్పుల దక్షతా ఈ వేళ మాత్రం అక్కర్లేదూ? ఆడదన్న తర్వాత...అది కాదండీ మామ్మగారూ! మీ ఇంజినీరు కొడుకున్నారు. పెళ్లి చేసుకొన్నాక ఆయన మీ ఇంట్లోనో ఉండిపోరుగద?
వుద్యోగం వుందిగా? పోనీ మీరు నలుగురూ వచ్చి కొడుకుదగర ఉండగలరా? సావిత్రమ్మ తలతిప్పింది. అబ్బే! లంకంత ఇల్లూ, కామాటమూ ఎక్కడవుతుంది? అసలా ప్రశ్నకే అర్ధం లేనట్లు కృష్ణంరాజు దానిని తోసేశాడు. పాలం పటా లేనివాళ్లు మాత్రం? కామాటం అంతా ఎత్తికట్టుకుని కొడుకుల్లో వుద్యోగపు వూళ్ళు వూరేగుతారా యేం?హౌనా మరి! తమ కాలం నాటి అవసరాలు వేరు. ఈ కాలపు అవసరాలు వేరూ అనడం...!!
అంత పెద్ద వంటలు వండనక్కర్లేకపోవచ్చు. పెద్ద ఇళ్య్రు సంబాళించనక్కల్లేకపోవచ్చు. కానీ, మగడూ, పిల్లలూ గాలి తిని బతకరు కదా? తనకైనా వంట వంకే, వండడం పని అనుకొన్నాక చదువుకొన్న పిల్లే కావాలనడంలో అర్దం ఏమిటి? త్రాసులూ, తక్కెళ్లతో తూచీ, బెన్సు గ్లాసులతో కొలిచీ వంటచేయాలా? కేకులూ, ఐస్శక్రీమూ ఇంట్లోనే తయారుచేశానన్నప్పుడు ఆయన ఒక్క గంట క్రితమే చదువుకున్న వాళ్ళుకుండే సర్వతోముఖ ప్రజ్ఞ మెచ్చుకొన్నాడు. ఇప్పుడు ఈ ఎత్తిపొడుపు.
ఎవరో హాస్యం కోసం అన్న మాటలూ, వ్రాసిన కథలూ మాటకేం అండి. చదువురాని వాళ్ళలో వంటరాని వాళు లేరూ? మా పెత్తల్లి కూతురుంది. ఏభయ్యేళ్లొచ్చేయి. మనిషికి ఎన్ని వీయ్యం కావాలో ఈనాటికెరగదు. ఆ మధ్య నేనో మారు చూసివద్దామని వెళ్లా. మామూలుగా పెక్పేదానికన్నా మరో శేరున్నర పోశాను. చాలదంటావా?' అంది. అందుచేత చదువుకోని ఆడవాళంతా అంతే అననా?
కృష్ణంరాజుకు ఏం చెప్పాలో తోచలేదు. సావిత్రమ్మ మగని పక్క నిలబడింది. ఇంతకీ చెప్పాచ్చేది. .. వాడికి చదువుకొన్న పిల్ల కావాలి. అందుకే టలాయిస్తున్నాడు! మంచిదే. అల్లాగ పట్టుపప్టే మగవాళు కొందరుంకే తప్పు ఆడపిల్లల చదువుమీద ఎవరూ శ్రద్ధ చూపరు.” ముందెవరో శ్రద్ధ చూపుతారంటే ఏం వొరుగుతుంది? ఈవేళ వరకు అటువంటి పిల్లలు మా కులంలో బాగా తక్కువ. చదువుకొన్న కొద్దిమందీ అందుబాటులో వుండరు.”
"చదువుకొన్న పిల్ల కావాలన్నప్పుడు, దానికి అంగీకరించాక, ఆ పిల్లని చూసుకొనే పనికూడా ఆయనకే వదలండి. ...” అంది. రామలక్ష్మమ సమస్యకు తానేదో పరిష్కారమార్గం చూపుతున్నట్టు. కాని, ఆ పరిష్కారం వాళ్ళిద్దరిలో ఎంత ఆందోళన తెచ్చిందో అక్కడున్నవారెవ్వరూ గమనించలేదు. ' ఇక్కడ చదువుకున్న వాళ్ళకి ఇద్దరు పిల్లలున్నారు. ఆ
ఇద్దరిలో ఎవరిని ఏరుకొన్నా
సంతోషమే, 'నని బాహాటంగా ప్రతిపాదించినట్లు వులికిపడ్డారు.
"రులంకాని కులం వాళ్ళని కావాలంకే....”
కృష్ణంరాజు కంఠస్వరం విని కల్యాణి ఉలికిపడింది. నాలుగురోజుల [క్రితం శేఖరమూ అదే భయం
ప్రకటించాడు. "ఏమిటీ ఆ కులం
గొప్పు”-అనుకొంది. కాని మైకేమీ అనలేదు.
నిజానికి కులం ప్రసక్తి వచ్చాక సంభాషణ ఎక్కడికక్కడే తెగిపోతున్నస్తు అనిపించింది.
ఆరో ప్రకరణం
జీవితంలో ఎదురుపడ్డ వాళ్ళంతా తమవైపే ఆకలిగా చూస్తున్నారనే హెచ్చరిక కొందరిని అనుక్షణం
వెంబడిస్తూంటుంది. ఎవరో తట్టి
చూపించేవరకూ తమ ఎదుట కనిపిస్తున్న వాటిని కూడా చూడలేరు కొందరు.
సరిగ్గా కల్యాణి విషయంలో జరిగిందంతే. బహుశా అది తన మనస్సును కూడా గుర్తించకపోవటం
వలన కావచ్చు. రాజగోపాలం పెళ్ళి
విషయంలో తల్లిదండ్రుల్ని ధిక్కరించడం సంతోషం కన్న సానుభూతి చూపవలసిన విషయంగా
ఆమెకు తోచిందంకే మరో అర్హం లేదు. గట్టిగా
నిలబడమనీ, మేమంతా నీ ప్రక్కనున్నామనీ దిలాసా ఇవ్వడం అవసరమన్నంతవరకే ఆమె
ఆలోచనలు వెళ్ళేయి.
"కులం కాని కులంలోంచి భార్యను ఏరుకుంటాడేమోనన్న భయం ఎందుకు కలగాలి? మీ అబ్బాయి
చాలా యోగ్యుడు. తల్లిదండ్రుల మాట
కాదనడు అండి. '-- అంటూ రామలక్ష్మమ ఊరడించినా ఆ దంపతులకు విశ్వాసం కలుగలేదు.
విశ్వాసం కలగకపోవటానికి తగిన
ఘటనలేం జరగలేదు. అసలు కొడుకును చూడకుండానే, ఆతనితో మాట్లాడకుండనే వారిలో ఆ
అవిశ్వాసం ఏర్పడింది. దానికి కారణం
అవసరంలేదు. అంతస్సాక్షి సూచన.
అనుకొన్నట్ట్లుగానే రాజగోపాలం తల్లిదండ్రుల (ప్రతిపాదనలన్నింటినీ నిరాకరించాడు.
ఒకరోజు రోజంతా తల్సిదండ్రులూ, కొడుకూ తమ వాటా విడిచి బయటకు రానేలేదు. మధ్య మధ్య
వినిపించిన రంకెలతో కృష్ణంరాజు కంఠం
చర్చాంశాన్ని నలుగురికీ వివరించింది.
ఎంత వినకూడదనుకున్నా ఏవేవో మాటలు చెవిని పడుతూనే వున్నాయి. రెండు వాటాల మధ్యనున్న
తలుపులూ, గోడలూ వారి రహస్యాలను
కాపాడలేకున్నాయి.
పడుచుల ఆకారాలు, వారి తండ్రులివ్వగల కట్నాలు- కానుకలు వారి కుటుంబాలు చేకూర్చుగల
ప్రతిష్టలు ఉదాత్తానుదాత్త
స్వరితాలలో కృష్ణంరాజు కొడుకు మనస్సుకు పట్టించ ప్రయత్నిస్తున్నాడు. కాని, అవన్నీ విఫలమైనప్తే
తెలిసిపోయింది.
"చ్రేతి కందుబాటులో వున్నదని నాటక మాడాలనుకుంటున్నావేమో. ఆస్తంతా నా స్వార్దితం. ”--
అంటూ కృష్ణంరాజు ఇచ్చిన అంతిమసందేశం
వినబడ్రా, ఆయన పేర్కొన్న పిల్ల తాననమోననే అనుమానం కూడా ఆమెకు కలగలేదు. ఆ
బదిరింపును కొడుకేమ్మాతం లక్ష్యం చేశాడో
రూడ ఆమె వినలేదు.
ఆ మాట విన్న రామలక్ష్మమ్మ కృష్ణంరాజును అభినందించలేక పోయింది.
"ఒక మూల ఆస్తికీ పెళ్ళికీ లంకెపెడుతూ, రెండో వేపున అది దైవనిర్దిష్టం అని ఆత్మ వంచన
చేసుకోవడం దేనికీ?"
తౌల్లవారగట్ల ఎవ్వరితోనూ చెప్పకుండా కృష్ణంరాజు భార్యతో రైలుకి వెళ్ళిపోయాడు. ఆ రోజునుంచీ
రాజగోపాలం తమరందరినీ తప్పించుకు
తిరుగుతున్నట్లనిపించింది కల్యాణికి. వివాహవిషయంలో తల్లిదండ్రుల్ని ధిక్కరించినందుకు తామంతా
తప్పుపడతామనుకున్నాడేమో. తమ
వివాహవిషయంలో తమ ఇష్టమే చెల్లాలని కోరే యువకులు ఎందరున్నారు? ఎన్నో బాసలు చేస్తారు.
కలలు కంటారు. కోపగించి
కొన్నాళ్సు తిండి తిప్పలు మానేస్తారు. కాని చివరకు తండి గద్దింపో, తల్లి ముద్దింపో, ఆస్తి బద్దింపో,
బంధువుల (ప్రోత్సాహమో
ఏదో ఒకటి దిగ తీసేస్తుంది. చప్పుబడి జీవితాన్ని ప్రవాహంలో వదిలేస్తారు. కొంతకాలం వెనుకటి
ఆశలు మనస్సుల్ని ఎరియ
పెడతాయి. తరవాత మరిచిపోతారు. మంచి కీలక సమయంలో కాస్త మాట ఆసరా, చేయూత
దొరికినవాళ్లు తమ కోరికల్ని
ఫలింపచేసుకొంటున్నారు. తల్లిదండ్రులు అంగీకరించి చేసిన వివాహాలకన్న ధిక్కరించి చేసుకొన్నవి
తక్కువ సుఖ పడడం లేదని
నిరూపించారు. బంధువులనీ, ఆస్తుల్నీ, స్వజనాన్నీ, సమాజాన్నీ కూడ ధిక్కరించి ఆశయాలకోసం
ఎంకైనా త్యాగం చెయ్యగలరు.
కల్యాణి ఆలోచన ప్రకారం రాజగోపాలం ప్రస్తుతం ఆ పరిస్థితిలో వున్నాడు. తమకున్న పరిచయంలో
తాను ఆ ఆసరా ఇవ్వడానికి
తగివున్నానని కూడ అనుకుంది.
కాని, అతడే ఆ అవకాశం ఇవ్వలేదు. వెనుకటికన్న ముందే ఇంట్లోంచి లేచిపోతున్నాడు. చాలా
ఆలస్యంగా వస్తున్నాడు. అతడెందుకు
తప్పించుకు తెరుగుతున్నాడో ఆమెకు అర్దం కాలేదు. నాలుగు రోజుల అనంతరం ఒక సాయంకాలం
అతడు డాక్టరు మంజులత యింట్లో తేనీటి
విందుకు హాజరయ్యాడు. ఆమె చెల్లెలు పరీక్ష ప్యాసయినందుకు టీ పార్టీ ఇచ్చింది. ఆశ్చర్యం,
సంతోషం కలిగాయి.
"మా ఇంజనీరుగార్ని నువ్వెరుగుదువా?"”
మంజులత కల్యాణి ఈడుదే, విశాఖపట్నంలో చదువుతున్నప్పుట్నించీ ఇద్దరికీ స్నేహం వుంది.
ఇప్పుడామెయే కళానికేతనం మైైోస్కూలుకు
వైద్యు సలహాదారు. కల్యాణి కళానికేతనంలోనే పని చేస్తూంది.
"మీ ఇంజనీరంకే?"”
మంజులత అనని మాటను వూహించుకొని కల్యాణీ ముఖం జేవురించింది. మంజులత పదీక్షగా
చూసింది. "ఏం కథ?”
కల్యాణి నవ్వింది.
"తోనిపోనివి వూాహించుకోకు. "
మంజులత ఆమెను తీసుకెళ్ళి రాజగోపాలం ముందు కూర్చో బెట్టింది.
"మీకూ నాకూ పరిచయం ఎల్లాగో మీదీవిడకు చెప్పుండి.”
రాజగోపాలం కంగారు పడ్డాడు. మంజులత పకపక నవ్వింది.
"మేమిద్దరమూ ఇంటరు కాకినాడలో చదివేము."”
వారిదరినీ ఆ కేుబులు వద్ద వదిలి మంజులత మిగిలిన అతిథుల్ని పలకరించడానికి వెళిపోయింది.
వారం పదిరోజులుగా తాను కనబడకపోవడానికి ఏవేవో కల్పిత కారణాలతో క్షమాపణ పూర్తి చేసుకొనే
వేళకు మనస్సు కుదుటపడింది.
తన తండి మాటలను ఆమె వినలేదు. ఆ విశ్వాసం కుదిరాక అతడికి తన మనస్సులోని
సంఘర్షణను చెప్పడం సులభమే అయింది.
"మా అమ్మ కన్నీళ్లు చూస్తుంకై మన జీవితాల కింతే ననిపిస్తుంది. అనుకొన్నదేదీ జరగదు.
జరగకపోతే కలిగే బాధను మనం
ఎరుగుదుంగనక మన తర్వాత తరాల వాళ్ళయినా మన ఆశయాలకనుగుణంగా నడుచుకోగల అవకాశం
కల్పిద్రామనో దొక్కశ్రే సంతంప్తి.
అదొక్కకశే మనబాధకుపశాంతి.
అతని వాక్యాలతో కల్యాణి అంగీకారం చూపలేదు.
"మఘ్సీరు జీవిస్తున్న పరిస్థితులే మీ తర్వాత తరం కాలంలోనూ వుంటాయనుకోకండి. భిన్న పరిస్థితులలో
ఆశయాలుకూడా భిన్నంగానో
వుంటాయి. ఈనాడు మీరు సాధించలేకపోయాననుకునే ఆశయాలు ఆనాటివాళ్ళుకి ఆచారాలే కావచ్చు."
"అదీ నిజమే."
"అందుచేత ఎవరి ఆశయాలను వారు కాపాడుకోవాలే గాని, భవిష్యత్తరాలకోసం. ..”
రాజగోపాలం వాదంకోసంకన్న తన మనస్సులోని ద్వైవిధ్యాన్ని వివరించడంకోసం ఎక్కువ బాధపడ్డాడు.
తన అన్నలకు లేని చదువు తనకు లభించడానికి తన తండే కారణం. ఆయన తన అభివద్ధి
కోరేడు. ఎంత డబ్బు కావాలన్నా
పంపించాడు. ఇప్పుడాయన మాటను తాను తోసేస్తుంకు ఎంతో బాధపడుతున్నాడు. తాను
కాదంటున్న ఆయన మాటకూడా తన భవిష్యత్తును కోరి
చెప్పుతున్నదే. ఆయన కోరిక కూడా పెద్దదేం కాదు. వివాహం విషయంలో వచ్చింది పేచీ. కన్యను
ఎన్నుకునే హక్కు తనకిచ్చాడు.
అయిష్టం అయిన సంబంధం చేసుకోమననన్నాడు. కట్నం వదలుకోవడానికి వొప్పుకున్నాడు. ఆయన
కోరిందల్లా ఒక్క చిన్న విషయం.
చేసుకొనే పిల్లను తమ కులంలోంచే చేసుకోమంటారాయన. అది ఆయన నమ్మకం. నీకు ఫలానా
రులం పిల్లను చేసుకోననేో నియమం లేదు
కదా! ఏ కులం నుంచైనా చేసుకుంటావు. కనుక ఈ పిల్లను. మరో పిల్లను చూసుకోమన్నాడు.
వాళ్లంతా మా కులం వాళ్ళే. అన్ని
రులాలలో మాదొకటి. ఆయన చెప్పిన సవరణకు ఎందుకు అంగీకరించకూడదు?
కల్యాణి అతనిని నిలవరించింది.
"వివాహం విషయంలో కులభేదాల్ని పాటించరాదనే మీ నియమం ఎందుకోసం?”
రాజగోపాలం ఆలోచించాడు.
"వివాహం (ద్రేమ (ప్రధానం కావాలి.”
"బాగుంది. [ట్రేమ అనేదెప్పుడూ ఏకవ్యక్తినిష్టం. ఫలానా వ్యక్తి తనకు కావాలనుకోవడమే కాదు. ఆ వ్యక్తి
లభించకపోతే తన
బ్రతుకే లేదన్నంత తీవ్రమైన భావోద్వేగాన్నది కలిగిస్తుంది. అల్లాంటప్పుడు నాన్నగారి మాటకోసం
లొంగిపోతున్నాననుకునే మనిషి
చేమ ఎరగడని చెప్పాలి. అనుభూతిలో లేక కేవలం భావనా మాత్రంగా వున్నప్పుడు మాత్రంగా
వున్నప్పుడు మాత్రమే మీరు
చెప్పినట్లు 'పోనీలే సర్తుకుపోదాం' అనుకోగలరు. ”
రాజగోపాలం ఏమీ అనలేకపోయాడు. తన మనస్సులో అటువంటి వృద్వేగమే వున్నదనీ, దాని
మూలంగానే తండ్రిమాట కాదన్నాననీ
చెప్పలేకపోయాడు.
"మా అమ్మ. ఆమె కన్నీళ్ళు పెడుతూంది. అది చూస్తే బతుకు మిద విరక్తి కలుగుతూంది. కేవలం
నా స్వార్ధం కోసం, నా సుఖం
కోసం కన్నతల్లిని ఏడిపిస్తున్నానే అనే బాధ కలుగుతూంది.”
కాని స్వార్ధం-నిస్స్వార్దం అనే మాటల కిక్కడ ప్రయోజనం లేదని కల్యాణి అభ్మిపాయం.
"మీ అమగారు కన్నళ్యు పెట్టవలసిందేమీ లేదు. తమ మాట ఏదో సాగలేదనో ఉడుకుబోతుతనం
తప్పిస్తే...... 7
తల్లికి ఉడుకుబోతుతనం అన్న మాట రాజగోపాలానికి కష్టం అనిపించింది. చటుక్కున మాట
తెంపేసేడు.
"ఇల్లాంటి సమస్యలు చర్చుల్లో తేలవు. ఎవరి ఊహాశక్తిని బట్టి వారు పరిష్కరించుకోవలసిందే
గాని....”
తానన్న ఏదో మాట అతనికి కష్టం కలిగించిందని కల్యాణి గ్రహించింది. బహుశా తల్లిని గురించిన ఆ
వ్యాఖ్య రుచించకపోవచ్చు.
వెంటనో క్షమాపణ చెప్పుకొంది.
"క్షమించండి. మీ స్వంత వ్యవహారాలలో అధిక జోక్యం చూపించాననుకొంటా. *
ఏడో ప్రకరణం
ఒక్క నిముషం ఉభయులూ మాటలేవీ తోచనట్లు కూర్చుండి పోయారు. కొత్త విషయంలోకి సంభాషణ
మార్చడం ఎల్లాగో ఇద్దరకూ
తోచడంలేదు. అంతకంతకు ఆ నిశ్శబ్దం మెదడులోని ఆలోచనలను అణిచేస్తుంకు కుద్చీల్లో
ముళ్ళమీదున్నట్లున్నారు. మంజులత రాక ఆ
సమయంలో దైవచోదితంగా కనబడింది. ఇద్దరి ప్రాణాలూ లేచివచ్చాయి.
"మాటా మంతీ లేకుండా కూర్చున్నారు. దౌబ్బలాడుకున్నారా యేం?”
ఇద్దరూ వలికిపడ్డారు. కాని వారి సమాధానానికి ఆగకుండానే మజులత అటువైపుగా వచ్చిన చెల్లెల్ని
పిలిచింది.
"మాయా?"
మాయ ఇరవై రెండేళ్ళ యువతి. ఆమె ఎం.ఎస్.సి. పాసయిన ఉత్సాహంలోనే మంజులత ఈ టీ
పార్టీ ఇస్తుంది. మాయ యూనివర్సిటీ
ప్రథమురాలిగా రావడం ఆమెకెంతో సంతోషంగా వుందని పరిచయ వాక్యాలలోనే కల్యాణి గ్రహించింది.
మాయ నభినందించింది.
"౭ఇంకేం చెయ్యాలనుకుంటున్నారు?”
మాయ సిగ్గుపడింది. ఆమె బదులు మంజులతే చెప్పింది.
”ఈ ఏడాది విశ్రాంతి తీసుకొంటుంది. ”
"నో, నో. ఏ రీసెర్చి ఇన్సిట్యూట్లోనో చేరి డాక్టరేట్ కు ప్రయత్నిస్తా.”
మాయ కంఠంలో వూహించని కారిన్యం ఏదో వినబడి కల్యాణీ వులికిపడింది. అంతవరకూ తాము
చర్చిస్తున్న విషయమే మనస్సులో
మెదిలింది. వివాహ విషయమే ఇక్కడా అక్కచెల్లెళ్ళమధ్య ఘర్తణకు కారణం
అయిందేమోననిపించింది. చదువుకొని సంపాదించుకుంటున్న
రాజగోపాలం, యూనివర్సిటీలో అగ్మశ్రేణిలో ప్యాసైన మాయ వివాహ విషయంలొ పరాధీనంగా
వుండాలిసిందేనా? ఎవరో ఒకరు వారి
ఇష్టానిష్టాలను పాలించవలిసిందేనా? అనిపించింది.
కాని మంజులత అంత సులభంగా తన వోటమిని అంగీకరించలేదు. చెల్లెలి మాట కార్కశ్యాన్ని
గుర్తించనట్ట్లు నటించింది. నవ్వింది.
”"ప్రరీక్షలయి ఇంటికి వచ్చినప్పుటినించీ నలతగానే వుంది. ఓ ఏడాది విశ్రాంతి తీసుకోమంకే జీవితం
అంతా కొల్లబోయినట్లు బాధ
పడుతూంది.
మాయకూడా నవ్వేసినప్లే మాట్లాడినా దృథఢంగానే తన మాటను చాటుకుంది.
"అబ్బు! ఈ డాక్టర్లొాకళళూ, జ్యోతిష్కులొకళూ- వీళ్ళ దగరుంకేు లేని రోగాలు వచ్చేటట్లు చేస్తారు.
ఆటో-సజెషన్ ?
రాయిలా వంకే చూడండి నలతగా వృన్నానంటుంది. బాబోయ్! అక్కా! గ్రమకీ, అభిమానానికీ కూడా
ఓ హద్దు వుండాలే మాతల్సీ! అతి
అయితే భరించలేం.”
డాక్టరు మంజులత నవ్వేసినా లోలోపల పళ్ళు కొరుకుతూందనిపించింది, కల్యాణికి. రాజగోపాలం
లేచేడు.
"మీరూ వస్తున్నారా ఇంటికి?"
కల్యాణీ సందేహించింది. ఒక్క పావుగంట[కితం కలిగిన వైముఖ్యం నుంచి ఆమె ఇంకా తేరుకోనోలేదు.
అతనితో కలిసి మూగిగా నడుస్తూ
వెళ్ళడంలో సొబగు కనిపించలేదు.
"మీరు నడుస్తూండండి. "
రాజగోపాలం వెళ్ళిపోయాడు.
కల్యాణీ చదువును గురించీ, కాలేజీనిగురించీ, స్నేహితులను గురించీ అనేకరకాల ప్రశ్నలువేసి
మాయను సంభాషణలోకి దింపడానికి
ప్రయత్నించింది. కాని ఆమె ఏకాక్షర సమాధానాలను మించి పలకలేదు.
వున్నట్లుండి మంజులత "తిరపతి పోయొుదధ్దాం. నువ్వుకూడా రా కల్యాణీ. ఇంకా
'సెలవులున్నాయికదా?” - అంది.
కల్యాణి వులికిపడింది. మాయ చిరునవ్వు నవ్వింది.
"మా అక్కకీ మధ్య మనుష్యులమీద విశ్వాసం పోతూంది.”
"సమానాంతరం లొ మానవాతీత శక్తుల మీద విశ్వాసం పెరుగుతూందంటారా?”
ఇంతసేపటికి మాయను మాటల్లో పెట్టగల అంశం దొరికినందుకు కల్యాణి ఆనందించింది.
"మీరిక్కడున్నారు. కనక వినలేదు. కాని, మెయిన్ హాలులో ఒక పథికా సంపాదకుడు భగవంతుని
మీద ప్రజలలో భక్తి
వ్యాపింపచేయవలసిన అవసరాన్ని గురించి ఒకకేు....”
డాక్టరు మంజులత చెల్లిలి వంక ఘుృణాపూర్వుకంగా చూసింది.
"మనం జీవితంలో అన్నీ సాధించగలమనే దీమా మన అలు జ్ఞానానికి చిహ్నం. నువ్వు ఎంత
చదువు, ఎంత పరిశోధించు, నీ
పరిశోధనలకీ, చదువులకీ అందకుండా మిగిలిపోయిందింకా ఎంతో ఎంతెంతో మిగిలివంటూనే
వుంది....”
"దానికి మనం కొన్ని పిచ్చి ధోరణులు స్వయంగా తెచ్చిపెట్టుకోవాలని అర్హమా?"”- అంది మాయ.
కల్యాణి విచారం ప్రకటిస్తూ డాక్టరు ముఖంలోకి చూసింది.
"ఈ వేళ తెనుగుదేశాన్ని వంద, రెండు వందల యేళ్ళ పూర్వానికి తీసుకుపోవాలనే ప్రయత్నం కసిగా
చేస్తున్నారు కొందరు. రేడియో
తిప్పు, వేంకకేుశ్వర సుప్రభాతం. పటిక తియ్యి, శిథిలం అయిపోతున్న దేవాలయోద్ధరణకు
విరాళాలు, వేంకశకశ్వరుడి ప్రత్యక్ష
మాహాత్మ్యపు కథలున్నూ. నవలలు తియ్యి, మహత్తర విజ్ఞానానికి గోరీ కట్టి పురాణ గాధల
పునరన్వేషణలు. డాక్టరుగారూ!
మీది ప్రత్యక్ష ప్రమాణం మీద ఏర్పడిన శ్యాస్తం. మీరూ....”
మంజులత ఏదో నిర్ణయానికి వచ్చినట్లు ముఖం పెట్టింది.
' ' 'ప్రోనీ వాళ్లందరూ ఛాందసులు గనక చేశారు. చెప్పేరు. ' అనేసేస్తావు. కానీ, ఈ వేళ సమాజంలో
కమ్యూనిస్తులు వంటి మొండి
నిదీశ్వరవాదులు కూడా దేవుజ్లీ కాదనకుండా ఉండగా. ..!!
ఒక కమ్యూనిస్తు గృహం కట్టుకొని గృహప్రవేశంతోపాటు సత్యనారాయణ వ్రతం చేశాడు. మరొకాయన
తిరుపతివెళ్లి భార్యతో సహా
ముండనం చేయించుకుని వచ్చాడు. సాంఘికంగా పూర్వాచారాలన్నీ తోసిపుచ్చిన వీర కమ్యూనిస్తు
వనిత నోడు శివపూజ వేళ తప్పుకుండా
చేస్తుంది. ఒకాయన భార్య క్రీస్తుకు కొలుపులు ప్రారంభించింది. కొడుకు చనిపోతే [క్రీస్తులాగ
మూడోరోజున లేస్తాడని ఆమె శవాన్ని
కదలనివ్వణేదు. తన వాదనల బలహీనతను కమ్ముకొనేటందుకు సాక్ష్యంగా ఆమె బోలెడన్ని
ఉదాహరణలు, పేర్లు సంతరించింది.
' 'కమ్యూనిస్తులంకే మీకు ఇష్టం కాదే. మీరు వారినే సాక్ష్యం ఎందుకు తీసుకుంటున్నారు?!
కల్యాణికి ఆశ్చర్యమే కలిగింది. కానీ, మాయ తెలిపిన అభ్యంతరం వేరు.
* *" కమ్యూనిన్టుల్లో నువ్వు చెప్పిన పనులు జరిగే ఉండొచ్చు. అందరూ మీ వెంకకుశ్వరుల్నో, క్రీస్తునో,
మరో బేవుడినో
స్వీకరించారని చెప్పలేవు కదా?!
'' ఈ చర్యల్ని ఆ పార్టీ ఖండించలేదు. నిషేధించలేదు. కనుక ఆమోదించినప్లే భావించాలి.
మాయ సర్దుకొంది.
' "నేను వాళ్ల తరఫున వకాల్తా పుచ్చుకోలేదు. నీ ప్రశ్నకి సమాధానం వాళ్లనే చెప్పుకోనీ. ఒకవేళ వాళ్లకి
నీ వాదనలే
నచ్చినా. . భగవంతుడి అస్తిత్వం నిరూపించబడదు. విజ్ఞాన శ్యాస్తాలు బుట్టకెక్కవు' !
కల్యాణి ఆలోచించింది.
''మా అన్న ఓ కమ్యూనిస్తు. మా వదిన సాయి భజన చేస్తుంది. అది మత స్వేచ్చను అమలు
జరపడమనీ, శాంతియుత
సహజీవన నూత్రాన్ని ఇంట్లోంచి అమలు జరిపి చూపిస్తూన్నాననీ మా వాడి పరితృప్తి,
పదేళ్ల క్రితం ఆ వదినే మా అందరికీ నిరీశ్వరతత్వం బోధించింది. కానీ, ఈ వేళ ఇల్లా
ఎందుకయింది? తన కొడుకు పదీక్ష
పాసైతే మూలేశ్వరుడి గుళ్లో కొబ్బురికాయలు కొట్టించింది. మగడు లంఖణం చేస్తే మార్కండేయ
స్వామికి మొక్కుకుంది. ఇదంతా
ఎందుకొచ్చిందీ* ఎల్లా వచ్చిందీ? అని మా అన్నే ఆశ్చర్యపడతాడు. శ్యాస్తవిజానం, తార్కిక దృష్టీ,
పట్టుదలా చూపడం
తగ్గేసరికి ఫలితం ఏమయింది? వాళ్లననుసరించినవాళ్లే ఈ వేళ ఎన్నో మూర్జ్ణాచారాలు సాగిస్తున్నారు.
కానీ, డాక్టరు గారూ!
విశ్వాసం ఒక్కటీ చాలదు. దానిని కనీసం కొంతవరకయినా అమలు జరిపే ఆలోచన ఉండాలి.
కమ్యూనిస్పులైనా అంతే. కాకున్నా
అంతే..!!
' ' నిదీశ్వరతత్వం బోధించిన నాటికన్నా మీ వదిన పదేళ్లు పెరిగింది. ఆ పదేళ్లలో సత్య పరిజ్ఞానం
రూడా కలిగిందని యందుకు
ఖావించకూడదు?'
''మీ అన్నయ్యని నేనొక విధంగా అర్దం చేసుకుంటున్నా. ఆయన నహించకపోతే ఇంట్లో అడుగడుక్కీ
పేచీ. కొట్లాట. ఆమె చేసే
దానిని సహించకపోతే భార్యను కొట్టాలి. వదిలేయాలి. అదిమాత్రం వాంఛనీయమా?' ' ... అని
మాయ తానారగని భాస్కరాన్ని
సమర్దించింది.
కల్యాణి ఆమెను పుచ్చిపోయేలా చూసింది.
' "ఆడవాళ్లు మూర్చులూ, పెంకివాళ్లూ అనే సదబ్శిపాయం...!!
' "తమ మూర్తత్వం (గ్రహించిన వాళైవరూ మూర్పులు కారు! !
ఎనిమిదో ప్రకరణం
పనిలో ఉండగా ఫోన్ మీద ఎవరో పిలుస్తున్నారనే కబురు వచ్చింది. రాజగోపాలం హడావిడిగా
వచ్చాడు.
డాక్టర్ మంజులత తన్ను తిరుపతికి రమ్మని పిలుస్తూంది.
' " ఏమిటా హడావిడి?! !
' ' వెళ్లాలనిపించింది. కారు వీధిలో పెట్టా!
సెలవు దొరకడం, బట్టలు చాకలి వద ఉండడం, దేవుడి మీద నమ్మకం లేకపోవడంలాంటివేమీ
మంజులత ఉత్సాహాన్ని ఆపలేదు.
అతనికి తప్పించుకొనటందుకు దారి దొరకలేదు.
' ' ఏమిటీ హఠాత్తుగా నోేనాందుకు జ్ఞాపకం వచ్చాను?!
మంజులత దానికి కారణాలు వేళ్లు మడుస్తూ ఏకరవు పెట్టింది.
ఒకటి మగాడివి.
రెండు నాతో చదువుకొన్నావు.
మూడు కారు (డైవు చేయగలవు.
' ' దాని అర్దం (డైవరు రావడం లేదన్నమాట: |
1 ' చేదు! 1
"మాయ?!
* "కల్యాణి టీచర్ని తీసుకెడదాం' |
' ' ఒకటి చెప్పు?'
''కానీ....'!
' "నిన్ను నేను పిలవడానికి కారణం అడిగేవు కాదూ!!!
''ఆ...!!
' "కల్యాణి టీచర్ని పిలవమనడానికేమిటి కారణం? !
రాజగోపాలం నమాధానం చెప్పలేకపోయాడు. మంజులత నవ్వింది.
' 'నాకు కావాల్సింది నువ్వు"!
రాజగోపాలం ఏమీ అనలేకపోయాడు. ఆఖరు ప్రయత్నంగా భోజనం మాట ఎత్తేడు.
' ' దాని అర్దం నీకు రావడం ఇష్టం లేదు. అంక నేను ఎందుకు వెళ్తున్నానో నీకులు తెలుసు. ఆ
అవసరం కలిగించడంలో
కారణభూతులైనవారిలో నువ్వొళక్కడివని నాకు తెలుసు. అది నీకు తెలుసు. అంతేనా?''
''అంకే...?"!
?" యాయ వూళ్లోలేదు? !
రాజగోపాలానికి ఆశ్చర్యం కలిగింది. మాయ భయపడినదే జరుగుతూంది. తాను చేతిగాజులమ్మి
ఆరువందల రూపాయలు తెచ్చి ఇచ్చిన
విషయం మంజులతకు ఎలా తెలిసిందో? ఆమెకు తెలియకుండా చేయాలనే మాయ తనకు ఆ పని
అప్పగించింది. కానీ, ఆ రహస్యం
బయటపడింది. ఆవలివైపు నుంచి మంజులత ప్రశ్నిస్తూ ఉంది.
' 'బౌనా కాదా?! |
' 'నీ ప్రశ్న నాకు అర్దం కాలేదు! !
' ' మాయకు డబ్బాక్కడిది?' !
' 'నీ అంత అప్పుగారు ఉండగా. . ఆమెకు డబ్బులోపమెందుకుంటుంది? !
' "అదో ఎత్తిపాడుపా?' *
' ' అల్లా ఎందుకనుకొంటావు? ' !
' "దాని చేతిగాజులు నువ్వు అమ్మిపెట్టలేదూ? ' !
రాజగోపాలం నవ్వేడు. తోసివేసేడు.
' "ఎంత గందగోళంలో పెట్టావు మంజులతా? మరో వస్తువుకు మార్చివేయడానికి ఎంత కథ
కల్పించేవు?' !
మంజులత లక్ష ప్రశ్నలు వేసింది.
మార్చి ఏం తీసుకొంది? నన్ను తీసుకెడితే మరో పాతిక, పరకో పడ్డా వేద్దును కదా? ఆ పనికి నిన్న
ఎందుకు నియమించింది? ఆ
విధమైన ఘట్టం వచ్చినప్పుడు నాతో ఎందుకు చెప్పేవు కాదు?
' 'నోనింత ఆలోచించలేదు మంజులతా!'! ౨.౨౨౨... అనేదొక్కకే ఆ ప్రశ్నలన్నింటికీ అతడిచ్చిన
సమాధానం.
' ' అదిప్పుడో సన్వాసిని. ..'*
' "ఇప్పుడు సన్యాసం పుచ్చుకొందామన్నా ఇచ్చేవాళ్లెవరున్నారు?! !
' "అతి తెలివి చూపకు! !
రాజగోపాలం నవ్వుకొన్నాడు.
''ఆ 'ని' ద్వితీయా విభక్తి ప్రతయం అన్నమాట. సరే?
* ' మెల్లి చేసుకొనోేటందుకు తిరుపతి వెల్లింది! !
' "అది నిలిపేటందుకు నువ్వు తిరుపతి....?'!
అసలు విషయం ఎరిగిన రాజగోపాలం ఒక్క నిట్టూర్చు తీసుకున్నాడు.
' ' ఉద్యోగంలో ఫ్టిరపడేవరకూ నువ్వు పెళ్లి కూడదంటావు! ' . అంది మంజులత.
''నా మాటకు (ప్రపంచం ఎంత విలువ ఇస్తుందో పరీక్షకి పెట్టాలంటావు! !
' "పోనీ అల్లాగే అను!
మరో పదిహేను నిమిషాల్లో న్యూబిడి వద్ద మంజులత కారును అందుకొన్నాడు.
అప్పుటికే సాయంకాలం అవుతోంది.
' "గుంటూరులో భోజనం చేద్దాం! !
' 'న్నిద?'! |
' "దారిలో, (టావెలర్సు బంగళాలో:
' 'అచ్చా...!”!
ఫ్టీరింగ్ కిందినుంచి జరిగి మంజులత అతనికి చోటునిచ్చింది. ఆమె స్థానంలోకి రాజగోపాలం జరిగేడు.
కీ యిచ్చివదిలిన
టాయ్కారులాగా సిమెంటు రోడ్డు మీద కారు జరజర పరుగెత్తింది.
గుంటూరు వెళ్లేసరికి సన్నని తుంపర ప్రారంభమైంది.
: 'స్పెట్రోలు సంగతి చూడు! '
మొట్టమొదట కనబడిన బంక్ వద్ద కారు నిలిపేడు. కీపరువచ్చి ట్యాంకు నింపేడు. మరో రెండు
టిన్నులకు పట్టి లగేజీ
బాక్సులో పెట్టాడు.
మరలా హోటలు వధ కారాగింది. ఇద్దరూ భోజనం చేసి వచ్చారు.
' "చలిగా ఉంది. ప్లాస్కులోకి పాలు తీసుకో:
సర్వరు ప్లాస్కు తెచ్చి అందించాడు. బుట్టలో ఇన్ని పళ్లు తీసుకొంది.
1 'నడ్తు! 1
' "చీకటి, వర్తం. నాకు దారి తెలియదు. ఈ వేళప్పుడు వెళ్లక తప్పుదంటావా?' !
మంజులత ఏమీ మాట్లాడలేదు. తనవైపున్న తలుపు సరిగ్గా పడిందో లేదో చూసుకుంది. 'విండో
ప్కీన్' బిగించింది. రాజగోపాలం కారు
కదిపాడు.
ఊరు దాటినతర్వాత మంజులతే ప్రారంబించింది.
' ఇదివరలో ఆడవాళ్లను అర్ధం చేసుకోవడం కష్టమనోవారు. బహుశా ఇప్పుడు మగాళ్లని అర్దం
చేసుకోవడం కష్టం అవుతోంది. '
రాజగోపాలం ముఖాన విరిసిన చిరునవ్వు కారులో ఉన్న ఆ చీకట్లో మంజులత చూడగలగడం సాధ్యం
కాదు.
' ' మగ-ఆడ అని కాదు. అసలు ఒక మనిషిని మరో మనిషి అర్దం చేసుకోవడం ఎప్పుడు
సాధ్యమైంది? ఏ క్షణంలోనైనా ఒకడు
రెండో వాళ్లే ఏదో ఒక కోణం నుంచే చూడగలుగుతారు. ఆ కోణం చూసే మనిషియుక్కు తక్షణ
ప్రయోజనాన్నిబట్టి ఉంటుంది. ఆ
ప్రయోజనాన్ని గుర్తించిన రెండో వాడు ఎప్పుడూ హెచ్చరికగానే ఉంటాడు.
' "అర్దం కారని తెలిసినా ఆడ-మగ ఒకరినొకరు ఆరాధ్య దేవతలుగానే భావిస్తున్నారు. అర్దం
కాకపోవడం ఆరాధనకి
అవసరమేమో...
* * రెండోవారి సాన్నిహిత్యం వల్ల (స్తీపురుషుల్లో అనుభూతం అయ్యే మానసికోన్నతిని గుర్తించగలగడం
ఆరాధనకు మూలం: |
' "అదోరకమైన పిచ్చి, నిషా, కవితాపరిభాషలో అమృతత్వపు అనుభూతే అంకే అననీ.
దానికంతకన్నా పెద్దమాట....'”!
' ' మనిషి జీవితం బహుముఖం. స్త్రీ-పురుష సంబంధం, అతని జీవితంలో ఒక ముఖం మాత్రమే.
అదొక ప్రధానమైన భాగంకూడాను.
అందుచేతనే ఆ అనుభూతి ఒక నిషాలాంటిది. ఆ అమృతత్వం మనకు అనుభూతం కానోకాదు.
దానిలో నిషా ఉండదు. అదో పిచ్చీ
కాజాలదు! !
కారు ఒక రోడ్డు కూడలివద్దకు వచ్చింది. కూడలిలో ఉన్న టీస్టాల్లో ఒక బల్లమీద ఇద్దరు ముగ్గురు
మగవాళ్లు
రూర్చుండి ఉన్నారు. వారికెదురుగా న్నిటాటనానుకొని ఒక ఇరవయ్య్యళ్ళు పడుచు నిల్పుని కబుర్లు
చెప్తూంది. మగవాళ్ల ముఖాలు
అక్కడున్న ష్మెటోమాక్సులైటు వెలుతుర్లో దేనికో నిదీక్షిస్తున్నట్లు కనబడుతున్నాయి. రాజగోపాలం కారు
ఆపేడు. మగవాళ్సిద్దరు
గబగబ బయటకు వచ్చారు. ఈలోప్రున లోనున్నవాడు కళ్లతోనే ఆమెతో ఏమో మాట్లాడాడు. ఆమె వేళ్లు
కదిపింది. తల తిప్పింది.
అదంతా మంజులత కారులోంచి చూస్తూనే ఉంది.
రాజగోపాలం వారినుంచి తాను పోవాల్సిన రోడ్డును గురించి తెలుసుకుని మరల బయలుదేరాడు. టీ
స్టాల్ పాకలో జరుగుతున్న
ఘట్టాన్ని గురించే ఆలోచిస్తూ మంజులత చాలా సేపటివరకు ఏమీ మాటాడలేదు. చివరకు
మాట్లాడినప్పుడు కూడా ఆ విషయమే మనస్సులో
మెదులుతూంది.
' ' మనుష్యుడు నీతిని, నైతిక ప్రవర్తననూ, ధర్మాన్నీ ఎన్నడూ లెక్కచేయలేదు. మనుష్యుడే కాదు.
మన దేవతలూ అంతే.
దేహావసరాలకి ఉదాత్తత కల్పించేందుకు చేసే ప్రయత్నాలలో ఆడుది దేవత అవుతుందా? మగాడు
దేవుడు అవుతాడా? '
ఎదురుగా వస్తున్న లాదీ హెడ్లైట్ల కాంతికి కళ్ళు జిగేల్గంటూంకే రాజగోపాలం కారునడక
మందగింపబేశాడు. అతడిస్తున్న
సిగ్నల్సును అెక్కచేయకుండా లారీవాడు పూర్తి హెడ్లైట్ల కాంతిలో, గమనవేగం తగ్గించకుండా
బురున దూసుకుపోయాడు.
' "స్కాండ్రల్స్!
రాజగోపాలం మఠలా రోడ్డుమీదకు కారును తెచ్చేడు. తెగిపోయిన సంభాషణను మరలా
అందుకొన్నాడు.
' "సహస నామార్చన భగవంతుడి అస్తిత్వాన్నీ, ఆరాధన (స్తీపురుషుల్లో దైవత్వాన్నీ సృృష్టించగలిగితే. .
మరి
సాధ్యంకానిదేముంది?' !
టీ స్టాల్లో కనబడిన యువతిని ఆ పురుషులు దేవతగా భావిస్తున్నారో. . నేలకు అడ్డంగా
భావిస్తున్నారో ఊహించేందుకు
ప్రయత్నెస్తూంది మంజులత.
తొమ్మిదో ప్రకరణం
టావెలర్సు బంగళావద్ద రెండు కార్లు కనబడేసరికి మంజులత నిరుత్సాహం ప్రకటించింది.
' "చచ్చాం. ఖాళీలేదుకాబోలు! !
మరో కారువచ్చి గుమ్మంలో నిలబడగానే కొత్తగా వచ్చినవారెవ్వరో చూడ్చానికి వచ్చినట్లు ఒక బంటటోతు
హాజరయ్యాడు.
' "ఏమన్నా ఖాలీలున్నాయా?' !
ఆడగొంతుక వినబడి లోనుంచి ఎవరో కేకకవేశారు.
' "ఎవరా వచ్చింది?! :
' "ఏం తాగివున్నాడా? అలా అరుస్తున్నాడు?! !
మంజులత ప్రశ్నకు బంటోతు సమాధానం చెప్పుగల స్థితిలో లేడు.
రాజగోపాలం తలుపు తీసుకొని బయటకు అడుగుపెట్టాడు.
* నేను చూసివస్తా వండు'
అతడు గబగబా మెట్లు ఎక్కి హాలులోకి వెళ్లాడు. పడక కుర్చీలలో అర్హశాయిలై ఉన్నవారిలో ఒకరు
తనకు పరిచితుడే. ఆయన
బెజవాడలో వకీలు. రెండో వ్యక్తి కొత్తవాడు. వకీలుకు ప్రాక్లీసుకన్న ఆస్తుల మీద ఆదాయం హెచ్చు.
పార్టీమీద కన్న
ప్రజాసంక్షేమ కార్యాలుంకే అందులోనూ మహిళల అభివృద్దికి సంబంధించిన పనులయొడ
అధికోత్సాహం చూపుతాడు. (స్తీల అభివృద్ధికీ,
పరిరక్షణకూ, సంక్షేమానికీ ప్రభుత్వం స్థాపించిన సంస్థ్టలన్నింటితో ఆయనకు పరిచయం వుంది.
అయితే ఆ సంసలకు చెందిన
మహిళామణుల్ని ఆయన ఒకమారు తన ఇంటికి ఆహ్వానించాడనీ, అప్పుడాయన భార్య పెద్ద రభస
చేసిందనీ చెప్పుకొంటారు. ఆయన
నైతిక ప్రవర్తన మంచిది కాదంటారు. కానీ, ఆయన అభిప్రాయం ఆ విషయంలో కేవలం భిన్నం.
' 'సెైళయింతర్వాత ఆడవాళ్లకి అంగ్యోస్తం చుట్టబప్రే స్వభావం అలవడుతుంది. '' - అనేది ఆయన
వ్యాఖ్య.
వకీలు వెంకటావు తనను ఎరగడు. సాధికారంగా ప్రశ్నించేడు.
' "ఎవరు మీరు? బంగళా అంతా 'ఆక్యుకమై' అయిడంది'!
' "బంగళా ఎక్పుందడరుకోసం వెతుకుతున్నా ' !
వకీలు గాంభీర్యం తగ్గలేదు.
' "నో చెబుతున్నాగా' |
రాజగోపాలానికి చ్విర్రపుట్టింది.
' 'ఎక్సెండరు నువ్వా, ఓయినీ... ఏం వేషం వేస్తున్నావోయ్. ..'
వకీలు వెంకటావ్ ఒక్కక్షణం ఆశ్చర్యంతో నోరు తెరిచాడు. అతని పక్కనున్న అతడు రాజగోపాలం
దూకుడు చూసి
సర్దుబాటు చేయడానికి పూనుకొన్నాడు.
' ' కొత్తవాళ్లతో మాట్లాడేపద్ధతి నేోర్చుకోలేకపోతే చాలా ఇబ్బుందులున్నాయి' ' అంటూ రాజగోపాలం
నామ్మదిగా కలహం నుంచి
తప్పించుకొన్నాడు.
కలహం తప్పినా బంగళాలో ఆశయం దొరకలేదు. ఒక గదిలో మహిళా సంక్షేమ శాఖలో ఉద్యోగం
చేస్తున్నావిడ ఉంది. వేరొక గదిలో
ఆ శాఖలోనే పనిచేస్తున్న మరొకావిడ ఉంది. తిరుపతి నుంచి తిరిగి వస్తూ వకీలు వెంకటావు, అతని
స్నేహితుడూ చీకటి పడడం
చేత బంగళాలో ఆగారు. వారు మధ్యహాలున్నాక్రమించారు.
రాజగోపాలం పరిస్థితి అర్ధం చేసుకున్నాడు. మంజులతతో సంప్రదించేడు.
' "కారులోనే పడుకోలేవూ?! '
మంజులత వెనకసీటులో ఉన్న సామానులు సర్హుకుని పడుకుంది. కారును ఆవరణలో ఉన్న ఒక
చెట్ప్టకిందకు చేర్చి రాజగోపాలం బండి
లోనే కూర్చుండిపోయాడు. అప్పటికి సన్నచినుకు దట్టమై వర్షం [ప్రారంభమైంది. మైన చల్లగా ఉన్నా
కారులోపల చాలా ఉక్కగా
ఉంది.
' "మనం అరుగుమీద వేద్దాం పక్క! అంది మంజులత.
' 'మావూళ్లో ఒకాయన ఉండేవాడు. ఆయన చిన్నతనంలో ఒకప్పుడు పొలాలవెంట వెడుతూ
అనాలోచితంగా జంటకూడుతున్న గుర్రాలను
సమీపించాడట. మరుక్షణంలో చుట్టుపక్కల పొలాలలో ఉన్న రైతులంతా కర్రలతో పరుగెత్తి వచ్చి,
గుురం నోటిలోంచి ఆయన్ని
బయటకు లాగేరు. ఆ అశ్వ ప్రణయానికి చిహ్నంగా ఆయన చేయి మొండి అయిపోయింది. ! !
మంజులత నవ్వింది.
' ' వాళ ప్రణయ కలాపాలకు మనం...!!
' "సందేహం ఏం ఉంది?! !
కాని మంజులతా, రాజగోపాలం వీధి వరండాలో పక్కవేయడం ఎవరికీ ఏవిధమైన ఆటంకం కలిగినట్లు
అనిపించలేదు.
ఓ రాత్రివేళ గదులన్నీ ఖాళీచేసి, జనం రెండు కార్లలో వెళ్లిపోయారు.
'" మనం కూడా పోదామా?! .... అప్పుటికి ఒంటిగంకేు అయ్యింది. మంజులత అంగీకరించలేదు.
' 'అకెండదర్ని పిలిచి ఒక గది బాగుచేయమను. వేణ్నీళ్లు పెట్టించు?!
' "స్నానం అవీ అయ్యేవరకు ఆలస్యమవుతుందేమో! !
రాజగోపాలం ఆ పనులు పురమాయించి మరల పడకేశాడు. లోపల పోతుగుురాలున్నంత వరకు
అతడు నిర్లక్ష్యంగా న్నిదపోలేకపోయాడు.
డాక్టర్ మంజులతను అవమానానికి గురి అయ్య ఫ్రైతికి వదలడం అతను ఊహించనూ లేకపోయాడు.
అందుచేత అతడంతవరకు
ఆదమరిచి న్నిదపోలేదు. ఇప్పుడా భయం తీరింది. ఒళ్ళారగని న్మిదపట్టింది.
తెల్లవారకముందే మంజులత స్నానాదికం పూర్తిచేసి రాజగోపాలం పడుకున్న చోటుకు వచ్చింది.
అతడతిప్రశాతంగా నిదపోతూఉన్నాడు.
లేపడానికి మనసొప్పులేదు. కాని, తమ ప్రయాణం తొందరిస్తూంది.
' 'గోపాలం!
అతడు కళ్లు తెరిచేడు. ఎదురుగా కూర్చుని తన భుజం మీద చేయివేసి తట్టుతున్న ఆమెవైపు చూసి
చిరునవ్వునవ్వేడు. అతడు
కళ్ళు తిరవడం చూసి ఆమె లేచి నిలబడింది.
శ్ లే, ం .
ఆమె చేయిచాచింది. అలవోకగా ఆమె వేళ్లు అందుకుని అతడొక్క వూపులో లేచి నిలబడ్డాడు. లేవడం
ఆలన్యమైనందుకు సంజాయిషీ
చెప్పుకొన్నాడు.
' 'వాళ్లు వెళ్లిపోయే వరకూ నిద్రే పట్టలేదు.
''ఆ ప్రణయకాండ అంత రసవత్తరంగా వుందా?'
ఒక పడుచు ఒక మగవాడితో ఆ తీరున ప్రసంగించటం అతనికి కొత్తగా ఉంది. కళ్లు విప్పార్చి
చూశాడు. మంజులత (గ్రహించింది.
' ' నీకు మెడికల్ కాలేజీల జీవితం అనుభూతం కాదు. అక్కడికళ్ళేక ' మైనర్ సెంటిమెంట్స్!
నిర్మూలం
అయిపోతాయి. మాటల్లో, చేతల్లో మోటుతనం, నిర్లజ్ఞిత మప్పుడానికి తెక్పురర్ల దగ్గరినుంచి గట్టి
ప్రయత్నాలు చేస్తారు! !
రాజగోపాలం ఏమీ అనలేదు. ఒక్క నిమిషం పోయాక మంజులతే ప్రశ్నించింది.
' ' బహుశా ఆ గదిలోంచో, ఈ గదిలోంచో తమరిని రక్షించాలని అరుపులు వినిపిస్తాయని, ఓ
దుడ్గుకరతో సహా రెడీగా ఉండి
ఉంటావు. కానీ, అల్లాంటివేమీ లేకుండా ' మానభంగాలు! అతి ప్రశాంతంగా జరిగిపోయాయి. బహుశా
నీ భారతీయత ఆ పరిస్థితికి చాలా
పరితాప పడుతూండి ఉంటుంది.! !
రాజగోపాలం చిరునవ్వు నవ్వేడు.
' ' మగాళ్లు కుక్కలనీ, పందులనీ నువ్వు తిట్టలేదు. అందుకు సంతోషంగానే ఉంది! !
మంజులత ఆలోచనలో పడింది. రాజగోపాలం త్వరగా తన పనులు ముగించుకువచ్చాడు. అస్పెండరు
కాచి తెచ్చిన పాలకప్పుల (ప్రక్క,
తాను వచ్చేటప్పుడు గుర్తుంచుకుని తెచ్చిన బిస్కట్లు పెట్టి ఆమె కూర్చుని వుంది.
' పెద ప్రయత్నమే చేశావే?! !
మంజులత ఒక అరగంట [క్రితం వదిలిన సంభాషణను అందుకొంది.
' ' మగవాళ్లీ పంది అనీ, కుక్క అనీ తిట్టలేదేమన్నావు. అందరూ తిశ్వేదే నేనూ అనడం అనవసరం.
మైగా జ్యాగత్తగా
ఆలోచిస్తే ఈ వేళ మగవాడు తన మనస్తత్వానికి తగిన ఫలితాన్ని పదహారణాలా అనుభవిస్తున్నాడు. '!
' "ఒక్కటి మరిచిపోవద్రు. మగవాడిలో ఉన్నదొక మగతనమేకాదు. అది అతని స్వయంవ్యక్త లక్షణం.
మరొకటుంది. చొరవ
తీసుకొని ప్రపంచం అంతా తనదేననే మొండితనంగా అడ్డుపడే స్వభావం. అది సమాజంలో
అతనికున్న స్థానాన్ని పట్టి సంక్రమించిన
లక్షణం. మీ ఆడవాళ్లు మొదటిదానిని కోరుతారు. రెండో దాని ఫలితాన్ని అనుభవిస్తారు! !
' ' సరిగ్గా నోచెప్పదలచుకొన్నదదే. బెనుగానీ, ఆడ-మగ ఒకరినొకరు కోరుకోవడం తప్పంటావేమిటి?! !
' 'శ్రుతి ఆటకీ కొన్ని నియమాలుంటాయి. ఆ నియమాలు వదిలేస్తే ఆ ఆకే లేదు. అంతే ఇదీను.'!!
* = ఎగ్జాక్ట్లీ! ఆటపాటలు మనుష్య సంకల్పితాలు. కనుక వాటికి నియమాలుంటాయి. (స్తీపురుష
సంబంధాలు
బైవనిర్దీతాలు. ప్రకృతి సహజం. వాటికి మనుష్యుడు కొన్ని నియమాలను జతచేశాడు. ఆ
నియామాలను మగాడు అక్కుచేయలేదు. ఆడదేం
చేయలేక వానిని కుక్కా-పందీ అని తిట్టింది. ఇప్పుడు తిట్టవలసిన పనేముంది? తానుకూడా
సమవుజ్జీగా నిలబడింది! !
* ' అవినీతిలోనా?' *
' 'అందరూ కాదన్నదానిని ఒకడు చేస్తే అవినీతి. అందరూ ఒప్పుకొన్నుదీ నీతే!
రాజగోపాలానికది మింగుడుపడినట్లు తోచలేదు. కిటికీలోంచి చూస్తుంకేు తమ కారు వెనక ఎవరో
ఉన్నట్లు కనిపించింది. కారులో సామాను
ఎవరన్నా తస్కరించడం లేదుకదా? తల బయటకు పెట్టాడు.
' "ఎవరా కారుదగర?! !
ఒక పాతికేళ పడుచు వికవికలాడుతూ తొంగిచూసింది. రాజగోపాలం ఆమెనక్కడి నుంచి పొమ్మన్నాడు.
ఆమె ముఖాన నవ్వు మిగలలేదు.
కోపంగా తప్పుకొని కొంచెం అవతలగా అతనికి కనబడేలా గోడనానుకొని నిలబడింది.
రాజగోపాలం మాట్లాడుతూ. .. మాట్లాడుతూ ఒకటి రెండు మాట్లు తిరిగి చూశాడు. మంజులత
శుశ్నాంచింది.
' "ఆవిడ కన్ను-ముక్కు తీరు బాగుంది కదూ! !
రాజగోపాలం అంగీకరించాడు.
' "అందమైన విగ్రహం!
' 'ఇక్కడ నీ మనస్సులో ప్రతిబింబిస్తున్నది మగతనం అంటావా? సమాజం ద్వారా సంక్రమించిన
చొరవంటావా?' |
* 'రెండూ కొద్దోగొప్పో కలిసివుండొచ్చు' ' అన్నాడు రాజగోపాలం ఆలోచిస్తూ.
' "ఆమె స్థితి కూడా కొంచెం ఇంచుమించు అదే. ఉన్న తేడా ఒక్కటి. ఆమెలో (స్తీత్వపు అకాంక్షకన్నా
చొరవ ప్రముఖంగా
వుంది.!!
రాజగోపాలం ఆశ్చర్యంగా ఆమెవంక చూశాడు. మంజులత త్రాగుతున్న కప్పు [క్రింద పెన్పేసి లేచింది.
' "గతంలో లేనిదీ, ప్రస్తుతం ఆడుదానికి లభించినదీ సంపాదించుకొనే అధికారమూ,
అవకాశమున్నూ. తల్సిదండులు ఒప్పుకొంటున్నారు.
భర్తలు ప్రోత్సహిస్తున్నారు. కానీ, రెండోవైపున ఇందాక నువ్వు చెప్పావే. .. సమాజంలో వారికున్న
వొానం ఇచ్చిన చొరవ అని,
దానిని ఈ వేళ ఆడదానికీ ఇచ్చారు. ఏమంకే మగవాడికున్న స్థానం ఆర్జిక మూలం. ఆడదానికి ఆ
సానం లభ్యమైంది. అందుచేత
దాని చొరవకు కావలసిన పూర్వరంగం ఏర్పుడింది. మరి మగాడికి మిగిలిందేమిటి? తరాల తరబడి
నర్చుకొన్న మెలకువలూ,
కూర్చుకొన్న హంగులూను. !
' 'మంజులతా! కుక్కకాటుకు చెప్పు దెబ్బు అన్నట్లు చేశామంకేు బాగాన వుండొచ్చు. కాని...'!
' "సమాజం ఏమవృతుందని నీ భయం. ఏమీ అవ్వదు. మనం కొత్త నియమాలూ, నీతులూ ఏర్పాటు
చేసుకొంటాం. మళ మామూలుగా
సాగిపోతుంది. అయితే ఒక్కటి. ఒక్కళ్లనే అంటిపెట్టుకొని ' యావజ్జీవం హోూోష్యామి' అనుకోడానికి
గతంలో ధర్మం కారణం చేశారు.
ఈనాడు _పేమ అంటున్నారు. దాని వెనకనున్న నిర్పుంధం ఒక్కకే...'!
రాజగోపాలం అడ్పుపడ్డాడు.
' 'ధర్మ్శం అన్నది నిర్బంధం వల్ల అంటగట్టింది కావొచ్చు. కానీ, పేమ అలాకాదు. ఇక్కడ
ర్ టి ల ల ల
(ఎపురుషుల ఇష్టం, అసి్సం
గేమకు మూలం. ప్రతిషేధకం అవుతూంది. ఇష్టాపూర్తిగా తెచ్చుకొన్నది నిర్బంధం ఎలా
అవుతుంది?!
' 'నీ ధర్మం కానీ, [్రేమ కానీ దాంపత్య సంబంధాల్ని ఒక నియమంలోకి తేవడం కోసమే. ఏ
నియమం లేని దాంపత్య సంబంధాలు
ప్రకృతి సిద్ధాలు. పశుపక్ష్యాదులున్నాయి. మనం తయారుచేసుకుని చెండనాడుకొనో నియమాలేవీ
వానికి లేవు. అవసరం కలిగినప్పుడు
ఎదుట వున్నదానితో కలుస్తుంది. ఆ అవసరం ఏమిటి? సంతానావసరం. ఆ జ్ఞానం వానికి
లేకపోవచ్చు. కానీ, ఆ అవసరమే
వానిలో ఆ చైతన్యాన్ని ఉద్చుద్దం చేస్తుంది. ఆ అవసరాన్ని తీర్చలేనికాలంలో దానికాస్మురణే
ఉండదు. మానవుడు
భగవన్నిర్శితమైన ఈ స్వేచ్చా ప్రపంచాన్ని తలకిందులు చేశాడు. ఫలితంగా భయంకరమైన
గందగోళం ఏర్పడింది. అందుకే
బతకలేడు. దానినుంచి బయటపడలేడు. బయట పడడం కోసం మరింత గందగోళం
కల్పించుకున్నాడు. ఆ ఎక్కువ గందగోళాన్ని
అభివృద్ది అని అనుకొంటున్నాడు. అనుకోనీ. .. కానీ... ఆ అభివృద్ద్ధినికూడా అట్రు రోజులు
హరాయించుకోలేడు...!
రాజగోపాలం ఆమె ధోరణిని అర్ధం చేసుకునోందుకు ప్రయత్నించేడు. అడ్డు ప్రశ్నలు వేశాడు.
మళ్ళీమళ్ళీ చెప్పించాడు. చిట్టచివరకు
ఆమె వాదనలకూ, ప్రశ్నలకూ పూర్తి సమాధానం ఇవ్వగల జ్ఞానం తనకు లేదన్నాడు.
' "నువ్వు అనేకరకాల సమస్యలు తెచ్చావు. సమాజ నిర్హాణానికి సంబంధించినవి కొన్ని. సామాజిక
ఆలోచనలకు సంబంధించినవి
కొన్ని. జీవశ్శాస్తం, జన్యుశ్యాస్తం, జంతుశ్శాస్తం, పరిణామవాదం... ఇవన్నీ చదివినవాడు గాని, నీ
శుశలకు తలవూాపడం
తప్పు సమాధానం ఇవ్వ;లేడు' |
అతడు తప్పించుకోచూస్తున్నాడని మంజులత భావించింది.
' "నేను అందులో చదివినవి కొన్నే...”
' "అదే ముప్పు. అడిగేవాడికి చెప్పేవాడు లోకువ...!!
' 'నోను చెప్తున్నాగాని, అడగడం లేదు.!!
' ' అన్నింటికన్నా ముఖ్యమైనది సమాజవిజ్ఞానం. ఒక్క కమ్యూనిస్సు తప్పు నీ ప్రశ్నలకు నాలుగు
దిక్కుల నుంచి
ఎదుర్కొనలేదు. ! |
మంజులత చప్పురించేసింది.
' "వాళ్లు మరీ అధ్వాన్నం. ఆడుదాన్ని దాని స్వేచ్చుకు వదిలే బదులు నలుగురం కలిసి
పంచేసుకుందామంటారు. చిన్నపిల్లలు
ఐస్ ప్రూటు తలొకడూ, తలోమారూ చప్పురించేసినట్లు'
రాజగోపాలం ఆమెవేపు చూశాడు.
'"నా అనుభవం వేరు. బహుశా మగాళ్ళిగనకనేోమో! !
' "ఏమిటయ్యా దాని అర్దం?!
' "నేను సంసప్క్టుతంలో మాట్లాడలేదు. వాళ్లతో నాకు పరిచయంలో ఆ అనుభవానికి అవకాశం
లేకపోయింది.”
రాజగోపాలం తన మాటను రెట్టించాడు. మంజులతకు చాల కోపం వచ్చింది.
' "నీకు మాట మర్యాద కూడా తెలియదు: !
సీటులో దూరంగా జరిగింది మంజులత. రాజగోపాలం భుజమ్మీద చెయ్యివేసి అదిమి పెస్పేడు.
: శ్రోప్పడకు!
ఎదురుగా వస్తున్న లాదీ కింద తాను పడిపోకుండేటందుకు రాజగోపాలం తన దృష్టినంతనూ
రోడ్డుమీదనో కేందీకరించాడు. చాలసేపటివరకూ
ఉభయులూ నిశ్శబ్దంగా కూర్చున్నారు. చివరకు మంజులత పలకరించింది.
' ' నువ్వు కమ్యూనిస్రువా?' '
ఇప్పుడామె కంఠంలో కోపరేఖలేదు. ఆసక్తి మాత్రమే కనిపించింది.
'' ఈ వేళ తెనుగుదేశంలో కమ్యూనినుల్ని గురించి తెలిసి వుండేటందుకు కమ్యూనిస్టే అయి
వుండక్కర్తేదు! !
''మరి....!!
' 'వాళ్లని గురించి నీకు ఎల్లా తెలుసో... నాకూ అల్లాగే తెలుసు. అయితే తెలిసింది మాతం వేరు''
మంజులత మాట్లాడలేదు. కొంతసేపున్నాక రాజగోపాలమే ప్రసంగం ప్రారంభించాడు.
' 'నీ మాటలే ఆలోచిస్తున్నా ' |
' ' మంచిది. బాగా ఆలోచించు! !
రోడ్డుప్రక్క చేలో ఒక చెట్టుకింద ఆవొకటి కశ్వేసి ఉంది. దాని చుట్టా ఆంబోతు అలగం తొక్కుతూ
ఆఅవువేపు వెళ్లినవారిని
తిరగ్గొడుతోంది. నలుగురైదుగురు పశువుల కురాళ్లు అంత దూరంలో నిలబడి ఆంబోతుకు ప్రోత్సాహం
ఇస్తున్నారు.
' "మానవుడు భగవంతుడి కల్పున అనేది నీ అభిప్రాయం కావచ్చు. జీవ పరిణామంలో అదొక
ఉన్నతోన్నత దశ అని నోను
భావిస్తా! 1
హ్
' "అయితే నేను చెప్పింది మరీ సత్యం. మానవుడు తన పూర్వుల ఆచారాలూ, అలవాట్లూ
అతిక్రమించి చేటు తెచ్చుకున్నాడు.
ఉభయుల మనస్సుల్లోనూ మెదులుతున్నవి ఆవూ-ఆంబోతూ. ఒకచెట్టు వెనక నిల్పుని వానివేసపే
చూస్తున్న ఒక కన్నాపిల్లను దాటి
కారు ముందుకు పోయింది.
' "జీవ పరిణామంలో మానవుడికి పూర్వులొక్క జంతువులేనా? అతఃపూర్వపు తరం చెట్టుచేమలు,
ఇంకా ఇంకా వెనక్కి వెడితే చేపలు
వగైరాలు మన ప్రపితామహులు:' !
రాజగోపాలం ఎటు లాగుతున్నాడో అర్దం కాక మంజులత మిడుతూ మిడుతూ చూస్తుంది.
' ' మనం ఇప్పుడు పరిగణించే లింగబేదం అనేది జీవ పరిణామంలో ఒక దశలో వచ్చింది.
' "వచ్చిన నాటి నుంచే తీసుకుందాం! *
మంజులత సర్హుబాటుస్వభావం పెద్ద భారాన్ని తగ్గించింది.
' "ఆ తర్వాత కూడా ఈ లింగభేదం ఎన్నో పరిణామాలు పొందింది. !!
' "ఎన్ని పరిణామాలు పొందినా... దాని ప్రయోజనమూ, ఫలితమూ ఒక్కక్రు. సంతానం! |
రాజగోపాలం నవ్వాడు. మంజులత ఆశర్యంతో అతనివంక చూసింది.
' "అక్కడే వుంది పారపాటు. మనిషి వద్దకు వచ్చేసరికి లింగభేదం కేవలం సంతాన ప్రయోజనమేనన్న
స్థితి పోయింది.
| "మది? .
'' మనలో దాని ప్రయోజనం సంప్రయోగసుఖం' !
మంజులత ఆలోచిస్తూ కూర్చుంది.
' "లతా! మనం పశువుల అలవాట్లకు పోవాలనుకున్నా పోలేం. సంతానావసరం తెలియకపోయినా
పశువు దానిని
ఇన్ఫ్టింక్షివగా ఫీలవుతుంది. గర్పుం ధరిస్తే దానికి సంగమేచ్చు ఉండదు. గర్పధారణకు అవసరమైన
స్ధితి
ఏర్పడినప్పుడేగానీ, దానికా ఇచ్థ ఉండదు. మనిషిలో అల్లాకాదు. ఇక్కడ గర్పుధారణ అనుషంగికం.
బుతువుకాని సమయంలో కూడా
[స్తీకి కామేచ్చు ఉంటుంది. గర్పధారణానంతరం కూడా సంప్రయోగానికి (స్తీ విముఖురాలు కాదు. నేను
విన్నదే నిజమైతే స్తీ
ప్రసవానంతరం పచ్చివొంటిమీద ఎక్కువ కామవాంఛననుభవిస్తుంది. ఇవేమీ జంతువుల్లో లేవు. ఉంకే
దాచుకోగల శక్తి లేదుగనక లేదనో
చెబుతాం. ఇదంతా మనుష్యుడి అవతరణలోనే ఉన్న, వచ్చిన పరిణామం. నీకేమన్నా సందేహం
వున్నా... ఈనాటి మెలకువలు
చూశాకయినా అది తీరాలి. నేడు కుటుంబ నియంత్రణ కోసమో, ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొనో
ఆడా-మగా అనేక శ్మ్యస్తచికిత్సులు
చేయించుకొంటున్నారు. మందులు వాడుతున్నారు. వారెవరూ సంప్రయోగవాంఛను కోల్పోవడం లేదు.
డాక్టర్గా నీకీ విషయం
కొత్తగాదు' |
' ' అక్కడే దైవంయొక్క నియమాన్ని మనం ధిక్కరిస్తున్నామనడం...'"!
రాజగోపాలం నవ్వాడు.
' "నువ్వు దేముడో, రాముడో అంకే నాకు పేచీలేదు. 'మూడు నాళాయెరా మువ్వగోపాలా!' అని
భక్తిపారవశ్యంలో మనిగిపోవడమే ఆ
ధిక్కారానికి వాగూపం. మన ఆలోచనల వల్ల కలిగే సిగ్గును దాచి పెట్టుకొనేందుకు కాకపోతే... ఈ
విషయంలో దేముడి ప్రసక్తి
ఎందుకు?! !
మంజులత మనసులోలేని విశ్వాసాన్ని మాటలతో ఒత్తి ఒత్తి పలికింది.
' 'దైవం సంగమాన్ని సంతానలభీకోసమే కల్పించాడు కనుక! ః
ఆమె మాటకు నవ్వాలో, విచారపడాలో తెలియక బాధపడుతున్న వాడిలా మొహం హ్పేడు
రాజగోపాలం.
' ' నువ్వు మగనాలివి! !
అతడేమి చెప్పుబోతున్నాడో మంజులత గ్రహించింది.
' "నాకు పిల్లలు కావాలనో వుంది.
' "కాని కలగలేదు! !
1 ' చేదు! 1
' "ఆరేళ్ల కుటుంబజీవితం అనంతరం నువ్వ కన్యవుగానే...'
' * దేవుడివ్వనిదానికి. ...'!
' "నిన్ను ఆడదాన్ని చేసిందీ ఆ దేవుడేనా? మరొకడా? మంజులతా! !!
ఆమె మాట్లాడకుండా కూర్చుంది. రాజగోపాలం ఏమీ అనలేదు.
* "కొంచెంసేపు నువ్వు తీసుకో! ' కారు ఆగింది. మంజులత చోటు మారింది. మరల బండి సిమెంటు
రోడ్డుమీద చిరచిరలాడింది.
పదో ప్రకరణం
యూనివర్సిటీ నుంచి మంజులత తిరిగి వచ్చేసరికి బాగా ఆలస్యమైపోయింది. సత్రం గదిలో
రాజగోపాలం ఆమెకోసం ఎదురుచూస్తున్నాడు.
దీర్ణాలోచనలో మునిగివున్న మంజులత నొక్క నిమిషం చాల పరిశీలనగా చూశాడు.
' "ఏం అల్లా వున్నావు?'
భోజనం చేస్తున్నప్పుడు కూడా ఆమె ఏమీ మాట్లాడలేదు.
' "అతను కనిపించాడా?' !
తల తెప్పడమే దానికి సమాధానం.
' 'అల్లా తిరిగివద్దాం రా''
' "ఎక్కడికి?! !
' "ఎక్కడికైనా సరే! !
రాజగోపాలం కారు తీసుకుని గది గుమ్మంలోకి తెచ్చాడు. మంజులత వచ్చి కూర్చుంది. ఆమెమీదుగా
వంగి అతడు ఆవలివేపు తలుపును
గట్టిగా లాగివేశాడు. అతని స్పర్శకు ఆమె వణికిపోయింది.
' 'ఏం వంట్లో బాగోలేదా?'
మంజులత మాట్లాడలేదు. ఆమె చేసిన ధ్వనికి ఏదన్నా సమాధానం చెప్పుకోవచ్చు.
కారు కదిలింది. ఆమె అతనికి దగ్గరగా జరిగింది. అతని చేయి ఆమెను చుట్టుకొని రొమ్ములమీద
నిలిచింది. ఆమె అతని చేతిని
నెమదిగా తప్పించి పక్కకు జరిగింది.
' "గోపాలం! ఒక్క ఆడదానికోసం మగవాడు ఆమె మినహా ప్రపంచమే లేదనోంత తాదాత్యుం పొందడం
సాధ్యమేనంటావా?' !
రాజగోపాలం ఒక్క నిమిషం ఆలోచించాడు. సరాసరి సమాధానం ఇవ్వలేదు.
' ' ఇప్పుడా సమస్య ఎందుకొచ్చింది?! |
మంజులత ఒక్క నిమిషం ఏమీ మాట్లాడలేదు.
' ' మధ్యాహ్నం నోనాతడిని చూశా' !
అతడెవరో రాజగోపాలానికి తెలుసు. మాయ (ప్రేమించిన యువకుడు. అతడిక్కడ యూనివర్సిటీ
కాలేజీలో అెక్సరర్. ఆ
వివాహానికి మంజులత ఇష్టపడలేదు. ఆ అయిప్టాన్ని అఆక్కచేయకుండా మాయ ఇంటినుంచి
వెళిపోయింది. ఆమెను వెతుక్కుంటూ మంజులత
తిరుపతి వచ్చింది. అతనిని చూడడానికి వెల్లింది.
' " ఏమన్నాడు?! !
' "వాళ్లకి పెళ్లి చేయకపోతే యావజ్జీవం శిథిలంగా గడుప్తుతాడనిపించింది. ఆ కుర్రవాడు మా
రులంలోనే ఎందుకు ప్రట్టిఉండకూడదు?'
రాజగోపాలం నవ్వాడు.
' ' నువ్వు యేమించి పెళ్లిచేసుకున్నావు. నీకు పప్రమమీద నమ్మకం లేదు. కులాంతరుజ్లీ
సెల్లిచేసుకున్నావు. కులాంతర వివాహాలమీద
నమ్మకం పోయింది! ?
' "లేదు. నాకిప్పుడేం నమ్మకం లేదు. (పేమించామనుకున్నాం. వయస్సు, చదువు, ఆలోచనలు
అన్నీ (పేమ ఏర్పడడానికి
అవసరమైనవన్నీ సమంగానే వున్న్నాయనుకొన్నాం. కానీ, ఇప్పుడు నా జీవితం ఏమిటి? కులం,
గిలం, మతం, జాతి మనుషుల్ని
విడదీయరాదన్నా. .. కానీ మా కుటుంబం భిన్నకులీనత ఫలితంగానే విచ్చిన్నం అయ్యింది.
గోపాలం! వదయ్యా! మాయకూడా నాలాగే
దిక్కు మొక్కు - తోడు నీడ లేని జీవితం గడపరాదయ్యా! మగడు మరోలా అయినా కనీసం
బంధువులనీ తనవాళ్లనీ ఏ కొద్దిమందో
మిగులుతారు...!!
డాక్టర్ మంజులత కుటుంబ జీవితం భగ్నుమయిందనే గాని, వివరాలేమీ తెలియని రాజగోపాలం
ఆమెకేమీ సమాధానం
చెప్పలేకపోయేడు.
మంజులత తనతోపాటుగనే మెడికల్ కాలేజీలో చదివిన రంగనాథరావును పెళ్లాడింది. మొదటి ఏడాది
నుంచి హౌస్
సర్దన్గా పనిలో చేరినంతవరకూ ఇద్దరూ అతి సన్నిహితంగా మెలిగారు. భిన్నకులాలు వారి మైత్రికి,
యేమకు ఆటంకం
కాలేదు. పెళ్లిచేసుకున్నారు. ప్రాక్టీసుపెట్టారు. కానీ, వారి దాంపత్యం ఒక్క ఏడాదధికన్నా శాంతంగా
సాగలేదు. మూడేళ్లు నిండేసరికీ
'్రాక్షీసులు, నివాసాలు పూర్తిగా విడిపోయాయి. ఇప్పుడొకరి పేరు చెబితే వేరొకరు సహించే స్టితికూడా
లేదు.
' 'భోజనాలలో, ఆచారాలు - అలవాట్లలో కులాల మధ్యనున్న తేడాలు అధిగమించలేమోయి మా
పేచీకి మూలం నీవు ఎరుగుదువా?! *
రాజగోపాలం తలతిప్పాడు.
' ' రంగనాథం తల్లీ, తండ్రీ మా పెళ్లి అయ్యాక మావద్దనే ఉంటూ వచ్చారు. వాళ్లకి మాంసం ఏపూటా
లేనిదే ముద్ద దిగదు. మేము
స్రీవైెష్టవులం. ఆ ఇంట ప్రట్టిన నాకు మాంసం అంకే అసహ్యం. డాక్టరుగా అస్తమానం
మాంసమ్ముద్రల్ని ముట్పకొన
నాకసహ్యమేమిటనకు. భరించలేనంత వెలపరం' !
' "రంగనాథం తినడా?'
' 'తింకు తింటాడు. నేను తినను!
రాజగోపాలం ఆ ద్వేషాలను అర్హం చేసుకొనోేటందుకు ప్రయత్నిస్తూ ఉన్నాడు.
' "అతని తల్లిదండ్రులకు ఎందుకు పుట్టిందో నేను మాంసం తినేటట్లు చేయాలనిపించింది. నేను
ఎదిరించాను. వాళ్ల ఎత్తులూ, నా ప్రతి
ఘటనా వివరాతెందుకు గానీ, చివరకు నాకు మహాకోపం వచ్చి వాళ్ళని ఇంట్లోంచి వెళిపామ్మన్నా. '"
రాజగోపాలం నవ్వాడు.
' 'రంగనాథరావు ఈ గొడవనెరగడా? ' |
' "ఎరుగును. అతని అభ్మిపాయం నేను కులాహంకారం చూపిస్తున్నాననో. ! !
' "అరే!
' "ఆ అభ్మిపాయం ఏర్పుడడానికీ కారణం వాళ్ళేనంకై నమ్ముతావా?! !
' "చెప్పొాచ్చునా?' !
' "ఒకమారు ఒక కేసు చూసివచ్చి, చాలా అలసిపోయి ఉన్నానేమో. గదిలో ఉన్న రెండో మంచం
లాక్కొని పడుకున్నా. నిదపోయా. నా
కాళ్ళు అతని తలగట్ల దిశగా ఉన్నాయట. దానిని వాళ్ళు తప్పు అన్నారు. '!
''మగడనో కాదు. ఎవరు పడుకున్నా కూర్చున్నా వాళ్లవైపు కాళ్లు జాపడం తప్పేకదా?'
' 'అది మనుష్య మర్యాదగా నువ్వు చెప్తున్నావు. ఆ విషయం నేనూ వొప్పుకొంటా. కానీ, వాళ్ల
అభ్మిపాయం అదికాదు. మగడుగా
రంగనాథం నానెత్తిని కాళ్లు పెట్టొచ్చు. భార్యగా, ఆడదానిగా అతడున్న దిశకు నేను కాళ్లు జాపరాదు.
పడమటి దిశగా ముస్లింలు
కాళ్ళుచాపనట్లు. అదీ అసలు రహస్యం!
' చిక్కే.”
"ఆ విషయంలో నోను చాల జాగ్రత్త తీసుకుంటా. ఆ రోజున నేను అలిసివున్నాను. ఎటు
పడుకున్నదికూడ తెలియదు. కాని,
రంగనాథం నమ్మలేదు. దానికీ కారణం వుందిలే. ఒకమారతడు పడక కుద్చీలో కూర్చున్నాడు. నేను
ఎదురుగా మరో కుద్చీలో వున్నా.
వున్నట్లుండి వెనక్కి వాలి, కాళ్లూ రెండూ నామీదకు కుద్చీచేతుల మీద పెశ్పేడు. నేనది తప్పున్నా. '!
రాజగోపాలం ఆశర్యంగా చూశాడు.
' "కాళ్ళు తగలకుండానేో మీరు కాపురం చేస్తున్నారా?!
మంజులత అతనివైపు చురుక్కుమనోలా చూసింది.
'?న్రీ మగత్తనపు దురహంకారం పోనిచ్చుకొన్నావు కాదు. అతడూ అలాగే అన్నాడు. ఎన్నిమార్లు తన
కన్నాడు. గోపాలం! మగడు - పెళ్లాం గదిలో చూపించే 'ఇన్టిమసీ' వేరు. గది బయట
జీవించే సాన్నిహిత్యం వేరు.
నువ్వింకా _బబహ్ముచారివి...!:
రాజగోపాలం చాలా సేపటివరకూ ఏమీ మాట్లాడలేదు. కారు నామ్మదిగా కదిలిపోతూంది.
' ' మంజులతా!
' ?' ఏమిటి చెప్పు'
' 'నీ కథ వింకే నాకొకటి స్పష్టంగా కనిపిస్తుంది. అది నిజమో, అబద్దమో తెలియదు. ఒకటి
చెప్పు...”
' ' ఇప్పుడా కథలన్నీ ఎందుకు పోనిద్రూ! !
' 'రాదు అవసరం. చాలా అవసరం:
' నీకా?! |
మంజులత చిరునవ్వు నవ్వింది. రాజగోపాలం ఒక్క నిమిషం ఆగాడు.
' 'ఎందుక్కాకూడదు? ! |
మంజులత ఒక్క నిట్టూర్పు విడిచింది.
' "మీ వివాహానికి అతడి తల్సిదండ్రులు ఒప్పుకొన్నారా?' ౫
' 'నోనారిగినంత వరకు...'!!
' 'వాళ్లు మీతో ఉండకపోతే మీ కుటుంబం విచ్చిన్నం అయ్యేదా?' *
' 'గోపాలం! మీరు బ్రాహ్మణుల ఆడపిల్లల్ని చేసుకోకండి. మీప్రేమల్ని, ఏకాగతల్న్ అధిగమించిపోయే
' ఇన్సీరియారిటీ
కాంప్లెక్సు! మీమనసుల్ని కుంగదీస్తూంటుంది. ఆ దశను అధిగమించేసరికి కాలం చాలా గడవాలి.
రాజగోపాలం నవ్వాడు.
' 'నీదొక ప్రత్యేకమైన ఫ్రితి. కానీ, వాళ్ళు మీ వద్ద వుండడం...'!
' *శుత్యక్షంగా కుటుంబాన్ని విచ్చిన్నం చేసింది! !
ఇద్దరూ చాలసేపు నిశ్శబ్దంగా ఉన్నారు.
' "ఒకపని చెయ్యి.”
' "ఏమిటది?! !
'' మూయా - వాళ్ళూ పెద్దవాళ్ళని దగర పెట్టుకోవడం వల్ల గల ప్రమాదాల్ని గుర్తింపచెయ్యి. ! !
' "నీ మీద మీవాళుు ఆశలు పెట్టుకొన్నక్లు అతనిమీద వాళ్ళవాళ్లు ఎన్నో ఆశలు పెట్టుకొని
వుంటారు! ?
మరల కొంత సేపు నిశ్శబ్దం.
' "నువ్వు చెప్పిన ' కాంప్లెక్సు! సార్వజనికం కాదు. ఇంక భిన్న కులాల మధ్య వివాహాలు సుఖకరం
కావాలంకే కుటుంబంనుంచి
విడిపోవడం ముఖ్యమనోభావం నాకు కొంతకాలంగా అనిపిస్తూంది! !
' 'విడిపోతే...! !
' 'నువ్వు శీవైష్టవకులస్తురాలివి. నేను సుక్షత్రియుడిని. మన తల్లిదండుల ఆచారాలు, అలవాట్లు,
జీవన పద్దతులు
ఖీన్నం కావొచ్చు. కానీ, మనం, కాలేజీలు, హాఫ్టళ్ళు, చదువులు, ఉద్యోగపరిప్టితులు. . ఇవన్నీ మన
అలవాట్లు, జీవిత
పద్దతులను సరిసమానం చేశాయి. అందరి విషయంలోనూ ఇది ఇంతే. కనుక - పాత కొత్తల్ని
వేరుగా ఉంచడమే కొత్తది కాలు
నిలదొక్కుకోడానికి అవసరం! !
' "అమ్మల్ని, నాన్నల్నీ ఏంచేస్తావు?'
ఆ (ప్రశ్నే తాను కల్యాణిని అడిగిన మాట మరిచిపోయాడు.
' 'తప్పుదు మంజులతా! వాళ్లకి కావాల్సిన డబ్బు ఇవ్వడమో ఏదో ఒకటి చెయ్యాలి.
' "ఇవ్వలేని సంపాదనలైతే...'!
' 'శ్రాప్ప్రులేను. నూతన పరిస్థితులు సమష్టికుటుంబాల విచ్చిత్తిని కోరుతున్నాయి. దానివల్ల
ఇబ్బందులు కొన్ని ఎదుర్కోవాలి.
అయితే తప్పుదు. ఆ ఎదుర్కోవడంలోనే ఆ దారేదో కనబడుతుంది. '!
మంజులత ముఖంలో ఏదో విచారం కనబడింది.
' ' వాళ్ళ కంగీకారం కాకుంకే...?!
' "చెప్పు. తర్వాత ఎవరికష్టసుఖాలు వాళు చూసుకోవాల్సిందే! |
మంజులత కంఠం గాధదికం అయ్యింది.
' ' మాయకు కూడా నా టెప్పులు తప్పువూ...'!
రాజగోపాలం కారు పక్కకు తీసి చెట్టుకింద నిలబడ్డాడు. రోడ్డంతా నిర్మానుష్యంగా ఉంది. చాలా
దూరం వరకూ అటూయిటూకూడా
గామాలున్న సనవ్వడికూడా లేదు.
అతడామెను దగరకులాక్కొని కళ్లు వొత్తేడు.
' ' మెల్లి చేసుకోవడం తిప్పులు తెచ్చుకోవడం అంటావేమిటి లతా!
ఆమె సర్ద్వుకుంది.
' "కారు తెప్పు పోదాం'
కారు కొంతదూరం వచ్చింది.
' 'నీ సిద్ధాంతం ప్రకారం నోనూ మాయకు దూరంగా వుండవలసిందేగా?' !
' "ఇప్పుడు మాయ నీకు దగరయిందంటావా?'! !
మంజులత మాట్లాడలేదు.
'' మనం 19వ శతాబ్దాన్ని వదిలేసి రమారమి అరవయే్యేళ్లయింది మంజులతా! !!
చాలా సేపు ఇద్దరూ నిశ్శబ్దంగా కూర్చున్నారు. తిరుగు ప్రయాణంలో కారు వేగం అందుకుంది. ఒక్క
అరగంటలో సత్రం ముందు
నిలబడింది. మంజులత ముందు దిగింది.
' "కానీ, ఎవరికర్శు ఎలా ఉందో... ఏం చేస్తాం.”
పదకొండో ప్రకరణం...
' "నాలుగు రోజుల నుంచి ఇంటికి రావడం లేదు. ఎక్కడికి వెళ్లారు?! ... అనే ప్రనశ్నతో కల్యాణి
తలుపు తెరిచింది.
అతడేదో సమాధానం లాంటిది గొణిగాడు. అదేమిటో ఆమెకు అర్హంకాలేదు. అంతకన్నా
తెలుసుకొనందుకు ఆమె ప్రయత్నించలేదు. ప్రశాంతంగా,
చిరునవ్వులు చిందుతున్న ఆమె ముఖం చూడగానే, ఆ నాలుగు రోజులు తానేదో తప్పుపనిలో
మునిగివున్నాననిపించేటంత విచారం కలిగింది.
రాజగోపాలం తన వాటాలో ప్రవేశించాడు.
అతనికింతవరకు కల్యాణీయెడ గాఢమైన అనురాగం ఉంది. కైకి తేలకోయినా అతడామెకోసం
ప్రపంచాన్నో వొడ్డేస్తాడు. తండి
బెదిరింపులు, తల్లి అనునయాలు అతని భావాలకు గంటు పెట్టలేకపోయాయి. సుందరిధయైైన
మంజులత పక్కనవున్నా.. అతని మనస్సు
కల్యాణితోనే ఉండగలంత ఏకాగ్రత ఉంది.
కానీ, నాలుగు రోజుల అనంతరం అనతి మనస్సు మంజులత కోసం ఆరాటపడే స్థితికి పాల్పడింది.
ఆ నాలుగు రోజులో అతను తాను
ఊహిస్తున్న వ్యక్తికి విన్నమైన వ్యక్తిని చూశాడు. అతి నన్నిహితంగా ఉన్నా. . ఆమె చనువు
ఇవ్వలేదు. ఆ చనువు
ఇవ్వకపోవడం అతని మనస్సును అస్తమానమూ ఆమెవైపునకే ఆకర్షిస్తూంది. ఆమె కళ్లు,
చేతికందుతూనే దూరంలో ఉండిపోయిన ఆమె
శరీరాంగాలు, నిరంతరం సపెదవులమై చిందుతూండే హాస్యం, ఆ హాస్యం వెనక దాగివున్న నైరాశ్యం,
తనకు రహస్యాలు చెప్పడం వల్ల
కఠలిగిన లోకువ, ఆ రహస్యాలకు మూలంలో ఉన్న వ్యక్తుల ఎడ అతనిలో ఏర్పుడిన జుగుప్స - ఆమె
చుట్టూ ఆకర్షణీయమైన
ఓ గుడి కట్టాయి. ఆమె స్పర్శ [ప్రారంభంలో కలిగించలేని ఉదేకాన్ని కలిగిస్తూంది. ఆ నాలుగు రోజుల
సాహచర్యం ఆమెతో ఇంకా
కాలం గడపాలనే కోరికను పెంచుతూంది.
వేల సంవత్సరాలుగా రక్తంలో కలిసిపోయేలాగ ఊదరపెట్టిన నిత్యవినీతుల సంస్కారాన్ని అణచివేసే
అనుభవాలు లేకపోవడం అతనికో
పెదచిక్కు అయిపోయింది. ఎంతో సందేహిస్తూ ఆమె రొమ్ముల మీదికి పాకిన చేతులు, చీరమడతల్లో
చిక్కుపడిన చేతులు నామ్మదిగా
ఆతోసివేయబడ్డాయి. ఆమె తన చేతుల్ని తీసిేయడంకన్న మరేమీ చేయలేదు. అదేంపనన్నా
హెచృురించలేదు. కారులోనూ, స్యతపు
గదిలోనూ కూడా తానావిధంగా స్వ్రృశించబోయిన తర్వాత కూడా ఆమె తనస్టానాన్ని మార్చుకోలేదు. ఆ
సమయంలో తానంతకన్న ముందుకు
పోలేకపోయాడు. ఆమెను లేపడానికై చెయ్యివేసినట్లు రొమ్ములు తాకేడు. ఆ వపాయం కోసం
గంటలతరబడి మేలుకొని, అనేక ఆలోచనలు
చేశాడు. కానీ, తన స్పర్శకామె మేలుకొనగానో చటుక్కున చేయితీసేసుకున్నాడు. ఆమె లేచి
రూర్సుని '' ఎందుకు లేపే”వంది.
' 'న్మిదలో మూలుగుతున్నావు. ఏదో పాడుకల వచ్చి ఉంటుంది. లేపాను! ' అని అతడు
అబధద్దమాడేడు. అది అబద్ధమని
తానెరుగును. ఆమెను తాకడం తన వుద్దేశం. అందులోనూ ప్రత్యేక ప్రదేశంలో తాకాలి. చీకట్లో
తలియక ముట్టుకొన్నానని
తప్పుకొనేటందుకు వీలుగా ఉండాలి. గదిలో కటిక చీకటి. ఒక అడుగు ఎడంలో ఆమె
పక్కవేసుకుంది. ఏ దొంగలోవచ్చి తాము
నిద్రపోతుండగా బట్టలు పట్టుకుపోకుండా తలుపువేశారు. అన్నీ అనుకూలంగా ఉన్నాయి. న్నిదలో
ఆమె శ్వాసను బట్టి ఆమె శరీరాంగాల
స్థానాలను వూహించుకున్నాడు. స్పర్శలో తన వూహ సరిగ్గానే వుందని (గ్రహించాడు. ఆమె ఏమీ
అనలేదు. తన పిరికిదనానికి
నవ్వకున్నదేమోనని ఇప్పుడనిపిన్తూంది. ఆమె లేవకపోయినా, లేచి ఎందుకు లేపేవని
నిలదియకపోయినా, అతని స్పర్శ
ఆమెకిష్టమేనని భావించవచ్చుననుకొన్నాడు. కానీ, అలా జరగలేదు. ఆమె తన అబద్దాన్ని నమ్మేసి
న్నిదపోయింది. ఇంక అదే
అబద్దమాడలేడు. మరో ఉపాయం తోచలేదు. ఆమె రొమ్ముల కాథిన్యాన్ని శరీర మృదుత్వాన్నీ
తలచుకొని తాను
అనుభవించలేకపోతున్నాననేదొక్కకే అనుతాపం మిగిలింది.
మంజులత మీద మనసుపారినాక అతనికి ఒక పెద్దసందేహం కలిగింది. తాను కల్యాణిని
యేమిస్తున్నాననుకొన్నది నిజమేనా?
కల్యాణితో
మాట్లాడేప్పుడు తన మనస్సుఏదో అనిర్వవనీయమైన సంతృప్తితో నిండి ఉంటుంది. ఆమె మాటకు
అడ్డుకూడా వెళ్లకుండా మాట్లాడుతూంకేు
వినాలనిపిస్తుంది. ఆ స్వరం, కళ్లు, పెదవుల మందహాసం, కనుబొమ్మలు, నుదురు, నుదుటను
దోబూచులాడే అలకలు అతని
కళ్లనూ, మనస్సును కూడా నిర్వికల్ప ఫ్టితిలో పెడుతున్నాయి. ఆమె ఎదుట అతడు అనామయ
స్థితిని అనుభవిస్తాడు.
కానీ మంజులత... ఆమె అతనికొక సమస్య. ఒక జ్వాల.
ఈ ఇద్దరిలో తన మనస్సు ఎవరిని అభిలపషిస్తుంది? అదే అతనికి కొరుకుడుపడలేదు.
రెండు రోజులు మంజులత విషయం మరిచిపోవాలనుకున్నాడు. కానీ, మనస్సులో ఆమెను గురించిన
ఆలోచనలు మెదులుతూనే ఉన్నాయి. అయినా
వెళ్లలేదు. మూడోరోజు సాయంకాలం విసెంటు రోడ్డుమీద హోటలుకెదురుగా నిలబడ్రాడు. మంజులత
కారులో వెడుతూ ఆగింది. పలకరించింది.
' "'కనబడ్డంలేదేం?' !
పనుందన్నాడు. కానీ, అదనపు పనేమీ లేదు. అది అబద్దం. మంజులత కనిపెట్టింది. చిరునవ్వు
నవ్వింది. '* * 'తీరుబడి
చేసుకురావయ్యా' |
అతడు తలూపేడు. కానీ, వెళ్లలేదు. ఆమె పిలిచిన వెంటనే వెడితే తనను లోకువ కట్టి ఆడిస్తుందని
భయం. ఆ మాట తోచగానే,
కల్యాణీ విషయంలో తనకాభయం కలగదనే సంగతి గుర్తుకువచ్చింది. ఆశ్చర్యం కలిగింది.
మంజులత తన మగడు ' ఇన్పీరియారిటీ కాంప్లెక్సు! తో బాధపడి తనను బాధపెక్పేవాడంది. ఇప్పుడు
తన మనస్సులో కలిగిన భావం
ఆ 'కాంప్లెక్సు' జన్యమేనా? కానీ, ఆ మాటను ఒప్పుకోలేకపోయింది మనస్సు. అయినా అతను
వెళ్లలేదు.
ఆమె పిలిచినందుకు గాక, తనకు పని ఉండడం చేతనే ఆమె ఇంటికి వెళ్లేననుకొనేటందుకు
మరునాడు అవకాశం చిక్కింది.
వర్కు షాపులో పని చేస్తున్న మెకానికు రామచంద్రం తన భార్య రుగ్గత విషయంలో రాజగోపాలం
సహాయం కోరేడు.
అతని భార్యకు ముట్టుకుట్టు వ్యాధి వుంది. ప్రతినెలా విపదీతమైన బాధ. ఆ మూడురోజులే కాదు.
నాలనాలా కలుగుతున్న ఆ బాధ
కామె క్రీణించిపోతూంది. లేవలేని స్థితికి వస్తూంది. ఆపరేషను చేయించాలన్నారు. మనులత
వయస్సుకు చిన్నదైనా హస్తవాసి
మంచిదన్నారు. ఆమెకు సిఫార్సు చెయ్యాలి.
"తమకు ఆమె తెలుసు. మా జీతాలు తమరెరగనిది కాదు. రోజు కూలిగాడిని. ఏదో కొద్దిగా
ఇచ్చుకొంటాను. తమరు చెప్పండి.”
రాజగోపాలం ఆలోచించేడు. తన సిఫార్సును మంజులత అెక్కచేస్తుందా యనే సందేహం. ఆ
సందేహానికి కారణం లేదు. కల్యాణీ విషయంలో
అతనికటువంటి సందేహమే కలగదు. కల్యాణితో స్నేహం కన్న మంజులతతో తన స్నేహం
చిరంతనం. అయినా ఆమె స్వభావం ఏమిటో
అతనికి అర్దం అయినట్లే లేదు. చివరకు ఆమెతో తనకంత పరిచయం లేదన్నాడు.
కాని, రామచందం నమ్మలేదు. పది రోజుల [క్రితం మంజులత స్కూవబిడ్సి వద్ద గోపాలాన్ని కారులోకి
పిలిచింది. ఇద్దరూ
గుంటూరుకేసి వెళ్ళారు. మళ్ళీ నాలుగురోజులవరకూ అతడు వర్కుషాపుదిశలకే రాలేదు. అందుచేత
తన అంచనాలు తనకున్నాయి. తన
అంచనాల ప్రకారం మంజులత గోపాలం చెప్పిన మాట వినితీరాలి. కాని, ఆ మాట కైకి అనక
పోయినా, సూచనగానేనా అనకుండా
ఉండలేకపోయాడు.
మంజులతతో తన పరిచయం చాలదూరం పోయిందనుకోవడం గోపాలానికెంతో గర్వ కారణం
అనిపించింది. పట్టణంలో మంచి పేరున్న లేజీ
డాక్టరు. అందకత్తె. బంధుత్వాల రీత్యా మంచి మంచి వృద్యోగాలలో వన్న కుటుంబంలోనిది. ఆమెతో
సాధారణ పరిచయం వుందనుకోవడంకూడా
గొప్పుగా భావించే జనం, తమ పరిచయం ప్రగాడమైనదిగా భావించడం అతనికి సంతృప్తికన్న
అధికమైన ఒక భావాన్ని కలిగించింది.
కాని, ఆ సంతృప్తిలో కూడా సందేహం మెరుగుతూనో వుంది.
"నాకు ముఖపరిచయం తప్పు విశేషం లేదయ్యా! *
కాని, అతడు ఫోను తీసేడు. రామచం[దం ముందు ఆమెతో తనకున్న పరిచయాన్ని
ప్రకటించుకోదలచుకోలేదు.
" నమస్కారం.”
"మీతో చిన్న పనుంది."
ఏమిటీ నమస్కారాలూ, మన్నింపులూనని మంజులత ప్రశ్నిస్తూంకై అతడు చిరునవ్వు
నణచుకొంటున్నాడు.
"మీకు అవకాశం ఎప్పుడుంటుంది?”
అతడు నిర్ణయించుకొన్న వేళకి రాజగోపాలం మంజులత గుమ్మంలో హాజరయ్యాడు.
గుమ్మంలో కారు వుంది. నర్సు ' మెడిసిన్ చెస్తు'తో మెట్ల మీద వుంది. అతనిని చూడగనే
మంజులత నిలబడిపోయింది.
"మా టబతుకులింతే. ఏ క్షణమూ మాది కాదు. నిన్ను రమ్మన్నా, ఏదో కాంపు కేసుమీద
బయలుదేరుతున్నా. నువ్వు వస్తావని
ఎరుగుదును. బల్లమీద చీటి పెట్టాను.”
నర్సు 'చెన్సు' కారులో పెన్వేసి తలుపు తెరిచి పట్టుకుని నిలబడి వుంది. ఆమెను పిలవవచ్చినవారు
ఎదురుగా నిలబడి
తొందరపెడుతున్నట్లు చూస్తున్నారు. ఆ చూప్తలు ఆమెకు కోపం కలిగించాయి.
” టాక్సీలో వెడుతూండండి. మీ వెనకాలనే వస్తున్నా.”
వాళ్ళు వెళ్ళలేదు. కాని, ఆమెవైపు చూడడం మాని ప్రక్కకు తిరిగేరు. ఆమె ప్రశ్నించింది.
"ఏదన్నా (ప్రత్యేకంగా మాట్లాడాలా?”
అయిష్టంగానే ఆహ్వానించింది.
"ఎంతసేపు ఆలస్యమవుతుందో యేమో. లేకపోతే నిన్నూ రమ్మందును. కారులో
మాట్లాడుకొనోవాళ్ళుం .”
వెంటనే చిత్రంగా కల్యాణి జాపకం వచ్చింది. ఆమెతోనైతే ఈ విధంగా వెళ్ళకూడదనుకొనేోవాడినేనా
అనిపించింది.
అతని సందేహాన్ని గమనించి మంజులత మళీ రమ్మంది.
"ర్శాత్రి తొమ్మిదింటికిరా, అప్పుటికి నను బహుశా వచ్చేస్తా. రావడం ఆలస్యమైనా వుండు. బాగా
రాతయితే ఇక్కడే పడుకో.
నర్సు ఆ ఏర్పాటు చేస్తుంది.”
పన్నాండో ప్రకరణం
అతనికి వెళ్ళాలనిపించలేదు. తాను హూోటలునుంచి తిరిగివచ్చేసరికి గుమ్మంలో రామ చందం కని
ెట్టుకొని వున్నాడు. డాక్టరు ఎంత
అడిగిందో, తన శక్తికి మించిపోతుందేమో, ఏం చెయ్యాలి? అని అతని ఆదుర్దా. కాని రాజగోపాలం
ఇంకా డాక్టరుతో మాట్లాడనోలేదు.
"బాబుగారు! దానికి ప్రాణ భిక్ష తమరే పెట్టించాలి. దాని బాధ చూడలేకున్నాను. అదెంతో కాలం
భరించలేదు కూడా.”
రామచంటదం కళ్ళు వొత్తుకోడం రాజగోపాలానికి ఆశ్చర్యం కలిగింది. భార్య విషయంలో ఇంత
యపేమాబభిమానాలు చూపుతున్నవాడు ఆడపిల్లను
కనబడనివ్వుడు. వాళ్ళు చెంగుపట్టుకు తిరుగుతూ మోటు హాస్యాలు ఆడుతూంటాడు. ఆశర్యం
కలిగింది, అడిగేడు.
”పెళ్ర్యాం మీద ఇంత .పేమ వున్నవాడివి రాజక్కని క్షణం వదలవేమోయి?"”
రామచందం కొంచెం సిగ్గుపడ్డాడు. ఆశ్చర్యమూ కలిగింది.
"నా భార్య అనుకొంటున్నది కట్టుకొన్న పెళ్ళాం కాదండి. తెచ్చుకొన్నది. మా ఇద్దరికీ మనసు
కలిసింది వచ్చేశాం."
ఆమె అతనికి మరో ప్రాణం. నెలలో ఏ రెండు మూడు రోజులో తప్ప ఆమె ఆరోగ్యంగా,
మూలగకుండా వుండదు. ఆమెను
బాధపెట్టకుండేటందుకే రాజక్క.
అదో చిత్రమైన సంబంధం. గ్రేమ లేకపోయినా శరీరసంబంధం వుంది. శరీరావసరాల్ని తీర్చలేని
చోట, తీరడానికి అవకాశం లేని చోట
యేమ వుంది. మంజులత ఆనాడన్న మాటలు గుర్తు వచ్చాయి.
"మనకు చిన్న పిల్లలయుడ గ్రేమ వంది. దానిని వాత్సుల్యం అంటాం. తల్లిదండ్రులూ, దేవునియిడా
డేమను భక్తి అంటాం.
సంస్కారంలోనో, సమాజ హోదా లోనో, ఆర్ధికంగా మనకంకే సన్న వాళ్ళ మీద డ్రేమ వుంటుంది.
దానిని అభిమానం అంటాం. వీటికి
పాత్రులయ్యేవాళ్ళ ప్రీ పురుష భేదాలు మనకనవసరం. స్తీ పురుషుల మధ్య వాంఛ వుంది. దాని
నిదివరకు కామం అన్నారు.
ఇప్పుడు పేమ అంటున్నారు. పేరు ఏం పెట్టినా అది కామమే. ఈ _పేమ బిన్న లింగాల మధ్యనే
వుంటుంది.
రామ చంద్రానికి భార్య యడ వున్న భావానికి మంజులత ఏం పేరు పెడుతుందో అతనికి వాగానం
చేసేడు. రామచంథదం ఎంతో బరువుగా
తిరిగి వెళ్ళిపోయాడు.
అతడు వెళ్ళిపోయాక రాజగోపాలాన్ని వేయిప్రశ్నలు చుట్టుమున్తేయి. ఈ మధ్యకాలంలో తన
మనస్సులో మెదులుతున్న ఆలోచనల
కొసలవి. (చేమ ఒకచోట, శరీర సంబంధాలొకచోట వుండడం తప్పా? తప్పుయితే వాటినొప్పుకోడానికి
రామచంద్రం ఎందుకు సందేహించడం
లేదు? తనకు మంజులతతో అతడూహించే సంబంధం లేకపోయినా వుందనడం తనకి వుత్సాహం
కఠిగిస్తూందే? మనస్సునూ శరీరాన్నీ ఆకాంక్షలో
వుంచే భావన తప్పా?
అతనికి మంజులత వాదనలు గుర్తు వచ్చాయి, "ప్రమ మానసిక స్వాతంత్ర్యాన్ని కొరుతుంది.
అటువంటి సందర్పుంలో ఆ స్వేచ్చను
అరికక్పే నియమాల పేరుతో _ప్రేమను ఎందుకు సంకుచితపరచాలి?” అని ఆమె వాదన.
అతడారాత్రి పదయినా, పన్నెండయినా మంజులతను చూచితీరాలనుకొని బయలుదేరేడు. అది
కేవలం సాకు మాత్రమేననీ, మంజులతలోని
ఆకర్షణే తన్ను లాక్కుపోతూందనీ అతనికి అంతరాంతరాల్లో తెలుసు.
అతడు వెళ్ళిన అరగంటలోపలనోే డాక్టరు తిరిగి వచ్చింది. ఆమె ముఖం (కోధఘూర్దితంగా వుంది.
మనిషి చాల అలిసిపోయి వుంది.
రాజగోపాలాన్ని సోఫాలో చూడగానే ఆమె సర్పుకొంది.
"నీ భోజనం అయిందా?”
”"ఈ్రిహా! 7
అక్కడికక్కడే నిలబడి వీధి మొగలో వున్న హోటలునుంచి కాఫీ తెప్పించి ఇచ్చే వరకూ ఆమె
కదలలేదు. [డైవరు తెచ్చిన
ప్లాస్కులోని కాఫ్ కప్పులో పోసి స్వయంగా అతనికిచ్చింది.
"రూర్చో వస్తా.”
రాజగోపాలం ఎదురుగా బల్లమీద వున్న ఒక తెలుగునవల తీసుకున్నాడు. సోఫాలో జేరబడ్డాడు.
"ఏమిటాలోచిస్తున్నావు?” అనే ప్రశ్నకు రాజగోపాలం వలికి పడ్డాడు. గడియారం వేపు చూసేడు. తానా
పుస్తకం తీసి గంట
గడిచింది. కాని, ఒక్క పేజీ కూడ తిరగయ్యలేదు.
తనకాపున్తకం ఆసక్తి కలిగించనో లేదన్నట్టు దానిని నిర్లక్ష్యంగా బల్ల మీద పడేసేడు. మంజులత
వెంటనో దానిని సర్దింది.
రాజగోపాలం నాలుక కరుచుకొన్నాడు.
”క్రమించు.”
మంజులత చిరునవ్వు నవ్వింది.
"నాకు వస్తువులు చిందరవందరగా వుండటం ఇష్టం కాదు.”
"నాకూ అంతే.”
"స్వంతం అయితేనే ఆ నియమం పాటిన్తా వనుకుంటా. ”
తనమనస్సులోని ఆలోచనలను ఆమె (గ్రహించిందా అనిపించింది. అందుచేత వచ్చినపని చెప్పేడు.
వెద్యవుత్తి విషయం వచ్చేసరికి మంజులత ముఖం గంభీరమయింది. ఆమెకు రామచంద్రం భార్య
పరిస్థితితోపాటు అతనికి రాజక్క తో
గల సంబంధం గురించి కూడా చెప్పేడు. అదేమో కారణం.
"నూట ఏభయి రూపాయలివ్వగలిగితే తీసుకురా. ”
రాజగోపాలం ఆశ్చర్యం ప్రకటించాడు. అమెరికను హాస్పిటలులో అన్ని ఖర్చులూ కలిపి అంతవరకు
అవుతాయంకే రామచందం జంకి
మంజులత కోసం ఆశపడ్రాడు.
"నెలంతా పనిచేస్తే నువ్వడిగిందాంట్లో సగం ఆదాయం రాదు మంజులతా! ”
"ఆరేళ్ళు చచ్చి చదివి నోర్సుకొంకేనోగాని అతడికి కావలసిన ఆపరేషన్ చేయగల శక్తి రాలేదు
గోపాలం !”
అతడింకా మాట్లాడబోయేసరికి ఆమె మాట మార్చేసింది. దానిని మఠల తెచ్చేసరికి చెప్పేసింది.
"మనం సోవియటు రాజ్యంలో లేము. ఆదాయాన్ని బట్టి ఫీజులు నిర్ణయించడానికి. ”
"అక్కడైతే వైద్యు సౌకర్యం వుచితమే నంటారు.”
ఆ మాటలోని ఎగతాళికి మంజులత మనస్సు చురుక్కుమంది.
”మెల్యాం మీద అంత (చేమ వున్నవాడు ఈ ఫీజు ఇవ్వడం అంత కష్టం కాదు.”
రాజగోపాలానికి తాను చేసిన పొరపాటు అర్దం అయింది. మంజులత _పేమ అనో మాటను
సహించలేదు.
"నిజమే! థాంక్సు! ”
రాజగోపాలం లేచేడు.
”"ర్రూర్చో,. ”
"అతనికి చెప్పాలిగదా!
"మరెల్లా తెస్తాడు?”
రాజగోపాలానికి ఆమె ధోరణి అసహ్యం కాలేదు.
"ఏదో తంటాలు పడతాడు."
మంజులత అతని ముఖంలోకి చూసింది.
"ఒక్క మాట వింటావా? డాక్టరు ఫీజు ఎగకొట్టాలనే భావనకు [గమ అనే అంత పెద్ద పేరు
తగిలించవద్దను. నిజం చెప్పాలంకే
ఖర్చు లేకుండ (స్తీ సుఖం పొందడానికి పెళ్ళి. ఆ పెళ్ళి ఖర్చు కూడా అక్కర్లేకుండా ఆడదాన్ని
సంపాదించే ఉపకరణం ,_,పేమ.”
ఆమె వ్యాఖ్యకు రాజగోపాలం అదిరిపోయేడు.
ఆడవాళ్ళు దృష్టిలోంచి నువ్వు వ్యాఖ్యానం చేశావు. ”
”"నువ్వేమంటావు?”
"కానీ సంపాదించనక్కర్లేకుండా భారం అంతా మగాడి నెత్తిన పారేసి ఇంట్లో పెత్తనం
చలాయించడానికీ, మగాడిని అనుభవించడానికీ ఆడది
పెళ్ళి చేసుకొంటూందా?”
"సంపాదించుకోలేని ఆడుదాని విషయంలో నువ్వా మాట అనొచ్చు. కానీ, ఆ సంపాదించుకోలేని
స్థితికి ఆడదాన్ని తెచ్చిన దాని దుష్పులితం
అది.”
ఇద్దరూ ఒక్క నిముషం వూరుకున్నారు. మంజులత మరల చెప్పింది.
"నేనీవేళ వెళ్ళిన కేసు ప్రసూతి కేసు కాదు. గర్పు స్రావం. ఆమె భర్త అమెరికాలో విన్నాడు. ఈమె
ఇక్కడ ఎవడినుంచో
గర్బుం తెచ్చుకొంది. ఆ కుటుంబం విచ్చిన్నం కాకుండేందుకు బంధువులు మందిచ్చారు. చక్కని
పడుచు. నిష్కారణంగా చచ్చిపోయింది. నువ్వు
చెప్పే పెళ్ళిళ్ళూ, (చమేమలూ ఆమెను బలితీసుకొన్నాయి. ఒక సాధారణమైన కామ కార్యానికి పెద్ద
పేర్లు తగిలించి
మహాపవిత్రస్పూర్తి నిస్తున్నారు. మనం నసృుష్టించిన ఆ దయ్యం మన ప్రాణాల్నే తీస్తూంది. గోపాలం!
స్త్ పురుష సంబంధాన్ని
కేవలం కామ కార్యంగానేో వదిలేసి, దానికి స్వేచ్సునిస్తే సమాజంలో దుర్మరణం అవసరం ఏం వుంది?”
రాజగోపాలానికి సమాధానం తోచనూలేదు. ఆలోచించగల ఫ్టితిలోనూ లేడు. రామచంటదం భార్య
యొడగల సానుభూతి ముందు మంజులత సిద్ధాంతాలు
కేవలం శుష్క ప్రియాలుగా కనిపించాయి. వెలపరం కలిగింది.
"వరు వెళ్ళిపోయి వుంటాడు. రిక్షా పిలిపించనా?"
"వద్దు. దగరనేగా. నడిచిపోతా. ”
రాజగోపాలం ఇంటికి వచ్చేవరకూ రామచందం కల్యాణితో మాట్లాడుతూ కూర్చున్నాడు. అతనిని
చూడగనో లేచి నమస్కరించేడు. గోపాలం
అతనికో పాతిక రూపాయలు అందివ్వబోయాడు.
"ఆ విషయంలో నువ్వే ప్రయత్నం చేసుకో. నీకు నేనివ్వ్శగల సాయం ఇంతే.”
రామచందం ముఖం వాడిపోయింది. ఒక్క నిట్ట్లార్పు విడిచేడు. దబ్బు నిరాకరించేడు.
"వద్దు బాబుగారూ! మాకు అందుబాటయిన చోటుకే వెడతాం.”
"ఎక్కడైనా డబ్బు కావలిసిందేగా. ”
"చిత్తం. కల్యాణమగారు రేపు ఒక డాక్టరువద్రకు తిసుకెడతామన్నారు.”
మంజులత-కల్యాణి-రాజగోపాలం కల్యాణి స్పిగ్త హృదయాన్ని మనస్సులోనే అభినందించాడు.
"ఆమె దేవతలాంటివారు.”
"చిత్తం. చిత్తం.”
రామచందం అతని మాటలకు అంగీకారం తెలిపేడు.
"ఆమె మాటలు వింటూంకేు మరల నా రంగమ్మ బతికి వచ్చే ఆశ వుందనిపించింది. "”
పదమూడో ప్రకరణం
గది తలుపు తాళం నొక్కి రాజగోపాలం వెనక్కి తిరిగేడు. కాని వాకిట్లోకి వెళ్ళేదారి బంద్.
గుమ్మంలో అడ్డంగా కూర్చుని సుజాత ముగ్గులు దిద్రుతూంది సుద్దతో. పదిరోజుల క్రితం జరిగిన
సంభాషణ అనంతరం సుజాత అతనికి
కనిపించడమే లేదు. కనిపించినా మూతీ ముక్కూ తిప్పి మొగం చాటు చేసుకొంటూంది. ఆమె
కతనిమీద చాలా కోపం వచ్చిందన్నమాట. ఆ
కోపాన్ని అతడు అక్క చేయదలచలేదు. ఒక కన్యకు ఆమె చేస్తున్న అనాలోచితపు పనిని గురించి
పహాచృరించడం అతడు తప్పుగా
భావించలేదు. తాను చేసింది మంచిపనే. దానికామె కోపగించడం చిన్నతనపు అజ్ఞానం తప్పు వేరు
కాదు. ఆమె కాలేజీలో చదువుతున్నా,
మంచి తెలివిగా మార్కులు తెచ్చుకొంటున్నా అతనికి చిన్న పిల్లగాన కనిపిస్తూంది. అందుచేతనో
ఆమె కోపాభిమానాలు, గ్రమానుతాపాలు
ముద్దుగా కనిపిస్తున్నాయేగాని ఆమెలోని యౌవన (్రాదుర్చావాన్ని మనస్సుకు తగలనియ్యడం లేదు.
సుజాత గుమ్మానికడ్డ్దంగా బైఠాయించింది. అతనిని చూడకుండేటందుకు తల బాగా దించుకుంది.
తనను చూశాక తప్పుకునే ప్రయత్నం
చెయ్యకపోవడం ఆమె రాజీ ధోరణిలో వుందనిపించింది.
రాజగోపాలం పలకరించాడు.
"ఈవేళ ప్రాద్దుకే ముగ్గులకు కూర్చున్నారేం?”
సుజాత తల ఎత్తలేదు. అతడి మన్నింపులో ఎగతాళి ప్రతిధ్వనించింది. తల వంచుకునే మూతి
వంకరలు తిప్పింది. ఆ వెక్కిరింత
రాజగోపాలానికి అర్ధం అయ్యే అవకాశంలేదు. కాని, ఆ నిశ్శబ్దంలోనే ఆమె ముఖ భంగిమ అతనికి
కనబడింది. అతడేమనడానికీ
వ్యవధి లేకుండనే వీధి గుమ్మంలో కూరలమ్మి కేకేసింది.
"ఏం వున్నాయి?”
రూరలమి్మి ఆశ్వాసాంతగద్యవంటి దొకటి చదివింది. సుజాత ఆ మాట వినిపించుకోకుండానే తట్ట
దింపించింది. మ మెట్టమీద కూర్చుని
క్రింద మెట్టు మీద కూరగాయల గంపా, ఇంకా [కింద కూరగాయలమి-దాటి, తోసుకుపోదామన్నా
సాగనివ్వును నుమా అన్నట్లు వెనుతిరిగి
చూసింది.
"అయ్యగోరు ఎలతారుగామాలమ్మా! "”
గంపలోని కూరగాయల్ని తల్లకిందులు చేస్తూ సుజాత మాట్లాడలేదు.
"తొందరలేదులే కానియ్యి.”
రాజగోపాలం ఆ మాట మర్యాదకు మాత్రమే అన్నా, సుజాత యధార్దంగానే స్టెరపరిచింది. కూరలమి్మి
మాట విననట్లు నటించింది.
"ఎండువరుగులకు కూడా ఆ ఖరీదేమిటమ్మీ!
వరుగులంటారేమిటమ్హా! నవుజులు. ఎక్కడా గింజన్నా కట్టలేదు గదమ్మా!
రూరలమ్మి నదరుగావున్న బీరకాయ ఒకటి విరిచింది. పుచ్చగింజల్లా మిలమిలలాడాయి.. దానిని
వీధిలోకి పారేసింది.
"తమ ఇష్టం వచ్చినవి ఏరుకొండమ్మా. వర్షాలకి పాదులన్నీ కుళ్ళిపోయాయి. "
"ఈ వంకాయలు మనుష్యులు మేసేటందుకా, గేదెలకి వండి పెట్టాలనా?”
రాజగోపాలం నవ్వేడు.
"సమస్యే! డాక్టరు మంజులతని అడగాలి. తిండిలోకూడా పశుధర్శాలను వదిలి మనుష్యుడు
పాడైపోయాడంటుందో యేమో."
"సుజాత పశువులు మనుష్యుల అలవాట్లు చేసుకోవాలంటూంది కాబోలు. " అంది అప్పుడే వీధి
గుమ్మంలో అడుగుపెట్టిన కల్యాణి.
"అప్పుడే స్నానం పూర్తిచేసుకుని బయలుదేరేరే!
అది కేవలం పలకరింపు. తాను ఎక్కడికీ పోవాల్సిన పనిలేకున్నా స్నానం చేసెయ్యలేదూ. గోపాలం
చిరునవ్వు నవ్వి ఊరుకున్నాడు.
కల్యాణి ఆహ్వానించింది.
"వచ్చి లోపల కూర్చోండి. ఇంత ప్రాద్దుకు వెళ్ళాలా పనిలోకి! ”
సుజాత ధోరణి చూసి ఆమె ఏదో ఖయ్యాళీలో ఉందనిపించింది. కొద్దిసేపట్లో సర్పుకుంటుంది.
అంతవరకు ఎవరుచెప్పినా వినదు. ఆమె
స్వభావం తెలిసిన కల్యాణి రాజగోపాలాన్ని లోనికి ఆహ్వానించింది.
"దారిలో ఉడిపి బ్రాహ్మల సువారం ఒకటుంది కదాండి. ఇటుతిరిగి, అటుతిరిగి ఎనిమిదింటికి
వర్కుషాప్పుకు చేరుతాం.”
"అంతేకద. రాండి. ఈపూట మేం కాఫీ ఇచ్చుకుంటాం.
రాజగోపాలం కాదన్నా కల్యాణి వినిపించుకోలేదు.
"ఎంతకాలమైనా మొగమాటమేనా? రా నాయనా! అంతల్లా చెప్తున్నప్పుడు.”
అంతవరకూ ఆవలి గుమ్మంలో నిల్ఫున్న రామలక్ష్మమ్మ నౌెవ్వరూ గమనించనేలేదు.
ఆ రోజున యింట్లోవున్నజనం అంతా వీధి గుమ్మంలోనే వుండడం చూసి గోపాలానికి ఆశ్చర్యమయింది.
ఇటువంటి స్థితిని ఈ ఏడెనిమిది
నెలల్లో అతడు చూడలేదు. కల్యాణి వాటాతలుపు తెల్లవారగక్తే తెరుచుకుంటుంది. తాను లేచేసరికి
ఆమె స్నానాదికం పూర్తిచేసి హాలులో
చదువుకొంటూనో వ్రాసుకొంటూనో కనిపిస్తుంది. వీధిలోకి వచ్చేసరికింకా మూడోవాటా తలుపులు
తెరిచేవుండవు. ఈవేళ అవీ తెరిచారు.
సామాన్యంగా ఆవేళకు పళ్ళు తోముతూవుండే సుజాత గృహాలంకరణలో వీదిగుమ్మంలో వుంది. ఏ
వంట పప్రయత్నాలలోనో ఉండే రామలక్ష్మమ్మ
అరుగుమీదికి తీరుబడిగా వచ్చింది. ఏదో విశేషం వుందనిపించింది.
తన వెనుక సంభాషణ సాగిపోతున్నా సుజాత వినిపించుకోలేదు. తల టత్రిప్పలేదు.
"కాకరకాయలెల్లాగ? పండబారినా పనికివచ్చేవి అవొక్కకు. ”
తాను మొగమాటపడుతున్నానన్న మాటను రాజగోపాలం అంగీకరించలేదు.
"డఇంకా వ్యవధివుంది గదాయని. నా శిష్యురాలు పెడుతున్న ముగ్గులు చూస్తున్నా.”
ఆ మాటలోని శేషకు రామలక్ష్మమ్మ నవ్వింది. కల్యాణి చిరునవ్వు నవ్వింది.
"అందుకే అత్మారాముడు శాంతిస్తే ముగ్గుల అందమూ, ముగ్గులు పెట్టే అమ్మాయి చందమూ
సుజాత కోపంతో చ్వురున తిరిగి చూసింది.
"నీ అందం నాకెక్కడినుంచి వస్తుంది. ?”
రామలక్ష్మమ్మ మేనకోడల్ని కోప్పుడింది.
”"హాస్యానికంకు కస్సుమంటావేం తెలివే అమ్మా!”
సుజాత సమాధానం ఇవ్వలేదు. కల్యాణి మాట మార్చింది.
"7 ఈవేళ ఆదివారం కదా, సెలవులేదా? ఇల్లు అద్దెకు తీసుకోవడమేగాని ఏ రోజునా ఓ గంట కూడా
రూర్చోరేం?”
ఏదో తప్పుచేసి సమాధానం చెప్పుకొంటున్నట్లు రాజగోపాలం గొణిగాడు.
"ఏ స్నేహితులతోనో. ..”
"అయితే ఇల్లు మీకు శత్రువన్నమాట. "-అంటూ సుజాత వెనక్కి తిరక్కుండానే మాట అందించింది.
"నా అనుకొనే మనిషి లేకుంకేు ఇల్సేమిటి, (బతుకే ఓ శత్రువు.” అంది రామలక్ష్మమ్మ వేదాంత
ధోరణిలో.
కల్యాణి దారితీయగా రాజగోపాలం హాలులో అడుగుపెక్పేడు,
"సుజాత పార్షీ ఇస్తూంది.
వీధిలోంచే సుజాత నిరాకరించింది.
"అల్లాంటిదేం లేదండోయ్."”
కల్యాణి నవ్వింది. రాజగోపాలం కూడా ఏదో అనబోయి, వీధి గుమ్మంలో రిక్షా ఆగిన చప్పుడు
వినిపించి వెనుతిరిగేడు.
రిక్షా నుంచి దిగిన వ్యక్తిని చూడగానే ఆశ్చర్యం అయింది. అతడు తన మిత్రుడు వెంకటావు.
అనుకోకుండా ప్రత్యక్షమయిన
మి(త్రుజ్లీ చూసేసరికి ఎంతో సంతోషం కలిగింది.
పలకరించడానికి నోరు తెరిచేలోపునే ప్రక్కన మరో రిక్షా నిలబడింది. అందులో కనిపిస్తున్న పడుచు
అతని భార్య కాబోలు. తన
మిత్రుడు పెళ్ళికూడా చేసుకొన్నాడన్నమాట. ఆ సంగతే తనకు తెలియదు. ఎప్పుడో నాలుగేళ్ళుకితం
కాలేజీనుండి ఇద్దరూ విడిపోయారు.
తరవాత మరి కలుసుకోలేదు. ఒకరిపోబడి ఒకరెరగరు. కాని, ఈవేళ తన మిత్రుడు భార్యతోసహా తన
గుమ్మంలో దిగేడంకు అతడు
తన విషయం వాకబులోనే వన్నాడన్నమాట. కాని, అతనివిషయం తాను ఎన్నడూ తెలుసుకొన
ప్రయత్నించలేదు అనిపించి సంకోచం
కలిగింది.
తన మిత్రుడు ఆ యింట్లోనే మరో వాటావారికి బంధువులై యుండవచ్చుననే తోచలేదు. సుజాత
ధర్మమాయని తన కాలశ్యమైయిందిగాని లేకుంకే
అతడెంత చిక్కునపడేవాడోననిపించింది.
వెనక్కి గుమ్మం వెలుపలకొక అడుగు వేశాడు.
"ఏమోయ్ వెంక్కటావు! గుడ్ మార్నింగ్.”
ఆ వుత్సాహంలో వీధిలోకి పరుగెత్తేవాడే. మధ్యలో కూరలగంపా, అటూ ఇటూ ఇద్దరు పడుచులూ
ఉండడంతో అక్కడే కదం తొక్కవలసి
వచ్చింది.
వెంకటావు తిరిగి చూశాడు. మిత్రుజ్దీ గుర్తుపట్టాడు.
"అరె గోపాలం! మేము వస్తున్నామని నీకు ఎల్లా తెలిసిందోయ్, ఈ ఊళ్లోనే ఉంటున్నావా?
సంతోషం.
వెంక్కటావు అంతదూరంనుంచే భార్యకు పరిచయంచేశాడు.
"మా రాజబాబు అంటూంటానో, అతడే, ”
తనను మిత్రుడు అదివరకే భార్యకు పరిచయం చేశాడు. తాను మాత్రం అతళ్ళీ ఎప్పుడూ
తలచుకోనన్నాలేదు. ఆ మాట తోచి
రాజగోపాలం మనస్సు ఖిన్నమయింది. అతడు చూపిన ఆప్హీయతకు హృదయం పొంగివచ్చింది.
తన నెత్తిమీదుగా సాగిపోతున్న ఆ పలకరింపులూ, పరిచయాలూ వింటున్నా కూరలమి్మి చాటు
కావడంవలన ఆవలివారెవరో సుజాతకు అర్దం
కాలేదు. తన అక్కా, అక్కమగడూ మెయిలులో దిగుతారని ఎరుగును. అయితే అతడికీ,
రాజగోపాలానికి పరిచయం వుండి వుంటుందనే
అనుమానం కూడా ఆమెకు లేదు. కంఠస్వరం పరిచితంగా వినిపించగానే తొంగిచూసింది. కళ్ళు
విప్పారేయి.
"రా బావా”
చేతిలోని కూరలు గంపలోనో విసిరేసి వాకిట్లోకి వురికింది.
"మా అక్కయ్వ్యేది?”
"నువ్విక్కడున్నావుగదా యని ఇంటిదగ్గరే దిగవిడిచి వచ్చా.”
"పనిలో పని నువ్వూ దిగబడిపోకపోయినావూ, ఇంత బెజవాడ పట్నంలో మగ ముఖమే
కనబడదనుకున్నావా?”
" అప్పుచెల్లెళున్నచోట మగసాయానికి లోటుండదని నే నారగనంటావు. ”
"స్వానుభవం మరి.”
రామలక్ష్మమ్మ ఇంట్లోంచి. వసంత వీధిలోంచీ రావడంతో ఆ బావా మరదళ్ల పరిహాసాలు కట్టుబడ్డాయి.
వసంత, రామలక్ష్మమ్మ
ఒక్కమారు ఒకరినొకరు కుశలప్రశ్నలు వేసుకున్నారు.
వసంత ఎదురొచ్చి కల్యాణిని కౌగిలించుకొన్నంత పనిచేసింది. చెల్లెల్ని దగరకు తీసుకొంది.
రాజగోపాలానికి నమస్కారం తెలిపింది.
మగనికి సామానులు దింపించి రిక్షావాళ్ళని పంపించే బాధ్యత వప్పుచెప్పింది.
ఆ హడావిడి, పరిచయాలూ చూస్తూ విస్తుబోయినట్లు నిలబడ రాజగోపాలాన్ని వెంక్కటావు భుజం తట్టి
కదిపాడు.
"ఏమిటి చూస్తున్నావు? నీ కర్షం కాలేదన్నమాట. సుజాత నా మరదలు. ఇదిగో ఈమె నా శ్రీమతి!
తెలిసిందా? బాగుంది.
నువ్విక్కడున్నావేమిటి? ఆ వాటాలో సువ్వున్నావు. చాలా సంతోషం. అయిదేళ్ళు దాటింది మనం
కలుసుకొని. *”
రాజగోపాలం ముఖంలో సంతోషం వ్యక్తమయింది.
"నోనిక్కడున్నాక ఎంత దగరబంధువులేగాని, నువ్వు మరో యింటి కెళ్ళడానికి వీలులేదు.”
సుజాత వారి సంభాషణను కనిపెడుతూనో వుంది.
"రాను బావా! తప్పుకుండా అల్లాచెయ్యి. ఇంట్లోవదలి, తాళం పెస్పేసి, మళ్ళీ రాత్రి పదిగంటలకే
దర్శనం ఇస్తారు.”
"అయితే మావాడి రాకపోకలమీద కన్నోసే వుంచావన్నమాట. "
కల్యాణి చిరునవ్వు నవ్వింది.
"మీకోసమే ఆయన్నీవేళ నిలేసింది. లేకపోతే పావుగంటకిితమే సైకిలు ఎక్కివుండేవారు. "”
వెంక్కటావు తల అడ్డంగా తిప్పేడు.
"గోపాలం నా స్నేహితుడని సుజాతకేం తెలుసు! నాకోసం నిలేసిందంకే నో వొప్పుకోను. తనకోసమే
నిలేసివుంటుంది. "
వెంకటావు రాజగోపాలం ముఖంవంక చూశాడు. అక్కడ వుత్సాహం కనబడలేదు. సుజాత కోపం
నటించింది.
"మీతోనే ప్రపంచం వుందనుకోవడం మీ మగాళ్ళు. ...”
ఆమె సగంలో ఆగిపోయింది. తర్వాత మాట అనడానికి సాహసించలేకపోయింది. వెంకటావే
అనేశాడు.
"త్రాగులంటావు. అనకుండా మానోసేవు. మాటలు కొంచెం నర్చుకొంటున్నావన్నమాట .”
నలుగురూ నవ్వేరు.
"ఇంట్లోకి నడవండి. వాకిట్లో ఈ నిలువుజీతం ఏమిటి?”
రామలక్ష్మమ్మ వసంతచేయి పట్టుకొని దారితీసింది. ఆమె మెప్పెక్కుతూ వెనుతిరిగింది.
"మీ నేస్తాన్ని ఆపండి. కాపీ త్రాగి వెడతారు.”
"నీ రాకతో నా కాఫీ చల్లారిపోయింది. ఒక్క నిముషం ఆలన్యమైతే. ...”
"ఏమీ చల్లారలేదు, రండి” అని కల్యాణి ఆహ్వానించింది. రామలక్ష్మమ్మ సిద్దంగావున్నా టిఫినుమాట
జ్ఞాపకంచేసింది.
"అలాగే పిన్నిగారూ! ”
రాజగోపాలం తనవాటా తెరిచి మిత్రుడినాహ్వానించాడు. వెంక్కటావు అతనికి నమస్కురిస్తూనో వెనక్కి
తిరిగి మరదల్ని పిలిచేడు.
వసంత వచ్చింది.
"వ్రాల్లెలితో కబుర్తుచెప్తూ నన్ను మరచిపోకుమీ. ”
వసంత నవ్వింది. అక్కకుబదులు సుజాత సమాధానం ఇచ్చింది.
"నీసంగతేదో మీ 'హోనుు! చూసుకోవలసిందే. నీకూ, మాకూ రామ్ రామ్.”
రాజగోపాలం మిత్రుడికి దిలాసా ఇచ్చేడు.
"ఏమోయ్ ఇంట్లో అయితే నీకు కాపీనీళ్ళే గతి. నడు హోటలుకి. "”
ఆ ఇద్దరి సలహాలూ, ప్రతిపాదనలూ వెంకటావుకు నచ్చలేదు.
"మా దంపతులనిల్లాగ వేరు పెట్టించడం మీకు క్షేమంకాదు సుమా.”
వసంత రెండు గ్లాసులతో మంచినీళ్ళు తీసుకువచ్చింది. సుజాత గద్దించింది.
"బాగుందే. వాళ్ళని వీధిలోంచే అల్లాగ పంపేద్దామనా. లోపలకి పిలు.”
వసంత నవ్వుతూ కాలు లోపలికి తీసుకొంది.
"ఇది మనిల్టుకాదు. రండి.”
వెంకటావు అంగీకరించాడు.
"ఎవరింట్లో వారి అలవాట్లు పాటించవలసిందే. రావోయ్. ”
పద్నాలుగో ప్రకరణం
రాజగోపాలం తన వాటాను మిత్రుడి ఆధీనంలో పెట్టి బయలుదేరేడు. అతడు గుమ్మంలోంచి
దిగుతుండగా కల్యాణీ పలకరించింది.
"ఈవేళ సాయంకాలం నలుగురం కలసి సరదాగా భోజనం చేద్దాం. హోటలుకి వెళ్ళకండి. పెందరాళే
వచ్చెయ్యండి.”
గుమ్మం దిగుతుండగా కల్యాణీ మామూలుగా వచ్చి ఏదోమాటలు పెటి ఆలస్యం చేయడం
అలవాటయింది. అతని మనస్సు ఆ సాక్షాత్కారం
కోసం ఎదురుచూస్తూంది. ఈవేళ ఇంట్లో ఇంతమంది వుండడంచేత ఆమె కనబడదేమో
ననుకున్నాడు. కాని, వచ్చింది. అతని మనస్సు ఆ
ఆహ్వానానికి ఉరకలే వేసింది.
"విందు మీరు చేస్తున్నారా? సుజాతా?”
ఆ పప్రయత్నమంతా సుజాతదేనని కల్యాణి చెప్పింది.
"నేను మీ చెవిని వెయ్యకుండానే వెళ్ళిపోతారేమోనని. ...”
రాజగోపాలం నవ్వేడు.
"నాతో మాట్లాడనివారింటి విందుకు నో రావడం....”
నుజాత కోపం అభినయించింది.
"ఆవిడ మనస్సులోని ఆలోచనలన్నీ నాకు అంటకడుతూంది. అదేం నమ్మకండి.”
"మీ మాటలకేం గాని, మీ స్నేహితుడితో మీరూ వుండాలిసిందే. "
వెంకటావు గుమ్మంలో నిలబడి వారి సంభాషణలని గమనిస్తున్నాడు. సుజాత మాటకు అతడు భయం
ప్రకటించాడు.
"అంకఠకేు నువ్వురాకపోతే నాకూ అన్నం పెట్టరన్నమాట. బాబ్బాబు! మధ్యని నేను మాడిపోతాను.
ఎక్కడున్నా నువ్వు
వేళకందుకోవాలోయ్ ! ”
రాజగోపాలంకూడా హాస్యధోరణి నందుకున్నాడు.
"అయితే నువ్వునాకు 'హాస్టేజి' వన్నమాట.
కల్యాణి నవ్వింది.
"ఏమి చేదు మేస్తున్నారండి. విందుచేస్తాం రమ్మంకేు శ్రమయట. హాస్టేజియట.
రాజగోపాలంకూడా ఆమెతో నవ్వుకలిపాడు.
బయలుదేరేముందు వెంకటావు" ఈరోజుకు సెలవుపెట్టలేవాా” అన్నాడు.
"నాకు పనిలేదు. కాని, మరొకరికోసం ఈ వేళ పనికి వెడుతున్నా. త్వరగానే వస్తా.”
"మళ్ళీ రాత్రిబండికే వెడతాం. త్వరగా రా.”
"ఎక్కడికెడతావులే. ”
అది అభ్యర్హన కాదు. విశ్వాసం. మిత్రుని ఆదేశం. సుజాతా మాట కలిపింది.
"రావడంవరకే నీ యిష్టంగాని వెళ్ళడం మా యిష్టం.”
వెంక్కటావు హాస్యమాడేడు.
"ఆ 'మా'లో రెండో మనిషి ఎవరు? రాజగోపాలమా?”
రాజగోపాలం ఆ 'మా'లో కలియడానికి ఒప్పుకోనట్లు సమాధానం ఇచ్చాడు.
"మా కేవలం బహుత్వుబొధకం. కల్యాణి వున్నారు. మమ్మ్శగారున్నారు.”
వెంకటావు సుజాతవేపు చూసేడు. కాని ఆమె అప్పుటికే వెనుతిరిగి లోపలికి అడుగు పెడుతూంది.
పదిహేనో ప్రకరణం
వెంక్కటావు మిత్రుని గదినంతనూ కలయచూసేడు. బహ్మచారి గది అయినా పరిశ్తుభంగా వుంది.
మిత్రుడి అలవాట్లు నెరిగి వుండడంచేత
అతనికి ఆశ్చర్యం కలగలేదు. కాలేజీ హాఫ్టలులో అతని గది ఎప్పుడూ పరిశ్తుభంగా వుండేది.
తనతోపాటు రెండోవాడు కూడా
పరిశ్తుభతను పాటించకుంకే ఒప్పుకొనేవాడు కాదు. చొక్కాలు మంచంమీద వుండకూడదు. పుస్తకాలు
మంచం,[క్రింద వుండకూడదు. చదువుకొన
శుబిలు మీద దువ్వెనా, కూర్చునే కుర్చీ వీపున తడితుండూ, తలుపున చొక్కావంటి వతనిగదిలో
ఎవ్వరూ చూసివుండరు.
అదే గది. వున్న తేడా అల్లా పుస్తకాల సంఖ్య. నాలయిదు ఆల్విన్ రాక్ లు గోడలకు తగిలించీ,
గోడలనానించీ నిలబెట్టే
వున్నాయి. వాటి నిండుగా పుస్తకాలు, మంచం తలాప్రున వున్న కేబుల్ మీద వరసలో పేర్చిన
పుస్తకాలు. అన్ని పుస్తకాలు
వెంకట్రావు వ్యక్తుల ఇళ్ళలో చూడలేదు.
"ఈతనికి పుస్తకాల పిచ్చి బాగా ఎక్కువయిందన్న్నమాట . "
వెనకనే వున్న వసంత సమాధానం ఇచ్చింది.
"ఇతర పిచ్చిలకన్న పుస్తకాల పిచ్చి మంచిదేకదా! ”
"అంత భయంకరమా! తెగచదవడమేనా? ఫలానా విషయం అనిలేదు. ఏ పుస్తకం దొరికినా
అడ్డపడతాడు. ఇప్పుడెలావున్నాడోగాని. *”
సుజాత కూడ అక్కడేవుంది.
"అక్కకి బాగా తెలుసు. వాళ్ళిద్దరూ ఏవేవో పుస్తకాల గురించి వాదనలు వేసుక్కూర్చుంటారు. ”
అతడేం మాట్లాడలేదు.
"ప్రుస్తకాలు కొనడమేనా, చదవడం ఉందా?” అనిపించింది. తిరిగేసేడు. అన్ని పుస్తకాలూ గుర్తు
తెలియలేదు.
వెంకటావు ఒక్కొక్క పుస్తకమే తీశాడు.
"రుచులు మారేయి"” అనుకొన్నాడు.
కుబిలు మీదున్న పుస్తకాలన్నీ తెలుగువి. కొత్తగా వస్తున్న నవలలన్నీ అక్కడున్నాయనిపించింది.
వాటి మీద తేదిలు
వేసివున్నాయి. అన్నీ ఆ యింట్లోకి వచ్చింతర్వాత కొన్నవే. ఒక తెలుగునవలమీద కల్యాణి సంతకం
పెట్టి వుంది. దాని నావిడ
బహుమతి చేసింది కాబోలు ననుకొన్నాడు. ఆ పుస్తకంలోనే ఆమె ఫోటో కార్లు సైజుది వంది.
అయితే ఆమె సంతకం వున్న పుస్తకాలు అయిదారు వుండడమూ అన్నింటా ఆమె ఫోటోలు వుండడం
చూశాక మిత్రుని అభిమానం అర్దం
అయిందనుకొన్నాడు. అయితే అది ఏక పక్షమా? ఉభయతా వుందా?
వసంత గదిలోకి రావడంతో అతడా పుస్తకాలను సర్దేశాడు. అతడు పుస్తకాలు సర్పుతూండడం గమనించి
ఆమె వ్యాఖ్యానించింది.
"ఎవరన్నా బాగుందంకే సరి వెంటనే బజార్లో కొనితెస్తారుట. ”
"ఎవరన్నారట?”
17 సుజాతే య!
కాని, సుజాత బాగున్నదనడంచేత కొన్న పుస్తకం ఒక్కటీ లేదనిపించింది. కాని మైకి ఆ మాట
అనలేదు.
"అంకేు సుజాత పుస్తకాలను గురించి మాట్లాడేటంతగా చదువుతూందన్నమాట . ”
నుజాత చదువు కేవలం కాలక్రేపం చదువు మాత్రమే. తండికి ఆస్తి బాగా వుంది. అక్కడినుంచి
బయట పడ్రానికిదో దారి. అంతే,
తండికో బలహీనత. తాను చదువుకో లేదు. తన సంతానం అంతా బాగా చదువుకోవాలని ఆయన
వూహ. కంటాక్టరుగా బాగా సంపాదించేడు.
కొడుకులు ముగ్గురు పెద్ద చదువులు చదివి మంచి వుద్యోగాల్లో వున్నారు. ఒక కొడుకు అమెరికాలో
చదువుకొచ్చేడు. కూతుళ్ళు ఇద్దరూ
ఆయన కోరికను పాటించలేదు. పెద్ద కూతురు వసంత బి. ఏ. చదువుతూ _పేమ వలలో చిక్కింది.
పెళ్ళి చేసుకొని చక్కగా
మగడితో కాపరం చేస్తూంది. రెండో ఆమె మీద ఆయన ఎంతో ఆశ పెట్టుకున్నాడు.
(చసేమ-అనురాగం చిన్నతనంలోనే చదువుకు అథఢం రాకూడదని విధవ చెల్లెల్ని తోడిచ్చి కాపురమే
పెట్టించాడు. తన వివాహానంతరం
కొద్ది రోజుల్లోనే మరదలి స్వభావాన్ని వెంకటావు గ్రహించేడు.
"కల్యాణి వుందిగా. దానికా యావ విపరీతం. దాని ప్రక్కనుంకే రాళ్ళక్కూడా
చదువుకోవాలనిపిస్తుంది. ”
ఈమారు మిత్రునిగదిలో పుస్తకాలు ఎల్లా చేరేయో అర్ధం అయింది.
"ఆమె ఏం చదువుతారు ఎక్కువగా?”
"ఏం చెప్పును?”
"నిజమె చెప్పు.”
"అంకే....”
"ఆమెకు వేని మీద అభిమానమో...”
"ఇంగ్లీషు పుస్తకాలూ చదువుతుంది. కాని తెలుగంకే అభిమానం. వాళ్ళ నాన్నగారు కాంగెసువాదట.
"అంకే-- ఈవిడ కమ్యూనిష్టా?”
"కమ్యూనిష్టులకిగాని తెలుగు పట్టదనా?”
"ఏం చదువుతూన్నారంకే వాళ్ళ నాన్నగారు కాం[గెసు వాదంటావేం?”
"ఆయన పనికట్టుకు సంస్కృతం చెప్పించారట.”
"గాంధీగారి మాట (ప్రకారం ఆయన చిన్నప్పుడు కాలేజీ వదిలేసి వుండాలి. *
"సంస్కృతం చదవాలనే వాళ్ళంతా చిన్నప్పుడు కాలేజీలు వదిలి వుండాలనే సిద్ధాంతం. ..... ॥7
వెంకటావు నవ్వేడు. తాను వేసిన వికట ప్రశ్నకి ఆమె బదులు తీర్చింది.
"గాందిగారు స్కూళ్లూూ, కాలేజీలూ, కోర్దులూ వదలమన్నది ఒకందుకు; వీళ్ళు అర్దం
చేసుకొన్నదింకొకటి. అసలు భాషకూ, విద్యకూ
స్వంతం అనీ, పరాయి అనీ విశేషణాలు తగిలించేరు. పరాయి భాషలూ చదువులూ మాని
మనదంటూ సంస్కృతం మీద పడ్రారు. కొన్నివేల
మంది జీవితాలు పాడయి శుదభఛాందసులు తయారయాక గానీ మన భాష అనే సంస్కృతం మరణించి
చాల కాలమయిందనీ ఆ (ప్రేతాన్ని
కౌగలించుకొని ప్రయోజనం లేదనీ అర్దం కాలేదు. మళ్ళీ కాలేజీలకు ఎగబడ్డారు. ”
"మన భాష చావలేదు. అది సంస్కృతం కాదు. ”-అని వసంత అడ్డుకుంది.
ఆమెది తెలుగు అభిమాన శాఖ. ఆ భాషను గురించి ఆమెకు కొన్ని అబ్మిప్రాయాలూ, అభిమానాలూ
వున్నాయి. వెంకటావు ఎరుగును. వెంటనే
తన పొరపాటును సర్హుకొంటూనేో ఆమెను ఎగతాళి పట్టించాడు.
"మనకు ఉత్తర-దక్షిణాలు లేకుండానే చేసిన భాషను మనదనడం పారపాళశు."
తెలుగు భాషలో ఉత్తర- దక్షిణాలు తెలిపే పదాలే పోయేటంతగా సంస్కృతం మన భాషను
అణచివేసిందని వసంత విచారం.
"ఒక మహానుభావుడు సాహిత్య అకాడమీలో స్థానం కోసం రాతికి రాత్రి జానోదయం అయిందన్నాడు.
అంతవరకూ (ద్రావిడ భాషల్లో
తెలుగొకటి అన్నవాడల్లూ ఆ జ్ఞానోదయం అయాక తెలుగు సంస్కృతంలోంచి పుట్టిందన్నాడు. మీరు
మరో అడుగు ముందుకు వేసి సంస్కృతమే
మన భాష అంటున్నారు. అకాడమీ అధ్యక్షత మీదగానీ చూపు పడిందేమిటి?"
వెంక్కటావు నవ్వడంతప్పు సమాధానం ఇవ్వలేదు. వసంత అతనిని చేయిపట్టుకుని కుర్చీనుంచి
లేవదీసింది.
"రేవండి. భోజనానికి.
"అదే అనుకొంటున్నా. మీరంతా భోజనాలు కానిచ్చేసి, నా కాకలి లేదనుకొంటు....”
"మీకా అనుమానం ఎందుక్కలిగింది? మీ మగతనానికి అవమనం జరగనిస్తామా?”
వెంక్కటావు కదిలేడు.
"మనం నల్ఫురం కలిసేనా?”
"ముందు మీరు...”
"వద్దమ్మాయి! ఆకలితో మీరు పిల్లుల్లా చూస్తూంకు నాకు ముట్ద దిగదు.”
"మేం ఎదటపడంగా. అత్తయ్యదే వడ్డన."
"నువ్వు ప్రక్కన లేకుంకు ముద్ద....”
"కల్యాణి ఏమనుకుంటుంది?”
"అందుకే నల్గురం కూర్చుందాం. *
"కల్యాణి సిగుపడుతుందేమో?”
"నీ మాట చెప్పు.”
ఆమె కేమన్నా అభ్యంతరం వుందేమో వెంకటావు సరాసరి కల్యాణినే అడిగాడు. ఆమె నవ్వింది.
"ఆడవాళ్ళు ముగ్గురు భోజనానికి కూర్చున్నారంకే కొన్ని దశాబ్దాల గాథలూ, దేశ విదేశాల చర్వితలూ
కబుర్లలోకి వస్తాయి.
భరించగలమనుకుంకేు...”
సుజాత బావను హాస్యమాడింది.
"ప్రోనీలే, నిన్న కొన్న కొత్తచీర బావకి. .”
వెంక్కటావు నవ్వాడు.
"మై వేషం వేయిస్తావు సరే...”
"దానితో వాదులాడ్డంలో మీకు ఆకలి తోచేలాగ లేదే”-అని వసంత అతని వార్లోరణికి అడ్డుకట్ట
వేసింది.
కల్యాణి నవ్వింది.
"వేషం మారిస్తే స్వభావం మారుతుందా?”
"అంకఠకే కథలూ, చర్మితలూ మాకు పట్టవనా?”
సుజాత చటుక్కున అందించింది.
"అబ్బో! ఆడపిల్లల కథలూ, వాళ్ళని ఏడిపించిన చరిత్రలూ చెప్పుకోవడం మీ తర్వాతే...”
వెంక్కటావు మాటలు పూర్తి చేయకుండానే సుజాత అందుకుంది.
"మా కథల్లో మగవాళ్ళు 'విలన్లు! . అంతే."
"జీవితంలోనేగాని మీ కథల్లో హీరోలు వుండరంటావు. ”
అతని మాటలోని మెలికను వెంటనే అందుకోలేక సుజాత నోరు తెరిచింది. వెంకటావు నవ్వేడు.
"అయితే ఒక్కమాటన్నా మా ప్రతాపం మీ నోట వినవలసిందే. "
రామలక్ష్మమ్మ వచ్చి అందర్నీ భోజనాలకు పిలిచింది.
"కల్యాణమాా! నువ్వు కూడా రామ్మా! ”
వసంత, కల్యాణీ ఆమెకు సహాయం చెయ్యడానికి వెంట వెళ్ళారు.
భోజనాల గదిలో అడుగుపెడుతూ వెంకటావు తన వెనకనే వున్న సుజాతను భార్యకు చూపించేడు.
"చీర సింగారించినా మీ చెల్లెల్నై మగరాయడే ననుకొంటారు సుమా!”
అతడామాట ఎందుకన్నాడో అందరికీ అర్దం అయింది. నవ్వేరు. సుజాత అెక్క చేయలేదు.
"నువ్వు తినో పిట్ట తిండికి నలుగురు వడ్డించాలా ఏం బావా?"
”నీ చేత వంట చేయించాలంకే నీకో బకాసురుజ్లీ వెతకాలన్న మాట.”
"౭బకాసురుడూ, కీచకుడూ....”
వెంక్కటావు మరదలి మాట ప్తూర్తి కానివ్వలేదు.
"మగాళ్ళలో తెగలంతే నంటావు?”
సుజాతకు బాగా కోపం వచ్చేసింది.
"కారుంకే కొందరు బృుహన్నలలూ, మరికొందరు గోపాలకృష్లులున్నూ ."
మాట జారాక సుజాత నాలుక కరుచుకొంది. వసంత విదలించింది.
*ఏమికే నువ్వు మరీను.”
అక్కు గదమడంతో సుజాత గమ్మునైపోయింది. వెంక్కటావు వదలలేదు.
"మీదీవిడ చేత మహా భారతం కంరోపాఠం చేయించినట్లుందే. ...”
"అక్క చెస్తేగాని ఏం చదవాలో తెలియంది మీ మిత్రుడికి. ...”
వెంక్కటావు ఆమె వేపు ఓరగా చూసి తల పంకించేడు.
"అయితే అతని పనులన్నింటిమీదా గట్టినిఘాయే వుంచావన్నమాట. "
కల్యాణీ చిరునవ్వుతో తల తిప్పుకొంది. వసంత తన అసమర్దతను ప్రకటించింది. "అబ్బు!
ఏమిటండీ! దానితో పాటు మీరూ చిన్న
పిల్లలయిపోతున్నారు. ”
"అవిడ అక్కగారిని పెళ్ళి చేసుకొన్నాను గదా యని ముసిలితనం వచ్చేసిందంటావేమిటి?*
ఇంతలో వీధి గుమ్మం వద్ద ఎవ్వరో పిలిచినట్లయి అలా మాటలు నిలిపేరు.
"గోపాలం గారు వచ్చారేమో” అంది కల్యాణి. కాని ఎవరిదో కొత్త గొంతు తనకోసం వాకబు చేస్తూంది.
"కల్యాణి గారున్నారా?”
"నీకోసమే%” నంది వసంత.
రామలక్ష్మమ్మ వచ్చిన వారిని కూర్చోబెట్టింది.
” పేరేమిటన్నారు?”
"కృష్ణవేణీ. వారు నన్నారుగరు. భోజనం చెయ్యనివ్వండి. కూర్చుంటాం.”
కల్యాణి కా పేరు కొత్తగా తోచింది. భోజనం ముగించడానికి తొందరపడుతుంకే వెంక్కటావు వారించేడు.
"కూర్చున్నారు గదా! ఎందుకంత తొందర?”
రామలక్ష్మమ్మ లోనికి వచ్చి కృష్ణవేణి వచ్చిన పని చెప్పింది.
"పేరంటానికి పిలువ వచ్చారు.”
కల్యాణి గుర్తుచేసుకొంది.
"మా స్తూడెంటు ఘైోమకు పెళ్ళి అన్నారు. బహుశా ఆమె అక్కగారు వచ్చి వుంటారు."
పదహారో ప్రకరణం
మిత్రుని గదిలో ఒక నిద తీసి లేచేసరికి వసంత కాఫీ కప్పుతో హాజరయింది. భార్యా భర్తలిద్దరూ కాఫీ
తీసుకుంటూ కబుర్లు
చెప్పుకొంటున్నా, వారి మనస్సులలో రాజగోపాలాన్ని గురించిన ఆలోచనలే సాగుతున్నాయని ఇద్దరూ
త్వరలోనే గ్రహించగలిగేరు.
"మీ మిత్రుడెవరు?”
వెంకటావు భార్య ప్రశ్న అర్దం కానట్లు నటించేడు.
"వర్కుషాపులో మెకానికల్ ఇంజనీరు.”
మగని కొంకశదనానికి వసంత ఆనందించింది. ఈ మారు స్పష్టంగానే అడిగింది.
వెంకటావు కనుబొమ్మలెత్తేడు.
"ఏం కథ?”
వసంత మనస్సు విప్పలేదు.
"వ్రూరికెనో. ..”
వెంక్కటావు మాట్లాడలేదు. వసంత అందించింది.
"త్రాలియదోయ్. ”
"అఖతిశయాలు పోతారు.”
వెంకటావు ప్రశ్నార్హకంగా చూసేడు.
"డబ్బులేదు. లేనివారికులం ఏదైతేనం?”
"మీకున్న డబ్బేమిటో....”
వెంకటావు నవ్వి భార్యను చేరదీసుకొని ముదు పెట్టుకొన్నాడు. వసంత అతని కౌగిలిలో వొదిగింది.
"నువ్వున్నావు. నాకు డబ్బు మాట సమస్య కాలేదు.”
శేఖరం అల్తుడికి డబు్పు వుండవలసి వుంటుందనే విషయంలో అశ్రద్ధ చూపలేదు. సత్యాగ్రహాలు,
కృష్ణ జన్మస్టాన గమనాలలో
ఆస్తి పోయి కుటుంబం తిండికి కటకటపడిన ఘట్టాల నాతడు మరవలేదు. అందుచేత వెంకటటావు
ఆస్తిపాస్తుల సంగతి వాకబు
ప్రారంభించేడు. ఏమీలేదని విన్నాక పెదవి విరిచేడు. కాని వసంత వూరుకోలేదు. ఆ పెళ్ళిని
సాధించితీరింది.
"ఎవ్వరైనా అంతే...”
"ఏం మరదలు కన్నోసిందనే అంటావా?”
వసంత కళ్ళు తెరిచింది.
"అటువంటిది మా యింటా వంటా కూడ లేదు.”
"నోనెరుగనా యేమిటి?”-అన్నాడు వెంకటావు ఎగతాళిగా.
"ఏం ఎరుగుదురు?” అంటూ వసంత కీర చూపులు చూసింది.
"మొదటిమాటు నిన్ను పలకరించినప్పుడు మంచి నడి శీతాకాలంలో ఐస్ క్రీం నోట పెట్టుకొన్నంత
ఆనందం అయింది."
వెనుకటి జ్ఞాపకాలకు వసంత నవ్వింది. అతని ఒడిలోంచి లేచింది.
"మిత్రులిద్దరూ ఒకే జాతి పక్షులా?”
"వాళ్ళు చెత్తరెయ్యలు. ” (క్షత్రియులు)
తన ప్రశ్నకది సమాధానం కాకున్నా మరో ప్రశ్నకు కావలసిన సమాధానం వచ్చింది. ఒక్క క్షణం
వూరుకొంది. మరల ఏదో
అనుమానిస్తూనే అంది.
"మన వాళ్ళేమో ననుకొన్నా.”
"మన కులంలోవాళు్రు తప్పు మగవాళ్ళు కారా?”
వసంత ఏమీ అనలేదు. వెంకటావు ఓ నిముషం వూరుకొని మళ్ళీ అన్నాడు.
"ఈ రోజుల్లోకూడా కులాన్ని పట్టి మనుష్యుల మంచి చెడ్డల్నె ఆలోచించే ధోరణి. .... 7
వసంత సగంలోనే అందుకొంది.
"అదేం మాటండీ.
"ప్రోనీ, నీ మాట చెప్పరాదూ?”
వసంత ఏమీ అనలేదు.
"మన అనుమానం నిజమేనా?”
వసంత తల తిప్పింది.
"చెల్లాయి చూప్తు అటున్నహ్తే తోస్తుంది."
అక్కు-బావకూ ప్రతి పదిహేనురోజులకీ ఓ మారు వ్రాసే జాబుల్లో సుజాత గత అయిదారుమాసాలుగా
రాజగోపాలం అనే ఇంజనీరు ప్రసక్తి
ఏదో విధంగా తెస్తూండడం వారు గమనించారు. రాజగోపాలం అనే ఇంజనీరూ, తాను రాజబాబు అనే
మి(త్రుడూ ఒకరేనని తోచకపోయినా అతని
అలవాట్లను గురించీ, మాటలూ-చేతలూ గురించీ వ్రాస్తున్నదేదో పరిచితం అయినట్లే తోచింది
వెంక్కటావుకు. అన్ని మాట్లు ఆ పేరు
ఎత్తి వ్రాస్తుంకే ఇద్దరికీ ఒకే ఆలోచన మెదిలింది. కాని ఆ మాట గట్టిగా అనుకోలేదు. ఏమంకే ఆ
రాజగోపాలం ఎవరో,
ఎలాంటివాడో, వివాహితుడో ఏమో. మైగా కాంగైసువాడైనా త్న మామగారికి కులాభిమానం, పట్టుదలా
హెచుు. వాటిని గురించి కొంతవరకైనా
తెలుసుకుంకేు తప్పు సుజాతకు ఆ ఆలోచనను సూచించను కూడ రాదు.
ఇద్దరూ ఈవేళ కలిసి ఇక్కడికి రావడంలో ఆ ఆలోచనే ప్రథమ స్థానం ఆక్రమించింది. తాను
మోద్రాబాదు ఏదో పనిమీద
వెళ్ళవలసి వచ్చింది. పది పదిహేనురోజులవుతుంది. వసంత తానూ వస్తానంది. అతడు తిరిగి
వచ్చేవరకూ వసంత బెజవాడలో
వుంటుంది. పరిస్థితులు గమనిస్తుంది. తిరిగి వచ్చేటప్పుడు వెంకటావు దిగుతాడు. అప్పుడేం
చెయ్యాలో ఆలోచిస్తారు. కాని, ఇక్కడ
పరిస్థితులు చూస్తే ఒక కొలిక్కి వచ్చి కూర్చున్నట్లనిపించింది.
వెంక్కటావు ఒక్క క్షణం వూరుకున్నాడు.
"సుజాత కాయన తప్పు మరో చూపే లేదు” అంది వసంత.
"కల్యాణి ఎరుగునా?”
తన చెల్లెలు ఆలొచనలు కల్యాణికి ఎందుకు తెలియాలో వసంత కర్టం కాలేదు
"గోపాలం అభ్నిపాయం..... 7
"ముందు మా నాన్న ఒప్పుకోవాలిగదా!
వెంక్కటావు ఆచి ఆచి స్పష్టంగా చెప్పేడు.
"కొనబోయే గేదె, పెట్టబోయే బచ్చులిపాదులా వుంటుంది మన వాదం. ఒక్కటి గుర్తుంచుకో. నీ
చెల్లెలు నువ్వు కాదు. దాని మనస్సులో
ఓ ఆలోచన పడింది. ఆ పని సాధించేటందుకు నీలాగ వెనకా ముందూ ఆడదు.”
వెనుకటి స్టూతులు వసంతను గిలిగింతలు పెశ్వేయి. వసంత వెంకటావును వివాహమాడడానికి
ఒప్పుకొన్నా తండి ' సై! అననిదే ముందుకు
అడుగు వెయ్యనంది. వెంకటావుకు ఆస్తి లేకపోవడం తప్పు కులం పేటి లేకపోవడంచేత ఆటంకం
కలగలేదు. ఆమె కాస్త గట్టిగా
చెప్పేసరికి ఆయన మెత్తపడ్డాడు.
"నాదే వేరుకులం అయివుంకే మన పెళ్ళి జరిగివుండేది కాదు"”- అని అతడు చాలా మార్తు భార్యను
దెప్పేడు.
"ఇంతకాలం పెంచిన వాళ్ళని కాదనడం ఎల్లాగండి?”-అని విస్తపోవడం తప్పు ఆమె వద్ద మరో
సమాధానమూ లేదు.
"అలా జరిగివుంకు ఏం చేసేవారు?” అని ఆమె ప్రశ్న.
"నీ ఇంట్లో మకాం పెట్టి, కాపురం చెడగొట్టి లేవదీసుకు తెచ్చుకొనోవాడిని. ”
వసంత అంత భయంకరమైన పనికి ఒప్పుకొని వుండేది కాదు. ఆ మాట చెప్పుడానికి సందేహించనూ
లేదు.
”"ఏడాదో రెండేళ్ళో బాధగా వుండేదేమో, తర్వాత బహుశా మీ గుర్తే రాకపోవచ్చు.”
వసంత చెప్పింది నిజమని వెంకటావుకూ తెలుసు. అది అంతే జరిగివుండేది. అయినా ఆ మాట
విన్నప్పుడు మనస్సుకు కష్టమే
కలిగింది.
"మరచిపోనిచ్చే వాడినని నీ వాహ”
జరిగివుండని పరిస్టితులని వూహించుకొని ఆ దంపతులు అనేక పర్యాయాలు తమ మనస్తత్వాల్ని
తిరగేసి నవ్వుకున్నారు. వెంక్కటావు
అదే జ్ఞాపకం చేశాడు.
"నవ్వుతాలు కాదు. కులం పట్టింపు మీనాన్న కుండొచ్చు. నాన్న పట్టింపు నీకుండొచ్చు. కాని మీ
చెల్లెలి కదేం పట్టదు. మీనాన్న
నోరు నొక్కగలది అదే.”
చెల్లెలు తన మగడు వూాహిస్తున్నంత మొండి కాదని వసంత అంది.
"మొండితనం మాట నేను చెప్పులేదు. ఆ మధ్య నీకీ వ్యాసం చూపా, గుర్తుందా?”
కాలేజీ చదువులు, యూనివర్శిటీ పరీక్షలు, హాఫ్టళ్ళలో జీవనం, హోటళ్ళలో భోజనం ఇవన్నీ
దేశంలోని వివిధ కులాల వారి
సంస్కార భేదాల్ని చదును చేసేస్తున్నాయి. కులాన్ని మాటల్లోనే తప్పు సంస్కారంలో కనబడని
నూతనతరం తయారవుతోంది. శరీర
నిర్మాణానికి సంబంధించినంతవరకు న్నీగో+-మంగోలియను, ఆర్యను- సెమెటిక్ జాతుల మధ్య
కనపడేపాటి కొద్దిపాటి భేదాలవంటివి కూడా
మనదేశం లోని కులాల మథ్య లేవు. ఈ నూతన యుగంలో కులభేదాన్ని చూడడం ఒక మానసికమైన
జబ్బు- అనేది ఆ వ్యాసకర్త
భావం.
"దానినామధ్య కత్తిరించి పంపించా. దానికి ఏం వ్రాసిందో చూశావుగా! మనం వ్రాసేవరకూ కులాల
మధ్య అంత పేచీయే వుందని
ఎరగనంది. దాని మనస్తత్వం వేరు. నాకు తెలుసు. కాని ఇక్కడున్న సమస్య వేరు. అతని
ఆ విషయం ఇదరికీ తెలియదు.
పదిహేడో ప్రకరణం
పెళ్ళికూతురు వేషంలో గుమ్మంలోకి ఎదురువచ్చిన మైమవతిని కల్యాణీ గడ్డం పుణికి పలకరించింది.
సిగ్గుతో రెప్పలల్లారుస్తూ,
తలవంచుకుని మకైోమవతి ఆమె ప్రక్కనే వత్తుకొని లోనికి నడిచింది.
కల్యాణి వెంట వచ్చిన వసంతనూ, సుజాతనూ, కృష్ణవేబీ ఆహ్వానించింది. కల్యాణి రాకకోసం తన
చెల్లలు పడుతున్న ఆదురద్దాను
వివరించింది. కల్యాణి ఆమె యుడ జాలి చూపింది.
"వెర్రి పిల్ల.”
"పెళ్ళి నాలుగు రోజులూ మీరిక్కడనో వుండాలి.” అంది కృష్ణవేణి.
"అయిదు రోజులు పెళ్ళి చేస్తారా?” అని ప్రశ్నించింది. కృష్ణవేణి తలతిప్పింది.
"లేదండీ, ఒక్కరోజే. ఇంకా చెప్పాలంకే ఒక్క గంకేు.”
కల్యాణి సంతోషం తెలిపింది.
"అదే సుఖం. డబ్బు ఖర్చు. శరీరం మైరాణ. అయిదురోజుల పాటు ఒకరు మర్యాదలు చేయడం.
ఒకరు పాందడం అనో పరిస్థితి
ఫలితంగా తగువులు. ఇదే మంచిది. ఇప్పుడు ఐదు రోజుల సెళ్ళి ఎవ్వరూ చెయ్యడంలేదు.
"ఆ రోజులు వేరు, ఆ సరదాలు వేరు. ఇప్పుడెంతసేపు పీటల మీద నుంచి ఎంత త్వరగా
లేచిపోదాం, పెళ్ళాం పక్కలోకి ఎంత
త్వరగా వస్తుందనేగాని ఓ ముద్దు-ముచ్చుటా అని వందా ఏమన్నానా? మా రోజుల్లో ఇల్లాగేనా: పెళ్ళి
అనేది ఒక్క పెళ్ళి కొడుకూ
పెళ్ళి కూతురూ కోసమేనా? అయినవాళుం పదిమంది చేరడం, బంధుత్వాలు జ్ఞాపకం చేసుకోవడం,
సరదాగా ఆ అయిదారు
రోజులూగడపడం....”
కల్యాణి వెనుతిరిగి చూసింది. కృష్ణవేణి పరిచయం చేసింది.
"మా అమ్మమ్మ. హైమను పెంచినదీవిజే. మన హైమ టీచరు వీరే నమ్మా.”
కల్యాణి నమస్కరించింది. ముసలమ్మ చాల సంతోషపడింది.
"అన్నగారిని గురించి తలచనైనా లేదు. మీరు రాలేదని మహా ఇదయిపోతుంది. వచ్చేవు తల్లీ!
మంచి పని చేశావు.”
కృష్ణవేణీ అందరికీ కాఫీలు తెచ్చి యిచ్చింది.
కల్యాణి పెళ్ళి కూతుర్ని దగ్గరకు తీసుకొంది. ముసలమ్మ వెళ్ళిపోతూ అభ్యర్థించింది.
"పసుపు రాయించుకోకుండా వెళ్ళకండి తల్లీ. మన ఆచారాలు ఆచారాలే.”
"అల్లాగే మామ్మగారూ!" - అని కల్యాణి దిలాసా యిచ్చింది.
"మెల్లికొడుకు ఎల్లా వున్నాడు?”
మోమ సిగ్గుపడి తల వంచుకొంది. కల్యాణి గడ్డం పట్పకొని మైకెత్తింది. మోమవతి మరింత సిగ్గుపడి
కళ్ళు మూసుకుంది. కల్యాణి
నవ్వింది.
"నీల మేఘ శ్యాముడా?”
మైమ మాట్లాడలేదు. కాని ఒకరోజున పాఠంలో ఆ శబ్దానికి వ్యావహారిక రూపం చింతబొగ్గు అని చెప్పిన
మాట గుర్తుకువచ్చింది.
నవ్వొచ్చింది. కాని ఆచుకొంది. బిగబట్టిన పెదవుల మధ్య రేఖా మాత్రంగా కనబడుతున్న
మృదుహాసం ఆ వర్సనను నిరాకరించింది.
కల్యాణి వదలలేదు.
"అసలు చూసేవా?”
మైమ అంగీకార సూచకంగా తలవాచింది.
"వచ్చేడన్న మాకేనా?”
మోమ మాట్లాడలేదు. కల్యాణి ఆమె బుగమీద చిన్నగా మీటింది. ఆమె మరింత సిగుుపడి
ఒత్తుకుపోయింది.
"ఏం చేస్తున్నాడు?”
"ఎం.బి.బవి.ఎస్.. మూడో యేడు....”
సన్నగా వినబడీ వినబడకుండా మైోమ అన్నమాటకు కల్యాణి ఆశర్యం వెలిబుచ్చింది.
"ఆయన చదువు సగంలో వంది. నీవీ ఏడాది స్కూల్ మైనలులో వున్నావు. అంకే చదువింకా
ప్రారంభమే కాలేదన్నమాట. ఇప్పుడే
పెళ్ళికింత తొందరేం వచ్చిందమ్మా?”
ఆ (ప్రశ్నకు మమ ఏమీ సమాధానం ఇచ్చింది. ఆమె కంఠం ఎంతో మృదువ)గానే వున్నా, ఆ ప్రశ్న
రావడం కష్టం అనిపించినప్సే
అర్దం అవుతుంది.
"వాళ్ళ అన్నకూడా ఆ మాకే అన్నాడు. అవునుగాని తెలియక అడుగుతాను, బి.ఏ. ప్యాసయితే
మగడిలోటు భర్తీ అవుతుందా?”
సుజాతకు తానుకూడా ఒకనాడీ ప్రశ్న వేసినట్లు జ్ఞాపకం వచ్చింది. దానికి కల్యాణి ఇచ్చిన సమాధానం
సంతృప్తి కలిగించలేదు.
' ఇప్పుడేం చెప్తావు?” అన్నట్లు ఆమెకళ్ళు వుత్సాహంతో దీపించాయి. దానిని గ్రహించినట్లు కల్యాణి
చిరునవ్వు నవ్వింది.
"మొగుడులోటు తీరుస్తుందా అంకు మనం మొగుడినుంచి ఏం కోరుతున్నాము - అన్నదానిమీద
ఆధారపడి వుంటుంది.”
తనకు చెప్పిన పద్ధతిలోనూ, ఇప్పుటి ఎత్తుగడలోనూ తేడా వున్నదని సుజాత [గ్రహించి శ్రద్ధగా
వింటూంది.
ముసలమ్మ మొగమాటంలేకుండా అనేసింది. వయస్సు ఆమెకు శ్రీరామరక్ష.
"ఇన్ని యుగాలనించీ ఆడది మగాడినుంచి ఏం కోరుతూంది? కడుపు-కడుపునకింత తిండీ, కడుపు
నిండిన పిల్లలూ....”
ఆ మాటల్లోని అసభ్యతను కల్యాణి పట్టించుకోలేదు. చాలా జాగ్రత్తగా తూచినట్లు మాట్లాడింది.
"మీరన్నది నిజమే. సూలంగా చూస్తే ఇంతవరకు పరిస్టితి అలాగే వుంది. అయితే ఈవేళ మగవాని
స్థితీ, లోకం తీరుకూడా
మీనాడున్నుట్లు లేవు. ఆడుది కూడా కొద్దోగొప్పో సంపాదించుకోవడం, తనకాళ్ళ మీద తాను
నిలబడుతూ, మగడి సంపాదనకు
వేన్నళ్ళుకు చన్నీళ్రులా తోడు చెయ్యడం అవసరం అవుతూంది.
"డ్రాక్టరీ చదివేవాడుకూడా అన్నం పెట్టలేక, పెళ్ళాన్ని సంపాదించుకోమంటాడా?"
ముసలమ్మ ప్రశ్న విన్నాక తానా చర్చ రేపినందుకు కల్యాణి చింతించింది.
"మైోమ పెళ్ళికొడుకు సమస్య కాదిది. లోకం ఫ్టితి చేప్పేను మామగారూ!
సుజాత తృప్తిపడలేదు. చర్చు మధ్యలో తెగిపోవడం ఆమెకు నచ్చలేదు. అయితే తాననుకొన్న దారికి
తేవడం ఎల్లాగో అర్దం
కాలేదు. అందుచేత ఆ మాటనే సాగతీసింది.
"అదిమాత్రం ఎందుక్కాదు? పెళ్ళికొడుకు ఇంకా డాక్టరు కాలేదుగా?”
డాక్టరుకాని మగడికి ఎస్.ఎస్.ఎల్.సి చదువుతున్న భార్య సంపాదించి పెడుతుందంటున్నట్లనిపించి
ముసలమ్మ నవ్వింది.
"నువ్వెవరి అమ్మాయివో నోనెరుగను. ఒక్క మాట అడుగుతా చెప్పు. తప్పుట్టళీకేం?”
ప్రశ్నలకు సమాధానం అనేటప్పుటికి సుజాత సందేహించింది. కాని వాదం పెట్టుకున్నాక ఎదటివాళ్ళ
శ్రశ్నలు విన ననడం ఎల్లా?
సమాధానం మాట తర్వాత.
"అడగండి. తప్పు పట్టుకోవడం ఏముంది? పెద్దలు తప్పుమాట అనరు."
వసంత గడుస్తనాన్ని మమ గ్రహించింది. తన అమ్మమ్మ మాట తూలకపోయినా, మోటుగా
అనేస్తుంది. అందుచేత తానే అందుకుంది.
"మా టీచరుగారు చెప్పింది నిజమే మరి..... 7
"ప్రోవే భడవకానా. .. నీ సంగతి చెప్తా” నంటూ ఆమె మనమరాలిని గదిమి సుజాతవేపు తిరిగింది.
"అవునుగాని, గునపం లాంటి కురాడొచ్చి పెళ్ళిపీటలమీదికి రమ్మంకే, వుండు ఈ బి. ఏ. సంగతి
ఏదో తేలనియ్యమని
రూర్భొంటావా?”
సుజాత బిడియపడింది. నవ్వింది.
"చదువయ్యేదాకా నోనొప్పుళోను. *
కాని ఆ మాటలో అంత విశ్వాసం కనబడలేదు. ముసలమ్మ ఆ లోకువను పట్టుకొని నిగదీసింది.
"నా దగరెందుకు చెప్తావుగాని, ఇల్లాంటి కబుర్లు ఈ డెబ్బయ్యేళ్ళలో వెయ్యిన్నొక్కమార్లు విన్నా.
మొగుడు నచ్చులేదని గదిలోకి
వెళ్ళడానికి మొరాయించిన వాళ్ళే మొగుజ్లీ మళ్ళీ మంచం దిగనియ్యరు. ” అంటూ ఆమె తన
హాస్యానికి తానో నవ్వుకొంది.
"పోవమ్మా నీ మాటలూ నువ్వూను. వినోేవాళ్ళుం మాకే సిగవుతూంకేు....”
కృష్ణవేణీ మాటలనామె అక్కచేయలేదు.
"మీరంతా అంతే. గదిలో తలుపుచాటున గజ్జెలగ్మురాలు. వాకిట్లో మొగుడిచాటున నంగనాచిలు. "”
కల్యాణీ ముసలమ్మను దారిలోకి లాగడానికి ప్రయత్నించింది. కాని ఆమె వొప్పుకోలేదు.
"చదువైతేగాని పెళ్ళి కూడదు అంకే వచ్చిన మంచి సంబంధం దాటిపోవచ్చు. నచ్చిన వరుడు
దాటిపోవచ్చు. ”
"దాటిపోయే వరుడు నచ్చినవాడైతే మాత్రం ఏం లాభం? ఆమె కతడు నచ్చినా, అతనికామె
నచ్చులేదు. అది తప్పిపోవడం
మంచిదేకదా?”
వసంత వాక్యాన్ని కృష్ణవేణి సమర్దించింది. "అంత దగ్గితేనే వుండని ముక్కు తుమ్ముతే వుండేనా?
దానినం చేసుకొంటాం?”
"చదువైతే గాని పెళ్ళి చేసుకోకూడదనేదీ ఈ పరీక్ష యిస్తేగాని పెళ్ళి పీటలమీద కూర్చోననేదీ ఒక
నిర్పంధం కాదు. సామాన్య
సూతం. ఆకాశదీపం, దానిని బట్టి మనం ఎక్కడున్నదీ తెలుసుకుంటాం. ఎటు పోవాలో
తెలుసుకుంటాం. అంతవరకే. ”
ఇంటికితిరిగి వచ్చేవరకూ వసంత ఆలోచిస్తూనే వుంది. గుమ్మంలో అడుగుపెప్తేసరికి వెంకట్రావు
ప్రశ్నించనో ప్రన్మించేడు.
"అల్లా వున్నావేం?”
సుజాత అనేసింది.
"చదువులో పడి ఇరవై మూడేళ్లు వెళ్ళేవరకూ పెళ్ళి చేసుకోవడం మంచిదా, చెడ్దదాయని తేల్చుకోలేక
విచారపడుతూంది కాబోలు.”
"ఫలానా ఫలానా వాళు భార్యా భర్తలని భగవంతుడు రాసిపారేస్తాడు. సప్త సముద్రాల అవతల
వున్నా వాళు
భార్యాభర్తలవాల్సిందే. మీ అక్కకి కేటాయించిన మగాళ్లి నేను. పాపం ఏం చేస్తుంది? దేవుడు
చేసిందానికి తాను విచారపడ్డం
దేనికి?”
వసంత అతని ఎగతాళికి నవ్వింది.
"డ్రిగీ పుచ్చుకొని మూడేళ్ళాయింది. ఇంతవరకు ఒక్క కాని సంపాదించలేదు. సంపాదిస్తాననే ఆశా
లేదు. మరెందుకు చదివినట్లు?”
"నువ్వే చెప్పు” అన్నాడు వెంక్కటావు.
వసంత ఏదో ఆలోచనలో మునిగివున్నట్లుగా ఒక్కొక్కుమాకే అంది.
"ఆడదానికి చదువు జ్ఞానం కోసమే గాని డిగ్రీకోసం కాదన్నాను. అదే సిసలనిపిస్తూంది. "”
కల్యాణీ ఆమెవంక జాలిగా చూసింది. వెంక్కటావు ఒక్క క్షణం ఆలోచించేడూ.
"ఈ చర్చు ఎందుకు వచ్చిందో తెలియదు. ఆడవాళ్ళుకూడ సంపాదించుకొనే స్థితి వుండాలిసిందేనని
ఛాందనసపు ముసలాళు కూడా
వొప్పుకొంటున్నారు. తమ పిల్లల్ని చదివిస్తున్నారు. మా రత్నం బాబయ్య సంగతి చూసేవగా?
చెట్టంత కొడుకు చచ్చిపోయేడు. ఈ
వేళ ఆ కూతురు స్కూల్ మైనల్ చదువుకుంది గనక ఎక్కడో టాఇపిస్సుగా చేరింది. వాళ్ళు వీధిన
పడకుండా మిగిలారు....”
కల్యాణికూడా ఆమె జిజ్ఞాస సరియైన దారిలో లేదంది.
"చదువు ఆడదానికి డిగ్రీకోసం కాదు. జ్ఞానం కోసం” అన్నమాట ఒక దశలో ఒక రాజీపద్ధతిలోకి
వచ్చింది. ఆడది
చదువుకోవాలన్నవాళ్ళ కామాట ఒక విజయం. అదివాళ్ళు ఆలోచనలకొక సరిహద్దుకూడా. ”
వసంత తల తిప్పింది.
"ఇంక నీ తర్కం అంతా వినిపిస్తావు. కాని, ఇది తర్క విషయంకాదులే తల్లీ! ఇది బీవితం."”
"తర్కం అన్నది జీవితాన్ని అర్హం చేసుకొనేటందుకో ఉపకరణం. దాని నంత సులువుగా
ఆమె అభ్మిపాయం ఏమిటో తనకు తెలియలేదన్నాడు వెంకటావు.
"ఏముంది? అంతవరకూ చదువుకొన్న ఆడది చెడిపోతుందన్న వాడు ఆ మాట వదిలేశాడు.
చదువుకోవడం మంచిదే కాని కాలేజీ చదువు
వద్దన్నారు. కాని మళ్ళీ ముందడుగు పడకుండా బంధం వేశారు.”
వెంక్కటావు తలూపేడు.
"రాను. ఇప్పుడు కాలేజీ చదువులకీ వొప్పుకుంటున్నారు. ఉద్యోగాలకీ వొప్పుకుంటున్నారు. ఉద్యోగం
చెయ్యకపోడం, చెయ్యక్కరలేక
పోవడం వేరు, చెయ్యలేకపోవడం వేరూను.”
పద్దెనిమిదో ప్రకరణం
హైమవతి రిక్రాదిగి గబగబ ఇంట్లోకి రావడంతో వారి చర్చ ఆగిపోయింది. ఆ సమయంలో వచ్చిన
పెళ్ళి కూతురును చూడగానే కల్యాణి
ఆశృర్యపడింది. అందులోనూ తామూ ఆమెను వదిలిందప్పుడేనాయు.
చటుక్కున కల్యాణి లేచింది.
"మీతో పనుండి వచ్చా" నంది హైమవతి. "అక్కడ మాట్లాడదామనుకొన్నా కుదిరింది కాదు.”
ఏదో చాల అవసరమైనదే అయివండాలి, అనుకొంది కల్యాణి. ఇద్దరూ లోపలిగదిలోకి వెళ్ళరు.
సిష్యురాలిని తనతో పాటు మంచం మీద
రూర్చోబెట్టుకొని వీపు నిమిరింది.
"ఏమిటమ్మా! ”
మోమ చాలా సేపటివరకూ మాట్లాడలేదు. కాని, కల్యాణి బుజిగించి చెప్పించింది. ఆ చెప్పిందేమీ
అర్దం కాలేదు.
"మీరు దగరుండాలి. గొడవలేమీ రాకుండా మాట దక్కడం ఎల్లాగో చెప్పాలి. *
కల్యాణి గుచ్చిగుచ్చి అడిగింది.
మధుసూదనంగారికో చెల్లెలుంది. ఆమె మన స్కూలులోనే టీచరు. కమలమ్మ గారు.
"నిజ౦?”
"మీ వాళ్ళంతా చూస్తే చేదస్తులల్లే కనిపించారు. ఈ సంబంధానికెల్లా వొప్పుకొన్నారు?”
పేచీ ఏమిటో కల్యాణికి అర్దం అయింది. కమలమ్మ వితంతు వివాహం చేసుకొంది. అది ఈ
ఛాందనసులకెల్లా నచ్చుతుంది?
"మధుసూదనంగారితో పరిచయంవుందా?”
"ఆయన పట్టుదలమీదనే స్కూలులో చేరా”
కల్యాణి నవ్వింది.
"”గంధథకర్తవే. ఇది మూడేళ్ళనాటి పరిచయం అన్నమాట. ”
హెమ మాట్లాడలేదు.
"ఊఊ. _తర్వాత, నువ్వు చేసుకుంటానంకు మాత్రం కులం ఏమవుతుంది పాపం.”
"ఆయన కట్నం వద్దన్నారు."
"డబ్బు లాభం వస్తే కులంపోయినా సరేనన్నమాట. "
"అలకపానూ, పిలకపాన్పూ వగైరా లాంఛనాలూ, సరదాలూ, సంప్రదాయాలూ కూడ వుండవంది మా
అక్క, గుర్తుందా?”
"జాను. నేనో, వసంతో అవన్నీ అనవసరమే నన్నాం కూడా.”
"అది మధుసూదనంగారిని వెక్కిరించడం. ”
"ఎందుకు?"
"ఆయనే అటువంటి తతంగాలేవీ వద్దని వ్రాశారు.”
"గట్టి క్మురాడులాగే వున్నాడు. కట్నం వద్దని, ఎడంచెయ్యి చాచకుండా! నాకో మాటు చూపిస్తావా, మీ
ఆయన్ని.”
"వీధిలో వున్నారు.”
కల్యాణి ఆశ్చర్యపడింది.
"ఆయన్ని వీధిలో పెట్టి, నువ్వు....”
"మొగమోటపడ్రారు. ”
"గట్టిదానివే, రా!”
మధుసూదనం వచ్చాకగాని అసలు సమస్య కల్యాణికి అర్దం కాలేదు. అర్దం అయినా దానిని విప్పడం
ఎల్లాగో బోధపడలేదు.
కమలమ్మ వితంతువయ్యీ వివాహం చేసుకోడం హైమవతిని పెంచినవారికి సమ్మతం కాదు. కాని, ఆమె
చేసుకొంది. వీళ్ళు ఎప్పుడో
బంధువులవుతారనీ, అప్పుడు తన వివాహం వారి కయిష్టం కావచ్చు ననీ ఆమె వూహించలేదు.
వూహించడానికి ఏదన్నా అవకాశం వున్నా
ఆమె మానేది కాదు. చేసుకొంది. తల్లి-తండి, అన్న అందరూ వొప్పుకొన్నారు. చేసుకొంది.
ఆమె ఆ మాదిరిగా వివాహం చేసుకోడం మధుసూదనాన్ని అనర్హుజ్సి చేయలేదు.
అతడు మంచివాడు.
ఎం.బి.బి.ఎస్. చదువుతున్నాడు.
కట్నం అక్కర్లేదు.
కోరి చేసుకొంటున్నాడు.
పిల్ల పట్టుదల వుంది.
కాని పెళ్ళిలో కమలమ్మ అక్కడికి వస్తుంది. ఆమె పిల్లడున్నాడు. అల్లరివాడు. మేనమామ వానిని
వదలడు. ఆ పంక్తి
బాహ్యులతో భోజనంకి కూర్చోవడమెల్లాగ?
"ఈ సమస్య వస్తుందని నాకు తెలుసు. నాన్నగారు ఎరుగుదురు” అన్నాడాతడు.
"రిజ్మి స్టేషను చేయిస్తే...”
"నాన్నగారు అదే వ్రాశారు.”
"కాని, అమమ్మ వొప్పుకోలేదు. ”- అంది కమ్రైోమ తల వంచుకొని.
కల్యాణి ఆశ్చర్యం ప్రకటించింది.
"ఎందుకని? సమస్య తేలిపోతుందే?”
మధుసూదనం సమాధానం ఇచ్చేడు.
"మైమకి తల్లీ-తండ్రీ లేరు. ఏదో అమ్మమ్మ పెంచింది. పిల్లనీ- కొబ్బరి బొండాన్నీ చేతిలో పెట్టినట్లు
రిజ్మిఫ్తారు ఆఫీసులో
పెళ్ళేమిటి? దిక్కూ-మొక్కూ లేనట్లు? ఇంట్లో సలక్రణంగా సంప్రదాయ పద్ధతిలో జరగవలసిందేనంది
ముసలమ]గగారు.”
"నువ్వేమన్నావు?”
"నాన్నగారు నీ పెళ్ళి నీ ఇష్టం అన్నారు. రమ్మంకే మేం వొస్తాం, వద్దంకే రాము అన్నారు. అమ్మ
రూడా అన్నీ నా యిష్టానికే
వదిలింది. అయితే చెల్లి రావడానికి అవాంతరం లేకపోతేనే తాను వస్తానంది. చెల్లికి రావడం
రాకపోవడం రెండూ సమానమే. కాని,
పిలిచి అవమానకరంగా ప్రవర్తించేరంకే వాళ్ళు చిన్నప్పుడు పాలు తాగిన దాసీదాని రంకులు సహా
కడ్తిగేస్తుంది.
కల్యాణి నవ్వింది.
"రాను. అవమానించడానికి పిలవడం ఎందుకు?”
"మా కృష్ణవేణి అక్కయ్య ఆలోచన అది. మా పిన్ని 'సై' అంది. మా అమ్మమ్మ...”
"ఏమంది?"
"ఏమంకేనేం తండి. ఆడాళ్ళలో పుట్టిందీ ఆలోచన. ఆచారాలు, బ్రాహ్మణ్యం చెడగొడుతున్న వాళ్ళని
మర్యాద చేయడం వాటిని
పోత్సహించడమేననో నిర్ణయానికి వచ్చేరు.”
"ఇంతకీ కీలకం నీ చేతిలో వుందని తేలుతూంది. నీ అభిప్రాయం ఏమిటి?” అంది కల్యాణి.
మధుసూదనం కొంచెం ఆలోచించేడు.
"నాకు ప్రత్యేకంగా దేనిమీదా పట్టుదలలేదు. సంప్రదాయ పధ్ధతిలో తప్పేముంది?”
ఏమీ లేదు.”
మధుసూదనరావు ముఖం వికసించింది.
"అందుకే వొప్పుకున్నా. "”
కల్యాణి ఆలోచించింది. ఆమెకు సమస్య ఎక్కడుందో అర్దం కాలేదు.
"ఇంక పేచీ ఏమిటి?”
మధుసూదనరావు ఆశ్చర్యపడ్డాడు. ఇంతచెప్పినా ఈమెకెందుకు అర్దం కాలేదా అనిపించింది.
"వాళ్ళు అక్క వొస్తే అవమానిస్తారు. "
"ప్రిలువకు. ”
"అయితే అమ్మా రాదు.”
"రావద్దను.
"నాన్న కూడా.”
”"అమ్మతోపాకేు ఆయనా. ...”
”"వాళ్ళావళూ ) రాకుండా పెళ్ళామిటి?”- అంటూ నిరుత్సాహపడి పోయాడు మధుసూదనరావు.
కల్యాణి అతనివేపు చుసింది.
"ఇంతకీ నీకు ఒడుగయిందా?”
మైోమ నవ్వింది. మధుసూదనం సిగ్గుపడ్డాడు.
” బాహ్మడివి. ఒడుగు కాలేదు. మరి మీ సంప్రదాయ వివాహం జరగడం ఎల్లాగోయి?”
కల్యాణి విరగబడి నవ్వింది. మధుసూదనరావు సిగ్గుపడిపోయాడు. కల్యాణి గంబీరురాలయింది.
”'పాత కొత్తల మేలుకలయిక ' అనే సూత్రం చెప్పుడానికైతే బాగానే వుంది. కాని, కార్యరూపంలో అది
సాధ్యం కాదు- అనో విషయం
అర్దం అయిందా? పాతనుంచి చాలదూరం వచ్చేశావు. ఇంక నువ్వు ఏదైతేనేమనో ఫ్థితి లేదు. నువ్వు
ఏరుకొన్నదను, అంగీకరించినదనూ,
ఆ మార్గం ఏదో కొత్త పరిస్టితులకనుగుణంగా వుండాలిసిందే. ఏమైతేనేం అంకే లాభం లేదు.”
మధుసూదనరావు ఆలోచిస్తూ కూర్చున్నాడు. చివరికి అడిగేడు.
"నన్నేం చెయ్యమంటారు?”
”"నోనోం చెప్పును? నాకేం తెలుసు?”
అతడు మళ్ళీ వూరుకున్నాడు.
"మీ నాన్నగారికీ నీకూ పేచీలేమన్నా వున్నాయా?”
"ఏమల్లా అడిగేరు?”
అతని ముఖంలో ఆశ్చర్యం కనబడింది.
"నీ పెళ్ళి విషయం నువ్వే చూసుకోమని ఎందుకు వదిలేసేరు?”
మైోమవతి మధుసూదనరావు ముఖం వంక చూసింది.
"మా వాళ్లూ అదే భ్రమలో వున్నారు.”
"అది (్రమేనా?”
మధుసూదనరావు విచారపడాడు..
"వివాహం బాధ్యత వథధూ-వరులకు సర్వాత్మనా విడిచిపెటాలంటాడాయన . ”
"కొంపదీసి మీ నాన్న కమ్యూనివు కాదు గదా.”
మధుసూదనం మళ్ళీ ఆశ్చర్యపడ్డాడూ.
"ఏం? ఏల్లా అనుకున్నారు?”
"ఏమంకే ఇల్లాంటి జనం వాళ్ళుల్లోనేో కనిపిస్తున్నారు. మనం రోడ్ల కూడలిలోకి వచ్చాం. ఇప్పుడు కాస్త
దారి చూపడం అవసరం.
బొప్పిలు కట్టి నోర్చుకోలేమా అంక ఎందుకు నోర్చుకోలేము? సమాజం ఇంతవరకూ రాలేదూ?
ఇన్నివేలూ, లక్ష సంవత్సరాలు
కమ్యూనిన్సుల మొహం ఎవరికేనా తెలుసా? అయితే ఇప్పుడున్నారు కనక, వాళ్య్ళేదో
ఉద్ధరిస్తారనుకుంటున్నాం గనక వాళ్ళుకేసి చూశాం.
మీరె నేర్చుకోండి మంచి చెడ్డలు అని వాళ్ళాదిలేస్తున్నారు. అందుకడిగేనులే. "
"ఆయన చెప్పిందాంట్లో నాకేం తప్పు కనిపించలేదు. నువ్వు గేమించిన కన్యను పెళ్ళి చేసుకోమని
సేద ఇచ్చిన వారెందరు?”
"బాగానే వుంది."
"ఆయన కట్నంతీసుకోవడం తప్పు అని చెప్పేరు.”
"చాలా మంచిపనో చేశారు. కాని వివాహం జరిపించేబాధ్యతను ఎందుకు తీసుకోలేదు?”
మధుసూదనం తలవంచుకున్నాడు.
"ఆయన రిజ్మిప్తేషను సూచించారు. వీళ్రు సాంప్రదాయపధద్ధతి అన్నారు. నేను దేనిలోమాతం
తప్పేముంది అల్లాగే ఒప్పుకుందామన్నా .”
"సాంప్రదాయ పద్ధతి అయితే నీకు ఒడుగు కావాలి. నాకు కులాలు, బ్రాహ్మణత్వం మీద నమ్మకం
లేదు. నేను తీసేసిన జంద్యం నీకు
వెయ్యను కనక...”
"చచ్చాం రా, దేవుడా! ఈ తెలుగుదేశం ఏమయిపోతూంది? తాను మంచిది కాదనుకున్నది కొడుకు
చేత వొష్పించలేకపోయారు? మా
అన్నయొుకడు. మీ నాన్న మరొకరు! దొడ్డ కమ్యూనిస్పులురా దేవుడా. ఏపనీ చెయ్యకుండా సోషలిజం
వచ్చేస్తుందిలే అని వీళ్ళ
వూహ కాబోలు. బలే.”
"అందులో నా తప్పూ వుంది.”
"సరిలే, ఇప్పుడేం చేస్తావు?”
"వాళ్ళు ఆలోచిస్తున్నారని చెప్పిన సంగతులు విన్నాక పెళ్ళి ఇప్పుడు చేసుకోను
అనేోద్దామనుకుంటున్నా .”
మోమ కన్నీళ్ళు పెట్టుకొంది.
"ఆ యింట్లోంచి ఎన్నడుపోతానా అనుకొంటున్నా. నేనో తొందర పెట్టా....”
"ఈఅద్రా సంగతి. మరి దానికేమంటావు?”
"మీరు చెప్పుండి."
"ర్రార్యం వుందా?”
"చూద్దాం."
"రిజ్మిప్టేషను జరగాలేగాని సాంప్రదాయ పద్దతి నోనొప్పుకొనను. "
"ఇదివరకే ఒప్పుకొన్నాగా. ”
"మార్కు శ్వైయిన్ కథలోకి మల్లే ఈ సమన్వకి పరిష్కారం సాధ్యం కాదు...”
మధుసూదనరావు లేచేడు. కల్యాణి మోమను ప్రక్కకి పిలిచింది.
"దినిని నువ్వే పరిష్కురించగలవు.
"లా? 17
"వాళ్ళ ఆలోచనలు తెలిసినాయి. వానిని అమలు జరపడానికి చేసే ప్రతి ప్రయత్నాన్నీ నువ్వే
ఎదుర్కో...
"ఇందాకా మీరు వచ్చే ముందే ప్రారంభించా, అందుచే మా అక్క కొంచెం పక్కపక్కగానేో వుంది.”
"భారత మహిళాత్వం ప్రతిషాకరమైన బిరుదేం కాదు. మంచికోసం అయినా గట్టిగా నోరు చేసుకోవడం
ఈ దశలో ముఖ్యం. కానీ....”
పంధొమ్మిదో ప్రకరణం
గవర్నురుపేట మార్కెటు వద్దకు వచ్చేసరికి ప్రవ్వులదుకాణాలు కనబడి జ్ఞాపకం వచ్చింది, తన
మిత్రుడిభార్య వచ్చింది. ఆమె
చెల్లెలూ, కల్యాణి వున్నారు. తనను విందుకు పిలిచారు. వాళ్ళకి ఏదన్నా తీసుకెళ్ళడం మర్యాద
అనిపించింది.
ఆడవాళ్ళకి పువ్వులకన్న అందమైన బహుమతి ఏముంది? కల్యాణికి గులాబీలంకు మహా ప్రీతి. ఏ
రోజునా కేబిల్ మీద 'వాజ్' లో
చక్కగా విచ్చిన గులాబీ అమరుస్తుంది.
సెకిల్ దిగేడు. పువ్వులదుకాణాలు కళ్ళ్రుకుక్పేలా వున్నాయి. ఎర్రని గులాబీలు, తెల్లని మల్లెలు,
సన్నజాజులు, పచ్చని
చామంతులు, రెండురంగుల్లో కనకాంబరాలు... దుకాణ దారు ఏమియ్యమంటా రన్నాడు.
రాజగోపాలానికి తెలియదు. అతడెప్పుడూ పువ్వులు
కొని వుండలేదు. ఎన్నికొంకు సరిపడతాయో ఎరగడు. బహుమతి, సంతుష్టి కలిగించాలి. అందుచేత
మూక ఉమ్మడిగా కొట్టువాడికే
పురమాయించేడు.
"ఇయ్యి. ”
దుకాణదారు పరిస్థితిని అర్ధం చేసుకొన్నాడు. బజ్సీలో క్రింద వున్న సామానుల్లోంచి చిన్న
వెదురుపేళ్ళబుట్ట తీసేడు. తన
వద్దనున్న వేర్వేరు రకాల పువ్వులతో దానిని నింపుతున్నాడు. రాజగోపాలం చూస్తున్నాడు. కొంచెం
గులాబీలు ఎక్కువ వెయ్యమనో సలహా
తప్పు అతను కాదనలేదు. ఎంతఖరీదు పెట్టి కొనాలో ఎరుగడు. అయితే వాళ్ళు తనను పీనాసి
అనుకోకూడదు. అంతే. అదొక్కకు
ఆలోచన.
అతని స్థితిని అర్హం చేసుకొని దుకాణదారుడే ప్రశ్నించేడు. ఇంట్లో వున్నది ముగ్గురు ఆడవాళ్యోననీ,
ఇంట్లో పెళ్ళో మరేదో
అల్లాంటిదో జరుగుతున్న సందర్పుం కాదనీ తెలుసుకొన్నాడు. తానదివరకే చేర్చినవి కొన్ని తీసేశాడు.
మరికొన్ని చేర్చాడు. గంప
తెచ్చి సైకిలుకి పెశ్పేడు. బుట్ట ఒకటి సైకిలుకి తగిలించి ఇంటికి తీసుకెళ్ళడం రాజగోపాలానికి నామోషీ
అనిపించింది. అందులో
పువ్వులు. ఏమిటి కథ?" యని కనుబొమ్మలతెవరన్నా ఎత్తితే తాను సిగ్గుపడిపోవలసిందే తప్పు ఏమీ
అనలేడు. ఎప్పుటిదాకానో
వాయిదా లేకుండా అక్కడే వినిపించిందా ప్రశ్న.
"ఏమిటోయ్? అన్ని పువ్వులు కొన్నావు? ఏం కథ?”
దారిన పోతున్న రంగారావు కంటబడనో పడ్డాడు. ఇంక టాంటాం చేసేస్తాడు. అతనినోటికి శుద్ధిబద్ధం
లేదు. అనేదీ అనకూడనిదీ
లేదు. డబ్బావాగుడు.
పూవులతో అతని కంటబడడం బాగులేదనిపించింది. ఏదో కూడని పని చేస్తూ పట్టుబడిపోయినట్ట్లు
కంగారు పడ్డాడు.
"నాకు కాదోయ్. "
"నీ కథ పువ్వులట్పకెళ్ళేదాకా రాలేదని నాకు తెలియదంటావేమిటి?"
రాజగోపాలం సిగుపడ్రాడు. రంగారావు భుజం తప్పుడు.
"క్రేవో. ఈ పువ్వులున్నయే ముట్టుకుంకే వాడిపోయేటట్లా వుంటాయా? కంచు కోటల్లో గూడు
కట్టుకున్న హృదయాల్ని కూడా బయటకి
తీసుకురాగలవు. కానీ నన్ను మాత్రం మరచిపోకు, నీకక్కర్లేనిది నాది. ఏమంటావు? అదిగో మాట్లాడ్డం
లేదు. ఉన్నవన్నీ నువ్వే
చుట్టపెస్తేదామనా? అరగదు సుమా!”
రంగారావు మూర్పుడు. లేకపోతే స్నేహితుని ముఖం అంతకంతకు రంగుమారుతూండడం
బగహించగలిగేవాడే.
మిత్రుడిమాటలకు రాజగోపాలం ఎంతో అసహ్వ్యించుకొన్నాడు. ఈయనకూతుర్ని చేర్పించడం కోసం
వెళ్ళినప్పుడే తనకు కల్యాణి పరిచయం
అయింది. ఆమె మాటమర్వ్యాదా, నిరాడంబరమైన ఆప్యాయతా అతనినాకర్తించేయి. అంతక్రితం
రెండునాలలనుంచి ఇంట్లో వున్నా అద్దె
ఇవ్వడం తప్పు అతనికి పరిచయమే లేదు. అతనిని ఆకర్షించిన గుణాలే రంగారావులో విన్నమైన
ఫలితాలు కలిగించాయి. అతడికామె
నులభసాధ్య అనిపించింది. అనుకూలాలు వంకే ఆమె తనదవుతుందని ఆశ. రాజగోపాలం
ఆయింట్లోనో వున్నాడు. కనక అతడీపాటికి ఆమెను
లోబరచుకొనోేవుంటాడని వూహ. ఆ యింట్లోనే మరోపడుచుకూడా వుండడం మంచి వేటకి
అనువనిపించింది. ఆ అభ్మిప్రాయాన్ని అతడదివరకే
రాజగొపాలం అదృష్టాన్ని అభినందించడంలో వ్యక్తపరచాడు.
"ఎల్లా అయినా అదృష్టవంతుడివి. ”
"వండినమ్మకు ఒకకూరే. మధూకరం వానికి పదికూరలు.”
ఈ విధంగా తన ఎదుటా చాటునా కూడ అంటూనే వన్నాడు. ఆ అదృష్టం ఏమిటో, కూర ఏమిటో
మెకి ఎన్నడూ అనకపోయినా గోపాలానికీ
తెలుసు. మిత్రులకూ తెలుసు. అందరూ నవ్వేవారు. అతడు సిగుపడేవాడు. వూరుకొనేవాడేగాని
అదిలించలేకపోయేవాడు. ఇప్పుడా
బలహీనతకు విచారం కలిగింది. ఎంతో ఆవేశమూ వచ్చింది. భుజం మీద వన్న చేతిని
తొలగించడంలో అరచేయి గుప్పిట లంకించుకొన్నాడు.
బలంకొటదీ నలిపివేయడంలో వేళ్ళనరాలన్నీ ఒత్తుకుపోయి రంగారావు గిలగిలలాడిపోయాడు.
"అబ్బ! మోటు సరసం చెయ్యకోయ్ .”
గోపాలం మరోమారు పిడికిట్లో చేయి నలిపేడు. ఈ మారు రంగారావు మెలితిరిగే పోయాడు. అప్పుడే
వారి మోటు సరసాలు చుట్టుప్రక్కల
వాళ్ళ కంటబడ్డట్టనిపిస్తూంది.
"వెధవమాటలెప్పుడూ అనకు, ఇడియట్! ”
పళ బిగించి నెమ్మదిగా తనకు మాత్రమే వినిపించేలా అన్న మాటలతో రంగారావు కళ్ళు తెరిచేడు.
రాజగోపాలం ఆ చేయి వదిలేసేడు. అతని ముఖంలోని రౌద్రాన్ని చూసి రంగారావు పిల్లే
అయిపోయాడు. ఎదుర్కోగల బైర్యం లేదు.
నైతికంగానే కాదు. శారీరకంగా కూడా. అతని పిడికిలి విగింపులో నలిగిపోయిన అరచేతి నరాలు ఇంకా
స్వస్థలాలకు చేరుకోలేదు.
సలుపుతున్నాయి. మైగా రాజగోపాలానిది కసరత్తుచేస్తూ మంచి ఫస్రితిలో కాపాడుకుంటూ వస్తున్న
శదీరం. నోటమాట కూడా రాక
ఒక్కక్షణం అతని ముఖంవంక చూస్తూ నిలబడిపోయేడు.
తాను ఎంతో సహృదయంతో కొన్న ఆ పువ్వులమీద అంత అసహ్యకరమైన వ్యాఖ్య వచ్చాక వానినింక
తీసికెళ్ళాలనిపించలేదు.
పట్టుకెళ్ళినా ఆ యువతులకు వాటినివ్వలేడు. తన మిత్రుడి దుష్టభావన ఆ పువ్వులను
వెంటాడుతూనే వుంటుంది. జుగుష్సుతో
ఆపువ్వుల్ని తీసేసుకోమన్నాడు, దుకాణదారుని.
తనమాట గోపాలం మనస్సులో కలిగించిన అసనహ్యంయొుక్కు పరిమితి [గ్రహించి రంగారావు చల్లగా
జారుకున్నాడు.
ఆ ఘటనను వింటూ చూస్తున్న దుకాణందారు వీరాస్వామి రాజగోపాలం ఫ్రితికి విచారపడ్డాడు.
"ఒక్కొక్కళ్ళ నోరూ, కళ్లూ. మనస్సూ అల్లాంటివి బాబూ!
పక్క దుకాణంవాడు సానుభూతి తెలిపాడు.
"తమరెల్లా వూరుకున్నారోగాని బాబయ్యా! నా మట్సుకి కొట్ట దిగొచ్చి గూబకదతయ్యాలనిపించింది నా
కొడుకుని. *
వీరాస్వామి పువ్వులు సర్దేసుకొని డబ్బులు తిరిగి ఇస్తూంకు రాజగోపాలానికి ఆశ్చర్యం కలిగించింది.
అతడు డబ్బుగురించి
ఆలోచించడంలేదు. ఆ పువ్వులు తన చేతిలోంచి పోవాలి.
దుకాణం వీరాస్వామి అతనిని వదలలేదు.
"బాబూ! కష్టం పెట్టుకోకండి, ఇంకేదన్నా తీసుకెళ్ళండి. బత్తాయిలు తెష్పించమంటారా? కుర్రాళ్లీ
పంపుతా.”
రాజగోపాలం ఏమనేలోప్రునే మనమడిని పంపి దగరలోవున్న కొడుకు పళ్ళదుకాణంలోంచి రెండు డజన్ల
బత్తాయిలు తెప్పించాడు. కురాడు
స్వంతబుద్ధి నుపయోగించి మంచిగా ముగ్గిన ఒకడజను అమృతపాణీ అరటిపళ్ళు కూడా తెచ్చౌడు.
"చ[కకేలీలు మంచివున్నాయి తెమ్ముంటారా?”
రకృుర్రవాడి ప్రశ్నకు విరాస్వామే సమాధానం ఇచ్చేడు.
"ఎర్రి సన్నాసీ! అయ్యగారికని చెప్పి మంచి పళ్ళు తెమ్మునలేదరటా? ఎల్లు, లగెత్తు, ఓ డజను
చాలతాయంటారా, మరో అర
డజను ఏయమంటారా? ఒరేయి నాలుగు పుంజీల్మటా, నాలుగు...” పరుగెత్తుతున్న కృురాడు అతడు
చూపిన వేళ్ళు గమనించి తలవూపి
తుర్రుమన్నాడు.
గుమ్మంలో కల్యాణి ఎదురయింది. ఆమె తనకోసమే ఎదురుచూస్తున్నట్లు వీధిగుమ్మంలోకి వచ్చింది.
"ఏమిటవి? ఏదో తెచ్చినట్లున్నారే. ”
రాజగోపాలం ఏమీ అనలేదు. రిక్రావాడితో బుట్టలోపలికి తెమ్మన్నాడు.
అమ్మగారు చూపిస్తారు. లోపలికి పట్టుకెళ్ళు. "
ఆమె బుట్ట సావట్లో పెట్టించి అతనిని లోనికి ఆహ్వానించింది. అతడు ప్రొద్దు తన వాటాను మిటత్రుడి
అదీనంలో పెట్టి వెళ్ళేడు.
ఇప్పుడందులో చొరవతీసుకొని ప్రవేశించడం సబబు కాదనిపించింది. తటపటాయిన్తున్నాడు. అది
గ్రహించి కల్యాణీ ఆహ్వానించింది.
"నీళ్ళు పోసుకుంటారా?”
"తర్వాత. ”
"వేన్నళ్రున్నాయి. ”
”"వెంకటావు ఏడీ?'
"నీళ్ళు పోసుకుంటున్నారు. ”
రాజగోపాలం వూరుకున్నాడు. వసంత ఎక్కడున్నదనో ప్రశ్న వెయ్యలేదు. కాని కల్యాణి (గ్రహించింది.
"బట్టలకోసమా? వసంత లోపలుంది. తలుపు తెరిచే వంది. అన్నట్లు మీతో చెప్పకుండా
మూడువాటాల సరిహద్రులూ చెరిపేశాం. ఇట్లా
వెళ్ళొచ్చు. రాండి.”
కల్యాణీ దారిచూపుతూ వంకే అతడామె పడకగది ప్రవేశించాడు. దానిలోంచి ఎడమదిక్కుగా సుజాత
పడకగదిలోకున్న తలుపూ, కుడిదిశగా
తన వాటాలోకున్న తలుపూ తెరిచి వున్నాయి. ఆ గది తాను పడకకుపయోగించడం లేదు. అందులో
తన పెశ్వే, బట్టలూ వున్నాయి.
ముందుగది తన పడకగది. ఎవరి ఇంట్లోకో వెడుతున్నంత సంకోచంగా నెమ్మదిగా తలుపు నెస్పేడు.
"త్వరగా రాండి” యని హెచ్చరించి
కల్యాణి వెళ్ళిపోయింది.
స్నానం చేసి దుస్తులు మార్చుకొని వచ్చేసరికి హాలులో నలుగురూ కొలువుదీరినట్లు కూర్చున్నారు.
తనకు చోటు ఏది నిర్ణయించారో,
అటూ ఇటూ చూసేడు. కల్యాణి ప్రక్కన ఖాళీ వుంది. ఆమె ఆహ్వానిస్తున్నట్లు కొద్దిగా కదిలింది. ఆ
కదలికనో ఆహ్వానంగా
తీసుకొని అటునడిచేడు.
"ఇంత కాలానికి మిమ్మల్ని ఇంటివద్ర అ్వససంజ వేళ చూసింది ఈవేళ ననుకుంటా.
రాజగోపాలం ఏమీ మాట్లాడలేదు. కల్యాణి కాఫీ పోసి కప్పు అందించింది. ఆమె ఆదరణను
చూస్తూంకే ఒక్క గంట క్రితం రంగారావు
అన్నమాట జ్ఞాపకం వచ్చింది.
"మీకు చాలా శ్రమ ఇస్తున్నా.”
సుజాత నవ్వింది. వెంకటావు వ్యాఖ్యానించేడు.
"అర్ధంలేని మర్యాద మాటలు బాగా నేర్చేవే. "
రాజగోపాలం అదేమిటన్నట్లు చూసేడు.
"లేకపోతే కాఫీ ఇన్తూంకే శ్రమ కలిగిస్తున్నాని క్షమాపణ చెప్పుకుంటావేమిటి?”
రాజగోపాలం నవ్వేడు.
"ఒకరు చేసిన మంచిపనికి అభినందించడం. .... 7
"నీకు కాఫీ ఇవ్వడం మంచిపని అంటావు?”
రాజగోపాలం నిరుత్తరుడయ్యాడు. రామలక్ష్మమ్మ అతనినా చిక్కులోంచి బయటకు లాగింది. కాని,
అది మరో కొత్త చిక్కు
తెచ్చిపెట్టింది. ముగ్గురు పడుచులు, అందులో ఇద్దరు అవివాహితల ఎదుటపట్టుకొని
' పెళ్ళాప్పుడంకు! ఏం చెప్తాడు? సాధారణంగా
ఇచ్చే సమాధానమే అతడూ ఇచ్చేడు.
"ఇప్పుటినుంచీ తొందరేమిటండి?”
వెంకటావు ఇల్లాంటి సదవకాశాన్ని జారవిడవలేడు.
"ఏమిటోయ్! తొందరలేదంటున్నావు. గేమలేఖలు వ్రాసే వయస్సు రాలేదంటావా యేం?
కొంపతీసి..... 77
"అందరికీ నీ అంత తొందరగా జ్ఞానన్నేతం వికసిస్తుందా?”- అన్నాడు గోపాలం చిరునవ్వుతో. వసంత
భర్తకేసి చూసి, కళ్ళతో
నవ్వింది.
వెంక్కటావు ఏమీ జంకలేదు.
"మనం గ్రేేమించి పెళ్ళి చేసుకోవడం మంచిదనుకొన్నప్పుడు ప్రమలేఖ మంచి మీడియం కాదూ?
ముసలమ్మ కబుర్లు చెప్తారేమిటి?”
పనికట్టుకొని పెళ్ళి, (డ్రేమ, పప్రమలేఖల వైపునకు సంభాషణను లాగుతున్నట్టనిపించి రాజగోపాలం
ఇరుకున పడ్డాడు. తన గదిలో
పుస్తకాలన్నీ తిరగేసి కల్యాణి ఫోటోలు చుసి వుంటాడనిపించింది. వానిని తీసి పెప్పైలో
భదపరచకుండా తెలివితక్కువపని చేశాడా?
సుజాత సంభాషణను మరోదిశ కీడ్సింది.
"ఈ మధ్య కాలేజీలో మా తెలుగు అెకరరు అన్నకు చెప్పేవు బావా! ఆడపిల్లల్ని అల్లరిపెట్టటంలో
మగకు[రాళ్లు చూపించే
మెలకువల్ని పట్టి వాళ్ళ వరార్తతల్ని నిర్ణయించాలన్నాడులే. ..”
రాజగోపాలం ఆశర్యం ప్రకటించాడు.
"అంకే....”
వెంక్కటావు పకపక నవ్వేడు.
కల్యాణి ముఖంలో అసహ్యం కనబరచింది.
"ఆడపిల్లల్ని ఏడిపించడం మగతనానికి గుర్తు అవడం సిగ్గుమాలిన మాట అని ఖండించకుండా నవ్వి
ఆనందించడం బాగాలేదు."
ఎందుకా సిగుమాలిన నవ్వు అన్నట్లే కుండ బద్దలు కొట్టినట్లు మొగంమీదనే అనేసరికి వెంకట్రావు
నవ్వు టక్కున నిలచిపోయింది.
"క్రమించండి."”
"పాడు పనులు చేసి గొప్పగా సమర్దించుకోవడం మీ మగాళ్ళుకో. ..” అంటూ సుజాత మాట మధ్యలోనో
ఆపేసింది.
”నీఅక్కమగడినయిన అపరాధానికి నన్నంకే అన్నావు. పడాలి. ఏం చేస్తా, కాని మగాళ్ళందద్నీ
కలిపి తిడితే చిక్కులున్నాయే,
ఇక్కడ మా గోపాలం ఒకడున్నాడు.”
సుజాత మేనత్త వెనక్కి తలతీసుకు దాగింది. వెంకటావు ఈ మారు సరాసరి కల్యాణిని ప్రశ్నించేడు.
"ఏమండీ! గేమలేఖలూ, చేమ ప్రకటనా మహా పాపిష్టి కార్యాలయితే ప్రేమను గురించి అన్ని పెద
కబుర్లు చెప్పటం
దేనికి?”
తాను _పేమిస్తున్న యువతి తన్ను అర్దం చేసుకొన్నట్లు కనబడ్డంలేదు. తన అభిప్రాయాన్ని ఆమెకు
చెప్పడం ఎల్లాగో తెలియడం
లేదు. ఎంతో ఆలోచించి గోపాలం చిన్న (ప్రేమలేఖ వ్రాసేడు. తీరా అది అందచేస్తే ఎల్లాంటి
ఫలితాలు వుంటయ్యోనని తానీ వారం
పదిరోజులనుంచీ జంకుతున్నాడు. దానిని తాను జేబులోనో పెట్టుకు తిరుగుతున్నాడు.
హఠాత్తుగా గుర్తువచ్చింది. జేబు తడుముకున్నాడు. నిన్నటి చొక్కా కాదిది. వెంకటావు సంభాషణ
నాంతసేపూ గ్రేమలేఖ వేపే ఎందుకు
లాగుతున్నాడో అర్దం అవుతుంది.
జేబు తడుముకోవడం చూసికూడా వెంక్కటావు చూడనటప్త్లే నటించడంతో అతని అభిప్రాయం
స్థెారపడింది.
"కాస్త ఎర్రగా, బ్యురగా వున్న అమ్మాయికల్లా ఓ డ్రేమలేఖను పోస్టు చెయ్యడం..... 17
"చిన్న సవరణ. ఎర్రగా బ్యుర్రగానేకాదు నల్లగా నీలమేఘఛ్స్చాయలో వున్నా ప్రేమలేఖలు పొందడానికి
అనర్హురాలు కాదు."
వసంతరంగు నలుపు. కల్యాణి చిరునవ్వు నవ్వింది.
"మీరు అడిగిన ప్రశ్న న్యాయమే. కాని ప్రేమలేఖ లందుకోవడం ఆడపిల్లకు అవలక్షణంగా
భావించేటంతకాలం కష్టమే మరి.”
వెంకట్రావు ఆ విధంగా ఎన్నడూ ఆలోచించలేదు.
"మా అక్కగనక. .” సుజాత ఏదో అనబోయింది. కాని వసంత చెల్లెల్ని గదమాయించింది.
"ఏమికే ఆ అధిక పప్రసంగం....”
"పర్వాలేదు అెద్రూ. నీకు [ప్రేమలేఖ వ్రాయగల మగాడిని నోనొక్కజ్లే యని నాకు తెలీదంటావా?”
అంటూ వెంక్టటావు భార్యను
సమాశ్వసించాడు.
"చ్రాలులెండి ప్రజ్ఞ...” అని మగణ్ని గదిమినా వసంత అసలు ప్రశ్న గాడి తప్పుకుండా దారికి
తెచ్చింది.
”పేమలేఖ అంటూ ఒకటి పుటిందంకే అది వ్రాసినమగాడితో, ఆడదానికిష్టం వున్నాలేకున్నా
పెళ్ళయితీరవలసిందే నన్నమాట. ”
తానా విధంగా ఎన్నడూ ఆలోచించలేదని వెంక్కటావు ఒప్పుకున్నాడు.
కల్యాణీ పరిస్రితులల్లాగే వున్నాయంది.
"మనకు కావలసిందేమిటో మనం ఎరుగుదుము. కాని, దానిని తెచ్చుకొనే దెట్లో తెలియదు. ప్రతి
విషయంలోనూ మనం అంగీకరించగల
భాగం, అంగీకరించలేని భాగం వుంటాయి. అల్లాగే పేమ విషయంలోకూడా. మనం అంగీకరించేది
నూతనభావన. అంగీకరించలేనిది అన్నుశుతంగా
వస్తున్న అలవాటుకు బిన్నమైన ఆచరణ...”
వెంకటావు ఆమె అభిప్రాయాన్ని కాదనలేకపోయాడు. అంగీకరించడానికీ మనస్సు వొప్పులేదు.
"మీ అభ్మిప్రాయాన్ని ఒప్పుకుంకై మనం [టటయల్ మారేజెస్ ను కూడా స్వీకరించవలసిందే కద?”
అన్నాడు వెంకటావు.
"గటయల్ మారేజి అనడంలో మీ వుద్దేశం ఏమిటో మరి. మనం ప్రథమ దర్శనంలోనే [పేమ
అంకురించడం సర్వ సామాన్య నూత్రంగా
భావించం. అది కేవలం ప్రబంధ శృంగారానికే పరిమితం. పరిచయం ముదిరి వివాహం
ముడిపడేవరకూ కొంత వ్యవధి పడుతుంది. ఆ
వ్యవధిలో పరిచయం అనేక స్థాయిలలో తెరిగి నిలిచిపోవచ్చు. వివాహం చేసుకోవాలనో భావతీవ్రత
ఏర్పుడకుండానో ఆగిపోవచ్చు.
వివాహానికి పూర్వమే అనేక దశలవరకూ పెరిగి నిలిచిపోయిన పరిచయాలు బోఆడు...... 77
వెంకటావు తన అజ్ఞానాన్ని మరల అంగీకరించవలసి వచ్చింది.
"అయితే వివాహాత్పూర్వుం తన భార్యకు ఎవరో _పేమలేఖలు వ్రాశారన్న పరిజ్జానం ఈర్వ్యాహేతువు
కాకూడదు.”
"ఆ మాట తలుచుకోవడానిక్కూడా కష్టంగా వుంది.”
కల్యాణీ ఏమీ అనలేదు. మిత్రులిరువురూ వెలుపలికి వచ్చేసి సిగరెట్లు ముటించారు. వెంకటావు
జేబులోంచి ఒక మడత తీసి
గోపాలంచేత బప్పేడు.
అదేమిటో అర్దం అయినా రాజగోపాలం ఎరగనట్లు నటించాడు :
"ఏమిటిది?"
"విష్ యూ గుడ్ లక్!”
ఇరవయ్యో (ప్రకరణం
తాను వ్రాసిన డ్రేమలేఖ తన మిత్రుని చేతిలోంచి తిరిగి వచ్చాక ఇంక సమస్యను అతనిముందు
పెట్టడమే మంచిదని రాజగోపాలం
భావించాడు. కాని, ఆ అవకాశం రెండు రోజులవరకూ లభించలేదు. లభించినప్పుడు తనవిషయం
చెప్పే అవసరం మిగలలేదు.
ఆ పూట కాఫీ తీసుకొన్నాక మిత్రులిద్దరూ గోపాలం పడకగదిలో కూర్చున్నారు. కేబుల్ ఫాన్
రుమ్ముంటూంది. తన మిత్రుడేదో
ఆలోచనలోపడి కొట్టుకుంటున్నట్లు చూశాడు.
"ఏమిటోయది. అల్లా వున్నావేం?”
చేతిలోని సిగరెట్టునుసి దులుపుతూ వోరగా చూశాడు.
"నిన్నరాత్రి మేము వచ్చేసరికి మీరు న్మిదపోవడం లేదు."
ఆ మీరులో రెండోమనిషి కల్యాణీ.
రాజగోపాలానికి కొంతర్యాతివేళ తెలివివచ్చింది. పక్కనున్న పరుపుమీద వెంక్కటావు కనబడలేదు.
లేచాడు. డాబాతూము ప్రక్క
పెట్టిన కూజాలో నీళ్ళు గ్లాసెడు వంచుకు త్రాగి లేచాడు.
"చాల వుక్కగా వుంది.”
కంఠధ్వని విని రాజగోపాలం అటుతిరిగేడు. వెన్నెలలో, తెల్లని పరుపుమీద నల్లకలువపువ్వులా కల్యాణీ
కనిపించింది. అతనిని
చూడగనో ఆమె లేచి కూర్వుంది.
అతనికి నోట మాట రాలేదు. నత్తుతూనే పలకరించాడు.
"మీరూ న్నిదపోలేదు. ”
కల్యాణి చిరునవ్వు నవ్వింది.
"గ్బప్పుడే తెలివొచ్చింది. "”
ఆమె ఆవలగావున్న పరుపుకూడా ఖాళీగానో వుంది.
తన మిత్రుడు భార్యను వెంటబెట్టుకొని సినీమాకు పోయివుంటాడనుకున్నాడు. అయితే తాము
పడుకోబోయేటప్పుటికే సినీమా రెండో ఆట
పారంభమైపోయి వుంటుందనే విషయం అతనికి జ్ఞాపకం రాలేదు.
"వాడికి సినీమాపిచ్చి జాస్తి. ”
కల్యాణి ఏమీ అనలేదు. చిరునవ్వు నవ్వింది. అందులో ఏదో రహస్యం వుందనిపించింది.
అర్ధంకాలేదు.
"న్రైమెంత అయిందో?”
"మూడు దాటివుంటుంది.”
"అబ్బ! సినీమాకెళితే ఈపాటికి రావలిసిందేనో,
అప్పుడూ ఆమె ఏమీ అనలేదు. వెంకటావూ తానూ ఎక్కడ చదివేరో ఏమిటో అడిగింది. ఏదో
కాలంనింపడానికి మాట్లాడుతున్నట్ట్లుంది.
చల్లని గాలి తిరిగింది. ఆమెకు తన మనస్సులోని మాట చెప్పాలని ఎంత ప్రయత్నిస్తున్నా అవకాశమే
దొరకడం లేదు. ఇప్పుడు
మంచి అనుకూలమైన సమయం దొరికింది. కాని చెప్పలేకుండా వున్నాడు. లేచి అటూ ఇటూ
పచారుచేసి ఆమె ఎదటికి వచ్చి నిలబడ్రాడు.
"కల్యాణి గారూ?”
ఆమె ఆగి తలఎత్తి తన ముఖంలోకి చూసింది. కాని ధైర్యం చాలలేదు.
ఇంతలో మెట్లకింద చప్పుడైంది. చటుక్కున కల్యాణి నిలబడింది. భుజంపట్టుకొని నామ్మదిగా
నొక్కింది.
"వెళ్ళి పడుకోండి. మేలుకున్నట్లు కనబడొద్దు. "
అతడామె చేయి పట్టుకొని చేతిలోకి తీసుకున్నాడు. ఆమె నెమ్మదిగా విడిపించుకొంటూ రెండో చేయి
తన గుండెలమీద వేసింది.
"వెళ్ళండి. పడుకోండి."
అతడు కదలలేదు. ఆమె నెమ్మదిగా నెట్టింది. తానుపోయి తన పరుపుమీద పుస్తకంలా పడుకొని
కన్నుమూసింది. మెట్లమీద
చప్పుడయింది. అతడూ చటుక్కునపోయి పడుకున్నాడు. కల్యాణి కళ్ళుతెరచి చిరునవ్వునవ్వడం
వెన్నాట్లో కనిపించింది. అతని
మనస్సు మల్తిలు పూచింది.
మెట్లమీదినుంచే వెంక్కటావు పలకరించాడు.
"కత్రాలివొచ్చిందిటోయ్?”
రాజగోపాలం మాట్లాడలేదు. కళ్ళు తెరవలేదు. వెంకటావు అక్కడే నిలబడి సిగరెట్టు ముట్టించాడు.
నెమ్మదిగా తన పరుపుమీద
చేరేడు. అతని వెనకనే మునివేళ్ళ మీద నడుస్తూ వసంత తన పరుప్పమీద చేరింది. కల్వాణి
ఆదేశం అతనికప్పుడర్వమయింది.
అ దంపతులు సిగు్గుపడతారని ఆమె న్నిద నటిస్తుంది.
ఆ సానుభూతి తనకామెను సన్నిహితపరచింది. భుజమ్మీద వేసిన చేయి, గుండెలమీద వుంచిన
చేయి, పడుకొని న్నిదనటించమన్న
అనునయం, నెమ్మదిగా తోసిన తోప్తు- కొన్ని వందల ప్రటల [గ్రంథానికి వ్యాఖ్యానం చేశాయి.
కల్యాణి తనది. ఇంక సందేహం అక్కరలేదు. తన జీవితం ఆమె స్పర్శతో పల్లవితం అవుతుంది.
ఆ ఇద్దరిమధ్యా మిగిలిన ఆ గుప్రరహస్యం వారినా పగలంతా ఆనంద తరంగాలమై తేలించింది.
ప్రతిచిన్న అవకాశం చూసుకొని
వాళ్ళకళ్తు నవ్వుకొన్నాయి. కాఫీ అందించడంలోఒక్క క్షణం వారి వేళు మూగపోయాయి. ఫలాహారం
అందించినప్పుడూ చీర కొంగు అతనిని
పరామర్శ చేసింది.
వెంకటావప్రశ్న ఈ పరిణామాలన్నింటిని పక్కకి తోసేస్తుంది. వాళ్లు వచ్చేసరికి న్నిదపోవడంలేదు-
అదేం (ప్రశ్న అనిపించింది.
"గదిలో ఫాన్ వుంది. ఇక్కడే పడకవెయ్యకపోయావా?”
వెంక్కటావు శుష్కహాసం చేశాడు.
"మా రాక....” మధ్యలో ఆపి ముఖం కేసి చూశాడు.
రాజగోపాలం తల ఎత్తేడు.
"మీ రాక... ఆగేవేం?”
"ఏం లేదు....”
వాళ్లు రాకపోతే కథేముంది ? తానామెముందు నోరు విప్పలేక పోయేవాడు. ఆమె బయటపడేదారి
వుండేది కాదు. ఎవరి మనోభావాలను వారే
జీర్ణం చేసుకోవలసిందే. కాని వెంక్కటావు కేం తెలుస్తుంది? తానాంత సాయపడ్రాడో ...
"పక్కలో పెళ్ళాం లేకుండా ఒక్క రాత్రి కూడా పడుకోలేను అనుకోడం నాకు తలవంపు
అనిపించడంలేదు. నను దానికి డటేమ అని పేరూ
పెట్టడం లేదు. ఒక మనిషి ఒకే మనిషిని పేమించగలడు, కామించాగలడు. కాని అవిరెండూ ఒక
చోట వుండవు.”
రాజగోపాలం బీరువాలో దేనికో వెతుకుతున్న వాడల్లా ఆగి తిరిగ్ప్బూశాడు.
"పేమ లేని కామం అవినీతి. సంఘం దాన్ని నిరసిస్తుంది. ”
వెంక్కటావు మానహాసం చేశాడు.
"నిన్నరాత్రిటిది నాకో అనుభవం."
అతడీ వారం రోజుల కార్యకలాపాల్ని వర్ణిస్తూ మంజులత విషయం తెచ్చేవరకు రాజగోపాలం
సావధానుడయ్యేడు.
తామంతా క్షాస్మేట్సు కదా, "బోర్డు చూసి మన మంజులతేనేమోనని వెళ్ళును. మాటవరసకన్నా
చెప్పేవు కాదేం? ఆవిడ
ఇక్కడే వుందని...”
"ఏమిటో ఆ దృష్టే లేకపోయింది.”
"సరి. చాలా ఆప్యాయంగా పిలిచింది. తన గొడవంతా చెప్పింది. చివరనేమందో తెలుసా? అంత
(సేమించి పెళ్ళి చేసుకొన్నా జీవితంలో
సుఖం లేకపోయింది. అర్దరాత్రి వెన్నెట్లో తెల్లటి మల్సిపువ్వు లాంటి పక్కమీద ఒత్తిగిలి పుస్తకంలా
పడుకున్నప్పుడు తట్టిలేపి
సరసన కూర్చునే దివ్య సుందర విగ్రహం కోసం కలలు కంటూనో వున్నా. కాని మధ్యాహ్నం ఏ
పన్నెండు గంటలవేళో హాజరవుతారు
మీరంతా. వళ్ళు మండిపోతుంది. పీక పిసికయ్యాలనిపిస్తూంటుంది. "
ఆ మాట నాతడు ఆహ్వానంగా తీసుకొన్నాడు. రాత్రి మళ్ళీ వెళ్ళేడు, పొద్దుపోయేవరకూ కబుర్లు
చెప్పేడు. అక్కడే పక్క వేశాడు.
చల్లగా మేడగది తలుపు వేసేశాడు. అర్హరాత్రీ, వెన్నెలా, మళల్లొపువ్వులాంటి పరుపూ వగైరాలతో
నిమిత్తంలేకుండానే ఆమె అతనిని
ఆ(క్రమించింది. కాని ఆ సంగమంలో సారస్యం కనబడలేదు. దివ్యసుందర విగ్రహం కొసం కలలుకనే
మంజులత మాటలూ చేష్టలూ అతడి
మనస్సుకి పాకీ దొడ్డికి పోయివచ్చినంత సుఖాన్నీ, అసహ్వ్యాన్నీ కలిగించేయి. ఆ విసురున ఇంటికి
వచ్చేడు. తనభార్యను
తానువిపరీతంగా గ్రేమిస్తున్నాడు. ఆమె సాంగత్యంలో తన మనస్సులోని అసంతుప్టిని
పోగొట్టుకోవాలనుకున్నాడు.
రాజ గోపాలం కళ్ళువిప్పార్చి మిత్రునిగాధ విన్నాడు.
"కామంవుండేచోట (పేమ వుండేటట్లయితే నిన్నరాతి నాభార్యని బాధించివుండను. తన
స్నేహితురాలికిగాని, నీకుగాని మెలకువవచ్చి, మేం
కనబడకపోతే నవ్వుతారంది. సిగ్గుపడి పోవలసి వస్తుందని _బతెమలాడింది. కామం _పేమను
చేరనిచ్చేదైతే నను నిన్న నామమాట
వినకపోయేవాడినా? ఆమె మనస్సు కష్టపడుతూందని తెలుసు. రబ్బరుబొమ్ములా నాచేతుల్లో వుంది.
ఎరుగుదును. అది సుఖంకాదు.
త్యృప్తీలేదు. సరిగా మంజులతతో గడిపిన సమయంలో కలిగిన అసంత్యప్తే.”
తన భార్యతో తాను గడిపిన క్షణాలను గురించి వెంక్కటావు చెషోంకు ఆశ్చర్యం కలిగింది. అటువంటి
ఆత్మీయవ్యవహారాలను ఒకరితో
వొకరు చెప్పుకోగలరని అతడెప్పుడూ అనుకోలేదు. అటువంటి సమస్యకు తానేం సమాధానం
చెప్పగలడు? ఆరోగ్యంలేని
బలహీనులైనవాళ్లూ, వయస్సు వడిమళ్ళిన రెండో మూడో పెళ్ళి వాళ్ళూ, వయస్సులో వన్న
ఆరోగ్యవంతురాళ్ళని కట్టుకొని, తిండి
పెట్టలేకపోయినా ఏకుటా పిల్లల్ని కనిపించే మనస్తత్వం గురించి ఇదివరలో ఓ మారు వెంకటావే
ఉపన్యసించేడు.
"దొంగదెబ్బుతీసే రౌడీలరకం వీళ్ళంతా. నిత్యజీవితంలో పెళ్ళాలతో ఏడవలేక, చంటిపిల్లల చాటున
తమ మగతనపు ప్రతిష్ట
కాపాడుకొంటారు .”
కొంచెం ఇంచుమించు అటువంటి మనన్తత్వమే వెంకటావు ఆచరణలోనూ కనబడింది. ఇష్టంలేని
సమయంలో మగతనం చూపించి విసిగించి ప్రజ్ఞ
నిలుపుకొనే ఈ మనస్తత్వానికి మూలం ఏమిటో....
తాను పుస్తకాలలో చదివింది తప్పు ప్రత్యక్రానుభవం లేదు. ఆ చదివిన ఆలోచనలతోనే సమాధానం
చెప్పుడానికి ప్రయత్నించేడు.
"_పేమలేనిచోట కామత్యృప్తికి ప్రయత్నించకూడదనోది మన మనోబలం, మన సంస్కారం- వీనికి
సంబంధించిన సమస్య. నీకు సంస్కారం
వుంది. మనోబలం చూపలేకపోయావు. ఆ బలహీనతమీద నీ సంస్కారం తిరుగుబాటు చేస్తూవుంది. ”
వెంకటావు ఏమీ మాట్లాడలేదు, చాలసేపటివరకూ. రాజగోపాలం ఆఫీసుకుపోయే సన్నాహాలు
చేసుకొంటున్నాడు.
"ఈవేళ రాత్రి బండిలో మేమిద్దరం క్రదరాబాదు వెళ్ళిపోతున్నాం. వచ్చినప్పుడు మేము
ఒకటనుకొన్నాం. అది జరిగే అవకాశంలేదని
మాకు అర్ధం అయింది. వెళ్ళేముందు నీకు 'కంగ్రాచ్యులేషన్సు ' చెప్తే తప్పు పట్టుళోవుగా.”
"నువ్వు అనుకొన్నదేమిటో, అర్హమయిందేమిటో నాకు తెలియలేదు."
"అర్దం కాకపోవడంవలన మునిగిపోయిందేమీ లేదులే.”
ఒక్క నిముషం పోయాక అన్నాడు.
"జీవితానికి సరిపడా డిసప్పాయింట్ మెంట్! దురదృష్టవంతురాలు! *
ఏ విషయమూ బయటపడి తీవ్రమైన మనస్తాపానికి గురికాక పూర్వయే సుజాత నక్కడినుంచి
తీసుకుపోవలసిన అవసరాన్ని ఆ దంపతులు
[(గ్రహించేరు. కాని, సుజాత కదులుతుందా? సెలవుల్లోకూడ ఆమె యింటికి పోలేదన్నారు.
దానికికారణం రాజగోపాలమేనని వెంకటావు
వచ్చినరోజునేో గ్రహించేడు.
నిజంచేత సుజాతను కదలడం ఒక పట్టాన సాధ్యం కాలేదు. అజంతా-ఎల్లోరాలు చూడాలనే
కుతూహలం కూడా ఆమెను కదిలించ లేదు.
"అబ్బ! ఈ ఎండల్లో సంచారమేమిట్నరా” - అని విసుక్కుంది.
"విజయవాడ ఉదకమండలంలా వున్నదేమ!” - అంది వసంత.
"కాకపోతే మాతం? ఇంటిపట్టున కూర్చుంటాంకద ! ”
"ఓ నాల్లాళ్ళు తిరిగిరాకుండ, ఏమికే గుడి పాములా ఇంటికి అంటుకుపోతానంటావు? పెళ్ళయి
మొగుడు పిల్లలూ అంటూ ఏర్పడ్డాక
కదలాలన్నా కదలగలవా?” అని రామలక్ష్మమ్మ మేనకోడల్ని (ప్రోత్సహించింది.
"అబ్బ! నీకిక్కడ కష్టంగా వంకే ఆ నెల్లాళ్ళూ నువ్వే తిరిగిరా అత్తా! నేనూ అక్కా కారియరులో
తింటాం.”
వెంకటావుకు అర్హం అయింది. పెళ్ళయిన వాళ్ళకన్నా ఎక్కువ 'జెలసీ! చూపూూంది. కల్యాణినీ,
అతనినీ వొంటరిగా ఒకయింట్లో
వదలడం ఇష్టంలేకనమో ఈ గడసరితనం అనిపించింది. వసంత నవ్వింది.
కల్యాణీ ఈ చర్చులన్నీ వింది.
"ఎందుకా దాని నంత బలవంతం చేస్తారు!”
"చూడక్కా? రానుమొరోమంటూంకే. ..”"” అని సుజాత గారం గుడిచింది.
కాని ఆమె బయలుదేరింది. అక్కా బావా నిష్టురంగా మాట్లాడేసరికి కదిలింది. కాని షరతు పెటింది.
"ఒక్క పదిరోజులంకే పదిరోజులేన్నరోయి. "”
ఇరవయ్యుకటో ప్రకరణం
వీధిలో కల్యాణికోసం ఎవరో అడుగుతూండడం విని రాజగోపాలం తన గది తలుపు తీసుకొని
వరండాలోకి వచ్చాడు. ఎదుట కనబడిన
వ్యక్తిని ఎక్కడో చూచినట్ట్లుంది. గుర్తురాలేదు. ఆహ్వానించాడు.
"దయ చెయ్యండి.”
వరండాలో కుర్చీ చూపేడు. నారాయణరావు కూర్చుని జేబురుమాలుతో మొగం వత్తుకొన్నాడు.
"వర్షాలు పడ్డా దిక్కుమాలిన వూళ్ళో ఇంత వుక్కపెడుతూంది.”
రాజగోపాలం చిరునవ్వు నవ్వేడు.
"త్రానుగు జిల్లాల్లో మూడు కాలాలు. వేసవి కాలం, వర్షాకాలం, శీతాకాలం. ఇక్కడ ఈవూళ్ళో ఒక్కకు
కాలం. వేసవికాలం.
మిగిలినవి రెండూ అతిధులు.”
"బాగా చెప్పేరు.” అన్నాడు నారాయణరావు.
"తమరు కల్యాణీదేవిగారికి. ..”
"నేను వారింట్లో అద్దెకుంటున్నానంతే. ”
"ఈ యిల్లు వారిదేనా?”
"కాదండీ. వారూ, మరొకరూ కలిసి ఇల్లు అద్దెకు తీసుకున్నారు. .... 7
"తమరు సబ్- శైనాంట్...”
"అంతేనండి.”
రాజగోపాలం లేచేడు- "వారు లోపల వున్నారనుకుంటా, కూర్చొండి వస్తారు.”
"తొందరలేదు, తొందరలేదు. *”
కొద్దిసేపటిలోనే కల్యాణి వీధిలో ఎవరో కొత్తవారు పచారు చేస్తూండడం గమనించి వచ్చింది.
"ఎవరు కావాలండి!
"తమరేనా కల్యాణీదేవిగారు. ..”
తన ప్రియ శిష్యురాలు మైోమవతి అన్న అని తెలిసి కల్యాణి చాలా సంతోషించింది. లోపలి
చావడిలోనికి పిలిచి కూర్చోబెట్టింది.
"తమరు మా చెల్లెలి యెడల చూపిన ఆత్మీయతకు అభివాదనలు తెలపడానికి వచ్చేను.”
"ఆ విషయంలో నా ప్రత్యేకత ఏమీ లేదు. హైమ సులభంగా ఆత్మీయత పెంచుకొంటుంది.
ఎదుటివాళ్ళలో ఆమె చూసేమంచి ఆమె లోని మంచికి
ప్రతిబింబం మాత్రమే.”
నారాయణరావు స్కూలు పరిస్థితులను గురించీ, చెల్లెలి చదువును గురించీ తెలుసుకొన్నాడు.
"ఆమె చదువు ఆలనస్యమైపోయింది. మంచి తెలివిగలదీ, చురుకైనదీను.”
నారాయణరావు అనుతాపం వెలిబుచ్చాడు.
"ఆమె చదువుగురించే కాదు, ఆమె విషయంలోకూడా నేను శ్రద్ధ తీసుకోవడం అన్యాయమే చేశాను.
మా పినతల్సిగారివాళ్రు ఛాందసులు.
ఆడపిల్లకి చదువేమిటన్నారు. మళ్ళీ ఎందుకో చేర్పించారు. చదువుతూంది. ఇప్పుడే పెళ్ళి, ఏం
బాగులేదు. మొన్న
మీరువచ్చినప్పుడన్నారట. అదే సిసలు. నేనూ అదే అన్నాను. కాని ఏం చెయ్యగలం?”
ఆయన అంత బబహ్మాండంగా స్వీకరిస్తున్న తన ఆ అభిప్రాయం ఏమిటో కల్యాణికి జ్ఞాపకం రాలేదు.
"తమరామె చదువును గూర్చి పట్టించుకోలేదని నేననలేదే. నాకా మాకే తెలియదే.”
నారాయణరావు ఆశ్చర్యంనుంచి తేరుకొని నవ్వేడు. తన మాటకు వచ్చిన వ్యాఖ్యానం విన్నాక అతడు
క్షమాపణ చెప్పుకున్నాడు.
"క్షమించండి, నా అభిప్రాయాన్ని సరిగ్గా చెప్పలేకపోయాను తప్పు, వేరేం లేదు.”
కాని, కల్యాణికి ఆయన మాటల్లో విశ్వాసం కలగలేదు. తన అభిప్రాయాలను అంగీకరించడంలో ఏదో
ఎత్తు వుందనుకోకపోయినా, గిరీశం
ధోరణి వుందనిపించింది.
ఆయన తన అభిప్రాయాన్ని తెలుగు, హిందీ, ఇంగ్లీషు మూడు భాషల్లోకి అనువదిస్తూ తంటాలుపడి
వివరిస్తుంటే కల్యాణి చిరునవ్వు
నవ్వింది. అయితే అంతా విన్నాక: ఆయనమీద సదభ్శిపాయమూ కలగలేదు. ఆయన అనుతాపాన్నీ
అంగీకరించలేదు.
తల్లిదండ్రుల్ని కోల్పోయేనాటికి హైమవతి రెండేళ్ళది. ఆమెను పినతల్లి తీసుకొచ్చి పెంచింది.
అప్పుడప్పుడు నూరో, ఏభయ్యో పంపడం
తప్ప ఈ పదారేళ్ళల్లో చెల్లెల్ని గురించి అతడు శ్రద్ధ చూపలేదు. అయిదారేళ్ళ [క్రితం
వచ్చినప్పుడోమారు చూడడం తప్పు ఆమె
ఆయనను చూడనూ లేదు. అటువంటి వ్యక్తి ఈవేళ ఓమారు చుట్టప్రచూప్రగా వచ్చి, అసలు
కష్టమంతాపడి పెంచిన వాళ్ళకి వంకలు
పెడుతున్నట్లనిపించింది.
"ఇంకా మేలేకదా. కనీసం క్రమ కిష్టం-అయిష్టం కనుక్కొని...”
నారాయణరావు సిగరెట్టు తీసేడు.
"అభ్యంతరం లేదుగదా?”
కల్యాణి 'ఏష్[శ్రే' టీపాయి మీద పెట్టి ఆయన కూర్చున్న సోఫా ప్రక్కకు నెట్టింది.
"ధ్రాంక్సు. వెనుకటి రోజులు కావుగా, పాతికేళ్ళ కుురాళ్లి కూడా ఎందుకు చేసుకోవని బాయించి
పెళ్ళిచేసెయ్యడానికి. .."
కల్యాణి ఒప్పుకుంది.
"ముసలమ్మగారే ఈవేళ తనకీ పెళ్ళికుదరడంలో కారణం అని మైమ అంటూంది...”
నారాయణరావు తగ్గేడు.
"నిజమే ననుకోండి. కాని, మరో నాలుగేళ్ళు ఆగితే బాగుండేది కదా అని. ఆగితే దాని కాలేజీ చదువూ
అయ్యేది. పాతికేళ్ళుక్రితం
ఆడపిల్ల చదువుమాట ఎవరికిపట్టిందంది మా కృష్ణ. అల్లా వస్తే ఆమాట నిజమేననుకోండి. "
కల్యాణి చిరునవ్వుతో సమాధానం ఇచ్చింది.
"కాలంలో మార్పు వచ్చినా, ఆచారాల్లోనూ పద్ధతుల్లోనూ ఎన్నిమార్పులొచ్చినా అలవాట్లంటూ
వుంటాయికదా. మనిషి మనమ్సుమీద తర్కం
ప్రభావంకన్న అలవాటుప్రభావం అధికంగా వుంటుంది. ఆడపిల్లనో అయ్య చేతిలో పెప్టయ్యుడం
ముఖ్యమనే ఆలోచించడం
మనకలవాటు. ..”
నారాయణరావు నవ్వేడు.
"అందరికీ అనకండి. తమరున్నారు. మీ పెద్దవాళ్ళకా అలవాకొందుకు రాలేదు?”
ఆప్రశ్నకు కల్యాణి ముఖంలో అసంతృప్తి కనబడింది. నారాయణరావు నర్దుకొన్నాడు.
”ఇంతకీ-ఇది అలవాటనడంకన్న అజ్ఞానం అనుకోవాలంటా. "”
"మన ఆచారాలు మారడంతో మనఅలవాట్లలో కూడ తప్పునిసరిగా మినహాయింపులూ, సవరణలూ
వచ్చితీరుతాయి. వయస్సు వచ్చేక పెళ్లి
చేయడం ఆచారం అయింది. ఇప్పుడు తమకు నచ్చితే ఇచ్చే అలవాటు మార్చుకొని పిల్లదానికి
నచ్చేటట్లయితేనే ఇవ్వడం అలవాటు
చేసుకొంటున్నారు. ఇంతకీ హైమకీ వరుడు నచ్చేడు...”
నారాయణరావు ముఖంలో కొంచెం నిర్వేదం కనబడింది.
"నచడమా! ఆ మాట దాని మానసికఫ్టితిని తెలపడానికి ఏ మాత్రమూ చాలదు. 'మోర్ లాయల్
దేన్ ది కింగ్! అంటాం చూడండి!
కాబోయే అత్తవారి విషయంలో అది చూపుతున్న శ్రద్దా- భక్తీ చూసి ఆ కురాడే అదిరిపోయేడు.
ఏమందో కాని మా కృష్ణవేణి
నిన్నల్లా ఏడుస్తూంది. మా అమ్మమ్మ ఇప్పుడీ పెళ్ళితలపెట్టి తపుపనయిందని ఏడున్తూంది. ”
కల్యాణికి చాలా ఆశర్యం కలిగింది. మమ చాల నెామ్మదైన పిలయని ఆమె ఎరుగును.
"అదేమిటి? మీరేదో అసంభవ విషయం చెప్తున్నారు. హైమకి తమవాళ్ళ మీద వెరి ఆప్యాయం."
కాని అదీ నిజమేనని నారాయణరావు చెప్పిన దానిని పట్తి తేల్పుకోక తప్పింది కాదు. ఆ వెనుకటి
రోజున కృష్టవేబీ బజారు
కెళ్ళి పెళ్ళి సామానులు తెచ్చింది. క్రమ వాటిని చూచి మూతి ముడిచింది. ముఖ్యంగా పానకపు
బిందెలు చూసేక ఆమెకెంతో తామసం వచ్చింది.
"కట్నం గిట్నం లేదు కదా, అన్నయ్య అయిదువేలు పెళ్ళి ఖర్సు కిస్తున్నాడాయెొ, ఆ దబ్బు ఖర్చు
చేసి కాస్తశుభమైన
వస్తువులు తెస్తేనేం?” అంది.
"మెలి చేసుకొన్న వెధవముండ పున్నిస్తేదవుతుందా? ఆ మొహాని కీబవిందె చాలునులే-” అని
ఈసడించిందట కృష్ణవేణి.
నారాయణరావు ఆ ఘటనను సవిస్తరంగా చెప్పడానికి సిగ్గుపడ్డాడు.
"హైమ ఆమాట వినేసరికి మండిపడింది. ఆ బిందెలు రెండూ పెరట్లోకి విసిరేసింది. అటునుంచి
వస్తున్న మా ముసలమగగారికి కొట్టుకొని
ఆమె గోలెత్తేసింది.
"బహుశ నువ్వుకూడా నా అత్తారివాళ్ళని అవమానం చెయ్యాలనే క్కుటలో చేరివుంటావు. అందుచేత
భగవంతుడా శాస్తి చేశాడు.” అంటూ
మోమ అమ్మమ్మను వూరడించడానికి బదులు తిట్టొిపోసింది.
"మీ సంప్రదాయం తగులడ్హప్పే వుంది. నాకీ యింట్లో పెళ్ళి అక్కర్లేదు. రిజ్మిస్టాఫీసులో
జరగవలసిందే” నని ఆమె పట్టు
పట్టింది.
"ఆ మొగుడు కృురాడు మహా సౌమ్యుడు. దాని ధోరణి చూసి ద్విగ్పుమ చెందేడు. శాంతపరచడానికి
ప్రయత్స్నించేడు. కాని అదే
వినలేదు. మనుష్యుల మర్యాద చాటునైనా వుంచనివారు ఎదుట అసలే వుంచలేరు. 'వీళ్ళచేత
అవమానింపబడేవాళు నా అత్తారయ్యారంకే
నాకు తలవంపు-' అంది. అతడు నా వద్దకు వచ్చేడు. నేనేం అనను! దానిమీద నాకేం పలుకుబడి
వుంది. 'నీ అయిదువేలూ
మిగులుతాయి. పాతికరూపాయల ఖర్చుతో పెళ్ళయిపోతుంది. వాళ్ళకి అవమానం తప్పుతుంది. !' అదీ
దాని పాట."
మోమవతి పులివేషం ఎందుకు వేసిందో కల్యాణికి అర్దం అయింది. "భారత మహిళ! బవిరుదం
్రతిష్టాకరం కాదు సుమీ యని తానే అంది.
సంతోషం కలిగింది. కాని కమైకేమీ తేలలేదు.
"అయితే ఇప్పుడేం చెయ్యాలి? కృష్ణవేణీ గా రామాట అనడం బాగులేదు. పిల్లవాడి బంధువులయొడ
మర్యాద భావం లేనప్పుడు నటన
లాభంలేదు. మర్యాదగాని అమర్యాదగాని చూపనవసరంలేని పద్ధతికి సిద్ధపడాలి. *
నారాయణరావు "నిజమే! నన్నాడు.
"కాని, దాని ధోరణి, గంతులు చూస్తే ఆ అత్తారివాళు ఏమనుకుంటారూ?”
"ఏమీ అనుకోరు. తమకవమానం చేయడానికి కృుటచేశారని తెలిసినా ఏమీ అనకుండా వూరుకున్న
కోడలు మహా యిల్లాలని ఎవరూ
అనుకోరు. అల్లాగే వూరుకొంకేు ఆమెకా ఇంట్లో సద్పావం మిగులుతుందని ఎప్పుడూ అనుకోకండి.
ఇప్పుడు మిమ్మల్ని సలహాఅడిగిన మగడే
రేపటినుంచి సందుదాొరికితే వెక్కిరిన్తాడు. ”
నారాయణరావు ఏమీ మాట్లాడలేదు.
"అవన్నీ అటుంచండి. తన అత్తవారివాళ్ళునే కాదు. సంబందబాంధవ్యాలు పెట్టుకోదలచుకొన్నచోట
ఇల్లాంటి కుటధోరణులు రాకూడదు.
మీరేం అనుకుంటున్నారో తెలియదుగాని ఆమె చూపిన ధోరణి సరిరైనదేననుకొంటా. "”
"ఆ హంగామా, అల్లరీ, ఏడూ చూస్తే మీరల్లా అనరు.”
"ఆ విషయం నేను చెప్పులేను. ఆ ధోరణి ఏ మోతాదులో చూపించాలనోది పరిస్థితుల్ని బట్టి
ఎవరికివారు నిర్ణయించుకొంటారు .”
నారాయణరావు వారుకున్నాడు.
"తమరంశే మైోమకి చాల మంచిఅభ్మిపాయం వుంది. తమరు కలగచేసుకొని పరిస్థితి చక్కబరుస్తారని
వచ్చాను.”
"అంకే?...”
సాంప్రదాయక పద్ధతిలో జరిగే వివాహంలో తాను పీటమీద కూర్చోడు. రిజిఫ్రరు చేయించడానికి
పద్దెనిమిదేళ్ళు నిండలేదు. అది
ఆటంకం. ఇంత జరిగేక ఆ యింట్లో వుండనంటుంది. "మీ యింటికి పోదాం నడవ” మని మగడిని
లేవదిస్తూంది.
కథ చాలా దూరం పోయిందని కల్యాణి (గ్రహించింది. వీలుచిక్కితే ఆ నవదంపతుల కనుకూలంగా
సర్దుబాటు చేయాలనుకుంది. ఆ వరుడివేపు
ఆర్దికప్టితినామె యొరుగును. మొన్ననాతడే చెప్పేడు. తండ్రి అతని చదువునే అతి కష్టమ్మీద
నెట్టుతున్నాడు. అక్కడికెడితే
మైోమ చదువు సున్నో. ఇంత జరిగేక ఈయింటవున్నా అంతే అవుతుంది. మైగా ఆమె వుండదుకూడా.
” పెళ్ళిఖర్సు అయిదువేలు మీరివ్వడం ఏమిటి?”
"దానిపెళ్ళికి అయిదువేలిస్తానని నోను వ్రాశాను. అది కట్నంగా ఇచ్చినా, ఖర్చుచేసినా సరేనని నా
అభ్మిపాయం. ”
"దానిని చెల్లెలికివ్వడంకూడా మీ వుద్దేశమా?"”
నారాయణరావు ఆలోచించాడు.
"ఆ విషయం నేనూహించలేదు.”
"ఇస్తే అల్లుడికివ్వాలి, లేదా వూళ్ళో బాజాభజంత్రీలకు ఖర్ఫుయిపోవాలి. అంతేగాని ఆడపిల్లకేం
ఇవ్వక్కల్తేదు. ”
కల్యాణి కంఠంలో వినిపించిన అవహేళనకు నారాయణరావు కంగారుపడ్డాడు.
"తమచేత పెడతాను ఆ అయిదువేలు, ఇష్టం వచ్చినట్ట్లు చేయించండి. కాని, పెళ్ళికానిదే హైమ
ఇల్లుకదలడం నాకిష్టంలేదు. *”
"సెళ్ట్య్ అయిపోవడమే ముఖ్యమన్నమాట. "”
"లేకపోతే వాళ్ళింట్లో మైోమహోదా ఏమిటి?”
"ఏ హాఫ్టలులోనో పెట్టి చదివించండి. చదువయ్యాకనే ఇద్దరూ పెళ్ళి చేసుకొంటారు. ”
"లాభం లేదు. ఇంతవరకూ వచ్చేక ఎంతో న్నిగహశక్తి వుంకు తప్పు చదువుమీదికి దృష్టి పోదు.”
కల్యాణి ఆలోచనలో పడింది.
ఇరవైరెండో ప్రకరణం
ఆ పూట రాజగోపాలం వచ్చేసరికి ఇంకా కల్యాణీ స్కూలునించి రాలేదు. స్నానం చేసి బయటకు
వచ్చేసరికి రామలక్ష్మమ
పలకరించింది.
"నీక్కూడా వుత్తరం రాయలేదుకదు నాయనా.”
ఆమె సుజాతకోసం ఎదురుచూస్తూంది. సుజాత వుత్తరంకూడా వ్రాయలేదు. కాలేజీలు తెరిచేస్తున్నారు.
దాని ముందుమాట ఏమిచేస్తే బాగుంటుందని
ఆమె రాజగోపాలాన్ని అడుగుతుంది. సుజాత విషయంలో ఆమెకన్న రామలక్ష్మమ్మ ఎక్కువశ్రద్ధ
చూప్పుతూంది.
ఈ పట్నవాసపు జీవితం వదిలి పల్లెకిపోయి వుండాలని ఆమె భయం. ఆ లంకంత లోగిళ్ళు
ఊడవడం, రెండడ్డగిన్నాలు వార్చుడం.
"ఇంకా సంసారాలు ఈదగల ఓపిక లేదమ్మా తల్లీ!" అంటూంటుంది కల్వ్యాణితో. అవే మాటలు,
ఆలోచనలు, ఆశలూ, కోరికలు ఈ పది
పదిహేను రోజులనుంచీ వినివిని విసుగుపుట్టింది. ఆమెనుంచి తప్పించుకొనేటందుకు వీధిగుమ్మంలోకి
వచ్చి నిలబడ్డాడు.
గుమ్మంలో గోపాలాన్ని చూసి మంజులత కారు ఆపింది.
"ర్బప్పుడే వచ్చావా?”
అతని ఆహ్వానంకోసం నిరీక్షించకుండానే కారుతలుపుతోసుకొని బయటకువచ్చింది.
"ఎక్కడా కనబడ్డ్దంలేదేం?”
దానికేం సమాధానం చెప్పాలో అర్దంకాలేదు. 'పనేముంద ' ననిపించింది. కాని అనలేకపోయాడు.
"నీవార్త తెలుస్తూనే వుంది. మొన్ననే వెంకటావు చూసి వచ్చానన్నాడు.”
మంజులత నవ్వింది.
"జెలసీ. ..”
"ఆశా, అధికారమూ వంకే తప్పు జెలసీ వుండదు లతా!”
మంజులత అతనిని ఒరుసుకునేోలా వచ్చింది. "మనిషిమర్యాదే మరిచిపోయావేం. ఇల్లా గుమ్మంలో
నిలబెస్టేనా మాట్లాడ్డం? నడులోపలికి.
కల్యాణి లేరా?”
గోపాలం ఒక్కడుగు పక్కకు వేశాడు.
"ఇంట్లో ఎవ్వళూ లేరు.”
"భక్తురాలూ వాళ కూడా.”
రాజగోపాలం ముందుకు నడుస్తున్నవాడు చటుక్కున ఆగేడు.
"అదేమిటి? నా భక్తులంకే? సన్యాసం పుచ్చుకొన్నాననుకొన్నావా?”
మంజులత నవ్వింది.
"సరసుడికీ సన్వాసికీ తేడా వుండదు. నువ్వెరగనట్ట్లు నటించినా సుజాత నిన్ను కళ్ళతో తాగేస్తుందని
ఎవరూ ఎరగరంటావు?”
ఆ విషయం చర్చుల్లోకి రావడం రాజగోపాలానికిష్టంలేదు.
” సెళ్యికావలిసిన పిల్ల. అన్యాయంగా మాట్లాడకు. "
మంజులత నవ్వింది.
"నీ మాశేమిటి?”
"సెల్యిళ్రు కుదరడం వయసుమళ్శినవాళ్ళు చేసేపని. *
మంజులత ఠీవిగా గదిలోకి వచ్చి మెడలో వున్న ఫ్రెత్ స్కోప్ బల్లమీద పడేసింది. ఎదుట గోడనున్న
మసెద్దఅద్దంముందు నిల్చుని
జుట్టు సవరించుకొంది.
"అల్లా కూర్చో.”
ఆమె వెళ్ళి మంచం మీద కూర్చుంది. గోపాలం తన కుర్చీ కిటికీవద్దకు లాక్కుని కూర్చున్నాడు.
"ఏమక్కడ కూర్చున్నావు.”
"రక్కడికే బాగా కనిపిస్తున్నావు. "”
మంజులత అతనివేపు చూసింది.
"నోనిల్లా పడుకుంకే నీ కభ్యంతరం లేదు గదా.”
అతడేమీ అనలేదు. మంజులత మంచంమీద వెల్లకిలా పడుకుని చేతులు తలక్రింద పెట్టుకుంది.
గోపాలం ఫాన్వేసి ఆమె వేపు
తిప్పుడు.
”ధ్యాంక్సు. ”
అతనివేపయినా తిరక్కుండా ప్రశ్నించింది.
"నిన్ను ఒక సంజాయిషీ కోరుతున్నా.”
"ఏమిటా కొత్తమాట .”
"నువ్వీమధ్య తరుచుగా మనస్సులో మెదులుతున్నావు. ”
రాజగోపాలం గాంభీర్యం చూపేడు.
"అది తప్పుపనే మరి.”
"వేలాకోళం కాదు.”
"అంకే... నీకు ... నా...”
"అబ్బ! ఆపు. దానికేదో పవిత్రమైన పేరు తగిలించి హత్య చేయకు. మనుషులం మనుష్యులుగానే
బతుకుదాం.”
"ఏదో పవిత్రమైన పేరు తగిలిస్తానేమోననే భయం ఎందుకు? పేరు పవిత్రం కాకుంకు ఆ భావమే
పవ్శితం కాకూడదూ.”
మంజులత వారుకొంది. ఒక్క క్షణమైనాక ఉన్నట్లుండి ఒక ప్రక్కకు తిరిగి ఒక మోచేతిమీద ఆనుకుని
లేచింది.
"ఎంతో స్వల్పువిషయాలలోకూడ మనుష్వుడి జీవితం ఓటమి పొందుతూనే వుంటుందెందుచేత?”
రాజగోపాలానికామె మాట అర్దంకాలేదు. ఆ మాట అనేసి మంజులత వెల్లకిలా తిరిగింది.
"మాయ పెళ్ళి చేసేసుకుంది.”
"నన్నడుగుతే మంచిపని చేసిందంటాను.
మంజులత చోలీలోంచి ఒక వుత్తరం తీసి చేతికిచ్చింది. అతడు పూర్తిగా చదివేవరకూ ఆగి
శుశ్నాంచింది.
"బాగుందా వరస.”
రాజగోపాలం ఆ ఉత్తరాన్ని మళ్ళీ ఆమెకందించాడు.
"మనుష్యుడు ఎప్పుడూ దెబ్బే తింటాడని ఎవరు చెప్పేరు లతా! నువ్వు అనుకొన్నవన్నీ
జరగకపోవచ్చు. అది మనుష్యుని వైఫల్యం
కాదు.”
ఏదో జ్ఞాపకం వచ్చినట్లయి మంజులత విరగబడి నవ్వింది.
"మా వూళ్ళో ఓ వడ్రంగి ఓ మాట అన్నాడనేవారు. ఆ రోజులో ఆడపిల్లలకు పెళ్ళిసంగీతం
మహాజోరుగా చెప్పించేవారట. ఇంటింటా
హార్మోనియంలూ, ఫిడేళూ వచ్చేయి. ఎవళ్ళో వేళాకోళానికి ' వీరయ్యా హార్మనోపెట్టై చెయ్యగలవా!
అన్నారట. అతడు సెక
చూశాడు. అటూ ఇటూ తిప్పేడు. 'ఆరు మానికల పెట్టు చెయ్యగలను కాని బాబూ! మూలుగు
పెట్టలే! నన్నాడట. నాదీ అదే
దుఃఖం.”
మాయకు చదువు చెప్పించింది. మనిషిని చేసింది. కాని ఆమెను తన యిష్టానుసారం
మలచుకోలేకపోయింది. శ్లీవైష్టవి తంబళ్ళ
క్నురవాడిని పెళ్ళి చేసుకుంది. రాజగోపాలం నవ్వుకున్నాడు.
మంజులత ఆవలించింది.
"ఒక్క గంటసేపు లేపకు.”
"సంజవేళ న్నిద్రేమిటి?”
న్నిదకీ చావుకీ వేళేమిటయ్యా? గాలిబ్ గీతం మాటమాటకు జ్ఞాపకం వస్తూందీమధ్య-
' ఎవరితో చెప్పికొందు
నా దురదృష్టాన్ని?
చావే రాకుంది ఎంత
కావాలనుకొన్నా. '”
"ఇందాకా నేను అనుక్షణం జ్ఞాపకం వస్తున్నానన్నావు. ”
మంజులత నవ్వింది.
"నేను అనుక్షణం కోరుతున్న మృత్వువూ, రాకుండా వున్న మృత్వ్యువూ నువ్వేనేమో. "
రాజగోపాలం లేచేడు. గదిలో సగభాగం పర్యాలోకన చేస్తున్న కశేబుల్ఫాన్ను ఆమె మీదికే స్థిరంగా
నిలిపేడు.
"ఈ న్నిదనుంచి లేవకపోతే బాగుండుననిపిస్తూంది.
ఆమెలోని ఆ నైరాశ్యం ఏమిటో రాజగోపాలానికి త్వరలోనే అర్హమయింది.
"బోర్డు బోర్లించేసి, ఏదో మారుమూల ఇంట్లో ఇల్లా వుండిపోగలుగుతే. ..”
” ఆ జీవితం ఎంతో కాలం మింగుడుపడదు మంజులతా! మొగం మొత్తేస్తుంది.”
నిద ఒత్తుకొనివస్తుంకేు మంజులత ఆ మగతలోనే అంది.
"మనకు అనుభవంలోకి వచ్చే అవకాశం లేనిదానిమీద ఆశ ఎక్కువ.”
ఆమె శ్వాస సమానాంతరంలో పడింది.
రాజగోపాలం నెమ్మదిగా అరుగుమీదకి వచ్చి గది తలుపు జేరవేశాడు.
"గుమ్మంలో డాక్టరుగారి కారు వుంది.”
అప్పుడే లోపలినుంచి వచ్చిన కల్యాణీ మాటకు గోపాలం తిరిగి చూసేడు.
"ఆవిడ లోపల వుంది.”
"మీకు మంచి, ఎక్కువ పరిచయమే వున్నట్ట్లుంది.”
రాజగోపాలం ఆ మాటకు 'ఆ' అన్నాక గాని, ఆమె కంఠంలో ఏదో ప్రత్యేకత వుందనిపించలేదు.
"ఏమల్లా అన్నావు?”
"ఏమన్నాను?”
అదో వింత ప్రశ్న. రాజగోపాలం ఆమె ముఖంలోకి చూసేడు. కాని, కల్యాణి వెనుతిరిగి పోతూంది.
అతడు పిలవబోయాడు. కాని, ఆమె
అప్పుటికే లోగదిలోకి వెలిపోయింది. అతడక్కడే అరగంటమైగా కూర్చున్నా ఆమె లోపలినుంచి
తొంగికూడా చూడలేదు.
మంజులత న్నిదలేచి కల్యాణిని చూడడానికై లోపలికి వెళ్ళింది. పకపక నవ్వుతూ పరుగెత్తి వచ్చింది.
కేబిల్ మైనున్న స్టెత్
స్కోపు మెడలో వేసుకుంటూ అతనినాగాదిగా చూసింది.
గాపేమ అనేది చాల ప్రమాదకరమైనదిలా కనిపిస్తూంది. _పేమించబడేవాడు అదృష్టవంతుడా,
అబభాగ్యుడా అంక చెప్పలేమనిపిస్తూంది.
మనం ,పేమించేదానివేపు ఇతరులు చూడనోరాదనో ఆస్తి యాజమాన్య స్వభావం వుందే
చాలభయంకరం. మనం గ్రేమించే దేవజ్లీ ప్రపంచంలో
ప్రతి ఒక్కళ్ళూ (పేమించాలంటాం. (పేమించనని మొరాయిస్తే నవఖాలీలూ, జబ్బుల్పూరులు
సృష్టించేస్తాం. ఆ దేవుడికి ఏకాంతశిక్ష
వెయ్యం. కాని గ్రేమించేవాళ్ళనీ, దేవుళ్ళనీ, దేవతలనీ పాగుడుతాం. అరాధిస్తాం. కాని, ఆ దిశగా
మరొకరు [క్రీీంటచూసినా
దుడ్డుకర తీస్తాం. అది దేవత్వమా, అసురత్వమా?”
రాజగోపాలం గదిలోంచి బాగ్ తీసుకొచ్చేడు.
"అదృష్టవంతుడూ, అభాగ్యుడూ అనేది [ప్రేమకు సమాధానం లభించడంమీద ఆధారపడి వుంటుంది.
ఇంక ప్రేమించడంలో మనిషికీ భగవంతుడికీ
పోలికేమిటి? ఒళ్ళో పెట్టుకు లాలించి, ఊచగలవే గాని రబ్బురు బొమ్మకు పాలు కుడపగలవా?
దేవుడూ అంతే. కృష్ణుడిబిమ్మ
చేయికూడా కదపలేదు గనకనో....
న్లిష్యతి కామపి చుంబతి కామపి
రమయతి కామపి రామాం
పశ్యతి సస్కిత చారుపరా
మపరా మనుగచ్యుతి వామాం ||
అంటూ రామప్రియరాగంలో కళ్ళు అరమోడ్స గలుగుతున్నాం.
మంజులత ఒక్క క్షణం అతనివైపు చూసింది. గుమ్మంవేపు నాలుగడుగులువేసి తిరిగివచ్చింది.
చటుక్కున అతనిని కౌగలించుకొంది.
రాజగోపాలం ఆశర్యంనుంచి తేరుకొనేలొప్తునే వీధిగుమ్మంలో మంజులత 'బైబై' అంటూంది.
మరుక్షణంలో కారు గ్నురుమంది. బాబా అంది.
మరల నిశ్శబ్దం.
"ఫీ ఇద్దరికీ మంచి ఎక్కువ పరిచయమే వున్నదే"”- అన్న మాటకర్టం ఏమిటో ఇప్పుడు తెలిసింది.
నిస్తబుడైపోయేడు.
ఇరవైమూడో ప్రకరణం
కల్యాణి ముభావంగా దూరదూరంగా వుండడం రాజగోపాలానికెంతో వేసట కలిగిస్తూంది. ఆమె దూరంగా
వుండడానికి కారణం ఎరుగును. కానీ,
తనకు మంజులత ఏమీ కాదనీ, కల్యాణీ సర్వస్వమనీ ఆమెకు చెప్పడం ఎల్లాగో అర్దం కావడంలేదు.
మంజులతను తాను ముట్టుకోకపోలేదు. కాని, ఆమె యొడ తనకు ప్రమవుందని చెప్పులేదు. ఆమెను
రూర్చిన ఆలోచనలు ఆమె ఎదురుగా
వున్నంతసేపే వుంటాయి. కాని, కల్యాణి తన ఆలోచనాపథాలన్నింటా సాక్షాత్కరిస్తుంది. అంగప్రత్యంగ
సౌష్టవం వున్న స్తీలలో
కల్యాణీ కనబడుతుంది. పువ్వులదుకాణాల మధ్య ఆమె జ్ఞాపకం వస్తుంది. అందమైన పుస్తకం
కనబడితే ఆమెమూర్తి పర్సు
తీయిస్తుంది. మంచంమీద పడుకొన్నప్పుడెప్పుడేనా మంజులత గుర్తు వచ్చినా ఆమెను అనుభవించ
పోయినా విరక్తి కలుగుతుందేగాని, ఆశ,
ఆకాంక్ష కలగవు.
ఇవన్నీ కల్యాణికి చెప్పడం ఎల్లాగ? తాను గ్రుమించే పడుచు ముందు ఏమీ దాచరాదనీ, భార్యతో
మనను విప్పి మర్శాలన్నీ
చ్రెపష్పయ్యాలనీ అంటారు. కాని, ఎల్లాగ? మనుష్యుని మనస్సు తప్పిదాలను బయట పెట్టుకోగల
ధైర్యం చూపలేదు. తప్పు
వొప్పుకోవడం వేరు. అందులో ఎరగనితనం, అమాయికత్వం వుంటుంది. కాని, తప్పిదాలు
చెప్పుకోవడం వేరు, తాను డ్రేమిస్తున్నపడుచుతో
తనపతనాలను చెప్పుకోవడం ఏ వుద్దేశంతో? నవలల్లో వ్రాసేటట్లు ఏ న్నిదపోతుండగానో, పరాగ్గా
వుండగానో ఎవరో అందకళత్తె
తనకు తపోభంగం కలిగించింది కాని నేనేమీ ఎరగనని చెప్పుకోడానికా? లేకపోతే భవిష్యుత్తులోకూడా
నోనిల్లాగే వుండొచ్చు. నా స్వభావం
ఇంతే. ఆడది కనిపిస్తే నారక్తం ఉడుకెత్తిపోతుంది. అల్లాంటి ఘట్టం కనబడ్రా, వినబడ్రా బాధపడకని
చెప్పుడానికా? కేవలం
నీవేలోకంగా వుంటానని చెప్పడం - చూపడం ఎల్లాగ?
రాజగోపాలానికి ఏమీ పాలుపోలేదు. కల్యాణి ఏదోపనిమీద వీధిలోకి తొంగిచూసింది. గోపాలం కుద్చీలో
కూర్చుని వున్నాడు. పలకరించింది.
"రేపు మధ్యాహ్నం చిన్న టీపార్లీ వుంది. మనింట్లో. తమరూ వుండాలి”
రాజగోపాలం లేచి నిలబడ్రాడు.
"మీదీ రెండు రోజుల్నుంచీ నామీద ఎందుకో కోపంగా వున్నారు. నోను....”
"మీమీద కోపంకన్న నామీద అభిమానం ఎక్కువయింది. అంతే....”
"అంకే నాకర్టం కాలేదు.”
"అయితే చెప్తా వినండి. నాకోరిక ఒక్కకు. మీ మనస్సు ఎటుందో నిర్దారణచేసుకొని నడవండి”
”"మీవుద్దేశం నాకర్ట్మమయింది. కాని....”
"దానికి మీరు సంజాయిషీ ఇవ్వనక్కర్లేదు. అవన్నీ మరోమాటు. నాకిప్పుడు తీరికలేదు. "”
కల్యాణి వెళ్ళిపోయింది. రాజగోపాలానికి ఏం చెయ్యాలో తోచలేదు. ఏంచెప్పాలో అర్ధంకాలేదు.
ఓఅరగంటలో ఆమె గొంతుక మరల వినబడింది. మరుక్షణంలోనే ఆమె గదిలోకి వచ్చింది.
"మనస్సులోని మాట దాచుకోడం అసహ్యంగావన్నా ఏంచెయ్యాలి - ఎల్లాచెప్పాలి అనేది చెప్పుడానికి
వ్యవధి కావలసివచ్చింది.
నామనస్సులో ఈ నాలుగు రోజుల నుంచీ మెదులుతున్న రెండు మాటలూ చెప్పేస్తా. కోపం
తెచ్చుకోకండి.
రాజగోపాలం చనువుతీసుకొని చేయిపట్టుకొన్నాడు. తీసుకొచ్చి కుర్చీలో కూర్చోపెక్పేడు.
"అనేమాటలేవో అను. నన్ను లేనిపోని జెలసీతో బాధ పెట్టకు.”
"నేను జెలసీతో బాధపడుతున్నానని మీరు చింత పడొద్దు. జెలసీ అట్టిది. సామాజికమైన ఒకభావన.
సమాజంలో ప్రస్తుతం
వస్తున్న మార్పులతో అదీ తగ్గుతుంది. ఫర్వాలేదు. కాని ఇందాక చెప్పేనే ఆత్మాభిమానం అన్నది :
అదే ఈవేళ బలియంగా వుంది
నాలో....”
"ఆత్మాఖిమానం చంపుకోవలసిన పరిస్థితులు నేను కోరడం లేదు.”
"బహుశా వాటంతటవే వస్తున్నాయి. నన్నేం చేయమంటావని మీ అభ్మిపాయం కాబోలు. మన
సమాజంలో ఇంతవరకూ వుంటూవచ్చిన పరిస్టితులు
మగవాడికి ఆడుది లొంగివుండాల్సిన పరిస్థితులను కలిగించాయి. అల్లా పడివుండాలనేో భావాన్నీ
కలిగించాయి. "
రాజగోపాలం గదిలో పచారుచేస్తున్నవాడల్లా నిలబడిపోయేడు.
"ఇంక రెండేమాటలు. అడ్డు రాకండి. మనసమాజం ఇంకావెనకబడే వుంది. అయినా ఆడుది
తనబబతుకు తాను బ్రతకగలననే ధీమా
క్రమంగా వస్తూంది. ఇదో సంధిదశ. మగవాడు దక్షిణ నాయకత్వం వహిస్తూ ఆడవాళ్ళకి బాధ్యతలన్నీ
వప్పుచెప్పుబోతే సాగేదశ
లేదు, అంతే. ' మోముపయి చేలచెరంగిడి ఏడ్చే' రోజులు పాతికేళ్ళ [క్రితం పోయాయి. అటుతర్వాతే
నో ప్రట్టా.!
కల్యాణీ మారుమాటకు అవకాశం ఇవ్వకుండా చరాలున లేచి వెళ్ళిపోయింది. రాజగోపాలం
ఖీన్నుడయ్యాడు. తాను చెప్పదలచిందేదో వినలేదని
కోపం వచ్చింది. అబేద్యమయిన సంబంధం ఏర్పుడ్డానికిముందే ఎదుటివాళ్ళ తలతిక్కలూ, తప్పు
ధోరణులూ, అర్హంకావడం
మంచిదేననిపించింది.
ఆ అవేశంలో టీపార్దికి తానుండకూడదనుకొన్నాడు. కాని, ఆలోచిస్తే తన కోపాన్ని ఆవిధంగా చూపడం
మంచిది కాదనుకొన్నాడు.
తాను కోపం తెచ్చుకోవడంకూడా అన్యాయమే అనిపించింది. ఏమంకే ఆమె వ్యతిరేకించేవిధంగా తన
పనులూ ఆలోచనలూ సాగడం లేదూ.
మైమవతి దంపతుల కోసం ఏర్పాటుచేసిన చిన్న విందు అది. వారిద్దరు, మంజులత అతిధులు.
కల్యాణీ యువదంపతుల వివాహవిశేషాలను తెలుసుకోవడంలో అత్యధికోత్సాహం చూప్రుతూంకే
రాజగోపాలం తన్ను విస్మరించినప్లై
బాధపడుతున్నాడు. మంజులత రాగానే ఆమెకాతని ప్రక్కనే సోఫాలో చోటు చూపెట్టింది.
మంజులతను తనటప్రక్కనేో కూర్చోబెట్టడం అతనికి కక్షగా కనిపించింది. మంజులత కూడా ఆ రోజున
అంత హుషారుగా కనిపించలేదు.
కల్యాణే ఆమెను కవ్వించి మాట్లాడుతూంది. కాని ఆమె తనధ్యాసలోనే పడివుంటూంది.
టీలూ, టిఫిన్లూ అయినాక కల్యాణి యువదంపతులతో మాట్లాడుతూవుండగా రాజగోపాలం
నామ్మదిగాలేచి తన గదిలోకి
వెళ్ళిపోయాడు. డాక్టరు మంజులత అతనిని అనుసరించింది.
"ఏమయ్యా! గ్రేమాయణం మాటలాడుకోలేని దశకు వచ్చినట్లుందే,; ౫”
రాజగోపాలం వులికిపడ్డాడు. మంజులత తనవెనకనో వున్నదని అతడింతవరకు గమనించలేదు.
"అందుకే పెళ్లీ - ేమా ఒకచోట వుండలేవంటాను. ఆడది కావాలంకే పెళ్ళి చేసుకో. (పేమ
కావాలంకే పెళ్ళిమాట తలపెల్సకు.”
రాజగోపాలం ఆమె మాటలను హాస్యంగా తోసివెయ్యాలనుకున్నాడు.
"నువ్వసలు పెళ్ళి పనికిరాదంటావనుకుంటాను. ”
మంజులత నవ్వింది.
"అది యోగులకు. పెళ్ళి నీబోటి రోగులకు."
"నాకేం జబ్బు.”
"అజీర్దం. హరాయించుకీలేవు.
రాజగోపాలం చిరునవ్వు నవ్వేడు.
"నువ్వు హరాయించుకోడం అంకే జ్ఞాపకం వచ్చింది. మావూళ్ళో ఒకాయన వుండేవారు.
నువ్వుచెప్పినట్లు హరాయించుకొనో శక్తి ఆయనకు
ఎక్కువే అనోవారు. నోనెరగననుకో, మనిషిని చూసిన గుర్తుకూడా చాలతక్కువే. ఆయన
దక్షిణనాయకత్వానికి ఫలితంగా
నలుగురైదుగురు అడుక్కుతినోేవాళ్ళూ, ఒకరౌడీ, ఇద్దరు అంట్లు తోముకొనీ, వ్యభిచారం చేసీ
బతుకుతున్నవాళూ, మావూరికి
అభ్యమయ్యారని చూపించేవారు. ఆయన తెచ్చి అందించిన రోగాలతో తీసుకుంటూ ఆయన భార్య
ఇద్దరు వెరివాళ్ళని, మతిభ్రష్టల్నీ
వూరుకిచ్చింది. ”
"ఆ రోజుల్లో అల్లా సాగింది వాళ్ళ ప్రభ.”
"అదే నేననేదీను. ఆడదాని విషయంలోనూ, సంతానం విషయంలోనూ ఆయన ఏమాత్రపు
కనీసబాధ్యతా చూపించలేదంటాం మనం. ఓమారాయనకి
చలి జ్వరం వచ్చిందట. "నాలుగురోజుల నాడు ఓఆడ' ుుదోమ ఎగురుతూంకేు ఊరికే
పోనియ్యడమేమని దగ్గరికి తీసుకున్నాను. ఇదీ
ఇల్లాంటిదీ మనకేం కొత్తకా'దన్నాడట. నువ్వు అయితే ఆయన్ని రోగుల్లోకి చేరుస్తావో, యోగుల్లోకి
చేరుస్తావో మరి.”
ఆ వెక్కిరింతను మంజులత నిర్లక్ష్యం చేసింది.
"ఏమిటయ్యా! ఈవేళ మరో కొత్త మాట తెచ్చావు. డచేమారాధన పేరుతో ఒక్కళ్ళతోనే ' యావజ్జీవం
"హచూపష్యామి!' అంటూ వుండాలన్నావు.
ఈవేళ ఆ (గ్రేమకి మరో బాధ్యతని జంటచేస్తున్నావులా వంది. మానవుడి నాగరికత అంతా ఆతని
స్వేచృుకేదో రూపంలో బంధనాల
కల్పునకేనా?
అల్లా అల్లా
వీళ్ళతో ఎల్లా?”
రాజగోపాలానికి ఆమె పాటతో నవ్వు వచ్చింది. కాని నిలవరించుకొన్నాడు.
"ఒక దశలో మగాడు బాధ్యతారహితంగా ప్రవర్తించడం నోర్చుకొన్నాడు. ప్రవర్తిస్తున్నాడు. ఆ
బాధ్యతారాహిత్యంలో స్తీ పురుషుల
సమానత్వం కోరుతానంటావు?”
"బాధ్యతపేరుతో ఆడదాని సంకెళ్ళు మగాడికి మార్చేబదులు వాటిని కృష్ణలో పారేసి ఈ ప్రపంచాన్ని
ఇల్లా బ్రతకనియ్యమంటాను. "
హఠాత్తుగా వెనుకవేపున కల్యాణి కంఠం వినిపించింది.
"పేమ అనేది న్నిగ్రహానికీ, బాధ్యతకూ మారుపేరు. స్తీ పురుషులు ఏర్పుడిన నాటి నుంచీ వారి మధ్య
సంబంధాలున్నాయి. ఆ
సంబంధాలలో న్మిగహం, బాధ్యత ప్రవేశపెట్టడానికి పెళ్ళిని ఒక ఉపకరణం చేశారు. అందుచేతనే
అది ఎన్నడూ కృతైమంగానే
వుండిపోయింది. అయినా న్నిగహానికీ, బాధ్యతకూ సహజమైన బలాన్ని కల్పించగల గ్రేమ పరిణితి
పొందడానికి కొన్ని భాతికావసరాలు
కావాలి. ఈనాడవి ఏర్పుడ్లాయి. ఆ ఏర్పడడాన్ని పెళ్ళిా-చేమలమథ్య పోటీరూపంలో
చూడగలుగుతున్నామంటాను. ”
రాజగోపాలం మాట్లాడలేదు.
"మీ _పేమోపాసకులు నిత్యజీవితాన్ని గంద్రగోళంలో పెడుతున్నారు. దుర్చరం చేస్తున్నారు. ఆటవిక
జీవితాన్నీ, జంతు ప్రకృతినీ
అర్దం చేసుకోవచ్చు. కాని ఈ నియమాలు, నిర్పంధాలు, నిషేధాలు, ఆరాధనల మధ్య అతి
సహజమైన ఆకలిదప్పుల్లాంటి
సాంగత్యవాంఛను గబ్బు పట్టించేస్తున్నారు. నాగరికత తెచ్చిన యంత్రాగారాలతో పాటు ఈ
శగేమోపాసనా మందిరాలు కూడ నేలకూల్చాలంకేు
బాగుంటుంది. కాని కల్యాణి గారూ! ఏమిటీ _పేమదాహం?”
కల్యాణీ నవ్వింది. రాజగోపాలం సమాధానం ఇచ్చాడు.
"ఆకలిదప్పులు వ్యక్తికి పరిమితాలు. దాని కష్టనిషురాలననుభవించేదతడే. అయినా ఆతని క్షేమం
కోసం దానికి నియమ
నిర్పుంధాలు విధిస్తున్నాం. సాంగత్యం అనేది రెండో మనిషినీ, సంగాన్నీ కూడా కలుపుకొంటుంది.
కాళ్లు నావి కాకుంకే కానీ దాకా
నడవమన్నట్లు ఇతరులేమైపోతేనేోం అనుకోగలమా?”
మంజులత కపటభీతినభినయించింది.
"మీరిద్దరూ ఇప్పుటికొకే పడవమీదకి వచ్చేశారు. నోను నిష్క్రమించడం మంచిది.”
ఇరవైనాలుగో ప్రకరణం
కల్యాణి స్కూలులో వుండగా కబురు వచ్చింది.
"మీ నాన్నగారొచ్చేరు.”
రామలక్ష్మమ్మ పక్కింటి క్మురవాడొకడిని పిలిచి, వాని ద్వారా కబురు పెట్టింది. కల్యాణి హెడ్మి[ఫ్రెస్తో
చెప్పి వంటనే బయలుదేరింది.
ఆమె వచ్చేసరికే రామలక్ష్మమ ఆయనకు కాఫీ పెట్టి ఇచ్చింది. అంత యోగ్యురాలైన కుమార్తెను కన్న
తల్లిదండ్రుల్ని
అభినందించింది. ఆయన ఇతర సంతానం గురించీ ఆస్తిపాస్తుల గురించీ ప్రశ్నలువేసి సమాచారం
తెలుసుకొంది.
"ఆస్తులకేం బాబూ! ఈవేళుంటాయి, రేపుపోతాయి. మళ్ళీ వస్తాయి. కాని ప్రతిష్ట, మర్యాద పోతే మరి
రావు. మా తమ్ముడున్నాడు.
మీలాగే కాంగెసులో జైలుకెళ్లేడు. గుడ్డిగవ్వ లేకుండా ఆస్తంతా పోయింది. ఈమధ్య నీమథ్య ఏవో
కంటాక్టులంటూ పెట్టుకున్నాడు.
రోజు బాగుంది నాలుగు రాళ్ళు వెనకేసేడు. ముగురు కొడుకులు. అంతా ప్రయోజకులయ్యేరు.
తలోమూలా వున్నారు. పెద్ద కూతురికి
పెళ్ళయింది. అల్సుడు ఇంజనీరు. కలకత్తాలో ఏదో వుద్యోగంలో వున్నాడు. మొన్ననే వచ్చివెళ్ళేరు.
రెండోపిల్ల వుంది. కాలేజీలో
చదువుతూంది. ఇంకావిడని ఓఅయ్య చేతిలో పెడితే అక్కడికి జీవితంలో అతడు చెయ్యగల
శుభకార్యాలన్నీ అయినట్లే. నాకు మాత్రం
ఎవరున్నారు? వాళ్లనే పెట్టుకొని వుంటున్నా.”
దక్షిణామూర్తి ఆమె కథనంతనూ 'ఆహా:, బెనాను' లతో వ్యాఖ్యానిస్తూ ప్రోత్సహిస్తున్నాడు. కల్యాణి
వస్తూనే రామలక్ష్మమ్మ
తోడును అభినందించింది.
"అమ్మను కూడా తీసుకురాకపోయారా?”
"పెద్దవదిన పిల్లలు వచ్చేరు. ఆమె నిండుపొద్దుల మనిషి. ఇంట్లోంచి అమ్మ కదలడం ఎల్లా
కుదురుతుందమ్తా! *
"సెద్దవదినయ్యాక, మరోవదిన. లేకపోతే ఓ అక్కయ్య. ఇంక [ప్రాణానికి కాస్త విశ్రాంతి ఎప్పుడు?”
దక్షిణామూర్తి నవ్వి కల్యాణి వపు నిమిరేడు.
"సంసారంలో విశ్రాంతి ఏమిటమ్మా? నువ్వింకా పెళ్లీ, పిల్లలు లేరు గనక ఇంట్లోతోడు అంకే అర్దం
కావడం లేదు గాని....”
-అంది రామలక్ష్మమ్మ.
"బాగుందండీ. పెద్దాళ్ళుంకే కాస్త విశ్రాంతి ఇవ్వడానికిబదులు పీక్కు తినాయ్యడమేనా?”
"తప్పు తప్పు” అని దక్షిణామూర్తి కూతుర్ని మందలించేడు.
కల్యాణి గ్రామంలో ఎరిగివున్న వాళ్ళనీ, బంధువుల్ని, పరిచితుల్న్ గురించి ప్రశ్నలు వేసింది.
ప్రతిెఇంటా జనన-మరణాల
లెక్కలు తేల్చుకోవడం ఆమెకో సరదా. తమ వరు నుంచి ఎవరు వచ్చినా విన్న వార్తలే వినడం.
అడిగినవే అడగడం -
త్రతిమారూ ఆ వార్తలు ఏదో కొత్తగానే వినిపిస్తుంటాయి.
తండ్రీ బిడల్ని మాట్లాడుకొనోేటందుకు వదలి రామలక్ష్మమ్మ ఇంట్లో ఏదో పని చూసుకొనేటందుకు
వెళ్ళిపోయింది.
కల్యాణి ఇరుగుపారుగుల్ని గురించీ, తన జీవిత పద్దతుల్ని గురించీ, ఉద్యోగ పరిస్థితులూ
తండికొక్కొక్కశ్రు చెప్పింది.
దక్షిణామూర్తి ఆమె వుత్సాహానికి ఆనందించేడు.
"పొరుగు రూడా మంచి వాళ్ళే దొరికారు. ఈ వాటాలో....”
"ఓ మెకానికల్ ఇంజనీరున్నారు. ఒక్కరే వుంటున్నారు పెళ్లీ అవీ లేవు. చాల మంచివారు. అన్నట్లు
మీరు కృష్ణాబారేజి చూశారా?
రేపు వెడదాం. రాజగోపాలంగారుకూడా వస్తారు. ఓమారు ఉండవల్లీ అవీ చూసొద్దాం. *
దక్షిణామూర్తి చిరునవ్వు నవ్వుతూ కూతురువంక ఆప్యాయంగా చూసేడు.
"సాయంకాలం బండికి పోవాలమ్మా! *
కల్యాణి ససేమిరా పనికిరాదంది.
"అదేమిటి నాన్నారూ! రాకరాక వచ్చేరు. కాలిజోడన్నా వదలకుండా మళ్ళీ ప్రయాణమంటారు. అదేం
కుదరదు.”
"యాడమ్హా! చిన్నపిల్లదానివా? అల్లాగంటావు! ఈమారు అమ్మా నేనూ వస్తాం, తప్పుకుండా ఒక్క
వారం వుంటాం. ఓఇరవై రోజుల్లో
అన్నయ్య రావాలనుకుంటున్నాడు. వాళ్ళ పార్దీ మీటింగులేవో వన్న్నాయట. వీలు చిక్కితే అమ్మను
పంపిస్తా.
తనతో కొన్ని ముఖ్యమైన విషయాలు మాట్లాడ్డానికే తన ఇతరపనులన్నీ విడుచుకువచ్చానంటూంకేు
కల్యాణికి అర్దంకాలేదు. బహుశా ఏదో
పెళ్ళి సంబంధం అయి వుంటుందని సావధానురాలయింది. కాని ఆయన వెంటనే చెప్పులేదు.
'కాళూం చేతులూ కడుక్కుని బట్టలుమార్సుకురా.
వివరాలు సావకాశంగా మాట్లాడుదా' మని కాలయాపన చేస్తున్నాడు. అంత అవసరమైన పనేమిటో
సూచనగానైనా తెలుస్తే
బాగుండుననిపించింది.
"ఓ ఉత్తరం రాసి పడెయ్యకపోయారా? అదీగాక ఓ పదిరోజుల్లో దసరాసెలవలిస్తున్నారు. పండక్కి
ఎలాగా వస్తున్నాను కదా.”
"నువ్వక్కడికి వచ్చేకనే ఆమాటచెస్తే నీకు ఆలోచించుకొనేటందుక్కూడా వ్యవధి వుండదు. ఉత్తరంలో
అన్నీ (వ్రాయలేము. మంచిదీ
కాదు. అందుకోసం స్వయంగా రావడమే మంచిదని బయలుదేరా. *
సందేహం లేదు. పెల్లిసంబంధమేననుకొంది. తన ఆలోచనలు కూడా చెప్పేసి ముందుకు సాగడానికి
అవకాశం దొరికిందనిపించింది. అయితే ముందు
రాజగోపాలాన్ని తండికి పరిచయం చేయడం అవసరం.
"పది నిముషాలలో వస్తానుండండి. చిన్నపని మరిచిపోయా. "
ఆమె జోడువేసుకొని గబగబ వీధిలోకి వచ్చింది. నాలుగిళ్లకావల వకీలు యింట కైలిఫోన్ వంది.
దానినుపయోగించడం అలవాటుంది.
వకీలు భార్య కల్యాణిని ఆహ్వానించింది. ఇద్దరూ బజారుకెళ్ళడం అలవాటుంది. పిలిచింది.
"నాన్నగారొచ్చేరు. వెళ్లిపోవాలి.
కల్యాణీ రాజగోపాలాన్ని ఫోన్మీద అందుకోడానికి ప్రయత్నించింది. కాని అతడు దొరకలేదు. రాగానే
ఇంటికి రావలసిందనో
కబురుపెట్టి తెరిగి వచ్చింది.
తండ్రి ఆలోచిస్తున్న విధమూ, సాధ్యమైనంతసేపు సాగారించి అసలు విషయం తేల్చుకుండడమూ
గమనించి ఆయన పెళ్ళిసంబంధం గురించి
మాట్లాడవచ్చేరాయనీ అనిపించింది. ఆయన మనస్సులో ఏదో వ్యథ.
"ఏమిటాలోచిస్తున్నారు?”
దక్షిణామూర్తి ఉలికిపడ్డా డు. తేరుకుని, ఆమెను తన ప్రక్కన సోఫాలో కూర్చోపెట్టుకొన్నాడు.
కరూర్చుంటూండగా నామ్మదిగా తాను
వచ్చినపని చెప్పేడు.
" అతడొచ్చాడు.”
"ఎవరతడు?”
కల్యాణి చక్రాల్లా కళ్ళుచేసి తండ్రివంక చూసింది. ఆమెప్రశ్నతో దక్షిణామూర్తి ప్రపంచంలో పడ్డాడు.
పూర్వవివరణ లేనిదే
తానన్నమాట కల్యాణికి తెలియడం సాధ్యంకాదు. ఆతడనే సర్వనామం ఎవరినుద్దోశించేడో చెప్పాలి.
"ఆనందరావు. ”
ఆనందరావు ఎవరో మనస్సుకు గోదరం అయింది. కాని, ఆ పేరు పదేళ్లనుంచి ఇంట్లో వినపడ్డం
లేదు. అందుచేత ఆ మనిషిని
గురించేనాయని అనుమానం కలిగింది.
ఆనందరావు అనో వ్యక్తి పదహారేళ్ళుక్రితం తన పదోయేట తనకి తాళి గప్పేడు. ఆనాడేమిటో తాను
చాలా అవకరంగా వుండేది. తను
అందంగా లేనని ఆ యిరవయ్యేళ్ళ యువకుడు మొరాయించినా తండ్రి గదిమేసి పెళ్ళి చేసేడుట.
కారణం తమ తండులిద్దరూ స్నేహితులు.
ముస్తపఫాలీఖాను చేత ఒకే రోజున ఎముకలు విరగ్గొట్టించుకొని ఏడాది పాటు బళ్ళారి జైలులో పులుసు-
ముద్దా తిన్నారు. ఆ స్నేహాన్ని
పిల్లల పెళ్ళితో ఇంకా దృుఢథపరచాలనుకొన్నారు. కాని, ఆ ప్రయత్నం రెండు కుటుంబాలమధ్య తగని
ద్వేషాన్ని కలిగించింది.
ఆ పెళ్ళయిన ఏడాదికే తండ్రి పోయేడు. ఆనందరావు తర్వాత దేశం వదలి పోయేడు. అమెరికా
వెళ్ళాడన్నారు. తిరిగి
వచ్చాడన్నారు. ఎక్కడో వుద్యోగం చేస్తున్నాడన్నారు. కాని స్వగ్రామం రాలేదు. భార్యఅన్న కన్యను
పలకరించలేదు.
మరోపెళ్ళి చేసుకొన్నాడన్నారు కూడా. అంతతో అతని చరిత్ర అవసరంకూడా ఆ ఇంటికి
లేకపోయింది.
ఇన్నాళ్ళకి ఆతడు రావడమేమిటి? ఆమెకు అనుమానమే అనిపించింది.
"ఎవరా ఆనందరావు నాన్నారూ?”
"అతడే నీ మగడు."
ఆ విశేషణానికి కల్యాణీ ముఖం చిటించింది.
"నాకు మగడింకా ఏర్పుడాడనుకోవడం లేదు నాన్నగారూ! *
దక్షిణామూర్తి సోఫాలో జేరగిలబడిపోయాడు.
"మనం అనుకోనివి చాలా సందర్పపడుతుంటాయి. వానిలో ఇదొకటి. ఇల్లాంటి వాటినే
అనిచ్చా[పప్రారబాలంటారు .”
పదిహేనేోళ్ళుకితం జరిగిపోయిన ఒక దుర్దటనను జ్ఞాపకం చేసుకోవాలనో వుత్సాహం లేకపోయినా,
అసలావ్యక్తి ఇన్నేళ్ళతర్వాత
ఎందుకు రావలసి వచ్చిందో తెలుసుకోవాలనే వాంఛను అణచుకోలేకపోయింది. ఆమె
ప్రశ్నించకుండానేో యావద్విషయాలూ పూసగుచ్చినట్లు
దక్షిణామూర్తి చెప్పేడు.
నాలుగురోజుల[కితం ఆనందరావు హఠాత్తుగా ప్రత్యక్షమయ్యాడు. ఆ రావడం సరాసరి తమ యింటికే
వచ్చాడు. తన భార్యను
తీసుకెళ్ళడానికే వచ్చానన్నాడు. ఇప్పుడు తమయింటోనే వన్నాడు.
అంతవరకూ [గ్రామస్తులు కల్యాణి దురదృష్టవంతురాలుగా జాలిచూపేరు. రత్నంవంటి అమ్మాయి.
అందం వుంది. చదువుంది గుణం వుంది.
అల్లాంటిదాన్ని మగడు ఒల్లకపోవడమేమిటి. దాని దురదృష్టం కాక అన్నారు. ఆనందరావురాకతో
అంతా ఆమె అద్యష్టానికి
పొంగిపోతున్నారు. ఆమె సుఖపడేరోజులు వచ్చాయన్నారు.
కల్యాణి అన్నీ విని ఆఖరున ' ఉహూ” అని ఒక్క దీర్షం తీసింది. అది సంతృప్తికి చిహ్నమో,
అసంత్యంప్తికి ప్రతినిధో అర్హం
కాలేదు.
దక్షిణామూర్తి ఒక్కనిముషం ఆలోచించి గ్రామస్తుల అభిప్రాయంలో ఆమె సుఖపడుతుందనీ,
అదృష్ట్రవంతురాలనీ అనుకోడానికిగల కారణాలు
చెప్పేడు.
"నెలకో వెయ్యి రూపాయలు జీతంలో వున్నాడట.”
"ఆ భార్య పోయిందట.”
"ఆమెకెవ్వరూ పిల్లలు లేరట.”
"వయస్సు ముష్పయ్యారు, ముప్పుయ్యేడే - ఇంకా చిన్నవాడే! "”
ఇవన్నీ ఆమె మగని అర్హతలు. కల్యాణి వేనికీ సుముఖతా, వుత్సాహమూ చూపలేదు. దక్షిణామూర్తి
ఆగి ఆగి ఆ మంచి
లక్షణాలన్నీ మెదడుకు పస్పేటందుకు వ్యవధినిస్తూ వుచ్చరించేడు. చివర తన అభిప్రాయం కూడా
కఠలిపేడు.
"నువ్వేమీ తొందరపడకు. ఆలోచించుకో. చదువుకొన్నదానివి. ”
ఆయన వుద్దేశంలోకూడా ఆనందరావువైపు మొగ్గున్నప్లే కల్యాణి భావించింది. ఖచ్చితంగా చెప్పేసింది.
"దీనిలో ఆలోచించేటందుకేముంది నాన్నారూ! ఎవరో వీధినపోయే బుద్ధిమంతుడొకడు ఇంటిదాకావచ్చి
మీ అమ్మాయి నాపెళ్ళామండోయంకే మీరంతా
ఎల్లా వూరుకున్నారు?”
చెంపకాయ తగిలినట్లయి దక్షిణామూర్తి ఉలికిపడ్డాడు. కాని, ఆయన కుమార్తెభావాన్ని సరిగ్గా
గ్రహించలేదని మరుమాటలోనో అర్దం
అయింది.
"వీధ్రేపోయే వాడెవరో కాదమ్మా, ఆతడే, అంత గుర్తుపట్టలేకపోయామంటావా?”
"ఆతడే కావచ్చు. గుర్తుపట్టడంలో పారపాటు లేకపోవచ్చు. కాని, అసలు పొరపాటు బాంధవ్యం
కలపడంలోనో వుంది! ”
దక్షిణామూర్తి తల తెప్పుకొన్నాడు.
"ఆఅంతేనంటావు. ”
"మరోలా అనుకొనేటందుకవకాశం లవలేశమూ లేదు,
ఒక్క క్షణం ఆయన మాట్లాడలేదు.
"ప్రస్తుత పరిస్పితికి మా తెలివితక్కువదనం కూడా కొంత కారణం కాదుగదా అనిపిస్తూంది. "”
"ఏ విధంగా?”
"నీకు పెళ్ళికానట్లు మేముకూడా నటించడం....”
ఆనందరావు ధోరణి తెలిసిపోయాక దక్షిణామూర్తి తన కుమార్తె భవిష్యుత్తుగూర్చి ప్రత్యేక శ్రద్ద
తీసుకొన్నాడు, ఆనాడే.
మగడు విడిచిపెట్టాడనే భావన ఆడపిల్లల్ని ఎంత కుంగదీస్తుందో ఆయన తన జీవితంలో
చాలమందిని చూసేడు. తనకు పెళ్ళయిందనీ,
ఫ్రలానావాడు తన మగడనీ వాళ్ళు ఎరిగి వుంటారు. కాని ఆ ఫలానావాడు మగని బాధ్యతలను
స్వీకరించడు. అయినా ఆశ వదలదు.
జీవితమంతా వ్యర్హమైపోయినట్లు విలవిల్లాడిపోతారు. క్రుంగిపోతారు.
ఆ దశ తనకూతురు అనుభవించరాదనుకున్నాడు. అల్లుడు తనకూతురంకే అనహ్యించుకొంటాడని
(గ్రహించాక పుస్తెలు తీసిపారేశాడు. ఆమెకు
పెళ్ళఅయినట్లు కాదన్నాడు. ఆతనిప్రసక్తి యింట్లో రాకుండా జాగత్త పడ్డాడు. వూళ్ళోవాళ్ళు గుర్తు
చెయ్యకుండా ఆమెను చదువుకు
పంపేసేడు.
వయస్సుతో కల్యాణి సౌందర్యం వికసించింది. అల్లుడూ విదేశాలనుంచి వచ్చేడన్నారు. కూతురికి
తెలియకుండానే మరోమారు ప్రయత్నం
చేశాడు. ఆతడు నిరాకరించేడు. కూతురికి మరోపెళ్ళి చేసుకోమన్నాడు. కావలిస్తే కాగితం వ్రాసి
ఇస్తానన్నాడు.
దక్షిణామూర్తి మండిపడ్డాడు.
"నీకు పిల్లనిస్తానని వచ్చానుగాని, ఇదివరకే నీకిచ్చినట్లు నోేననుకోవడంలేదు. నీకిస్తాననడమే ఆమెకు
మరోపెళ్ళి ప్రయత్నంలో
వున్నానని అర్దం. నీ కాగితంముక్కు అవసరంలేదు-” అన్నాడు.
ఆనందరావు నామ్మదిగా వివాహం అయ్యేవరకూ నాలనాలా డబ్బు పంపుతానన్నాడు.
"మంచో, చెడో పెల్లిచేసుకొన్నా, ఆమెజీవితం నాశనంచేయడం నా అభిమతంకాదు. ఆవేశపడి ఆమె
జీవితాన్ని అల్లరిపాలు చేయకండ”ని
సలహాకూడా ఇచ్చేడు.
దక్షిణామూర్తి వచ్చేసేడు. ఒకటి రెండు నాలలు మనిఆర్జర్లు వచ్చాయి. ఆతడు తిరగకొన్ప్వేడు. తర్వాత
అవీ ఆగిపోయేయి.
కల్యాణి పెళ్ళిలో తప్పు చూసి వుండని ఆ ముఖాన్ని గుర్తుపట్టలేనిఫ్థితి. ఇంట్లోవాళ్ళు కూడా ఆమెకు
పెళ్ళయిందనో భావనను
వదలుకొన్నారు. ఆపేరే గుర్తు రాదు. ఆమెకు పెళ్ళిప్రయత్నాలూ చేశారు. కాని చదువులోపడి కల్యాణి
అటువేపు దృష్టిసారించలేదు.
ఇన్నాళ్ళుకామె దృష్టి పెళ్లివేపు మళ్లింది. హాస్యంలోనో, మాటల్లోనో ఆమె పెల్లివిషయాలు వూహిస్తూందని
స్పష్టమయింది. సరిగ్గా ఆ
సమయానికి ఆనందరావు హాజరయ్వేడు. అది మంచికనుకోవాలో, చెడ్డకనుకోవాలో దక్షిణామూర్తి
నిర్ణయించుకోలేకున్నాడు.
కాని కల్యాణికి ఆ విషయంలో భఖిన్నాభిపాయంలేదు. తనకు పెళ్ళిఅయిందనే విషయాన్ని ఆమె
స్వీకరించదు.
"నిజంగానే అయిందనో అనుకుంటున్నారా?”
ఆ సరాసరి ప్రశ్నకు దక్షిణామూర్తివద్ర సమాధానం లేదు. వూరుకున్నాడు.
"మొదట చేసినపని పారపాటని మీరే అనుకొన్నారు. దానిని దిద్రుకున్నారు. మంచిపని
చేసేరంటాను. పదేళ్ళపిల్లకి కట్టడానికి
ప్రాముఖ్యత ఇవ్వవద్దు. నాలుగేళ్ళ మేనమామ కూతురు న్నిదబోతూండగా గణపతి కట్టిన తాళిబొట్సుకి
సింగమ్మ ఇచ్చిన
విలువకన్న దానికి హెచ్చు విలువ వుండదు. లేదుకూడా. లేనిపోనిఆశలు పెట్టుకొని లేకుండాపోయిన
సెళ్ళికొడుకును గురించి నా మనస్సులో
అర్ధంలేని అభిమానాలు, సెంటిమెంట్సూ కలిగించలేదు. సంతోషం. నాకాళ్ళు మీద నేను
నిలబడగలిగేటట్లు చేశారు. నాకిష్టం వచ్చిన
వరుజ్లీ ఏరుకొనేో అధికారం కూడా ఇచ్చారు. అవునా?”
దక్షిణామూర్తి నిశ్శబ్దంగా తల తిప్పుడు.
"మరిప్పుడీ ఆలోచన ఎందుక్కులిగింది?”
"వివాహం అన్నది అంత సులువుగా తెంచి పారెియ్యగలిగేటట్లు తోచడం లేదమ్మా!
"ఇదివరకొకరు మీలో ఇందుకు విరుద్దమైన అభ్మిప్రాయం కలిగించారు.”
"అవును."
"అదే సరయినది. ఆ అభిప్రాయాన్ని వదలకండి.”
దక్షిణామూర్తి విచారంతో తలతిప్పేడు.
"ఆనందరావు ఎదటకు రానంతకాలం అది బాగానే వుంది. కాని ఆతడు వచ్చి నేనున్నాననోసరికి
కేవలం ఆత్మవంచన మాత్రంగా
పరిణమించింది.
కల్యాణి ఆలోచించింది. తండ్రి చెప్పిన మాట యధార్దం. శుభలేఖలు, పురోహితుడు, బాజాభజంత్రీల
వాళ్ళు, [గ్రామస్తులు బోలెడంత
మంది ఆ వివాహం జరిగిందనడానికి సాక్ష్యం. తర్వాత జరిగిన ఘటనలు ఒకపారపాటనుకొంటారు.
ఒక మారు తన తండి ఓ కథ చెప్పేడు. ఆయన మద్రాసులో పెనికెన్టియరీ జైలులో వుండగా ఒక
వ్యక్తి ఫోర్లరీచేసి జైలులో
పడ్డవాడు అగతగిలాడు. ఆతడు కాగితాలనో కాదు, జీవితాలనే ఫోర్దదీ చెయ్యగల సమర్పుడని తెలిసింది
- ఆతడిది గుంటూరు.
నాల్తూరు జిల్లాలో ఓపల్లెటూరులో ఒకయింట నాతడు ఒక అందమైన పడుచును చూసేడు. అమెకు
ఆస్తికూడా వుంది. ఆమెను అడిగితే
తండి తిట్టి తరిమేశాడు. అతడింక ఫోర్దరీకి పూనుకున్నాడు. పైస్సుకి వెళ్ళి రెండేళ్ళుకితంవున్న
ముహూర్తానికి శుభలేఖలు
అచ్చువేయించాడు. ఒక పురోహితుడికి, నలుగురు బళ్ళవాళ్ళకి, భజంత్రీల మేస్తికి, ఆ వూళ్ళో
వ్యతిరేకపక్షంవారికి డబ్బిచ్చి
లొంగదీసుకొన్నాడు. కోర్పులో ఈ కూట సాక్ష్యంతో జరగనిపెళ్ళి జరిగిందని రుజువిప్పించి పెళ్ళాన్ని
తఆచ్చుకొన్నాడుట.
ఆ సాక్షులసహాయంతోనే నేడు ఆనందరావు తన భఛర్తుత్వం చలాయించదలస్తున్నాడు.
అయితే ఆ దురంతకుడితో కాప్రరం చెయ్యడం ఇష్టపడక ఆ నెల్లూరమ్మాయి ఆత్మహత్య
చేసుకొందన్నారు. తానంత బలహీనురాలు కాదు.
పత్రయత్స్నించనీ చూద్దామనుకొంది.
ఈ నూతన పరిస్థితులలో తనవారంతా ఎల్లా ఆలోచిస్తున్నారో?
దక్షిణామూర్తి ఆలోదించేడు.
"చ్రాల్లాయి వొప్పుకుంకేు....” అన్నాడు పెద్దన్నగారు.
"దానిని నిర్పంధించకండి” అన్నాడు చిన్నన్న.
"అమ్మ ఆలోచన కూడా తీసుకోవలసిందే” నని దక్షిణామూర్తి వివరించేడు.
"మంచో చెడ్డో జరిగిపోయిందేదో జరిగిపోయింది. కల్యాణికి వయస్సు వచ్చింది. మొదట అనుకున్నట్లు
పెళ్ళిచేసివుంకు అదోవిధంగా
వుండేది. అలా జరగలేదు. దైవలిఖీతం. ఇప్పుడు ఆనందరావే వచ్చి అడుగుతున్నాడు.
ఇతరవిధాలైన లోట్లులేనప్పుడు ఇంక తామంత
పట్టుదల చూపరా"”దనోది ఆవిడ అభ్మిప్రాయం.
"వాళ్ళిద్దరికీ బ్రహ్మ అల్లావ్రాసి పడేశాడు. వాళ్ళని విడదియ్యడం మనుష్యుబుద్దికి సాధ్యంఅయ్యే
పనికాదు. అందుచేతనే మనం
పెళ్ళిచేయాలని ఎంత ప్రయత్నించినా సాగలేదు. వద్దన్నవాడే తిరిగొద్చాడు. ”
కల్యాణి లేచి నిల్చుంది.
" నాన్నగారూ?”
దక్షిణామూర్తి తలఎత్తి చూశాడు.
"నాకు పెళ్ళికాలేదు. అనాటి నాటకంలో నాపాత ఏమీలేదు.”
ఆ కంఠస్వరం విని ఆయన చకితుడయ్యాడు.
"నాకిష్టం వచ్చినప్పుడు నాకిష్టమైనవానిని చేసుకొంటాను. మానుతాను. నాయిష్టం. ఆ స్వాతంత్ర్యం
మీరిచ్చేరు. వుందనుకొనేటట్లు
చేశారు. ఈ వేళ మళ్ళీ కాదనకండి. వీధేపోయే పెద్దమనిషిని చూపించి నాకు వరస కలపవద్దు.
ఇరవయ్య్యయిదో ప్రకరణం
పాట్ఫారంమీద రైలుకోసం ఎదురుచూస్తూ నిలబడి దక్షిణామూర్తి మరోమారు కుమార్తెను
పాచృరించాడు.
-”పట్టుదల చూపవలసిన ఘట్టాలు వున్నాయి. మరచిపోవలసిన అవసరాలూ వున్నాయి.”
-" మరోలా చెప్పాలంకే తెగేదాకా లాగకూడదు. ”
అంతవరకూ అన్నీ వింటూ కూర్చున్న కల్యాణికి ఒకసంగతి గుర్తుకు వచ్చింది. తండి ఈవిషయంలో
రాయబారి మాత్రమేనా? ఆయన
అబ్మిపాయం ఏమిటి?
"ఇంతకీ మీ స్వంత ఆలోచనలేమిటి?”
"నీ మనస్సులో ఒక ఖచ్చితమైన అభిప్రాయానికి వచ్చేశాక ప్రత్యేకంగా నేను చెప్పేదేముంటుంది?”
కల్యాణి ఏమీ మాట్లాడలేదు. ఒక్కనిముషం ఆగి దక్షిణామూర్తే చెప్పేడు.
"ఒక అన్యాయం జరిగినమాట నిజమే. దానిని సర్పుకొంటానన్నప్పుడు ఎందుకు సందేహించాలి? -
అంటాను.”
"మీకు నేను చెప్పవలసిందాన్ని కాను.”
"సందేహించకు. "
"మెల్ళి విషయంలో చేసుకొనేవాళ్ళ అభ్మిప్రాయాల్ని పాటించాలి కదా?”
”"లేకుంకే తెలుగుదేశంలో ఇంతవరకు వచ్చిన అభివృధ్ధికి అర్జంలేకుండా పోతుంది.”
"ఆ విషయంలో ఆడ-మగలమథధ్య తేడాచూపించకూడదు.”
"మనం ఏభయ్యేళ్ళుకితం వున్న స్థితిలోనే లేము. తప్పుకుండా నువ్వుచెప్పిందే న్యాయం.”
"రానా మరి, ఇదివరకు ఒకమారు ఆ అబ్నిప్రాయాన్ని నిరాకరించేరు. ఇప్పుడు మరోమారు అదే పని
చేయకండి. ”
దక్షిణామూర్తి అప్రతిభుడయ్యడు.
”ఈ విషయంలో మేం చెప్పేదీ, చెప్పగలదీ సలహామాత్రంగానే వుంటుందమ్మా!
"ఇంతవరకూ మీరు చెప్పిందంతా సలహామాత్రమే అయితే....”
దక్షిణామూర్తి మరల వొక అడుగు వెనక్కి వేశాడు.
"నీ మీద వున్న గ్రమా, చనువా, మా వయస్సు పెద్దరికపు కర్తవ్యజ్ఞానమూ మా కంఠాలలో ఆజ్జల్లాగ
ధ్వనించినా వానినల్లాగే
తిసుకోనక్కర్లేదు. అది కేవలం మా సలహా మాతం....”
"మీ సలహాలకు నా సవరణ....”
"ఏమిటది?"
"నాకు పెళ్ళయిందనేో ఆలోచనో మీ మనస్సుల్లోకి రాకూడదు. "”
దక్షిణామూర్తి చిన్నగా నవ్వేడు.
"పోనీ భవిష్యత్తులో. ...”
"ఎందుకు చేసుకోను?”
"చ్రేసుకోవాలనుకొన్నప్పుడు ఇతజ్జీ కూడా ఆలోచనలోనికి తీసుకోవచ్చు కదా! ”
"కట్టుకొన్నవాళ్ళని విడిచిపోతాడనే మచ్చు చిన్నదేంకాదు. అటువంటివానిని పెళ్ళి విషయంలో
ఆలోచించే ప్రమాదం ఎవరూ
తెచ్చుకోకూడదని నావూహ. "”
దక్షిణామూర్తి ఏమీఅనలేదు. కొంత సేపు వన్నాక మరల అన్నాడు.
"నీ అభ్మిప్రాయాన్ని బహుశా మనింట్లో ఎవ్వరూ కాదనరు. కాని....”
” ఏమిటి?”
"ఈవిషయంలో నీచూపు మరోచోట. ...”
తండి ప్రసంగం మారుస్తున్నాడని (గ్రహించి కల్యాణి నవ్వుకుంది. ఆ ప్రశ్నకాక్షణంలో సమాధానం
ఇవ్వడానికామె సిద్ధంగా లేదు.
"వ్సీక్రు చూపించకుండా చేసుకోను కదా! *
రూతురు గడుస్తనానికి దక్షిణామూర్తి నవ్వణొన్నాడు.
ఇరవయ్యారో ప్రకరణం
సేషనునుంచి బయటకు వచ్చేసరికే రోడ్టుదీపాలు వెలుగుతున్నాయి.
కల్యాణి మనస్సంతా గందరగోళంగా వుంది. తాను ఎన్నుకొన్న వరుజ్లీ తండ్రికి చూపి పరిచయం
చేయాలనుకుంది. తన అన్నగారు ఓమారు
వచ్చినప్పుడు రాజగోపాలంతో పరిచయం చేసుకున్నాడు. అతనిని వరుడుగా ఎన్నుకోవడంలో
అభ్యంతరం ఉండకూడదనే భావాన్ని మొదట
కఠలిగించివాడు అన్నగారే. ఆయనతో మాట్లాడి వచ్చినాక అన్న భాస్కురానికి మంచి అభ్మిపాయం
ఏర్పుడింది.
"బాహ్మణులం, మిగిలినవాళ్ళకన్న ఉత్తమసంస్కారం మాకుంది అని ఆత్మవంచన చేసుకోవడమేగాని
ఆయనకన్న (బాహ్మణుల
మనుకునేవాళ్ళు ఎందులో గొప్పు?”-అని భాస్కరరావు ప్రశ్నించేడు. మరో రోజున ఏదోమాటల
సందర్పుంలో తమమథ్య వయోబభేదం
పరిగణించనక్కర్లేదనే భావంకలగడానికి తోడ్పుడ్డాడు.
పదేళ్ళకన్యకూ పదేళ్ళకుుర్రవానికి పెళ్ళిచేయడం తప్పే. ఆడవాళ్ళు ఒక్క ఏడాదిలో పెరిగిపోతారు.
ఆమెకు వయస్సు వచ్చేసరికి
అతడింకా గుంటపువ్వులు పూస్తుంటాడు. కాని ఇరవయ్యేళ్ళ యువకుడు పాతికేళ్ళపడుచును
పెళ్ళిచేసుకోవడం అభ్యంతరం కాకూడదు. ఇద్దరూ
పూర్ణయౌవనంలో వుంటారు.”
ఆ మాట తమరి నుద్దేశించి చెప్పినదికాదు. లోకవృత్తంగా చెప్పేడు. కాని అది తమకు
సరిపడుతూంది. ఏదో వాకబులో రాజగోపాలం
తనకన్న ఏడాది చిన్నవాడని తేలింది. అన్నమాటలతో ఆ తేడా విషయమై అనుమానాలున్నా
తొలిగిపోయాయి.
తనతో సమంగా అతడుకూడ తనయెొడ మమకారం చూప్రతున్నాడని తెలిసాక ఆమెకింక సందేహమే
లేకపోయింది. తన అన్నమాటలను పట్టి ఈ
సంబంధాన్ని నిర్ణయించుకోడానికి ఆయన తోడ్పుడతాడు. ఇంక తండ్రీ-తల్సీ, మిగిలిన బంధువులూ.
తండి సిద్దాంతరీత్యా కులభేదాన్ని
అంగీకరించడు. కాని, తనకూతురు మరోకులం వానిని పెళ్ళిచేసుకోవడం ఇష్టమవుతుందో, అవదో,
మొదట కాదన్నా ఆయన్ని
వొప్పించవచ్చు. ఆ విషయంలో తన అన్నసాయం తీసుకోవచ్చు. కాని తల్లి! అక్కలు! మిగిలిన
అన్నలు! అందులో కొందరి
అత్తారివాళ్ళు ఛాందసులు. తను మరోకులంవాడిని పెళ్ళిచేసుకుంకే పూర్వకాలంలోలాగ అక్కులకి శిక్ష
విధించి పుటిళ్ళకి తో తలయ్యడం
జరక్కపోవచ్చు. వెలేస్తామని వూళ్ళోవాళ్ళు బదిరించకపోవచ్చు. కాని, తమ పిల్లలకి మంచి
సంబంధాలు రావనో, సాటివాళ్ళు
వెక్కిరిస్తారనో, తమ అక్కల్ని పుట్టింటికి పంపకపోవచ్చు. ఎంతమందికి ఇష్టంలేకపోయినా,
అంతమందికీ ఇష్టంలేకపోయినా, తాను
భయపడక్సర్లేదు. వాళ్యుకాదంకు వాళ్ళ ఇళ్ళ కెందుకెళ్ళాలి? వెళ్ళదు. వెళ్లకుంకు జరగదనే భయం
తనకులేదు.
అందుచేత దసరా సెలవులకు వెళ్ళుటప్పుడు పల్లెటూళ్ళు చూడం పేరుతో రాజగోపాలాన్ని తీసుకెళ్ళి
అందరికీ పరిచయం చెయ్యాలనే
ఏర్పాటులోవుంది.
కాని హఠాత్తుగా కొత్త సమస్యలు పుట్టుకొచ్చేయి. నిజంచేత అది పాతసమస్యే. కొత్త చిగుళ్ళు
తొడిగింది. ఈ విధమైన
పరిణామాన్ని ఆమె ఊహించలేదు. అందుచేత ఏం చెయ్యాలన్న ఆలోచనా కలగలేదు. హఠాత్తుగా
తన అంచనాలు కదిలిపోయాయి.
ఇంతవరకు తనవాళు వర్ణాంతరుజ్లే పెళ్ళి చేసుకోవడానికి ఆటంకపెడతారేమోనని మాత్రమే
సందేహిస్తూంది. ఇప్పుడు తను
జరిగినట్లు భావించదలచుకోక పోయినా, సంఘం దృష్టిలో జరిగిపోయిందనుకొంటున్న పెళ్ళికి తన్ను
దఖలుపరిచేస్తారు. తన తండి
రాయబారం వుద్దేశం అది.
కల్యాణి ఈ అన్యాయాన్ని తృణీకరించదలచినది. తనకు పెళ్ళికాలేదనే ఇంతవరకు అనుకుంటూంది.
దానిని ఆత్మవంచనగా
తీసుకోదలచలేదు. ఆ అభ్మిపాయంమీదనో అందర్నీ ఎదిరించాలి. అయితే ఈ సమస్యను
రాజగోపాలం ముందుపెట్టాలా? ఏవిధంగా పెట్టడం?
బొమ్మలపెళ్ళికన్న విలువలేని దానిని గురించి అతనితో చెప్పడంకూడా దానికి లేనివిలువ నివ్వడమే
అవుతుంది కదా? చెప్పకపోతే
మోసపుచ్చినట్లు భావిస్తాడనే ఆలోచన అమెకురాలేదు, ఇంతవరకూ. ఈ నూతన పరిజామాలదృష్టా
అతనితో చెప్పడం అవసరమా?
ఆమె ఏమీ తేల్చుకోలేకుండా వుంది. ఒక్కవిషయంలో ఆమెకింతవరకు దృడాభ్మిపాయం వుంది.
ఎవరుకాదన్నా రాజగోపాలాన్ని పెళ్ళిచేసుకుంటుంది.
ఇప్పుడే దానిస్టానో మరో అంశం నిలబడింది. ఎవరు పెనన్నా ఆనందరావును అంగీకరించదు.
ఆమె ఆలోచనలో ఉండగానే రిక్షా సెంటరుదాటి ఏలూరు రోడ్డుకి తిరుగుతూంది. బాగా చీకటిపడింది.
ఇంటికివెళ్ళి వంట వండుకోవడానికీి
బద్దకం అనిపించింది. బద్దకంగావున్నా, పనిజఒత్తిడి వున్నా, పనిమనిషిని పంపించి కారియరు
తెష్పించుకోవడం అలవాటు. అ రోజున
మరచింది. ఇప్పుడు వెళ్లి వండుకోలేదు. ఆకలి వేస్తూంది. హోటల్లోనో తిని వెళ్లిపోవాలనుకుంది.
రిక్రావానిని పంపేసింది.
హోటళ్ళ సెంటరుకి వచ్చేసరికి సైకిలు దిగుతూ రాజగోపాలం కనిపించేడు. అతడే దూరంనుంచి
ఆమెను చూసి వచ్చేడు.
"చీకటి పడ్డాక ఇల్లా నడిచివస్తున్నావెక్కడినుంచి?”
" స్టేషనుకెళ్ళా. నాన్నగారొచ్చేరు. ”
ఆయనను తీసుకురావడానికే వెళ్ళిందనుకొన్నాడు.
౫ ప్రదీ? ౫
అప్పుటికే ఒకళ్ళిద్దరి దృష్టి తమమీద వుండడం గమనించి కల్యాణి తొందరచేసింది.
"మధ్యాహ్నం వచ్చేరు. వెళ్ళిపోయారు. బండికి పంపేసి వస్తున్నా."
"ఇద్దరూ హోూటలులోకి నడిచేరు. గోపాలం తమరిద్దరికీ టిక్కెట్లు తీసుకున్నాడు. కుటుంబాలతో
వచ్చిన వారి కోసమని 'ప్కీన్!
లతో వేరుపరచిన చిన్నగదిలోకి సర్వరు దారిచూపేడు. అందులో ఒకేకేబిలు వుంది. దానికి
రెండువేపులా రెండుకుద్పీలు. తనకుద్చీకూడా
కళ్యాణి కుర్చిప్రక్కనో ఉండేటట్లు సర్వరుచేత మార్పించేడు.
భోజనం పూర్తిచేసి ఇద్దరూ వీధిలోకి వచ్చారు. రాజగోపాలం రెండు కిళ్ళీలు కట్టించి తెచ్చేడు.
”"ఎమిటింక? ఇంటికేనా?”
కల్యాణి గడియారం చూసింది. ఎనిమిదే అయింది.
"ఏదన్నా సినీమాకి వెళ్ళాలంకే చాలా వ్యవధి వుంది.”
రాజగోపాలం ఆమె ప్రతిపాదనకు అంగీకరించేడు. కాని, అంతవరకూ ఏం చెయ్యడం? ఏ
పార్కులోనన్నా కూర్చోవాలనుకుంకే బెజవాడలో
అటువంటి అలవాట్లూ లేవు. అందుకు వీలయిన పార్కులూ లేవు. జనం మధ్య ఒంటరిగా ఓగంట
కాలక్రేపం చెయ్యాలంకే రోడ్డు
బిడ్సిమీదికి వెళ్లి కృష్ణకేసి చూస్తూ ఆనందించాలి.
"రా. విశాలాంధ్ర ఆఫీసులోకి వెడదాం. చాలామందిని ఎరుగుదును. ఏ పేపర్లో చూస్తూ కాలక్షేపం
చేయొచ్చు.”
కల్యాణి అంగీకరించలేదు. ఆమె తలనొప్పిగా వుందంది.
"ఇంటికే పోదాం.”
ఆమెతోకలసి సినీమాకు పోవడంలోవున్న ఆనందాన్నీ, సంతృృప్తినీ రాజగోపాలం వొదులుకోలేకపోయాడు.
ఇద్దరూ మోటలులోకే వెళ్ళేరు. కాప్
సెక్షనులో శుబుల్సున్నీ ఇంచుమించు ఖాళీగానే వున్నాయి. భోజనాలవేళ.
ఒక చిన్నకేబుల్ వద్ద ఇద్దరూ కూర్చున్నారు. రెండుకాపీలు చెప్పి ఇద్దరూ బాతాఖానీ
ప్రారంబించారు.
"మధ్యాహ్నం ఫోన్చేశా. కబురందలేదా. ఎక్కడికి వెళ్ళారు?”
రాజగోపాలం ఆ రోజున తాను ఎక్కడికి వెళ్లిందీ వివరించి చెప్పేడు.
"మీనాన్నగారు హఠాత్తుగావచ్చి ఎందుకంత తొందరగా వెళ్లిపోయారు?”
"ఇంటికెళ్ళాక చెప్తా. చాలా సంగతులున్నాయి. "”
ఆమె సఫ్తేషనునుంచి వస్తూ చేసిన ఆలోచనకు భిన్నమైన వార్తానం. ఆ ప్రశ్నవస్తుందని ఆమె
వూహించలేదు. ఇప్పుడు వచ్చింది.
ఇంక దాచడంలో అర్దంలేదు. వెంటనే చెప్పేసి కర్తవ్యం ఏమిటో ఇద్దరూకల్సి తేల్చుకోవడం
మంచిదని తోచింది. లేచింది.
"లేవండి, సినీమాకు రేపురావచ్చు. ఈ వేళకి”
ఇంతసేపూ వుండి బాగుంటుందనుకొన్న ఫిలిం చూడకుండా పోవడం రాజగోపాలానికి ఒప్పుదలకాలేదు.
తొమ్మిది అయింది కూడా.
"త్రొిమ్మిదయింది. నెమ్మదిగా పోదాం. మనమూ వెళ్ళేసరికి ఆట వదిలేవేళ అవుతుంది.
హాలు చేరేసరికి తొమ్మిది దాటింది. కాని మొదటి ఆట విడిచేటందుకు అరగంట వ్యవధివుంది. రెండో
ఆటకి పల్పపల్పుగా జనం
చేరుతున్నారు.
పోర్టికోలో ఖాలీగా వున్న కుర్చీలను ఆ[క్రమించేరు. ఆమెను కూర్చోబెట్టి రాజగోపాలం వీధిలోకి వచ్చేడు.
"సబ్బుయిపోయింది. పక్కకొట్టులో తెస్తా. కూర్చో.”
కళ్యాణి అక్కడే కూర్చుని చృటాలలో బిగించిన రాబోయే ఫిల్ముల తాలూకు ఫ్రిల్సు చూస్తూ వాని
కథలను అర్దం చేసుకోవడానికి
ప్రయత్నెస్తూంది.
వెనక ఎవరో పిలిచినట్లయి తిరిగి చూసింది. పది పన్నెండేళ్ళ కుర్రాడు. చింకిరిగుడ్డలూ, మాసిన
జుట్లా- సినీమా హాళ్ళబయట
గేట్లలో నిల్చుని, సందుల్లోంచి మూడు ఆటలూ చూసి రాత్రి అక్కడే ఏ పేవమెంటు మీదనో పడుకుని
న్నిదపోయే కుర్రాళ్ళలో
ఒకడు.
"ఎవరిని?”
"మీతో వచ్చినోరు. అక్కడున్నారు. పిలుచుకురమ్మన్నారు.”
" ఎక్కడున్నారు?”
”గేటుప్రక్క. ౫”
ఆవార్త అందించి వాడు మరోమూలకు పరుగెట్టిపోయడు.
"ఎందుకబ్బా! అనుకుంటూ కల్యాణి గేటులోకెళ్ళింది. అక్కడ రాజగోపాలం లేడు. ఎదురుగా
అంతదూరంలో ఒక చిన్నకారుంది. ఇంజను
పిల్లికూతలు పెడుతూంది.
కల్యాణీ రాజగోపాలంకోసం అటూఇటూచూస్తూ రోడ్డువేపు రెండడుగులు వేసింది. హఠాత్తుగా ఎవరో
భుజమ్మీద చెయ్యసేరు. వులికిపడి
వెనక్కి తెరిగింది.
ఒకపడుచువాడు మంచిదుస్తులలో తనప్రక్కనే నిలబడి జబ్బదొరికించుకొన్నాడు.
"రా. ఇంటికిపోదాం. "”
కల్యాణీ వాని స్పర్శకు జలదరించింది. అంత చనువుగా భుజమ్మీద చెయ్యివెయ్యడమూ, అధికారం-
దర్పం చూపుతూ ఇంటికి పోదాం
రమ్మనడమూ ఆమెకు దిగ్రుమను కలిగించాయి. దానినుంచి తేరుకునోలోప్రునే అమెచేత వాడు
రెండడుగులు వేయించేడు.
కల్యాణీ కాలునిలదొక్కుకొని చెయ్యి విడిపించుకోబోయింది.
"ఎవడ్రా నువ్వ?”
ఆమె నోటినుంచి మాట వస్తూండగానే వాడామె ముఖంమీద బలంకొద్దీ చరిచాడు. ఆ దెబ్బకు కళ్ళు
బైరులుకమ్తాయి.
నీచార్లబోధకం అయిన ఏకత్వ ప్రయోగం తన మగతనాన్ని అవమానిస్తున్నట్లు అరిచేడు.
"పాడుముండా! ఇష్టం వచ్చినప్పుడల్లా సినీమాలపేరుపెట్టి ఇదో నాటకమా"” యని మరోచరుపు నెత్తిన
వేసేడు. తల
దిమ్మెక్కిపోయింది. ఆమె మనస్సు, కరచరణాలు అమె స్వాదీనంలోంచి తప్పిపోయినట్లయింది. ఏదో
కలలో జరుగుతున్నట్లు,
మసకచీకట్లో చూస్తున్నట్లు తెరవెనక మాటలు వింటున్నట్టు అనిపిస్తున్నాయి. జరుగుతున్న
ఘటనలలో తనప్యాత్ర ఆమెకర్టం
కాకుండాపోయింది.
వాడి భార్య ఈమె. చాల గర్విఫ్టి. ఖర్సుపరురాలు. మగళ్లీ అక్కచేయదు. రోజూ మూడాటలూ
సినీమాలు చూడాలిసిందే.
అర్హరాతైదాకా వూరుమీద బలాదూరుగా తిరగాలిసిందే. ఆమె సుఖంకోసం ఆ మగాడు అడ్డమైన చాకిరీ
చేస్తున్నాడు, ఇంటా-
ఆఅఆఫీసులోకూడా. ఓ పూటా కూడొండి పెట్టదు. ఆఫీసునుంచి వచ్చేసరికి తాళంపెట్టి పోతుంది.
పక్కింటివాళ్ళకేనా ఇవ్వదు. ఆవిడ
సినీమానుంచి వచ్చేదాకా వాడల్లా రోడ్డుమీదపడి ఏడ్వవల్సిందే.
_సినీమాహాలువద్ద అప్పుడప్పుడే చేరుతున్న జనానికి అర్ధం అయిన కథ అది.
"మొగుడుముండాకొడుకు సాయంకాలం ఇంటికొచ్చేసరికి తలుపు తాళంపెట్టివుంకశు కోపంరాదూ”-అందో
(బ్ర కంఠం.
"మెగా ఇంటికి రమ్మని నెమ్మదిగా అంకే ఎవడ్రానువ్వని డబాయించడంకూడానూ” మరో
పురుషకంఠం.
"ఎవరది?”
"భ్రార్యకాబోలు, ఇంటివద్ద పోట్లాడివచ్చింది. "
"అబ్బే పారుగింటివాడితో సినీమాకొచ్చింది. మొగుడు చూసేడు.”
"సినీమాలంటూ వొచ్చేక ముండలు సేశ్రేగిపోతున్నారు.”
కల్యాణిని నడిపిస్తూ ఆ యువకుడు తన బాధలు చెప్పేడు.
"దీన్ని కట్టుకున్నాక తిండికీ, నిిదకీ కూడా మొహంవాచిపోతున్నా.” నంటూ మళ్ళీ ఓగుద్దు మెడమీద
వేసేడు.
కల్యాణి మనస్సు స్తంభించిపోయింది. వాడు చెప్తున్నది తన్ను గురించేనా యనే ఆశ్చర్యం
కలుగుతూంది. కాని కమైకేమీ చెప్పలేదు
ప్రతిఘటించ లేదు. కాలు నిలదొక్కుకోవాలనో అభిప్రాయమే కలగడంలేదు.
చుట్టుప్రక్కలవాళ్ళంతా ఆ యువకుడికి తలో సాయంచేయడానికి నడుంకళ్పురు.
"ఏయ్ రిక్షా.”
ఒకరు రిక్షాను పిలుస్తూంకు మరొకడు ప్రక్క నిలబడివున్న చిన్నకారు (డైవరుతో మాట్లాడి సర్వం
సిద్దంచేశాడు.
ఆ యువకుడామెను కారువరకూ తోసుకొచ్చేడు. ఒకరు తలుపు తీశారు. నలుగురూ చుట్లామూగి
చోద్యంచూస్తుంకు వాడామెను లోపలి
నాట్టబోయాడు _"”ఎక్కు.”
ఒక్కమారుగా ఆమెకు చైతన్యస్స్పూర్తి కలిగింది. గిజాయించి చేయి విడిపించుకొని పారిపోబోయింది.
కాని, రెండోఅడుగు వెయ్యడానికిక్కూడా ఖాళీ లేదు. చుట్లా జనం, భజన చేస్తున్నట్లు తలోమాటా
అంటున్నారు. హితచింతకులళల్లే
ఉపదేశాలిస్తున్నారు. తిడుతున్నారు. బెదిరిస్తున్నారు.
"ఎక్కడికమ్మా! ఆ రాలుగాయితనం. పచ్చుని కాపురంలో నిప్పులోసుకుంటావు---” అంటూ ఒక ఆడుది
నిలేసింది.
"మంచిపని కాదు తల్లీ? వెళ్ళు. ”
"వ్రెైరగమరిగిన ఆడది మాట వింటుందా? ఆడది తిరిగి చెడింది. మగాడు తిరక్క చెడ్రాడదన్నమాట
వూరికే పుటిందా?”
"మక్కలిరగతన్నాహే! ”
"ఏమయ్యోయ్! కొడతావని బదురుతూంది కాబోలు. ఏం చెయ్యకయ్యోవ్. ”
వాడు _బతిమలాడడం ప్రారంభించాడు.
”చ్రెప్పకుండా లేచివచ్చావనో కోపంకొట్లీ ఒకకేుసాననుకో. ఇంకెప్పుడూ ఏమీ అనను. రా.”
ఆమెకు వాడెవ్వరో గుర్తొచ్చింది. బస్సు కండక్టరు భదం ఆ మాకే అరచి చెప్పింది.
"ఇదంతా మోసం. వీడో బస్సు కండక్షరు. భదం అని. నాకు వీడేమీ అవడు.”
ఆ పేరు గుర్తించడం మరీ కొంప మునిగింది. బన్సు కండక్షరు వుద్యోగం ఓ ఉద్యోగమా యనే
నిరసనతో ఆమె మగళ్డీ కాదంటూందనే
వ్యాఖ్యానం వచ్చేసింది.
"కందరక్టరైతే మగాడు కాకపోయాడా?”
"అంత _బతిమాలుతున్నప్పుడు. ...”
"పోనీలేవే కండక్టరుపని మానేసి, . మరో వుద్యోగం చూస్తానులేవే. రా.” _ అంటున్నాడు భదం.
కల్యాణి అరచింది. పెనుగులాడింది. కాని, ఆ వలయం లోంచి ఈవలకు రాలేకుండావుంది.
సినిమాకొచ్చిన వాళ్ళో తెలియదు. చోద్యం
చూడ్డానికొచ్చేరో తెలియదు. అందరూ మూగుతున్నారు. ఆమెను నొక్కేస్తున్నారు. భదం చేతుల్లోకి,
కారులోకి వప్పచెప్పేయ్యడానికి
సిద్దం అవుతున్నారు. వాళ్ళు తనమాట వినిపించుకోవడం లేదు. అసలు తనమాట ఎవరికీ
వినిపించనంత గొడవ చేస్తున్నారు.
"క్రాప్రరం గడ్డలు చేసుకోకు. *
"పట్టింపులొస్తాయి. పేచీలొస్తాయి. మొగుడూ, సెళ్ళామూ అన్నాక ఏవీ రాకుండాఉంటాయా?”
"బస్సుకండక్షరు, టిక్కట్టుకలక్సరూ గాక అందరికీ జిల్లాకలక్షరు ఉద్యోగాలు వస్తాయా?”
"ఏదో కోపంలో మగపీనుగు ఓదెబ్బు వేస్తే ఎంత అల్లరి చేస్తుందో చూడు.”
"మాంచి వేషంలో వుంది.”
*"రంగేళీ సరుకులాగే వుంది.”
"గట్టి సరుకు.
వెకిలి నవ్వులు. కల్యాణి తల తిరిగిపోతూంది. ఒక కేక పెటింది. ఏడ్పొచ్చేస్తూంది. చుట్లా జనం
గొంతు మార్చింది.
"మరో రెండు తగిలించి కారులో పారేసి లాక్కుపోక చూస్తావేమయ్యా! ”
"అతగాడి లేవకనిపెళ్టే నాటకమాడుతూంది. "
ఆలస్యమవుతూంది. జనం పెరుగుతున్నారని భృదం తొందరపడుతున్నాడు. కాని కల్యాణి ప్రతిఘటన
మానలేదు.
"కాళ్లూ చేతులూ కట్టి కారులో పారెయ్యి. ”
కాని, ఆపని జరిగే లోపున భదం నెత్తిమీద మరమరాలబండిలో మండుతున్న కుండ భళ్ళుమంది.
కణకణలాడుతున్న బొగ్గులు,
మండుతున్న కర చితుకులు చెదిరేయి. రాజగోపాలం సబ్బు తీసుకుని హాలు వద్దకు వచ్చేసరికి
అక్కడ జనం మూగివున్నారు.
ఏమిటోనని చూడబోయసరికి కల్యాణీ చీర కొంగులా అనిపించింది. కాని ఆమె కనిపించలేదు. బెజవాడ
సినీమాహాళ్ళు వద్ద రౌడీగుంప్రులు
చేస్తున్న అల్లర్ల కథలు చాలావిన్నాడు. నలుగురైదుగురు చేరి సినీమాలు చూడవచ్చిన ఒంటరికళత్తెల్ని
ఎత్తుకుపోతారు. కొన్ని
సందర్బాలలో ఒకరాత్రో, ఓ రోజో దాచి వదిలేస్తున్నారు. కొన్ని సందర్చాలలో వాళ్ళే
దాటించేస్తున్నారు. ఆ కథలు విన్న
రాజగోపాలం తన కళ్ళముందు అటువంటి ఘటనే జరుగుతూందని [గహించడంలో ఆశృర్యంలేదు.
లోపల జొరబడ్డాడు. ఒక ఆడదికూడా ఈ
దురంతంలో సాయం. తీరా చూసేసరికి తన కల్యాణే వాళ్ళు చేతుల్లో నలిగిపోతూంది. చటుక్కున
పక్కనే వున్న మరమరాలబండిలో
మండుతూన్న పిడత తీసేడు. చెయ్యి చురుమంది. దానితోనే భద్రం మొగాన కొక్పేడు.
నిప్పులు, మండుతున్న పుల్లలు మధ్య పడేసరికి జనం ఒత్తిగిలేరు. మొగంమీద కుండ (బదలయిన
వేడికి భృదం కల్యాణి చేయి
వదిలేశాడు. కాని, రాజగోపాలం వానిని వదలలేదు. అతని చెయ్యి పట్టుకుని మెలితిప్పేసేడు. ఆ
బాధకు మెలితిరిగిపోతూంకే ఒక్క
తన్ను తగిలించేడు. దానితో భదం బోరగిలపడి రోడ్డుమీద కొంత రక్తం చూపించేడు.
రాజగోపాలం కనబడగానే కల్యాణీ అతని ప్రక్కకు చేరింది. ఆమె తన చేతికి అడం అవుతుందనిపించి
కసిరేడు.
"తప్పుకో వీడి సంగతేదో చూస్తా."
ఆ కంఠానికి కల్యాణి బిక్కచచ్చిపోయింది. ఓదార్పుకుబదులు గదమాయింపు. ఒక్కమారు ఏడ్పెసింది.
రాజగోపాలం [కిందపడ్డ భద్రాన్ని లాగి నిల్చ్ఫోబెట్టాడు.
భద్రానికి మిత్రుతవళ్లూ అక్కడ కనబడలేదు. సినీమాకు జనం బాగా చేరారు. కొద్దిమందే
వున్నప్పుడు విషయం తెలియక
వంతపాడేవాళ్ళు దొరుకుతారు. అదంతా బూటకమని ఎరిగినా ఆ కొద్దిమందే ' మనకెందుకులే! యనా,
కలగచేసుకుంకు దెబ్బులుతగులుతాయని
భయపడో చూసీ చూడనట్లూరుకుంటారు. కాని, జనం పెరిగాక, తమ చేష్టకు వ్యతిరేకత వచ్చేక
దురంతకులు చల్లగా తప్పుకుంటారు.
అంతవరకూ ఆ దురంతానికి సాయం చేసినవారే "ఎంత అన్యాయం” అని ఆశృర్యమూ కనబరుస్తారు.
వీలుతప్పితే తమవాడిని అప్పుటికి
వదిలేసి, తరవాత బయటకు తెచ్చుకుంటారు. కసితీర్చుకుంటారు.
రాజగోపాలం అంతవృధుృతంగా మీదపడిపోవడంతో వాళ్ళు హడలిపోయారు. చల్లగా జారుకున్నారు.
రాజగోపాలం భద్రాన్ని నిలవబట్టి మరొక్కటి తగిలించేడు.
ఈమారు జనం వానిని చీత్చాయ్యుడానికి సలహాలిస్తున్నారు. విషయం తెలియగానే అంతా తిస్పేరు.
ఇద్దరు గుద్దోరు. మిగిలినవాళ్ళు
ఏమేం చెయ్యాలో సలహా ఇస్తున్నారు.
"మండెలు తిెప్పయ్యండి. ”
"చేత్రులు విరిచెయ్యండి. "”
చిన్నకారువాడు జనం విసురు తనమీదకు తిరక్కుండా కారునడుపుకొని బ్యరున వీధిమొగ తిరిగేసేడు.
ఆ ఖాళీలో జనం తోసుకొచ్చేరు.
వాళ్ళలో ఓ పోలీసువాడూ హాజరయ్యేడు. అంతవరకూ ఎక్కడో కునికిపాట్లు పడుతున్నపోలీసు
అంతమంది ఒకచోట గుమికూడడం
నసహించలేకపోయేడు.
"నడవండి, పోండి. ఇంతమంది ఎందుకు చేరేరు."
పదిమందీ అటూ ఇటూ కదిలేరు, ఎవరికి వారే ఏదో చెప్పబోయేరు. పోలీసువానికి విసుగు వచ్చింది.
"ఏయ్ వాడినాందుకు కొడుతున్నావు?”
అంతవరకూ పిల్లిలావున్న భద్రం పోలీసురాకతో రాజగోపాలాన్ని మింగేసేలా చూసేడు.
ఇరవయ్యేడో ప్రకరణం
కల్యాణి ఇంకొక్కక్షణం అక్కడుండనంది. జనం పెరుగుతున్నారు. అంతా తలోమాటా అంటున్నారు.
తలకొప్పేసినట్లుంది.
"ఇంటికి పోదాం.”
రాజగోపాలం ఇరుకునపడ్రాడు. ఆవల పోలీసువాడు దబాయిస్తున్నాడు.
"ఎందుకు ఇతణ్ని కొస్టేవు? రా. పోలీసు స్టేషనుకి.”
ఈ దురన్యాయం చేసినవాడు తప్పించుకొంటున్నాడు. తాను నేరస్తుడు అవుతున్నాడు. భదం
అమాయకత్వం నటిస్తున్నాడు. వాడు
పరిస్థితులు [గగ్రహించేడు, కల్యాణి తనమీద నేరం చూపలేదు. అది ఆవిడ ప్రతిష్టకు భంగం. కనక
నామ్మదిగా తప్పుకుంటుందని
వాడు [(గహించేడు. ఆ ధైర్యంతో రాజగోపాలంమీద ఎగిరిపడుతున్నాడు.
"ఈ నాకొడుకు వట్టినే నన్ను కొశ్వేడు.”
కాని, జనం చెప్పిన మాటల్నిపట్టి పోలీసు భద్రాన్ని గదమక తప్పిందికాదు.
"నోరుముయ్యి. ”
ఫిర్యాదుచేయడానికి రాజగోపాలం పోలీసుస్టేషనుకు వెడదామన్నాడు. కల్యాణి వద్దంది.
"మన సంస్కారంఅది. నాకు సానుభూతి లభించడానికి బదులు రేపటినుండి నాకు చిత్రచిత్రాలళైన
పేర్లు పెడతారు. ఈ వారినుంచి
లేచిపోవడంతప్పు నాకు దారుండదు. మీకు పుణ్యముంటుంది. వూరుకోండి. ”
పోలీసువాడూ నెమ్మదిగా అదే సలహాఇచ్చాడు.
వీళ్లీ లాక్కుపోయి లాకపులో కీళ్ళుతీసి వదిలేస్తాం. మీరు వెళ్ళిపోండి. కేసుపెడితే ఆ అమ్మకే
అవమానం. ఈ మొండిలంజాకొడుకులికి
సిగ్గా, బవిడియమా?”
రాజగోపాలం ఇటువంటి ఘటనలు జరిగేయన్నప్పుడు చెప్పిన సలహాల్ని మరచిపోలేకపోయేదుడు.
"సినిమా హాలుల దగరా, రాజవీధుల్లోనూ ఈ రౌడీలు మితిమీరిపోతున్నారు. ఎరిగినవాళ్ళేనా
జనంలోంచి ఎవరో నవ్వేరు.
”ఈయనెవరో అమాయకుడల్లోవున్నాడు. ”
ఈ భద్రం కొంతకాలం కమ్యూనిసు జెండా పుచ్చుకు గంతులేసేడు. వీడో రౌడీఅని తెలిసి వీడికీ మాకూ
సంబంధంలేదని వాళ్ళు విశాలాంధ్రలో
వేసేశారు. వెంటనే కారగెసు నాయకుడొకాయన వానిని చేరదీసేడు.
ఆ కథ వినేసరికి భదం కీర్తి ఆ వీధిలో గుభాళిస్తూందని రాజగోపాలం (గ్రహించేడు. రౌడీలకు
రాజకీయపుముసుగు లభించిందంకే
మనచేతులు దాటిపోయిందన్నమాకే ననిపించింది. ఆ భయాన్ని పోషిస్తూ ఒకడు రహస్యంగా చెవిలో
వూదేడు.
"మీకీ సంగతి కొత్తదల్లేవుంది. వీడు ఆ వీధిలోవున్న భజన సమాజం మనిషి. వాళ్ళకీ హాయయజమాని
బలంవుంది, రేపువచ్చే
ఎన్నికలకోసం వాళ్ళనీయన పోషిస్తున్నాడు. ఆయన మంత్రివర్గం [గ్రూపులోవాడు, అంకే గవర్నమెంట్
క్కూడా మామగారన్నమాట . ”
ఆ రాజకీయ సంబంధాలు ఎంతవరకు నిజం. చెప్పేవాడెవరు? అతడికివన్నీ ఎల్లాతెలునసు? అనే
ప్రశ్నలు అతని మనస్సులో
చేరనేలేదు. వేర్వేరుష్యతికలలో వస్తున్నవార్తలు, చెవులబడుతున్న కథలు వింటుంకే
నమకపోవలసిన అవసరం కనబడలేదు.
కాని హృదయం ఆ అన్యాయానికి ఆహైాశించక మానలేదు.
"మనం అడవిజంతువుల్లో బతుకుతున్నామా?”
ఆ హితచింతకుడు నవ్వేడు.
”" అడవిజంతువులకి సినిమాహాళ్ళుండవు. మంతుల బలమూ వుండదు.”
ఆయనే ఓ రిక్షాను పిలిచేడు. రిక్షావాడు రాజగోపాలాన్ని ఆహ్వానించేడు.
"బాబయ్యా! కేసులు గీసులు తర్వాత చూసుకుందురుగాని, మీతో మాట్లాడుతున్న నాయుడు సంగతి
తెలీదుమీకు. వాడే ఇవన్నీ పక్కనుంచి
చేయిస్తుంటాడు. ముందు రిక్షా ఎక్కండి."
రాజగోపాలం దిగ్రమ చెందేడు. అక్కడున్నవారిలో ఎవరిని నమ్మాలో తెలియడంలేదు. నాయుడు
వెళ్ళిపోయాడు. పోలీసువాడు భద్రాన్ని
తీసుకుని వెళ్ళిపోతున్నాడు. వాడు దూరంనుంచి వెనుతిరిగి చూస్తూ బెదిరిస్తున్నాడు.
"కొడత్రావేం? నా తడాఖా చూద్దువుగానిలే, నా కొడకా!”
పోలీసువాడు గెంటుతున్నా వాడు తిరిగితిరిగి చూస్తూనేవున్నాడు. తిడుతూనోవున్నాడు. పోలీసువాడు
వానిని అరెస్పుచేశాడో, అల్లరికాకుండా
కాపాడుతున్నాడో అర్దం కావడం లేదు.
ద్యిగ్పుమ చెందినట్లు నిలబడిపోయాడు.
"నడు కళ్యాణీ! ”
ఇద్దరూ రిక్షా ఎక్కికూర్చున్నారు.
"ఏమిటీ దురన్యాయం?”
కల్యాణి దుఃఖం కట్టలుతెంచుకుంది. అతని ఒడిలో తలపెట్టుకుని వెక్కి వెక్కి ఏడుస్తూంది. అతడు
ఏం సమాధానం ఇవ్వగలడు?
ఏమని వూరడించగలడు?* ఆమెదుఃఖం చూస్తే అతనికీ కళ్ళనీళ్ళు తిరిగేయి. జాలిగా వీపు నిమిరేడు.
రిక్రావాడు రుణర్వుణ చప్పుడుచేస్తూ రంయ్ న తొక్కుకుపోయాడు.
ఇరవయ్యనిమిదో ప్రకరణం
తమ విధిమొగకు రాగానే గోపాలం ఆమెను లేవదీశాడు. కల్యాణి కళ్ళుతుడుచుకుని కూర్చుంది.
అతని చేతిఆసరాతో రిక్రా దిగింది.
రిక్రావాడు వెళ్ళిపోయేముందు సానుభూతి తెలిపేడు.
"అయ్యగారున్నారు గనక సపెద్దగండం తప్పింది నంజకొడుకులు మదీ బరితెగిస్తుండారు. పోయొత్తా
బాబూ! ”
వాడు వెళ్ళిపోయినా కల్యాణి అడుగువెయ్యలేదు. వీధి అంతా నిశ్శబ్దంగావుంది. అంతా
తలుపులువేసుకు పడుకున్నారు. రాజగోపాలం
తనవద్రనున్న తాళంతో వీధిగేటు తెరిచేడు.
" మామగగారెక్కడి కెళ్ళారు?”
రామలక్ష్మమ్మ కల్యాణితోపాటు అతనికీ మామ్మ.
"కృష్టలంకలో బంధువులున్నారు. చూసివస్తానంది. వెళ్ళిందికాబోలు.
కంఠంలో దుఃఖచ్చాయలు కరగలేదు.
7గ్రా!
అమెచేయి పట్టుకున్నాడు. తమయిద్దరిమధ్య పరిచయాన్ని ఎంతవరకు ప్రదర్శించవచ్చునో అతనికి
అర్దంకావడంలేదు.
ఇంట్లోనోవున్నా రామలక్ష్మమ్మకు కూడా తమ సన్నిహితత్వం అర్హంకాకుండా మెలుగుతున్నారు.
ఇప్పుడు నడివీదిలోంచి ఆమెను
పొదివిపట్టుకుని తీసుకెళ్ళడం ఎవరన్నా చూస్తే? చూస్తేనేమో అతనికి తెలియదు. నలుగురూ తమకు
వరసకలుపుతారు. తప్పేంలేదు.
తామెల్లాగు కొద్దిరోజుల్లో పెళ్ళి చేసుకోవాలనుకొంటూనే వున్నారు.
కాని, కల్యాణే దానికి అభ్యంతరం చెపూంది, పెళ్ళి అయినతర్వాత పరిస్టితి వేరు. అది జరక్కుండానోే
తాము దగ్గరగా
వుంటున్నట్లు తెలిస్తే వచ్చేపేర్తు వేరు.
"నా కాళు కదలడంలేదు. ”
అతిక్షీణంగా దుఃఖమయంగా వినబడ్డ ఆమెకంఠం అతని హృదయాన్ని కలచివేసింది. శంకలు గాలికి
వదిలాడు. పాదివిపట్టుకుని
నడిపించేడు. ఆమె అతనిమీద వొరిగిపోయి కంఠం కాగిలించుకుంది.
ముంగిలిదాటాక కటకటాలతలుపులు తాళం. మెస్తెక్కేక వేర్వేరు వాటాతలుపులు తాళం. తమ
జీవనసమభాగిత్వానికున్నన్ని ఆటంకాలూ.
తొందరపడి లాభంలేదు.
లోనికి వెళ్ళాక ఆమె నాతడు చేతులలోనో ఎత్తుకొని, తీసుకుపోయి మంచంమీద పడుకోబెట్టి తాను
శుక్కన కూర్చున్నాడు.
ఆమె నీరవంగా, నీరసంగా కళ్ళప్పగించి మిద్దెవేపు చూస్తూంది. అతడామెమీదుగా వొరిగి అర్దశాయియమైై
ఆమె ముఖంలోకే చూస్తున్నాడు.
అతనిచూప్తు తన ముఖంమీదే వుండడం గమనించి ఆమెకళ్ళు నీళ్ళుతిరిగేయి. అతడు చెంపలు
తుడుస్తూంకే ఆచేతినితీసి గుండెలకదుముకుంది.
"మీరు రాకుంకే నా గతి ఏమయేదో....”
"నేను రాకపోవడం ఎల్లా సాధ్యం కళ్యాణీ! ”
ఆమె అతని చేతిని మరల చెంపల కానించుకొంది.
"ముఖం అంతా మండుతూంది.”
అమెనోట జరిగిన ఘటననంతా వివరంగా తెలుసుకున్నాక ఆమెనాతడు గాఢంగా కౌగిలించుకొన్నాడు.
"నేనా సమయంలో నిన్ను కసురుకున్నాను. క్రమించుతావు కదూ!
ఆ సమయంలో ఆమె తననంటిపెట్టుకు వేలాడుతూంకే అతడు కదలలేదు. ఆ రౌడీకి అవకాశం
ఇచ్చినట్టువుతుంది.
కల్యాణి అతనివీపున చేతులువేసి, అదుముకొని అతని క్షమాపణను స్వీకరించింది.
లేచి నీళ్ళుపోసుకోవాలి. బట్టలు మార్చుకోవాలి. ఆ మాలిన్యం వదల్పుకొంకుతపు న్నిదకూడా
పోలేదు. కాని, ఎల్లాగ? కాలూ చెయ్యీ
రూడ కదల్ప్చలేనంత అవశత్వం.
"కొంచెం టీగాని, కాఫీగాని త్రాగితే ఓపిక చేరుతుంది. తెచ్చిపెట్టనా?”
రాత్రి పదిగంటలవేళ టీ కావాలంకే సెంటరు కెళ్ళాలి. రెండో ఆటముగిసేవరకూ అక్కడ ఒకటిరెండు
హూటళుు తెరిచివుంటాయి.
కాని కల్యాణి అతనిని కదలనివ్వలేదు.
"నేనుండలేను. భయంగా వుంది.”
అతని కౌగిలింతలు, మూర్కొనడాలు, ముద్దులు ఆమెకు బైర్యం కలిగించలేకపోయాయి.
"మామ్మ బంధువులింటికి వెళ్ళడంకూడ ఒకవిధంగా మంచిదే అయింది. నోనొక్కర్తెనూ ఈ గదిలో
పడుళీలేను. ”
ఆ గదిలోనేోకాదు, ఒంటరిగాకూడ పడుకోలేకపోయింది. ప్రతిష్ట కోసం పళ్ళుబిగపట్టుకుని కొంతసేపు
పడుకొంది. కన్ను మూసేసరికి
ప్రత్యక్షం అవుతూ, ఆ ఘటన ఆమెను అంతరంతరాల్లోంచీ కలిచివేస్తూంది. ఏడ్పువచ్చింది.
ఏం చెయ్యాలో తోచక, ఆమె న్నిదపోయే వరకూ రాజగోపాలం ఆమె ప్రక్కనే కూర్చుని వున్నాడు.
ప్రక్కన చేతికందేటంత దూరంలో
తనమంచం వేసుకున్నాడు. కాని, ఆమెను వదలిపోయి న్మిదపోవడానికి మనసనొపష్ప్పడం లేదు. ఆమె
చేతిని తన చేతుల్లోకి పిసుకొని
అలాగే కూర్చున్నాడు.
కల్యాణీ అతనిని తనమీదకి లాక్కుంది.
"పడుకోండి."
"నువ్వు నిద్రపో."
అతడామెను అర్జం చేసుకోలేదు. కల్యాణి ఈమారు తనమంచం మీదనో పక్కకు జరిగింది.
ఇరవైతొమ్మిదో ప్రకరణం
తెల్లవారేముందు గోపాలానికి తెలివి వచ్చింది. కల్యాణీ తన కంఠాన్ని కౌగలించుకొని పడుకొనోవుంది.
ఒళుఇ కొంచెం వెచ్చగా
వున్నట్ట్లుంది.
ఆమె తనప్రక్కన వుండడం అతనికెంతో తృప్తీ, సంతోషమూ కలిగిస్తూంది. గాలికి చెదిరిన జుట్టు
సవరించేడు. బుగలు నిమిరేడు.
కల్యాణి ఒక్కమారు కళ్ళు తెరిచింది, చిన్న చిరునవ్వు కనబడింది. అతనిని మరింత దగ్గరగా
లాక్కుని మరల కన్ను
మూసుకుంది.
వీధిలో పనిమనిషి కాబోలు తలుపు తట్టింది. మామూలుగా ఆవేళకు కల్యాణి తలుపు తీసి వుంచేసేది.
కాని ఈవేళ ఆమె లేవలేదు.
లేవగలిగే స్థితిలో కూడలేదు.
రాజగోపాలం మెల్లగా ఆమె చేతిని తప్పించి లేచేడు. కల్యాణికి తెలివివచ్చింది. అతనిని లేవనీయడం
అమెకిష్టంకాదు. నడుం
కౌగలించుకుని ఒడిలో తలపెట్టుకుంది. అతడు అప్యాయంతో తల నిమరబోయేడు. కాని ఆమె ఆ
చెయ్యితీసి చేతపట్టుకుంది.
"జుట్టంతా పచ్చిపుండులా వుంది.”
ఆస్థితి అతనికి జాలికలిగిస్తూంది. ఆమె అంతబేలగా ఉంటుందని అతడూహించలేదు. ఆమె
కౌగిలింతలలో అతనికి విలాస-వ్మిభమాలు,
శృంగారావేశమూ కన్నా పరాశయంకోరే బేలతనేోమే కనిపిస్తూంది. అతనికి చాల జాలికలిగింది.
" క్రభ్యాణీ! ౯
వీధిలో మరల పనిమనిషి పిలుపు. ఆమె కదలికలోనో పిలుపు విన్నదని అర్ధం అవుతూంది.
"నువ్వు పడుకో. నో తలుప్పుతీస్తా. ”
ఆమె ఆలోచించింది.
"వెళ్ళండి. ”
తమరిద్దరూ ఒక్క మంచంమీదనే పడుకున్నట్ట్లునుకోకుండా జాగ్రత్తపడడం తప్పు వారప్పుడు
చేయగలది లేదు.
రాజగోపాలంవాటా తాళంకూడా తీసిలేదు. అతని మంచం కల్యాణి గదిలోనో వుంది.
రెండువాటాలమథ్య తలుపు మూసినా రాత] కల్యాణి
స్నానంచేసి వదలిన తడిచీర, నీళ్ళబవిందె రాజగోపాలం వాటాలోనే వున్నాయి. ఆ వాటాలమధ్య
తలుపుగడియ కల్యాణి గదిలోనికే వుంది.
కనక ఆ ద్వారం వాడుకోగలిగేరు. దొడ్డిలోనున్న గదిలోకి వెళ్ళడానికి భయపడి అతని వాటాలోని
వసారామీద స్నానంచేసింది. ఆ
చిహ్నాలన్నీ అల్లాగే ఉండిపోయాయి. వాటినన్నిటినీ దాసీమనిషి చూస్తుంది. కాని, చెయ్యగలిగేది
లేదు. ఇప్పుటికే పావుగంట నుంచి
పిలుస్తూంది. ఇంకా ఆలన్యమైతే ఏమిటో విశేషమని వీధివీధంతా చేరగలరు.
పనిపనిషి వచ్చేసరికి ఆమె లేవలేదు. దాసీమనిషికి తలుపు తీస్తూనే రాజగోపాలం ఆమె
ఉఊహించుకోగలగడానికి ఉపోద్దాతం
పారంభించేడు.
"నిన్నరాత్రి మీ అమ్మగారికి జబ్బుచేసింది. తెల్లవార్లూ పలవరింతలు, కేకలు, ఇప్పుడిప్పుడే కొంచెం
నిద్రపోయారు. ”
' మీరు కల్యాణిగారి గదిలోంచి వస్తున్నారు. రామలక్ష్మమ్మగారు లేదా! ...యనే ప్రశ్న
దాసీమనస్సులోనే మెదిలింది. కాని ఆమె
ఆ (ప్రశ్న వేయలేదు.
దాసీ కల్యాణిని "ఎమిటమ్మగారూ"” అని ఆరోగ్యం సంగతి అడిగింది. చేయిపట్టుకు చూసింది.
"కొద్దిగా వెచ్చగా వుంది.”
కల్యాణి ఏమీ అనలేదు. దాసీమనిషి సహాయంతో ముఖం కడుక్కుంది. ఆమె కాఫీ కాచి తెచ్చేసరికి
రాజగోపాలం ఆమె మంచం(ప్రక్కన
రుద్చీవేసుక్కూర్చున్నాడు.
"ఏమన్నా జడుసుకున్నారేమో అయ్యగారూ”. .. అంది ఆమె అనారోగ్యానికి కారణాలు వెతుకుతూ
దాసీమనిషి లచుమ్మ.
కల్యాణి ఏమీ అనలేదు. తన భయానికి కారణం ఏమిటో లచ్చుమ్మకు తెలియనివ్వడం ఇష్టంలేదు.
దానివలన ఎన్నో
ఇబ్బుందులున్నాయి. ఇరుగూ-పొరుగూ వింతగా చెప్పుకుంటారు. అనేకపేర్తు పెడతారు. కల్పునలు
ప్రారంభిస్తారు. దానికితోడు పిల్లలూ,
ఇతరటీచర్లలో ఎంతో చిన్నదనం. అందుచేత కనుసంజ్దచేసి గోపాలం ఏమీ చెప్పకుండా వారించింది.
"ర్శాతి అన్నంకూడా వండుకున్నట్టు లేదమ్మగారూ !
తండ్రిని సాగనంపడానికై వెళ్లి ప్రేషనునుంచి వస్తూ హూోటలులో భోజనం చేశాననడంతో దాసీ
మరోప్రశ్న వేసింది.
” నీళ్ళకాగు కనపథడంలేదమ్మా! ”
"రాత్రి గోపాలంగారు స్నానంచేసేరు. వారివాటాలో వుంది.”
"అయ్యగారూ! తలుపుతీస్తారా బయటపెడతాను. ”
కల్యాణీ ఇప్పుడేం అక్కురల్లేదంది.
"నేను నీళ్ళుపోసుకోను ఈ పూట. మధ్యాహ్నం నీళ్ళు పెట్టవచ్చునులే. *
లచ్చమ్మ మరోపేచీ వేసింది.
"మబ్బేసింది. అయ్యగారైనా పోసుకుంటారు."
దాసీదాని పట్టుదల అర్దం అయింది. అదేదో రహస్య పరిశోధనకుష్మకమించిన ఉత్సాహంలో వుంది.
"అయ్యగారికి నీళ్ళమాటటుంచుదాం. పాపం వారికి తెల్లవార్లూ న్నిదలేకుండా చేశాను. నువ్వు
హోటలుకి వెళ్లి ఇడ్తీ పట్టుకురా.”
గోపాలం తనకు వద్దనబోయాడు. కాని కల్యాణి కనుసంజ్దితో వారించింది.
పరుపుక్రిందినుంచి డబ్బులు తీసియిచ్చి దాసీలచ్చుమ్మను పంపేసింది.
"బంకనక్కిరికాయలా పట్పుకొంది. ”
కల్యాణి అతనిసహాయంతో లేచింది. మధ్యతలుపు తీసుకొని వెళ్లి రాతి తానావాటాలోకి వెళ్ళినట్లుచూపే
గుర్తులన్నీ తీసేసింది. మళ్ళీ
మధ్యతలుపు బిగించింది.
"కాగు అట్లాగే వుంచండి. దానినే తీసుకురానివ్వండి. ”
"ఏమిటీ దాగుడు మూతలు కళ్యాణీ! ఈ వేళనే రిజ్నిస్టారాఫీసుకు రాసిపడేద్దాం, పదిహేనో నాడు
పోయినట్లయితే రిజిస్టరు
చేస్తారు. ”
నిన్నటి ఉదయం -సరిగ్గా ఇరవైనాలుగంటల[కితం ఆ ప్రతిపాదనకు ఆమె మహోత్సాహంతో
సరేననేది. కాని ఇప్పుడనలేకపోయింది.
కారణం ఏమిటో అతనితో చెప్పనూ లేకపోయింది. తాను జరిగిందనుకోని పెళ్ళిఒకటి జరిగిందని
చెప్పుకోవడంలో అర్హంఏమిటి? కాని
ఆమాట నాతో ముందెందుకు చెప్పులేదు? ఈ రహస్యం ఎందుకని? గోపాలం తప్పుపడితే.
నిన్నటివరకూవున్న పరిఫ్రితివేరు. ఈవేళ ఆనందరావు అనోవ్యక్తి బయటపడ్లాక వచ్చిన పరిస్థితివేరు.
"దాసీదాని కోసం రిజ్మిఫ్టారాఫీనుకి పరుగెత్తుతామా యేమిటి?”
ఇంతవరకూ అ ప్రసక్తి ఎందుకుతేలేదన్న ఎత్తిపాడుపు ఆమాటలో వినబడి రాజగోపాలం
నొచ్చుకున్నాడు. కళ్యాణి వూాహించింది. తన
అభ్మిపాయం అదికాదని సంతృప్తిపరుస్తూ అతని చేయి చేతిలోకి తీసుకొంది.
"నిన్న మిమ్మల్ని నాన్నగారికి పరిచయం చెయ్యాలని ప్రయత్నించా."
తానాసమయానికి అందకపోవడం చాల దురదృష్టం అన్నాడు.
"పోనీ మనం ఇద్దరం వెళ్ళివస్తే.”
కల్యాణికా ఆలోచన బాగుందనిపించింది. తానెన్నుకున్న వరుజ్లీ తనవాళ్ళందరూ చూడగలుగుతారు.
ఆనందరావు అక్కడేవున్నాడు గనుక
అసలుపరిస్థితి ఏమిటో వివరంగా గోపాలానికే తెలుస్తుంది.
"మీరు వస్తారా? వెడదామా?”
రాజగోపాలం అమెకళ్ళులో కనబడిన అశ్రువులు చూసి కదిలిపోయేడు.
"ఎందుకురాను కళ్యాణీ! నీకా అనుమానం ఎందుక్కులిగింది?”
అతని కౌగిట కల్యాణి ఒదిగి గుండెలమీద తలఆన్నింది.
వీధిగేటు చప్పుడయి ఇద్దరూ విడిపోయారు. లచ్చుమ్మ ఇట్సీతో లోపలికడుగు పెట్టేసరికి కాతడు తన
రుద్చీలో వున్నాడు.
"ఇంత ఆలస్యం చేసేవేమే?”
"ఎంతకీ కట్టివ్వలేదమ్మా! ”
దాసీమనిషి గ్లాసుకడిగి మంచినీళ్ళు తెచ్చి పెట్టింది.
"అమ్మగారూ! పొయ్యి రాజవెయ్యనా?”
"అక్కర్లేదు. నేను హోటలునుంచి తెప్పించుతాలే. ” అన్నాడు రాజ గోపాలం.
కాని, కల్యాణి ఆపనిని లచ్చుమ్మకే వప్పుచెప్పింది.
"రొక్టై కూడా తీసుకురా.”
"మరి క్యారియరెవరికమగగారూ ! ”
"ఏమిశే వెధవప్రశ్నలూ నువ్వూనూ, గోపాలంగారున్నారుగా. ఆయన్నో హోటలుకెళ్ళి రమ్శంటావా?”
" ఆఫీసుకెడతారననుకున్నానమగారూ ! ”
"మామ్మగారుకూడా లేరు. ఈవేళ వారిని కాస్త తోడుండమన్నా.”
ఒకయువకుణ్లీ తోడుండమనడంలోని బెచిత్యమేమిటో లచ్చమ్మ కర్టం కాలేదు. కాని ఏమీ అనలేదు.
"మీకు మందేమిటమ్మగారూ ! ”
రాజగోపాలం సమాధానం ఇచ్చేడు.
"నేను డాక్షరుగారిని తీసుకొస్తాలే. ”
డాక్టరును తీసుకురావలసిన ఆలోచనో వుందంకే ఏదో పెద్దజబ్బే చేసిందన్నమాట.
"ఈవేళ మధ్యాహ్నం ఒంటిగంట వేళప్పుడో బండి వుండాలి. ఓవారం సెలవుపెట్టి ఇంటికి వెడతా.
గోపాలంగారు తోడొస్తారు. నువ్వు
స్కూల్లో నా సెలవుచీటీ ఇవ్వాలి. *
సెలవపెట్టి తల్లి దండ్రుల వద్దకు వెళ్ళి పోవలసిరావడమూ, దారిలో గోపాలం తోడు
కావలిసిరావడమూ ననేసరికి లచ్చమ్ముకు
నిజంగానే గాభరా కలిగింది. గోపాలం రాత్రిఅంతా అమెవద్ర వుండవలసినంత అవసరం
వుండేవుంటుందని తృప్తిపడింది.
లచ్చమ్మ వెళ్ళింతర్వాత గోపాలంకూడా లేచేడు.
"నేనూ సెలవుపెట్టి వస్తా.”
ముపష్పయ్యో ప్రకరణం
హఠాత్తుగా కూతురు గుమ్మంలో గుర్రబ్బండి దిగుతూంకే, అప్పుడే వీధిలోకి తొంగిచూసిన భాగ్యమ్మ
బహ్మానందపడింది. ఆమె
ఒక్కర్తేగాక మరో యువకుడు కూడా బండిదిగడం ఆమెకు ఆశ్చర్యం కలిగించింది. అతడిదెన్నడూ
చూసిన ముఖం గాదు. వయస్సులో
వున్నాడు. దృఢమైన శరీరం, నీటయిన దుస్తులూ, తేటయిన ముఖమూ, వ్యక్తిగా అతనిలో
అభ్యంతరకరమైనది ఆమెకు కానరాలేదు.
కాని తనతో వెంట బెట్టుకుని రావడంలోనో వుంది, అభ్యంతరం.
భాగ్యమ్మ కూతురుకుశలంకన్న, ఈ అవజ్జ్ఞతకు సంజాయిషీ అడగడం అవసరమని భావించింది.
"ఆయన ఎవరే."
ఆ కంఠంలోనే మందలింపు ధ్వనిస్తూంది. అది ఎందుకో కూడా కల్యాణి గ్రహించింది. దానిని
లెక్కచేయదలచుకోలేదు. ఇటువంటి ఘట్టం
రావచ్చునని ఆమె ఎరుగకపోలేదు. తల్లికే కాదు అక్కడకు వచ్చినవారందరికీ ఒకమారు
పరిచయంచేయడానికై పిలిచింది.
"గోపాలంగారూ! ”
బండివానికి డబ్బులిచ్చిపంపేసి అతడు నామ్మదిగా వచ్చి ఆమె ప్రక్క నిబడ్డాడు.
"మేమూ, వీరూ ప్రక్క ప్రక్క వాటాల్లో ఉంటున్నాం, ఇంజనీరు, పేరు రాజగోపాలంగారు. మావూరు
చూద్దురుగాని రమ్మనితీసుకొచ్చా. ”
రాజగోపాలం మందహాసంచేస్తూ అందరికీ నమస్సురించేడు.
భాగ్యమ్మ విషయం అర్దం కాకపోయినా, అతనిని ఆప్యాయంగా ఆహ్వానించింది.
దక్షిణామూర్తికి పరిఫ్టితి అర్మమయిందనిపించింది. మొన్నటిరోజున తనపారుగునవున్న ఇంజనీయరు
గురించి చెప్పడంలో కనబరిచిన
వుత్సాహం గుర్తుకువచ్చింది. అప్పుడామె మాటలలో కనబడని విశేషం ఇప్పుడు గోచరించింది.
మొన్న తాను అందచేసిన సమాచారానికిది సమాధానమేమో అనిపించింది. అదే అయితే ఆమె
చాలతెలివితక్కువగా
వ్యవహరిన్తూందనుకోవాలి-అనుకొన్నాడు .
భాస్కరరావుక్కూడా తండ్రికి కలిగిన అనుమానమే తట్టింది. కాని ఏమీ అనలేదు. ఆ యింట్లో
రాజగోపాలానికి పరిచితుడాతడొక్కడే..
అతనంకే సదభ్మిపాయంవుందికూడా. ఆతడు రాజగోపాలాన్ని తన ఇంటికి తీసుకెళ్ళేడు. కూర్చుండి
కబుర్లు చెప్పేడు. ఆతనిరాకకు కారణం
బగహించడానికి తిప్పిత్రిప్పి ప్రశ్నలు వేసేడు.
బిడియపడుతున్నట్లు మాటమాటకూ కళ్ళువొంచుకొంటున్నా అతనినుంచి భాస్కరం కొత్తగా ఏమీ
తెలుసుకోలేకపోయడు.
వాళ్ళ వెనక పదిహేనునిముషాలకు కల్యాణి వచ్చింది. ఒక నిముషం వదినతో మాట్లాడినా, ఆమె
వారిద్దరున్నచోటికే వచ్చింది.
"మీరు స్నానం చెయ్యరాదూ. రాత్రి ప్రయాణంలో బడలికచేసివుంటుంది, లోపల వేడినీళ్ళున్నాయి.”
"బట్టలు తెచ్చుకొన్తా. ”
కాని అతనినంచీ తెపష్పించడానికి భాస్కరం స్వయంగా వెళ్ళేడు.
కల్యాణి మాట్లాడుతూ, మాట్లాడుతూ మధ్యలో నెమ్మదిగా అందించింది.
"మావదినతో చెప్పా, సినిమాహాలుదగరసంగతి.. *
"వద్దనుకొన్నావు. "”
"అవసరమని తోచింది."
రాజగోపాలం ఏమీ అనలేదు.
కల్యాణి వేడినీళ్ళుతోడి స్నానాలగదిలో పెట్టింది. సబ్బువుంచింది. దండెంమీద తుండు వేసింది.
అతనికి దగరుండి ఒక్కొక్కశు చూపించి
తలుపు జేరవేసి యింట్లోకి తిరిగివచ్చింది.
గుమ్మంలో వదిన కనిపించింది. పరాయి మగవాని విషయంలో ఆమె చూపుతున్న శ్రద్ద
అతెఅవుతూందని ఆమె అబ్మిప్రాయం.
"పరాయి యువకుడియెడ అంత ఆప్యాయం చూపడం సాంప్రదాయం కాదు కళ్యాణీ!”
"ఇంతవరకు నాస్వంతంఅన్న మనిషి ఏర్పడలేదుగనక దేశంలో మగవాళ్ళంతా నాకు
పరాయివాళ్ళాకాదా వదినా! ”
"అదే మొన్నటిపరిస్టితి తెచ్చిపెట్టింది. ఇప్పుడన్నా మగతోడు అవసరాన్ని గుర్తిస్తావా?”
"గిరీశం చెప్పినట్లే వుంది వదినా! మగతోడు అవసరంచూపించడంకోసమే నన్నమాట ఆ దొంగవెధవ
పని.”
మాణిక్యాంబ నిరుత్తర అయింది.
అయితే తల్లి ఆ ఘట్టం విన్నప్పుడు తన కూతురికి కలిగిన ఆపదకు విచారపడి వూరుకోలేదు.
"ఆడపిల్లలు వంటరిజీవితం అందుకే మగవాళు కాదంటారు. మాటలురాని నలుసైనా మగకు[రాడిని
చంకనేసుకు వెడతారు ఊరికేనా?”
"ఒంటరితనం ఏమిటమ్మా! మూడులక్షలు జనాభావున్న పట్నంలో.”
"నా అన్నవాడు లేనిచోట ఎందరున్నా అడవిలో వున్నళ్స్తు...”
"నా అనేది ఎవరి ముఖాన్నైనా వ్రాసి వుంటుందేమిటి? ఆపదలో అయినవారెవరో వాళ్ళే మనవాళ్యు. "”
"అయితే. ...”
"అయితే లేదు గియితే లేదు. అది అంతే" నని కల్యాణీ వెళ్ళిపోయింది.
కాని భాస్కరరావేమంత సులభంగా వదిలిపెట్టలేదు. మగా అతనికి విషయంచాలవరకు తెలిసింది
రూడా.
"మన నవలలూ, సినీమాలల్లో మాదిరిగా 'విలన్' బారినుంచి కాపాడిన కృతజ్ఞతా యిది.”
"అది జరిగింకా ౩6 గంటలు మించలేదు, కదా అన్నా!”
"అయితే ఇది బాగా, వేళ్ళు...”
కల్యాణీ వూరుకోలేకపోయింది. ఆమెకా అన్నగారి స్వభావం తెలుసు. ప్రతిదానినీ వేళాకోళాలు,
వెక్కిరింతల్లో తేలగొట్టి చులకన
చేసేస్తాడు.
"వొరేయి, నువ్వు బెచిత్యంకూడా మరిచిపోతున్నావు. ”
"వేళ్ళూనుకొను-- అనే శబ్దం డ్రేమవిషయంలో వాడడం ఉచితం కాదంటావు. మాకంకే
మీరేనయమరా! ఏశబ్దం ఎక్కడవాడాలో
కాస్తజ్ఞానమేనా ఉంది. మొన్న మానేస్తం ఒకడు పెళ్లిచేయిస్తానని తయారయ్యాడు. పురోహితులనోట్లో
మన్నుకొట్టడందాకా పనికి
వస్తున్నారుగాని, ఏం మాట్లాడాలో, మాట్లాడకూడదో నోర్వలేదుగా. అతగాడు ఏంచేసాడో తెలుసా?
మంగళనసూూతంకస్రు ఆచారాన్ని
శవాలంకరణమనేశాడు. ఆ మాట మంచి గమకంగా కనపడింది కాబోలు, ఓపావుగంటలో పదిమాట్లకు
తక్కువగాకుండా వుపయోగించేడు. ఆ
పెళ్ళికూతురుకు ఖర్మం ఆ మాంగల్యంవుంకేగాని పెళ్ళికాదనే నమ్మకంతో కట్టించుకొంటూంది. అయితే
చేయిస్తున్నది దండలపెలి.
తాళిబొట్టుకు దానిలో ఛాన్సు లేదు. కనుక పెద్దలు పూలమాలతో కలిపి దానిని వేయించేశారు. మా
"పెద్దమ్మ అది
ఎరగడు..... ?7
"నెత్తిమీద వూదొత్తులబుడ్సితోనైనా కొట్టకపోయిందా?”
"అయ్యబాబోయ్! అందుకేగాదుకే, ఆడదాని స్వాతంత్ర్యంగురించి మాట్లాడడం తగ్గించేశాం. "
"ఉదరించారు. ”
అయితే ప్రస్తుతం నన్ను ఆయనతో మాట్లాడమంటావు. ”
"ఏమీ అక్కర్లా, నువ్వు అమ్మ, నాన్న, వదినలతో మాట్లాడు.”
భాస్కరం ఆశ్చర్యంగా చూశాడు.
"అయితే అన్ని ఏర్పాట్లూ చేసుకుని....”
"లేదన్నా, ఇంకా ఏ ఏర్పాటూ చేసుకోలేదు.”
"ఇప్పుడు మేం నిశానీ సంతకం చేయాలంటావు. పొట్టి సంతకమా, పొడుగు సంతకమా?”
అతని మనస్సులోని కష్టాన్ని కల్యాణి (గ్రహించింది.
"అన్నాయ్! కొంచెం సెన్సిబుల్గా వుండు... .డ్రేమించి పెళ్ళి చేసుకోవాలనో దానిని
అంగీకరించినప్పుడు పెళ్ళిళ్ళుకుదరృడంలో
మనకుంటూవచ్చిన ఆలోచనల్ని కూడా నసవరించుకోవాలి. ఫలానా వాడిని గ్రేమించాలని
అంచనావేసుకుని 'ఏమంటావన్నా' అని నీసలహా
అడగరు. మంచిది కాదంకే చీరకొంగు దులిపినట్లు దులిపేసి, ఇంకెవడున్నాడు మనం
యేమించతగినవాడని చూడరు. _పేమ అనేదానిని
మన స్వాధీనం తప్పిపోయిన దశలోకాని గుర్తించలేం. ఇంక చేయగలదల్లా. ...”
"అది తప్పుదారిన పడిందనిపిస్తే...... 7
"ఆ పేమకు అర్హుడు కాకపోతే..... ॥7
"అదొక బులపాటం- ఇనఫాట్యుయేషన్ మాత్రమేనని తేలిపోతే..... ॥7
భాస్కరం మనస్సులో ఎన్నో సమాధానాలులేని ప్రశ్నలు. వానికి చెల్లెలిచ్చిన సమాధానంవిని అతడు
స్తంభించిపోయేడు.
"యంత్రంవద్ద పనిచేసే వాడికి దానిమోత తెలియడం అది ఆగిపోయినప్పుడే. ”
ముష్పయ్యొుకటో ప్రకరణం
రాజగోపాలం బట్టలు మార్చుకుని వచ్చేసరికి దక్షిణామూర్తి కాఫీకి అహ్వానించాడు. కేబుల్ వద్ద
పరిచితమైన ముఖాన్ని చూసి సంతోషం
వెలిబుచ్చౌడు.
'తమరెప్పుడు దయచేశారు? ఈవూారేనా తమది?”
నారాయణరావుక్కూడా అంత ఆశ్ళర్యమూ కలిగింది. అక్కడ ఒకేయింట్లో ఉండడమే కాదు,
వెంటవెంట వుంటున్నాడుకూడా నన్నమాట.
"మీరిద్దరూ కలిసేవచ్చేరా?”
రాజగోపాలం తలవాపేడు. అతని ప్రశ్నకు సమాధానం ఇవ్వకపోయినా నారాయణరావుది ఆ
వూరుకాదనేో విషయంలో సందేహంలేదు. ఒక
వూరివాళ్ళే అయితే పరిచయం కాకపోయినా కనీసం ముఖపరిచయమేనా వుండదా? ఆరోజున
కల్యాణిగాని నారాయణరావుగాని ఒకరినొకరు
ఎరిగివున్నారనిపించలేదు.
దక్షిణామూర్తికీ ఆశ్చర్యమే కలిగింది.
"మీరిద్దరూ తెలుసునా?”
రాజగోపాలం తలతిప్పేడు. నారాయణరావు సమాధానం ఇచ్చేడు.
బెజవాడలోనే పరిచయం. ఒకమారు చూశా.”
రాజగోపాలానికి కుతూహలం కలిగింది.
"ఆరోజున మీరు కల్యాణి గారిని ఎరిగివున్నుట్లనిపించలేదు.
"అదంతా ఓదురదృష్టగాధ. నోనీ ఇంటివారి అల్తుఖ్జి.
వీరు మా అల్లుడుగారే. ”----అని దక్షిణామూర్తి నారాయణరావును బలపరిచేడు.
అది మరీ ఆశ్చర్యం కలిగించింది. అల్లుడంకు? ఏ అక్కమగడోనా? అంత దగర బంధువును కల్యాణి
ఎరక్కపోవడం. ఆయన
కల్యాణిని ఎరక్కపోవడం సంభవమా?
హఠాత్తుగా కల్యాణి అతనిని వెతుక్కుంటూ ప్రవేశించింది. మీరక్కడున్నారేమోనని
అన్నయ్యగారింటికెళ్ళా ఏదీ నిన్న మీకిచ్చింది?”
"నా సంచిలోనో వుంది. తాళం ఇదిగో.”
దక్షిణామూర్తి ఆ సాన్నిహిత్యాన్ని ఆశ్చర్యంతో చూస్తున్నాడు.
కల్యాణి అతని చేతినుంచి తాళంచెవి అందుకుంటూ ప్రక్కకుచూసింది. నారాయణరావును
గుర్తుపట్టింది. సంతోషం తెలిపింది.
"ఎప్పుడొచ్చేరు?”
"ఒక వారం దాటింది."
"ఇంకా వుంటారా? ఈఊళో బంధువులున్నప్లే చెప్పులేదే.
నారాయణరావులేచి ఆమెకు కుర్చీ ఇచ్చేడు.
"మా ఇంట్లో మాకే మర్యాద చేస్తున్నారు. బలేవారేనో. కూర్చోండి. "”
కల్యాణివంక ఆశ్చర్యంతో చూస్తున్న తండికి తమ పరిచయం ఎక్కడిదో వివరించింది.
"వీరి చెల్లెలు హైమావతి నా సూడెంటు. ఈ మధ్యనే ఆమె పెళ్ళిలో పరిచయం అయ్యారు.”
తానిదివరకే కల్యాణిని చూసినట్లుకూడా ఆనందరావు చెప్పులేదని దక్షిణామూర్తికి గుర్తువచ్చింది.
"మీరు చూసినట్రనా చెప్పలేదే?”
ఆ మాటలోని లోతును కల్యాణి గమనించలేదు.
"మీరు మాట్లాడుతూండండి, గోపాలంగారూ! మీరూ ఎరుగుదురేమో. మా మైోమ అన్నగారు... .వూళ్లోకి
వచ్చినప్పుడు జ్ఞాపకం చేసుకొని
వచ్చినందుకు ధన్యవాదాలు. ”
వారికి పరిచయాలు కలపవలసిన పనిలేకపోయినా అమె వరకు తమ బాంధవ్యం ఎరగదని
దక్షిణామూర్తి (గ్రహించేడు. ఆనందరావు
ఆమెను తానెవరో చెప్పకుండా చూసేడు. మాట్లాడేడు. అదేమీ చెప్పకుండా కేవలం ధర్మ్శబుద్దితోనో
తాను వచ్చినట్ట్లు చెపుతున్నాడు.
కల్యాణి సావట్లోంచి తిరిగి వస్తూంకేు గుమ్మంలోనే తల్లీ, వదినా కనబడ్డారు. వారు ఎవరికోసమో
వచ్చినట్లు అక్కడ నిలబడి
వున్నారు. ఆమెను చూసి నవ్వుతున్నారు.
"ఆయన్ని ఎరుగుదువు?”
కల్యాణి వారి ప్రశ్నను వినిపించుకోకుండానే వెళ్ళిపోతూ - "ఎవరిని?" అని అడిగింది. మరుక్షణంలో
చేతిలో గొలుసుతో వచ్చింది.
"ఏమన్నావు? ఆయన్ని నెల [క్రితమే కాదటమ్మా చూసేను. అంతలోనే మరిచిపోతామేం ! ”
ఆ (్రశ్న వేశాకగాని అసలు పరిస్థితి ఆమెకు గోచరం కాలేదు. తనకంకు అయన మైైమవతి అన్నగా
తెలుసు. తన ఇంట్లో
వాళ్ళాల్లా ఎరుగుదురు! ఆ ఆలోచన తోచగానే అనుమానం కలిగింది. తన తండి చెప్పింది
ఈయన్నిగురించా? కాదనిపించింది. అయన
చెప్పింది ఆనందరావు. ఈయనపేరు నారాయణరావు. ఊళ్ళోోకివచ్చి అందర్నీ పరిచయం చేసుకుని
వుంటాడు.
"ఆయన్ని మీరంతా ఎల్లా ఎరుగుదురు?”
మాణిక్యాంబ సమాధానం ఇచ్చింది.
"ఆయన మన బంధువే కాదటమ్మా! ”
కల్యాణి కాశ్చర్యం అయింది.
"నాలుగైదుమార్లు ఆయనా వచ్చేరు. నేనూ వెళ్ళేను. ఎప్పుడూ చెప్పునేలేదు సుమా, నీకేమౌతారు?”
తల్లి నిట్టూర్చింది.
"౭ను. పదిహేనేోళ్ళుకితం ఓపూట చూసినమనిషి గుర్తు ఎల్లా వుంటాడు?”
"అంకే?”
"ఆయనో నీ మగడు --"” అంది వదిన.
కల్యాణి చ్యురుమనోలా చూసింది.
"ఏమిటొదినా ఆమాట! ”
"తప్పేమందే. ” అని తల్లి సమర్దించింది.
"అమ్మా!"
ఆన్వరానికి తల్లి వులికిపడింది.
"నా మగళ్లీ నే చూసుకోగలను. దారేపోయే దానయ్యకెవరికో కన్యాదానం చేయనక్కర్లేదు. %
సావట్లో వున్న ఆనందరావుకామాట ఎక్కడ వినబడుతుందోనని భాగ్యమ్మ నోరు నొక్కుకుంది.
"ఎంత అప్రతిష్టే కూతురా!”
వదిన మాణిక్యాంబముఖం వెల్లనయ్యింది.
తల్లిని అదరగొన్పేసిందేగాని ఆనందరావురాక అంతవరకూ పట్టాలమీద సాఫీగా నడిచిపోతున్న తన
జీవితశకటాన్ని తల్మకిందులు
చేసేస్తూందనో విషయం స్పష్టమైపోయిది. అతడూళ్ళో మకాంవేసి, తనవాళ్ళందర్నీ తిప్పేసుకున్నాడు
-- అనిపించింది.
రెండురోజుల క్రితం సినిమాహాలువద ఘటన కళ్ళముందు మెదిలింది. అక్కడున్న నలుగురూ తన్ను
సాయంపట్టి కండక్ష్సరు భదంతో
కారెక్కించెయ్యటానికి సిద్దమయ్యారు.
ఇక్కడ తల్లి, తండ్రి, బంధువులూ యావన్మందీ ఆనందనారాయణ రావుకు తన్ను
వప్పుగించేస్తున్నట్ట్లుంది.
అక్కడ రాజగోపాలం తన్ను బయటకు తెచ్చేడు. ఇక్కడ అతడు ఆ సహాయం చేసేటట్ట్లులేడు.
"నీకు పెళ్ళయిందనో మాకు చెప్పేవుకావు,”
తన్నేదో మభ్యపట్టడానికీ, మోసంచేయడానికీ తాను ప్రయత్నించినట్లు భావిస్తున్నాడనిపించింది.
తామసం కలిగింది.
"చిన్నప్పుడోమాటు మైఫాయిడ్ పడ్రాను. అంతకంకే చిన్నతనంలో కోరింతదగ్గుతో ఆరునాలలు
బాధపడ్డానని మా అమ్మ చెప్తూంటుంది.
ఎవరో ఏదో, వేరో, తీగో కంకెలా చుట్టియిస్తే మెళ్ళో వేసేరట.
కల్యాణి చరచర వెళ్ళిపోయింది. మరల కనిపించినప్పుడామె చాల వృదాసీనంగా వంది.
కనుపొట్టలుబ్పినట్లున్నాయి. తాను గతదినం
వూరుకు బయలుదేరి వచ్చేటప్పుడిచ్చిన బంగారపుగొలుసును తెచ్చి తన సంచిలోపెస్పేసింది.
"మనం ఏర్పురచుకోదలచిన బాంధవ్యం గురించి మీరేమీ చింతపడొద్దు. మీరేదో వాగ్దానం చేశారని నేను
అనుకోవడంలేదు. "
ఆమె ఆమాటలతో వెల్లిపోబోయింది. రాజగోపాలం పిలిచేడు.
"రిజ్మిఫ్టారాఫీసుకి తలియపరుద్దామంకే వద్దన్నావు. ఇందుకేనా?”
"మిమ్మల్ని ఈవేళ నోనిక్కడకు తీసుకువచ్చింది ఇందుకే. సమ్ముఖాన తెలుసుకొన్న విషయాలు నోను
ఇచ్చేరంగులో కనిపించవు. "”
"నువ్విచ్చేదేం రంగు!”
"మీరెరుగుదురురనుకుంటాను. ”
కల్యాణి తన పొరపాటు ఎంతనష్టం కలిగిస్తూందో ఇప్పుడిప్పుడే తెలుసుకోగలుగుతూంది. తాను
అంగీకరించినా, అంగీకరించకపోయినా అతనితో
పెళ్ళయిపోయింది. సంప్రదాయం. చట్టం అతనికి తనను స్వాధీనం చేసేస్తున్నాయి.
తనకిష్టంలేకపోతే ఆ మగళ్ట్ళి కాదనిచ్చు. వేరుగా
ఉండొచ్చు. కాని, తను పెళ్ళికాని కన్య కాదు. ఎవరిని పెళ్ళి చేసుకోవడానికి ఏ చట్టం,
సంప్రదాయమూ కూడా అంగీకరించదు.
అంతే కాదు ిక్షిన్తుంది. ప్రేమించిన వానిని కాపాడబోతే తనకు పదేళ్ళ శిక్ష. తననాతడు కాపాడబోతే
ఆయనకైదేళ్యు
సిక్ష....దీనికి కారకుడైన వ్యక్తిని కోర్దులు ఏమీ చెయ్యలేవు.
ఆ మాటనే అంతక్రితమే భాస్కరరావు ఆమెకు వివరించేడు.
"నను పెళ్ళందనుకోవడంలే"” దంది తాను,
"ఏమన్నా అనుకో, నువ్వింక పెళ్ళిచేసుకోలేవు. చట్టం వొప్పుదు.
తాను వివాహం అయిందని వొప్పుకుంకే విడాకులకు దరఖాస్తు పెట్టవచ్చు. అది లబిస్తేనే తనకు
పెళ్ళి.
అంకే-మొదటిపెళ్ళిని గుర్తించితేనో -మరో అడుగు, గుర్తించకపోతే అదీ లేదు.
మొండితనంగా పదిమాట్లు వల్లించుకొంది.
"నాకు పెళ్ళికాలేదు. "
కాని ఆ జపం-తపం-తాపం-కోపం ఏమీలాభంలేదు.
ఏడుపొచ్చింది. తన అసమర్దతకు, అసహాయతకు నిస్ప్రుహ పొందింది.
తాము బయలుదేరేముందు రాజగోపాలం ఒక బంగారు గొలుసు తెచ్చి తన మెడలో వేశాడు. తాను
అభ్యంతరం చెప్పినా అతడు వినిపించుకోలేదు.
ఊరినుంచి వచ్చేక ఇద్రువుగానన్నాఅతడు ఒప్పుకోలేదు. అతని వుత్సాహం, ఆనందం తనను
అంగీకరింపచేసింది.
"మీవాళు వొప్పుకొన్నా వొప్పుకోకపోయినా నువ్వు నాదానివి. ఇదే మనవివాహానికి గుర్తు. మీవాళ్ళు
ఇష్టపడకపోయినా నిన్ను
నాభార్యగా తెచ్చేసుకొంటాను. ” -- అన్నాడాతడు.
తాను ఈ పరిణామాన్ని వూహించలేదు. తనవాళ్ళుంతా తనను సమర్దిస్తారనీ, ఆనందరావు
అవమానభయంతో తప్పుకొనిపోతాడనీ భావించింది.
కాని నిజంచూస్తే ఇప్పుడు తాను ఏకాకి, తనను భార్యగా తీసుకుపోతానన్న రాజగోపాలంకూడా
వెనుకంజ వేశాడు.
కల్యాణి నిరుత్సాహంచూసి రాజగోపాలం కించపడ్డాడు.
"నీకు నేనుచెయ్యగల సహాయం....”
"ఏమీలేదు. నాకు నేనుతప్ప్పు సాయం చెయ్యగల వారెవ్వరూ లేరు."
ఆమె వెళ్ళిపోయింది. సాయంకాలం మెయిలులో బెజవాడకు బయలుదేరేవరకూ రాజగోపాలానికి ఆమె
కనపడలేదు. ఇంట్లోంచి బయటకురాలేదు.
రిక్షా ఎక్కుతూండగా నమస్కారంతెలుపుతున్న కల్యాణీ ముఖం చూసి రాజగోపాలం
స్తంభించినట్లయిపోయాడు. సినీమాహాలువద్ద జరిగిన
ఘటనకు బెదిరిపోయి, తెల్లవార్లూ తననంటిపెట్టుకున్న కల్యాణి మరల కనిపించింది. కాని కంఠంలో
ఆ బలహీనత లేదు. గంభీరంగానే
వుంది. అక్కడ చేరిన బంధువుల ముందు ఎంతో సామాన్యంగానే వారు వీడ్కోలు తీసుకొన్నారు.
రిక్షా ఎక్కేటప్పుడు గోపాలం భాస్కురాన్ని పిలిచేడు.
"మీకు అభ్యంతరం, పనీ, లేకుంకేు....”
భాస్కరం "అదేం మాట! అన్నాడు.
"నేనూ స్టేషనువరకూ వస్తున్నా."
ముప్పయి రెండో ప్రకరణం
రాజగోపాలం వెళ్ళిపోయాక భాస్కరరావు తండివద్ద విచారం వెలిబుచ్చేడు.
"దాని జీవితం భగ్నుమయింది. అది అతనిని అంగీకరించదు. కావాలనుకొన్న మనిషి
చెయిజారిపోయాడు .”
ఆ మాటకు ఆయన ఏమీ అనలేకపోయాడు. వయస్సు వచ్చిన గాని ఆడపిల్లకు పెళిచేయడం సబబు
కాదనుకోన్నవాడు మంచి సంబంధం
దొరికిందనీ, తన [ప్రాణమిత్రుడే కోరి చేసుకొంటున్నాడని అప్పుడు మెత్తబడ్డాడు.
"మా ఆనందం ఎం. ఎస్. సి. ప్యాసయ్యాడు. స్కాలర్ షిప్ మీద అమెరికా వెడుతున్నాడు. వాడు
స్వదేశం తిరిగి రావాలనీ, మంచి
శ్యాస్తవేత్తగా మన దేశానికి వుపకరించాలనీ ఆశ. అందుకోసం వాడిక్కడికి తిరిగి రాక తప్పుని బంధనం
ఒకటి ఏర్పరచాలని నా
సంకల్పుం. నీ పిల్లను ఇవ్వు.”
దక్షిణామూర్తి తన విశ్వాసాలను గుర్తు చేసుకొని కొన్నాళ్రు ఆటంకపరిచేడు.
"కల్యాణీ పదేళ్ళదోయి. "
"వాడు దేశానికి తిరిగి వచ్చేసరికి ఆమెకూ వయస్సు వస్తుంది.”
"కట్నం ఇవ్వలేను. ”
" సెల్యిఖర్సులుకూడా నేనే పెట్టుకుంటా. "”
"ర్సరాడు ఇష్టపడ్డాడా?”
"వాడికి ఏం తెలుసు? నో చెప్పానంకే వింటాడు.”
నిజం ఆలోచిస్తే ఆ వివాహం జరపడం తనకు పూర్తిగా అంగీకారంకాలేదు. [ప్రాణమి[త్రుని పట్టుదల
ఒక్కకు ఆయన్ని
ఆలోచనలోపెట్టింది. మంచి సంబంధం వచ్చినప్పుడు పదేళ్ళయినా పెళ్లి చేసెయ్యడంలోని
సిద్దాంతవిఘాతాన్ని గూర్చి
బాధపడనక్కర్లేదనిపించింది. భార్య వొప్పుకోవడమే కాదు. పట్టుబట్టింది. బంధువులు, వూళ్ళోవాళుు
అందరూ అది జరిగించడానికి
పోత్సాహం-సహాయం దండిగా ఇచ్చారు. వాళ్ళంతా చూసిందొక్కుకే. కురాడు చదువుకొన్నాడు.
మంచిభవిష్యుత్తుంది. రూపసి, గుణవంతుడు.
అందులో భారతీయతకీ, పితృవాక్యపరిపాలనాశ్రద్దకీ చాల సన్నిహితసంబంధం వుంది. అందుచేత
క్కురవాని అభ్మిపాయం ఖచ్సితంగా
తెలుసుకోవాలనే శ్రద్ధ ఎవరిక్లేదు. కురాడు పెళ్ళికంత సుముఖుడుగా లేదన్నవారుకూడా
విశేషంపట్టింపు చూపలేదు. ఏదో
చిన్నతనం, సిగ్గు, చదువుమీద శ్రద్ధ. . .వగైరాలన్నీ సమాధానాలుగా అమిరేయి.
ఆఅనాటికథలన్నీ గుర్తుకువచ్చేయి. కుర్రవాడు భారతీయతకు పెద్ద్రమర్యాద ఇవణోేదు. పిల్ల మెళ్ళో
పుస్తె ముడేసేవరకే అది
నిలబడింది. తర్వాత నాకీపెళ్ళి ఇష్టంలేదన్నాడు. అంతవరకూ కొడుకు భక్తి శద్దల గురించి
తండ్రికున్న విశ్వాసం,
అన్వ్యాయంచేశానో యని దుఃఖపడడానికే పనికొచ్చింది.
దక్షిణామూర్తికిప్పుడు మరోవిధంగా కూతురుకు తాను అన్యాయంచేశానని బాధకలిగింది. ఆమెకు
తానింతవరకూ పెళ్ళి చెయ్యలేకపోయాడు.
ఆమెకు పాతికేళ్ళు మైబడ్డాయి. ఇప్పుడాతడే వచ్చి తనభార్యను తీసుకెడతానన్నాడు, బాగానే
వుందనిపించింది. ఆ అభ్మిప్రాయాన్ని
బలపరుస్తూ అంతవరకూ జ్ఞాపకమైనా వచ్చివుండని చట్టసంబంధమైన అభ్యంతరాలన్నీ కళ్ళముందు
కనబడ్డాయి. ఊళ్ళోవాళు మళ్ళీ
పెళ్ళినాడుచూపిననంత వృత్సాహమూ చూపించారు. తాను మళ్ళీ మెత్తపడ్డాడు.
కాని, అసలువిషయాన్ని పదిహేనేోళ్ళనాడు మరచినక్పు నేడూ మరచేడు. ఆ దాంపత్యాన్ని
సాగించవలసిన ఇధ్రరూ అంగీకరించేరా? ఆ
మాటనెవ్వరూ పట్టించుకోలేదు.
చట్టం-ధర్మ్శం-ఆచారం- సెంటిమెంటు-అన్నీ సాయపడుతున్నాయి. ఏవీళ్ళిద్రరినీ కలపాలి-
కలపాలంటున్నాయి. కాని, ఆ కన్య అబ్మిపాయం
ఏమిటి? చట్టానికి-ధర్మానికీ [పప్రాతిపదికయైన మానవతాసమాలోచన తమలో లుప్తమైపోయింది.
దక్షిణామూర్తి ఆతగ్గ్గానితో నీరవంగా వెళ్ళిపోయాడు.
కాని తల్లి భాస్కరాన్ని చాల కఠినంగా మందలించింది.
"నువ్వే రేపెడుతున్నావివన్నీ, దానికేం తెలుసు? ఎంత ఆప్యాయంగా పలకరించింది. ఎంత బాగా
కబుర్లు చెప్పింది?....”
తమ చిన్ననాడు మగడు వీధిలోవున్నాడంకేు ఆ వీధిన నడవడానికి తామంతా సిగ్గుపడేవారు.
యభయ్యేళ్తు దరిబడ్డా ఈవేళ కూడా తాను
మగనిముందు ఏ కుర్చీలోనో కూర్చోడానికి సిగూ- వీడియమూ పడుతుంది. అల్లాంటిది తనకూతురు
ఆయనతో చాలసరదాగా మాట్లాడింది.
బెజవాడలోనేో వాళ్ళు మాట్లాడుకున్నారు. లేకపోతే ఇన్నేళ్ళు తన్ను వదిలేసుకున్నందుకు అభిమానం
చూపదూ? కోపం ప్రదర్శించదూ?
బతిమాలించుకోదూ?
అతనిదగరకుపోవడం ఇష్టంలేక, వెనకటి కోపమే ఇంకావుంకు అతడున్న వైపుకేనా వెడుతుందీ?
ఇవి రెండూకూడా జరగలేదుగనక వాళ్ళిద్దరూ బెజవాడలోనే సఖ్యపడిపోయారనీ ఇక్కడ కోపంనటిస్తూ
తమరిని బుట్టలో
పెట్టచూస్తూందనీ ఆమె సమాదానపరచుకొంటూంది.
వాళ్ళు సఖ్యపడితే భాస్కరరావే చెడగొడుతున్నాడని ఆమె అభిప్రాయం.
అతడు కమ్యూనిస్టు, తండ్రి జైళ్ళకెళ్ళీ, కాం[గెసులో చేరీ ఇంట్లో నానా మాలకూళ్తూ కలిపితే, కొడుకు
వర్షసంకరమే
చేసిపెట్టాడని ఆమె అభ్మిపాయం.
అతడు చేసుకున్నది (బబాహ్మణుల పిల్లే అయినా అమెకాతని యెడ ఆ అభిప్రాయం గట్టిగా వుంది.
వర్ణాంతర వివాహాలకెన్నింటికో
అతడు పౌరోహిత్యం నిర్వహించేడు. తన మామగారితోనే తమ పౌరోహిత్యపు సాంప్రదాయం పోయింది.
ఈనాడు తనభర్త యధావిధిగా తద్దినాలు
పెడతాడు. నమ్మకం వుండికాదు, భక్తితో. కాని, భాస్కరానికి ఆ భక్తీ లేదు. ' చచ్చిపోయినవాళుు
ఒక్కరోజు బతికివచ్చి
విస్తరేసుక్కూర్సుంకే మీరెవ్వరూ ఈ తద్దినాల ప్రసంగం తెచ్చివుండ' రనేోది అతని వ్యాఖ్యానం.
అల్లాగే అర్జంతెలియని మంత్రాలతో విసువుకలిగించేకన్న ఉపన్యాసాలు మంచివని సభాముఖంలో
దంపతులచేత ప్రమాణాలు చేయించాడు.
అదోవిధంగా ఫర్వాలేదనుకుంటుంకే ఇప్పుడు కిరస్తానీవాళ్ళల్లా రిజ్మిస్టేషను చేసుకోండంటున్నాడు.
ఇవన్నీ ఆమె దృపఫ్ట్లో
వర్షసంకరం, మతసంకరమే. మామూలుగా బిన్నంగా ఆ యింట ఎవ్వరేమనుకొన్నా అది భాస్కరరావు
బోధల ఫలితమే అంటుంది. దానికి
' దుష్ట! అనో విశేషం చేర్చుకపోయినా ఆమె అభ్మిపాయం అదే.
తల్లి ఆ ఆరోపణ చేసినప్పుడల్లా భాస్కరరావు నవ్వేస్తాడు. ఇప్పుడూ అంతే చేశాడు.
"కబుర్లు చెప్పినవాళ్లీ మొగుడుగా వొప్పుకున్నస్తేనా ఏమమ్మా!”
"మగడు - పెళ్ళాం సంబంధం కాదంకే పోతుందృటా.”
"పదిహేనేళ్ళుకితం తండి పట్టుదలతో మెళ్ళో తాడుముడేసినందుకే మొగుడుతనం
సిరపడిపోయేటట్లయితే చాలకష్టం అమ్మా! ఈ వీధిలో
ఆడపిల్లలు చాలమంది చిన్నప్పుడు బొమ్ములాటల్లో నాచేత తాళికట్టించుకున్నారు. అమా నాన్న
ఆట ఆడి సిగునటించేరు.
ఉత్తుత్తి విన్తరేసి అన్నంకూడా పెట్టారమ్మా! వాళ్ళావరో జ్ఞాపకం వచ్చినా బాగుండును.”
చినవయస్సులో గడ్సిమేటుచాటునా. మంచాల క్రిందా, తలుపుల వెనుకా తనతో కోడెగాలాడిన
అమ్హాయిలు గుర్తువచ్చేరు. కాని, ఆ
విశేషాన్ని తల్లిముందు చెప్పులేకపోయడు.
అతడు తెచ్చిన వుపమానానికి భార్య విరగబడి నవ్వింది.
ఇంట్లోగనక సరిపడింది. ఈమాకే వీధిలో అంకే మగాళ్ళదాకా అక్కర్లేదు. ఆ ఆడాల్యే
చీప్పురుకట్టతో. .... 7
భాస్కరరావు బృురగోక్కున్నాడు.
"నువ్వేనా సాక్ష్యంగా వుంటావుకదా? మీకిదోం పోయేగాలం. మగళ్లీ అల్లాకొడుతున్నారు? మీరు
భారతమహిళలు కాదా/ సీతా- సావ్వితుల
రక్తం మీలో ప్రవహించడం లేదా? రాణీ రుదమ్మలూ, రూన్సీలక్షులూ అంకే మొగుజ్లీ కొట్టమనా? -
అని నువ్వడగవా?”
మాణిక్యాంబ నవ్వింది.
"అందుకే మెళ్ళోతాడు వేయడం దాగుడుమూతల్లో ప్పురివెనుకనో, అటకలమీదనో కోడెగాలాడడంతో
మగడూ- పెళలయిపోయారే
మగువా! "---అన్నాడు తల్లి దగరలేకుండా చూసి.
పెళ్ళికిపూర్వమే తానాతనితో కోడెగాలాడినచోట్లు జ్ఞాపకం వచ్చాయి. ఆ రహస్యాలు తమకే తెలుసు.
అవన్నీ కితకితలు
పెట్టినట్లయి నవ్వింది.
అమ్మమ నరసమ్మ్శుమాాతం అది ఉత్తుత్తి సెళ్ళికాదు సుమా అని హెచ్చరించింది.
"శ్యాస్తీయంగా, అగ్నిహోత్రసాక్షిగా జరిగిందిరా. .... 7
అంతేకాదు ఆ సపెళ్ళిజరిగిన ముహూర్తానికి చాలబలం ఉన్నదనే విషయాన్ని కూడా ఆమె
నిరూపించింది.
"పదిహేనేళ్ళయితేనేం, పాతికేళ్ళయితేనం, ముక్కుకి తాడుపోసి లాక్కొచ్చింది.”
భారతి పథతికలలో వెలువడే గోపాలకృష్టమాచార్యులుగారి జాతకాల వ్యాసాలన్నీ ఆమె అతిశ్రద్రతో
చదివించుకొని వింటుంది.
భాస్కరరావు ఆశ్చర్యార్దకాలతో అపహాస్యం చేశాడు.
"౭ నుసుమీ అమ్మమ్మా! బహుశా ఇంతకాలందాకా ఆ తాడు దొరకలేదనుకుంటా, ఏమూలో పడేసి
మరచిపోయి వుంటుందేమోనమా?ై! *
"ఒరేయి భడవా! తప్పుడుకూతలు కూయకురా. *
తల్లి వాపోయింది.
"చిన్నప్పటినుంచే వాడొక్కలాగే వున్నాడు. ముపు్రయ్యేళ్ళాచ్చినా బాధ్యతలు వొంటబట్టలేదు. నీ ఇష్టం
వచ్చిన వాళ్ళింట్లో తిను.
స్నేహాలు చెయ్యి. కాని, నీ అనాచారం మొగుడు-పెళ్ళాల మధ్యకి తీసుకురాకు. పెళ్ళి అనేది అంత
చులకనగా చూడకు.” అని ఆమె
ఆన్రోశించింది.
తన అభిప్రాయాల్ని తల్సికెల్లా బోధపరచాలో ఆతనికి అర్దం కాలేదు. పెళి అంకే అగౌరవం లేదు.
కాని, జగత్తుకంతకూ
క్షేమమూలకంగా దాన్ని భావించవద్దంటాడు. దాని ఆధ్యాత్మికతయిడ ఆతనికి విశ్వాసం లేదు. అదొక
సామాజిక (పక్రియ.
మనుష్యునిలో మానసికోత్తేజాన్నీ, ఉత్తమాభిభావనల్నీ, ఆత్మిక ఏకత్వాన్ని సాధించేటంతవరకే దాని
మన్నింపు, ఈ ఉదాత్త
స్థితికి మనుష్యుని లేవదియ్యలేనిది మంత్రాలుచదివినా, మాటలుచెప్పినా, చట్టాలు బలపరిచినా -
రిజ్మిఫ్టారాఫీసు బైండుపుస్తకాల్లో
నమోదయినా పెళ్లి కాదు - అంటాడాతడు. కాని భాగ్యమ్మకు అవన్నీ అర్హంచేసుకొనే ఓపికలేదు.
ఆచారం, సాంప్రదాయం వాటినిదాటిన
దాంపత్యాలనామె వూాహించదు. వూహించలేదు.
"మామా! మనవెంకటమ్మకెందరు పిల్లలు?”
ఆ (ప్రశ్న వెనకనున్న రహస్యాన్ని ఆడవాళ్ళిద్దరూ [గహించేరు.
వెంకటమ్మకూ వారికీ సంబంధం లేదు. వాళ్లు ఎరిగివున్న ఒక బంధువుకామెతో సంబంధంవందనేతప్పు
ఆమె వాళ్ళకులానికి చెందిన మనిషికూడా
కాదు.
ఆమెకు పిల్లతెందరో భాస్కరానికి అఆక్కకావలసీ కాదు. వెంకటమ్మను 'మన'లో చేరృడంలోనేవుంది
ఆతనిప్రశ్నకు కీలకం.
వెంకటమ్మ కార్యంఅయిన కొత్తలో మగణ్జీ మీద చెయ్యి వెయ్యనియ్యలేదు. ఆమె అప్పుటికే
తమయింటిముందున్న ఇంట్లోకి కాపురం
వచ్చిన స్కూలుమాస్టరు యువకుడితో (చ్రేమకలాపాలు సాగిస్తూంది. అతడా కులాంతరుడు కావడం -
ఆతనికప్పుటికే పెళ్ళాం,
ఓచిన్నవుద్యోగం వుండడం కారణంగా అతనిని పెళ్ళి చేసుకోలేదు. ఆతనితో మరోవూరుపోయి
కాపురమూ పెట్టలేదు. ఫలితంగా కొన్ని
సర్హుబాట్లకు సిద్రపడవలసివచ్చింది.
తర్వాతతర్వాత ఆమె ఇష్టాపూర్తిగా మగడివద్దకు వెడుతూంది. వెళ్ళినప్పుడో నాలో పదిహేనురోజులో
అక్కడుండి వచ్చేస్తుంది. నాల
తప్పిందంటారు. ఆ విధంగా ఆమె ముగురినో నలుగురినో కంది. ఆమె ఇచ్చిన చనువును
పునరుద్ధరించుకొనేటందుకు ఆమొగుడాడు
ఒకటిరెండుమార్లు వచ్చాడు. కాని, వేవిళ్లు, నిండునాలలు, పచ్చిఒళ్ళు, పిల్లకు పాలు
చాలకపోవడం, చెరగు మూయడం వంటి
సమస్యలు వస్తాయి. అప్పుటికీ వదలక మొండితనంచేస్తే ఆతని చెయ్యి తగలడంతోకే ఆమె
విరుచుకు పడిపోతుంది. ఈ బడదలన్నీ
పడలేక ఆమె కళరకుదిరి వచ్చినప్పుడే చాలులేయని ఆమొగుడు ఈ నాలుగు రోజులతోనే తృప్తిపడడం
నర్చుకొన్నాడు.
"సెళ్ళిని చాలమర్యాదగా, గౌరవంగా చూసేవాళ్ళకి వెంకటమ్మను చూపించాలి. ఆమె సహజంగా
వ్యభిచారగుణం కలదికాదు. ఆమెకు
కావలసిందొకమగాడే. ఆతనినే తనపిల్లలకు బాబయ్యగారని చూపుతూంది. కాని, వివాహ వ్యవస్థకు
మీరంతా ఇన్తూన్న
ప్రతిష్టఫలితంగా ఆమె తాళికట్టినవాడితో వ్యభిచారంచేయక తప్పుడంలేదు.
ముసలమ్మ వోడిపోయాననుకొంది.
"నాయనా, నువ్వు చదువుకొన్నవాడివి. నీకు చెప్పులేం. కాని ఒకటి మరిచిపోకు. జీవితంలో నువాైా
నేనా అనే మాటకు ఆస్కారం
లేదు. నీకూ-నాకూకూడ చోటుంది. అంతే.”
ఈ మారు భాస్కరానికి ఏం చెప్పుడానికీ తోచలేదు.
"అమ్మమ్మా! మీ రోజుల్లో పరిస్థితులు వేరు. తిండికి, బట్టకి, తలదాచుకునోేటందుకు అన్నింటికి
ఆడదానికి పరాధీనప్తబతుకే,
కనక మగాడేంచేసినా గజేంద్రమోక్షం పునశ్చరణ చేయవలసిందే. ...”
"అయితే నీచెల్లెలు సంపాదించుకొంటూందిగనక మగాడితో పనిలేకుండా (బబతుకుతుందంటావు. ”
" అమ్మమ్తా! ఒక్కటడుగుతా చెప్పు, ”
నరసమ్మ నవ్వింది.
"నువ్వు నాచేత నానావాగుడూ వాగిస్తావురా. ”
”"వాగుడేమిటమ్మా! నీఅనుభవాలు....”
"అది నువ్వుపెట్టిన పేరు.”
భాస్కరం నవ్వేడు. కాని, ప్రశ్నించకుండా వూరుకోలేదు.
"మనం అందరం ఎరిగినదీ, నిర్చ్వయంగా చెప్పుకోగలదీ కనక వెంకటమ్మకథ తీసుకో. ...”
"ఏం సీతారామయ్య కథ....”
"వాళ్ళ వాళ్ళే ఆతని పేరు కదపడానికి జంకుతున్నారు. ...”
"అయితే చచ్చిపోయినవాళ్ళుగురించి చెప్పు, ఏ పూచి పేచీలు లేనిపని....”
"ఏదీవద్దులే పోనీ. పెట్టి పోషించవలసిన బాధ్యత లేకపోతే మగాళ్ళు చేస్తున్న అల్లర్లకి ఆడవాళ్లు
వొప్పుకుంటారంటావా?”
”పెట్టిపోషించడం ఒక్కకేన్నటా. పిల్లలుపుట్టకపోతే ఒక విధం, ఆ కాస్త నలుసూ....”
"నలుసు - కాలిలోని ముల్దుసంగతి మళ్ళీ తీసుకుందాం. ఈ విషయం చెప్పు....”
నరసమ్మ ఆలోచించింది.
"ఇల్లరికపుటల్లుడు మాట ఎందుకు పుట్టిందనుకున్నావు?”
భాస్కరం నవ్వేడు.
"అంతే అమ్మమ్మా! మగాడి అవసరం ఆడదానికెంతో ఆడదానితో అవసరం మగాడికీ అంతే. రెండూ
చెల్లు. ఇంక మిగిలిందేమిటి?
సంపాదించిపెడుతున్నాననే అభిప్రాయం దానివలనకలిగిన అధికారం, అహంకారం, సంఘంలో
బలం....”
తల్లి ప్రశ్నించింది.
"అయితే ఏమంటావు? ఆతడో పాడుపని చేశాడు కనక కుక్కకాటుకి చెప్పుదెబ్బలా మనమూ ఓపాడుపని
చెియ్యాలంటావు. ”
"నేను ఇంతవరకు అల్లాంటి మాట, తప్పుపని చెయ్యాలన్నానా అమ్మమ్మా! ఈచెంపకొడితే ఆచెంప
చూపాలనడం ఈమథ్యనొక
ఫసేషనయిపోయిందమ్మా! ప్రతిదానికీ సంగతి సందర్ప్చాలున్నాయి. పెద్దపులి ఒకజబ్బు పీకేస్తే. ఏకంగా
తలకాయి తీసుకెళ్లి దానినోట్లో
అప్రయ్యాలనం....”
"మెల్ళీ-పెద్దపులి ఏం సామ్యంరా....”
"అందుకేనమ్మా! వపమానాలు లాభంలేదనడం. వదితెయ్యి. చెల్లాయికి జరిగిన పెళ్లి చెల్లదు.
అందులో ఒకప్యాత అయిన కల్యాణికి
ఆనాడు పదేళ్లు. చట్టంవొప్పుకున్నా నైతికంగా మైనరు అది. పోషకులకి ఆమెతరఫపున వ్యవహారాలు
చెయ్యడానికి అధికారం వుందిగాని,
కాళూ చేతులూకటి దానినే అమ్మేసేటందుకు అధికారంలేదు. ...”
"నువ్వు ప్లీడరీ చదివితే ఎంత బాగుండేదిరా. ఎందుకు మానేశావురా, నాయనా! *
"సోషలిజం వస్తే ప్లీడర్లపని వుండదన్నారమ్మా అంతాను. తీరా చూస్తే సోషలిస్సుతరహా వరకే
వచ్చింది. అందుచేత మనం ఇట్లానే
వుండిపోయాం అమ్మమ్మా! ”
"అందుచేత వొప్పుదంటావు. డెబ్బయ్యేళ్ళ [క్రితం పుట్టి వుంకు నువ్వు. ...ఒరేయి నా పెల్లి రెండోయేట
జరిగిందిరా. అప్పుటికి
పళ్ళుకూడా రాలేదట. ...”
"అవును. నీక్కూడా మళీసెళ్లి ఎందుకు చేయాలనేదానికి పది కారణాలు చూపించి వుండేవాడు. ”-
అని భాగ్యమ్మ వెక్కిరించింది.
భాస్కరం అక్కచేయలేదు.
"చెల్లాయికి పెళ్ళికాలేదనడమే కాదు. మీరు అయిందంటున్నారుగా.
'ఓం మమవతే తే హృదయం దధాతు
మమ చిత్త మనుచిత్త ప్పేస్తు.
మమ వాచా మేకమనా జుషస్వ,
బ్రహస్పతి న్తా నియనకు మహ్వం.!
- అని మంత్రం చదివిన బుద్దిమంతుడే పెళిని రద్దు చేసేసేడు. తనఖా కాలదోష పరిమితి
దాటిపోయిందనో కాదు. రద్దు
అయినట్లుగానే భావించి మళ్ళీ పెళ్ళే చెయ్యమన్నాడు. ఆ రద్దయిపోయిన దాన్ని చూపించేహక్కు
ఆయనకు లేదు.”
"నువ్వు పండితుడవురా నాయనా! నువ్వీ కమ్యూనిస్తుల్లో ఎల్లా పడావో గాని. ...”
అమ్మమ్మ మాట తప్పించే ప్రయత్నం వుందనిపించింది. ఇంక తానూ దానిని సాగించడం మంచిదిగా
తోచలేదు. నవ్వేడు.
"పండితులు కమ్యూనిస్తులు కారా, కాకూడదా అమ్మమ్మా! ”
కాని తల్లి వదలలేదు.
"హక్కులూ, టక్కులూ అని పెళ్లిళ్లు చెడగొట్టకురా, మహాపాపం! ”
"దాని పీడా పోయిరి. వర్షసంకరం, జాతిసంకరం కన్న మహాపాపాలు నన్నేం చుట్టుకుంటాయిగాని,
ఏవేవో వెరి ఆచారాలనడంపెట్టుకొని
మనుష్యుల బతుకులు నాశనం చెయ్యకండి.”
"ఇంతకీ నువ్వేమంటావురా, ” అని నిలవదీసింది నరసమ్మ.
"ఆ మొగడని మీరంతా చెప్పేవాడితో కాపురం చెయ్యాలో, దానిని గడ్డ్దలుచెయ్యాలో దానికే
వదిలెయ్యండి.”
"దానికేం తెలుస్తుందిర'యని తల్లి [ప్రాణం కొట్టుకులాడింది.
భాస్కరం నవ్వేడు. నరసమ్మ తలవూపింది.
"మా రోజుల్లో ఆడదానికో ఇష్టం, అయిష్టం వుందన్న వాళ్లో లేరు. మీ రోజులు వేరు. కనీసం
నువ్వొక్కడివేనా నీ చెల్లెలితరపఫున
వున్నావు. రెండోవేపు మీ అమ్మ ఒక్కర్తయిపోయింది. మీ నాన్న అటూ-ఇటూ అనలేకుండా వున్నాడు
ఇదెందుకు వచ్చిందో గాని....”
భాగ్యమ్మ చిరాకు చూపింది.
"ఎందుకొచ్చిందో తెలుస్తూనే వుంది.”
"ఇంతకీ అసలు పిల్లది ఏమంటుందో" నరసమ్మ సలహా భాగ్యమ్మకు నచ్చలేదని ఆమె ముఖమే
చెప్తూంది.
"అన్న మాట విన్నాక చెల్లెలి మాట వినక్కర్తేదు.
ముసలమ్ముకు ఏమనడానికీ తోచలేదు.
"మనకాలం తీరిపోయింది. ”
"అందుకోసం ఈ మహాపాతకాలన్నీ తలకి చుట్టుళకోవాలంటావు. "”
"అమ్మా! ఒకటి చెప్తా విను. మా చిన్నరోజుల్లో నరేందపురంలో చయనులుట. మంచి
వేదపండితుడు. ఓ మాలదాన్ని అంటుకొని
వాళ్ళల్లో కలిసిపోయేడట. ఆ రోజుల్లో దానికి పెళ్లేమిటి? లేచిపోవడం - కలిసిపోవడం అంతేమాటలు.
మహాపండితుడట. పెద్ద
ఆస్తిపరుల ఇంటబుక్పేడు. మాలాళ్ళులో కలిసిపోయాక మట్టికొట్టకు (బతికేడు. మనూరి చెరువుంది
చూడు. దానిని తవ్వించినప్పుడు
మటిమోసిన వాళ్ళలో ఆతడొకడు. అమ్మతో ఓరోజున వసిష్టకెళల్లి వస్తూంకే 'చిస్పెమ్మూ!' అని పిలిచి
కళ్యుసనళ్స్రు
పెట్టుకున్నాడు. నేోనింతదాన్ని. మా తాతగారి వద్ద వేదం చదువుకున్నాడుట. "మహాపండితుడవు నీకీ
ఖర్తేంరా” అని అమ్మ
ఏడ్సింది. నాకిప్పటికీ లీలగా గుర్తు. కాని....”
"అందుకోసం ఇంటా వంటా లేనిది....”
"ఇదిగో పిల్లా! కొంచెం సర్హుకోడం నోర్చుకో, మా మామయ్య ఏదో కొట్లాటలో కొడుక్కి అరదండాలు వేసి
రెండురోజులు జైల్లో పెస్తేరని
అభిమానపడి అక్కిలేరుమీది నుంచి పడి ఆత్మహత్య చేసుకొన్నాడు. ఆ రోజుల్లో జైలుకి వెళడం
కానిపని. మహావమానం. కాని- మా
ఆయన ఆరుమాట్ట్లు జైలుకెళ్లేడని నువ్వే గొప్పలు చెప్పుకొంటావు. ”
తన చిన్నతాత కొడుకు దొమ్మీకేసులోనో, దోపిడికేసులోనో జైలుకి వెళ్ళుడానికీ, కాంగెసు వుద్యమంలో
తన మగడు జైలుకెళ్ళడానికీ
సాపత్యం చెప్పడం భాగ్యమ్మకు రుచించలేదు.
"దానికీ దీనికీ సాపత్యం ఏమిటమ్మా! ”
"సాప్రత్యం ఏమీ లేదు. పిడుక్స్కీ బవియ్యానికీ ఒకేమం[తం కాదు. మనంచేసిన పనిఫలితం ఒకక
అనిపించినా దేశం-కాలం పట్టి ఆ
పనుల స్వభావాలు మారతాయి. అంతే....”
నరసమ్మ లేచి వెళ్లిపోయింది. గుమ్మంలో కల్యాణి ఎదురయింది.
"అదష్టవంతురాలివే, మనమరాలా!”
భాస్కరంతోడి సంభాషణధోరణినుంచి బయటపడని నరసమ్మ ఒక వుద్దోశంలో అంది. ఆమె
యిష్టాయిస్టాల్ని సమర్దించే అన్న
వున్నాడన్నంతవరకే ఆమె ' అదృష్టం! అంది. కల్యాణికి అది అర్దంకాలేదు. మరొక విధంగా ఆమె
అర్దంచేసుకొంది.
"అల్లాగే కనిపిస్తూందమ్మమ్మా!
చూప్తు ఆనని ముసలమ్మకు ఆమె ముఖంలోని నైరాశ్యం కనపడలేదు. చెవులకు లోపంలేదు, గనక
మాటవినబడింది. వినబడినమాటకు
ఆశ్చర్యమే కలిగింది. ఇందాకటినుంచి జరిగిన వాదనకూ, అసలుమనిషి ఇచ్చిన సమాధానానికి
సంబంధంలేదు. "అన్నగారి ఆలోచన
తప్పా యేం చెప్మా”-అనుకొంది.
ముష్పయిమూడో ప్రకరణం
ఆనందరావుకు పరిస్థితులు ఎల్లా అర్ధం చేసుకోవాలో తెలియడం లేదు. పదిహేనేళ్ళపాటు
ముఖంచూడ్రానికికూడా నిరాకరించి ఈవేళ
హఠాత్తుగా హాజరయితే ఆ గాథధలన్నీ మరచి అంతా స్వాగతం ఇస్తారని ఆతడూహించలేదు.
నిజంచెప్పాలంకే ఆతడు
ఆశించినదానికన్నాఎక్కువ సౌమనన్యమే కనబడింది. తనఅత్తవారివాళ్లు ఎంతోహుందాగా తనను
ఆదరించేరు.
తానీదేశం వచ్చేటప్పుడు కల్యాణి ఆతని మనస్సులో లేనేలేదు. తన భార్య బుందేలీ కన్య. ఆమె
చనిపోయింది. ఈమారు
తనస్వదేశంలో పిల్లనావరినైనా చేసుకొందామనుకొన్నాడు. వచ్చాడు. వస్తూనే కల్యాణితో పరిచయం
అయింది. నల్లగావున్నా మనిషి
అందంగా వుండొచ్చుననే విషయం ఆమెను చూశాకనే అర్దం అయింది. ఇంత కాలం ఆతడు
పాశ్చాత్య దేశాలలోనో, ఉత్తరాదినో మాత్రమే కాలం
గడిపాడు. దక్షిణదేశంనుండి వచ్చినవాళల్లోతప్పు అక్కడ నల్లనివాళ్లు కనబడరు. అందులో
చిన్ననాటినుంచీ ఆతనికి నలుపు
అందవికారంగానే భావన. ఇప్పుడు కల్యాణి ఆతని ఆలోచనలన్నింటినీ తల్లకిందులు చేసింది. ఆమె
నల్లునిదైనా అందకళత్తా.
అంగసౌష్టవం వుంది. కన్ను ముక్కు తీరు వుంది. మంచి మర్యాద వుంది. చదువుంది. అంతకన్న
భార్యలో కోరదగింది కనబడలేదు
ఆతనికి.
అందుచేత ఆమె ఎవరోతెలియకుండానే పరిచయం సపెంచుకొన్నాడు. ఆ పరిచయంలో ఆమె ఎవరో
తెలిసింది. వెంటనే బయలుదేరేడు. ఆమె
అంగీకరించకపోవచ్చుననే అనుమానమే ఆతనికి కలగలేదు.
తానామె భర్త. భారత మహిళ మహాపతివ్రతల వారసురాలు. చదువుకొన్నా, పాశ్చాత్య నాగరికత
అలవరచుకొన్నా భారత స్తీ
పతివ్రతా ధర్మాన్ని విడవదు. తాను వస్తాననే ఆలోచనకూడా లేకపోయినా ఆమె ఇంత కాలంవరకూ
అవివాహితగా వండిపోవడంలోనోే
అతనికీ ప్రమాణం లభ్యమయింది.
అత్తవారింటికి వచ్చాక తన అభిప్రాయాలకు ఆటంకం కాగలడని తోచిందల్లూ చిన్నబావమరిది
భాస్కరరావు. ఆతడైనా తననేమీ
అనలేదు. కాని, ఆతనికి భాతికదృప్టే గాని, ఆధ్యాత్మిక విషయాల మీద విశ్వాసం ఏమీ లేదు.
భారతీయత ప్రత్యేకతను
ఆతడంగీకరించడు. అందరిలాంటి వాళ్ళమే మనమూ. అందరికీ వన్న మంచిలూ, చెడ్డలూ,
గుణాలు, అవగుణాలు, యోగ్యతలూ-అయోగ్యతలూ
తగుమైన పాళంలో మనకీ వున్నాయని ఆతని వాదన. పెళ్ళిని, (స్తీ స్వాతంత్ర్యాన్నీ గురించిన అతని
అభ్మిపాయాలుకూడా భారతీయ
సాంప్రదాయాలకు విరుద్దంగానో కనిపించాయి.
"ఈతడు (ప్రత్యణువూ కమ్యూనిసుు. "-అనుకున్నాడు.
ఒకరోజున భాస్కరరావు తన్ను ఎగాదిగా చూసేడు.
"నీకు యౌవనపు విసురు మళ్ళిపోయింది. ఆడదాని అవసరం నీకిప్పుడు కేవలం కాలక్రేపానికి.
హోటలుమెతుకులు తినక్స్కర్లేకుండేటందుకు.
కోపంవచ్చినప్పుడు ప్రపంచానికీ నీకూ మధ్య నిలబడ్డానికి, నలుగురిలో ప్రతిష్ట కోసం.”
ఆ విధంగా భాస్కరరావు చెప్తూంకు తనకు నచ్చులేదు. కాని ఆలోచిన్తుంకు ఆతడు నిజమే
చెప్తన్నాడనిపించింది.
ఇరవయ్యేళ్ళ వయస్సప్పుడు ఆడదాని సాంగత్యం కోసం చూపిన యావ తనలో ఇప్పుడు లేదు.
అమెరికాలో ఓ అరడజనుమంది కన్యల్ని
మార్చేడు. 'నెకింగ్' దశను దాటి ముందుకు అడుగు పెట్టలేని ముగలు ఎంత అందంగా కనబడ్లా
' పెటింగ్' కు అనుమతించే యువతులతో
'డేట్సు' ఏర్పురుచుకున్నాడు. ' పెటింగ్' పరిమితుల్ని దాటిన ఘట్టాలుకూడా ఆతడు ఎరుగును.
దేశం వచ్చి, పెళ్ళి చేసుకొన్నాక
మొదటి రోజుల్లో భార్యను ఒక్కరోజు విడిగా వుండనివ్వలేదు. క్రమంగా తనకు తెలియకుండానే పృథక్
శయ్యమీద న్నిదపట్టడం
ప్రారంభించింది. భార్య కన్నుగప్పి రండల్ని వెతికే ఆవేశం ఇప్పుడు లేదు.
అయితే తానెందుకు పెళ్ళి చేసుకోవాలనుకున్నాడు?
శారీరకావసరంకన్న మానసికావసరమే ఎక్కువగా వున్నదని ఒప్పుకోక తీరిందికాదు. కూడావుండేందుకు
సహచరి కావాలి. భాస్కరం
వివేచనను ఒప్పుకొన్నాడు. అయినా కల్యాణిని తీసుకుపోవాలన్న ఆలోచనను వదులుకోలేదు. ఆమె
తన భార్య.
చివరకు భాస్కరం అనేశాడు.
"మీ అనుభవంతో జీవన [ప్రాంగణంలో వన్న అమ్మాయిల్ని ఆకర్షించలేరు. మీకు ఈడుబోడుగా
వుండగల స్తీని వెతుక్కోండి.”
ఆనందరావుకామాట అర్దం కాలేదు. తాను ఆకర్షించడం సమస్య ఏముంది? రింగ్ మాస్టరు చేతిలో
కొరడా లాగ తన చేతిలో
తాళి కట్టిన హక్కు వుంది. దానిని రుుడిపించి మంచం ఎక్కమంకే ఎక్కాలిసిందే. ఇక్కడ
అధికారంతోనో గాని ఆకర్షణతో పని లేదు.
ఆకర్షణ వుండాలిసింది ఆమెకు, కల్యాణిలో ఆకర్షణ అవసరం కన్న అధికంగానే వుంది.
అందుచేతనే అతడా బావమరిదితో ఆకే వాదన వేసుకోలేదు. కాని తీరా చూస్తే కల్యాణీ కూడా ఆతని
ధోరణిలోనో వుందనిపించింది.
తండ్రి ఇంట్లో తనను చూసినప్పుడు ఆమె అకృతైిమమైన సంతోషాన్ని చూపింది. అప్పుటికి తానెవ్వరో
ఆమెకు తెలియదు. తెలియకపోయినా
ఆమె కనబరచిన ఆనందం తన సంతోషానికి ప్రతిబింబంగానే కనబడింది. భారతీయ వివాహ
మంత్ర్రాలలోని శక్తిని గూర్చి విన్న
కథలూ, చదివిన నవలలూ జ్ఞాపకం వచ్చి ఒక్కమారు జంద్యం తడుముకున్నాడు. మొదటిభార్య
వుండగానూ, వుద్యోగఫ్రలంలోనూ ఆతడు
జంద్యం గురించి పట్టించుకోలేదు గాని, స్వదేశంలో వివాహపయత్నం చేసుకోడానికి
బయలుదేరేటప్పుడు దాని అవసరం వుంటుందనిపించి, ఒక
పావలా ఖర్చు చెశాడు. గాయత్రీ మంత్రంతో సహా యావత్తూ మరచిపోయాడు, గాని సంధ్యావందనం
రూడ [ప్రారంభించేవాడే.
ఒక అరగంట పోయాక మరల కల్యాణి వచ్చింది. ఈమారు ముఖంలో సంతోషంలేదు. విచారంలేదు.
మర్యాదకోసం నాలుగు మాటలాడి
వెళ్ళిపోయింది. ఆమె ముఖంలో ఇంతవరకు తాను ఉపేక్షించినందుకు అసమ్మతిమాత్రమే అతనికి
కనిపించింది. తన పశ్చాత్తాపాన్నిగాని,
తన మనస్సులో ప్రస్తుతం పేరుకుంటున్న అభిమానాన్నిగాని వ్యక్తీకరించడానికి ఆమె ఏమాత్రం
అవకాశం ఇవ్వలేదు.
మరునాడుదయం కాఫీ అనంతరం ఆమె అతనితో మాట్లాడడానికి వచ్చింది. తానూ మామగారు
కేబులు వద్ద కూర్చుని కబుర్లు
చెప్పుకుంటున్నారు. కల్యాణి కాఫీ తీసుకొని వచ్చింది. తాను ఓ కుర్చీ లాక్కుని కూర్చుంది. ఆమే
సంభాషణ (ప్రారంభించింది.
"మైమ ఏం చెయ్యాలంటూంది?”
"దానికేం తెలుసు? మనం ఏది చెస్తే అదే చేస్తుంది.”
ఆ 'మనం' ఎవరో అర్దం అయింది. కాని, ఎరగనట్లూ, అర్జం కానట్లే మాట్లాడింది.
"ఏం చదివించడానికీ, ఏం చెప్పుడానికీ మీకు అధికారం ఏం వుంది? అది వాళ్ళిద్దరూ
నిర్ణయించుకోవలసింది. ”
ఆ మాటలో సౌమ్యత లేదు. దక్షిణామూర్తి గ్రహించేడు. ఇదే వాళ్ళ దాంపత్య జీవితానికి నాందీవాచకం
కావలసివుంకు శుభమాచకం
కాదనుకొన్నాడు. తానక్కడ అనవసరం అనిపించింది. లేచేడు.
"మీరిద్దరూ మాట్లాడుకొంటూ వుండండి. నోనల్లా వీధిలోకిపోయి పనిచూసుకువస్తా. "”
ఉపోర్దాతాలు, [ప్రాథమికమైన సమాధానపరచడాలవరకూ ఆయన వుండడం బాగుంటుందని
ఆనందరావు భావించినా ఏమీ చెయ్యలేకపోయాడు.
కల్యాణి ఎరిగివుండి సెలవిచ్చి పంపేసింది.
"వెళ్ళిరాండి. ...పని చూసుకురాండి. ..."”
వెంటనే ఆమె తనను కూర్చోమంది.
"మీకేం పనిలేదుగదా. .. .లేకుంకేు కూర్చోండి.”
ఆమె ఏదో దృఢనిర్హ్ణయానికి వచ్చి తనతో మాట్లాడటానికి వచ్చింది. అయితే ఆమె ఎత్తుబడి చూస్తే ఆ
నిర్ణయం తన ఆలోచనలకు
అనుకూలంగా వుండదనిపించింది. వెంటనో సర్హుకొన్నాడు.
తండి వెళ్ళిపోయాక ఆమె ఒక్క క్షణం ఆగి ప్రారంబించింది.
"తమరు ఇక్కడికి వచ్చిన కారణం నేను విన్నా.”
ఆనందరావు నమ్మదిగా అన్నాడు.
"అయిందేదో అయిపోయింది. తెలిసో తెలియకో చేసినతప్పు సవరించుకోవాలని. ...”
కల్యాణి ఆతనిని వారించింది.
"ఇందులో తప్పేం జరగలేదు. మనుష్యుల మీద ఇష్టం, అయిష్టం అనేవి మంత్రాలమీద
ఆధారపడికలగవు. ఒక వస్తువుమీద
మనకయిష్టం ఎందుకంకే ఏం చెప్తాం? శ్యాస్తీయకారణం ఏదో వుండొచ్చు. మనకు తెలియదు. కనక
సమాధానం ఇవ్వలేం. సమాధానం
చెప్పులేంగనక యిష్టం తెచ్చుకోగలుగుతామా? . ... అలాగే మనుష్యులమీదా....”
విజయవాడలో జరిపిన సంభాషణల తరవాయిలా వు్రందేగాని ఆనందరావు అనుకున్న ధోరణిలో
సాగడంలేదు. ఆతనిమాట చొరనివ్వకుండా తన
నిర్ణయం చెప్పేసి వెళ్ళిపోయేటట్లా ఆమె కనిపిస్తూంది. ఆతడు ఏలాగయినా మాట దూర్చాలని ఓ
వ్యర్మప్రయత్నం చేశాడు.
"కేవలం ఇష్టం అయిష్టం అనడానికి వీల్లేదు. ఏది ఇష్టమో, అయిష్టమో చూడ....”
"ఎక్టాట్లీ. చూడ్డం అవసరమే లేదు. సలాజార్ను మనం చూడలేదు. బహుశా ఏ ఫొటోలోనన్నా
చూశామా అంకేఅదీ
అనుమానమే. డయ్యరున్నాడు. డప్పులాడున్నాడు. విళ్ళావళ్ళవీ ఫొాటోలుకూడా చూడలేదు. కాని
వాళ్ళ పేరు చెప్తే మనకెంతో అసహ్యం.
గాంధీజీని నేను చూడలేదు. కాని ఆయనంక గౌరవం. (బతికి వుండగా చూడనోలేకపోయానే అని
ఎంతో అనుకుంటాను. కొన్ని
ఎస్సోసియేషన్సు. ...”
మాటలో కల్పించుకొని సంభాషణను దారికి తేవాలనే ప్రయత్నాన్ని ఆనందరావు వదలలేదు.
"మనమధ్య ఎటువంటి ' ఎస్సోసియేషన్సు! ఆధారంగా ఏ అభ్మిప్రాయాలు ఏర్పురచుకోడానికీ. ...”
"అవకాశమే లేదంటారు. సరిగ్గా అదే నే చెప్పదలచుకొన్నదీను. ఏమీ అక్కర్లేదు. అది అంతే.
కారణశూన్యమైన
ఇష్టానిషాలకు క్షమాపణ చెప్పుకోవలసిన అవసరం నాకు కనిపించదు. ఏదో మర్యాదకుతప్పు
వాటికెక్కువ [ప్రాముఖ్యం ఇవ్వనూ
రూడదు. ఏమంటారు?”
ఆమె ఇంతసేపటికి మాటకు అవకాశం ఇచ్చినా ఇప్పుడేమనడానికీ తోచలేదు. "నువ్వు
చెప్పుకుంటూన్న క్షమాపణకు విలువ లేదు. నను
నమ్మను! అంటూంకే ఆతడు దిగ్పాంతుడయ్యేడు.
"అయితే మనం సంఘంలోవున్నాం గనక కొంతవరకన్నా ఆ నియమాల్ని అనుసరించకతప్పుదు.”
తనకవకాశం దొరికిందనిపించి ఆనందరావు మాటకలిపాడు.
"సరిగ్గా నా ప్రస్తుతప్రయత్నాన్ని (ప్రోత్సహించినదదే. ...”
"నేను అర్దం చేసుకోగలను. నిన్నమధ్యాహ్నంవరకూ మనుష్యుని ఆలోచనల్నీ, విశ్వాసాల్నీ
సంఘనియమాలు ఎంతవరకూ
తీర్చిదిదగలవనో విషయమై స్పష్టమైన అభ్మిప్రాయంలేదు. కాని, మా రాజగోపాలంగారిలో వచ్చిన
స్పందనలు చూశాక....”
ఆమె బుద్ధిపూర్వకంగా రాజగోపాలం పేరు సంభాషణలో ప్రవేశపెడుతూందని [గ్రహించేడు. ఆమె
అభిప్రాయాన్ని (గ్రహించడంలో తాను పారపాటు
చేశాననుకొన్నాడు. తననుచూసి రాజగోపాలం జంకేడు. వెళ్ళిపోయాడు. ఇప్పుడీమెకు తానే దిక్కు.
ఆ మాట తోచాక అంతవరకూ ఆతని మనస్సులో అంతర్గతంగా వుండిపోయిన అనుమానం, ఆమె
స్సీలాన్ని గురించిన శంక పాటమరించింది.
వారిదరూ పక్కపక్క వాటాలలో ఒంటరిగా వున్నారు. బాగా పరిచయంకూడా వున్నట్లు అతడిక్కుడికి
వెంబడించడమే చెప్తూంది. నిన్న
ప్రాద్దుటి నుంచీ ఆ మాట సూచనగాకూడా అనలేకపోయినా, ఆమె లోకువ కనిపించిపోయిందన్నప్పుడు
అనకుండా వండలేకపోయేడు.
"మీవెంట తిరగడానికి ఆయనకు వుద్యోగం, సద్యోగం ఏంలేదేమిటి?”
కల్యాణి ఆతని పొడుపును [గ్రహించినట్లు నవ్వింది.
"నేనూ రాజగోపాలంగారూ పెళ్ళిచేసుకోవాలనుకొన్నాం. వారిని నాన్నకూ-అమ్మకూ చూపించాలని
తీసుకొచ్చా. రమ్మంకే వచ్చారు.”
ఆ మాటకాతడు నోరు తెరిచాడు.
"పాతికేళ్ళు వచ్చాక ఎవరి బాధ్యతలు వారు తీసుకోవడం మంచిది. ఆడదైనా, మగాడైనా. రేపునో
వెడుతున్నా. బెజవాడ వెళ్ళుగానే
రిజ్మిఫారుకు తెలుపుతాం.”
ఆ మాటలు తనకెందుకు చెప్తూందో అర్దం కాలేదు. తనను ఆడిస్తూందా? వెక్కిరిన్తూందా? తాటాకులు
కడుతూందా?-ఆమె ధోరణిని ఆతడా
ధోరణిలోనే ఎదుర్కోవాలనుకొన్నాడు.
"రిజ్మి స్టేషను చెల్లదు.”
" మోసగించేవంకేు శిక్షపడుతుంది. ”
"ఆయన వుద్యోగం వాడుతుంది.”
ఎన్నో ప్రశ్నలు. ఎన్నో బెదిరింపులు. వానిలో ఒక్కటీ ఆమెయెడ అభిమానం చూపేది లేదు. చట్టం,
హక్కు, అధికారం....
కల్యాణీ ఆ ప్రశ్నలన్నింటికీ అంగీకారం తెలిపింది. కుద్చీలో జేరబడి దృథకంఠంతో సమాధానం
ఇచ్చింది;
”"మీరిదివరకు నాన్నగారితో అన్నమాటలు కాగితంమీద వ్రాసి ఇస్తారు."
"ఆ మాట ఎల్లా అడగలిగావు?”
అంతవరకు ఉపయోగిస్తున్న గౌరవవాచకం పోయింది. కల్యాణి గమనించింది.
"మీరు పెద్దలు. నన్ను 'నువ్వు'న్నా, 'మీర*న్నా నాకు వచ్చేదీ పోయేదీ ఏమీలేదు. కాని,
అదేవిధంగా నేనుపయోగిస్తే
మాత్రం....”
"క్రమించండి."”
ఆనందరావు అయిష్టంగానైతేనం వెంటనో సర్దుకున్నాడు.
"ఫర్వాలేదు. ఇంక తమప్రశ్న....”
ఆతనికెంతో తామసం కలిగింది. క్షణంక్రితమే ఆమె శీలంయొుడ అనుమానం వెలిబుచ్చిన మాట
మరచాడు. తన హక్కులోవస్తువు
జారిపోనివ్వరాదనేదొక్కకే దుగ్గ.
కల్యాణీ బంధుకోటిఅంతా తనకు స్వాగతం ఇచ్చేరు. గ్రామమంతా తనను అభినందిన్తూంది.
కల్యాణికూడా సెళ్ళికాక, మొగుడికోసం మొగంవాచి
వుందనీ, పిలిచిందేతడవుగా తనవెంటబడుతుందనీ ఆతడింతవరకు కల్పునలు సాగిస్తున్నాడు. కాని
జరుగుతున్నది దానికి విరుద్దం.
కోపంవచ్చిందంకే ఆశృర్యంలేదు.
"చిన్నప్పుడెప్పుడో ఏదో అన్నాననుకోండి. అది ధర్మ్శ్మవిరుద్ధమని [గ్రహించేకకూడా. ...”
కల్యాణి ఖచ్చితంగా చెప్పేసింది.
"నాకు సంబంధించినంతవరకు ధర్మాధర్శుచింతన అవసరం వుందనుకోను. ఏమంకే ఆనాటి
వివాహాన్ని అంగీకరించను. *
"అంగీకరించక. ...”
కల్యాణి నవ్వింది.
"చ్రాప్పేనుగా....”
ఆమె కోరినటువంటి వుత్తరాన్ని ఆనందరావు ఇవ్వడు. దానిని అతక్కచేయకపోతే కోర్పుకీడ్చి నోలబెట్టి
రాసేస్తానని చెప్పేడు.
కల్యాణి లేచింది.
"సరే, కోర్డులో మీరు పెప్టేకేసు సులువుగా రుజువుకావడానికి నో చెయ్యగల సహాయం ఇస్తాను.”
ఆనందరావు ఆశ్చర్యంతో నోరు తెరిచేడు.
"అంకే....”
"మీరు కాగితం ఏదీ ఇవ్వనక్కల్లేదు. ”
"అది వట్టి వ్యభిచారం. ...”
"దృక్పథంలో భేదం తప్పు వేరుకాదు. నా దృష్టిలో మీతో కాపురం చెయ్యడం వ్యభిచారం. మీ
దృష్టిలో అది ధర్మం. ఫర్వాలేదు
వ్యభిచారమే కొందరికి జీవితధర్శంగా తీసుకొనే భారత దేశంలో ఈ మాత్రపు దృక్పుథవైవిధ్యం
వుండడంలో ఆశ్చర్యంలేదు. ”
ముప్పుయినాలుగో ప్రకరణం
రాజగోపాలం గుమ్ముంలో అడుగుపెక్పేసరికి సుజాత కనబడింది. కాని ఆమెలో వెనుకటి దీప్తీ లేదు.
వుత్సాహమూ కనబడలేదు. ఒక్క
రెండుమూడు నౌలల్లో ఇరవయ్యేళ్ళ తరుగుదల వచ్చేసినట్లు కనబడుతూంది. ఏదో అమూల్యమైన
వస్తువును పారేసుకొన్నట్లూ,
జీవితాలంబనాన్నో పోగొట్టుకొన్నట్లూ దిగాలుపడి వుంది. ఆమెను చూడగానే రాజగోపాలం
దిగ్రుమచెందేడు.
"ఎవరు, సుజాతా! అల్లూ వున్నావేమిటి?”
సుజాత ఉలికిపడినట్లు తిరిగిచూసింది. గుద్గనీరు కక్కుకొని ఇంట్లోకి పారిపోయింది.
రాజగోపాలానికి వెంక్కటావు మాటలు జ్ఞాపకం వచ్చేయి. "జీవితానికి సరిపడా నిర్వేదం.
దురదృష్టవంతురాలు, -” కాని, ఆమాటయందు
తనకు విశ్వాసం లేకపోయింది. ఆమెకు ఎవ్వురియందూ నిర్వేదం కలిగించేటంత ఆత్మీయత
ఏర్పుడలేదనీ, ఆ వయస్సు, ఆ
మననస్తత్వమూ కూడ లేవని ఆతని అభ్విపాయం. చిన్నతనం, చిలిపితనం, గారం తప్పు ఆమెకింకా
గాంభీర్యం పట్టుబడలేదని ఆతని
ఆలోచన. కాని, ఇప్పుడు ఆమెను చూస్తే అల్లాఅనిపించదు.
ఆతనికి ఆమెయెడ నిజంగానే ఎంతోపరితాపం కలిగింది. మనస్సులోనే ఆమెను దగ్గరకు తీసుకొని
బుజ్జగించి, తల ముద్దుపెట్టుకొని
వీపు నిమిరేడు. 'వెర్రిపిల్లా! ' అన్నాడు-మనస్సులోనో.
కాని, తనకు కావలసింది ఆమెకాదు, కల్యాణి. ఆమె లభించకపోతే తనజీవితం ఏమిటి?
చిన్నప్పుడెప్పుడో జరిగి, ఆమెజ్ఞాపకంలోంచికూడా జారిపోయిన ఒకఘటన తనకెందుకు చెప్పులేదని
అభిమానం వేసింది. కోపం వచ్చింది.
కాని ఆ అభిమానం - కోపం రైలుకు బయలుదేరేవేళకే అంతరించేయి.
ఆమెను తాను పెద్రప్రలులూ, తోడేళ్ళామధ్య వదలిపెట్టి వచ్చినట్లనిపించింది. ఆమె ఆ ఒత్తిడికి
తట్టుకోగలదా? ఆచారాలు,
సంప్రదాయాలు, కులప్రతిష్టలు, ధనం పలుకుబడులు - నిగ్రహించి నిలబడ్డానికి కావలసిన
మనస్కైర్యం. ...భగవానో!
ఎంతపనిచేశాడు. తనకు కోపం, అయిష్టం ఏర్పడిందనే బ్రమ కలిగించేడు. ఆమె లొంగిపోయటట్ట్లు
చేసిన ఆఖరు ఉపకరణం అదే
అయితే. ...ఆ ఆలోచనే చాల బాధాకరంగా తోచింది.
గుమ్మంలో అడుగుపెన్పేసరికి కల్యాణిలేనిలోపం బాగా కనిపించింది. ఈ ఏడాదిలో ఆమె తనకు
చిరునవ్వుతో స్వాగతం ఇవ్వని రోజులు
జాపకం రావడం లేదు. ఇదే మొదటిదనిపించింది. హృదయం హ్వ్పాసింది. తానుచేసింది
చాలతెలివితక్కువపని. వెంటనో వెనక్కి
తిరగాలనిపించింది.
ఎదురుగా శేఖరం నిలబడి పలకరిస్తున్నాడు.
"ఎప్పుడొచ్చేవు నాయనా!”
న.
రాజగోపాలం ఆ వుదయమంతా ఎల్లాగోవున్నాడు. నిదరాకపోయినా పక్కమీదినించి
లేవాలనిపించలేదు. మెదడంతా శూన్యంగావుంది. ఆఫీసుకి
పోవాలనిపించలేదు. హోటలుకి అలవాటుకొద్దీ వెళ్ళేడేగాని, వాడేం పెప్పేడో, తానేం తిన్నాడో,
అసలు తిన్నాడో లేదో, ఏమీ తెలియదు.
అనుక్షణం ఒక్కకే ప్రశ్న. "ఈ క్షణంలో కల్యాణి ఏంచేస్తూందో? వాళ్లేం ఒత్తిడి పెడుతున్నారో, ఆమె
ఒంటరిగా. ...”
సినీమాహాలువద జనంమూగి ఆమెను కారులోకి గెంటుతున్నదృశ్యం గుర్తుకువచ్చింది. గుండె
నీరయిపోయింది. తానువెళ్ళి ఆమెప్రక్క
నిలబడాలి. ఒక్కఉదుటున లేచేడు.
అప్పుడే గుమ్మంలోంచి వెనుతిరగబోతున్న శేఖరం ఆతడు లేచిన చప్పుడు విని ఆగేడు.
" నిద్రపోతున్నావనుకొన్నాను .”
రాజగోపాలం ప్రకృతిలోపడ్రాడు.
"దయచెయ్యండి. ”
ఆతని ఆహ్వానంతో నిమిత్తంలేకుండా శేఖరం వెనక్కితిరిగేడు. కుద్చీలాక్కుని కూర్చున్నాడు.
"ఏం అల్లావున్నావు?”
ఏదో మర్యాదకోసం వేసేప్రశ్నలు. కాలక్రేపంకోసం వాకబులు. ఏదో చెప్పదలచినదానికి ఉపష్మకమణికగా
శాఖాచదంక్రమణలు.
రాజగోపాలం మనస్సుకవేం దూరడంలేదు. తన స్వభావానికి విరుద్ధంగా మాట్లాడుతున్న మనిషి
లేచిపోతే బాగుండుననిపించింది. మర్యాదకాదని
ఎరిగినా కొన్ని ప్రశ్నలకూరుకుంటూ వచ్చౌడు. కాని శేఖరం ఏమీ నిరుత్సాహపడలేదు.
ఒక్క గంటసేపు ఆ మాటా ఈ మాటా చెప్పి అసలు విషయానికి వచ్చాడు.
"ఏమిటో కులం అనుకోడమే గాని పిల్లలకంకు ఎక్కువా? నీకంకు గుణవంతుడెవడు? సుజాత నీకోసం
అలమటిస్తూంది. దానిని నీకిచ్చి
పెళ్ళిచ2య్యాలని నాకోరిక.
శేఖరం నలపబైవేలు కట్నం ఇవ్వడానిక్కూడా సిద్దపడి కూతుర్ని కులాంతరుడికివ్వడానికి సిద్దంగా
వున్నాడు.
సరాసరి తానివ్వగల కట్నం, లాంఛనాలు, వేడుకలు, బహుమతులు -
కంటాక్టరుస్వభావాన్ని స్పష్టంచేశాడనిపించి రాజగోపాలం నవ్వకొన్నాడు.
పావలా నుంచి వేయిరూపాయిలదాకా వుందిరేటు - చప్రాసీనుంచి మంటత్రివరకూ ఏ పనేనా
జరిగిపోతుంది. ర్యాష్టాన్ని కొనస్తానన్నా
అమ్మేసేటందుకు మనుష్యులున్నారు. వాటికి రేట్లున్నాయి. ఆ రేట్లన్నీ ఆతడెరుగు. ఆ దైర్యంతోనే
ఒక్కమారు అల్లుడు కావలసిన
యువకుడి కళ్ళు జిగేల్మనిపించెయ్యాలనుకొన్నాడు. కాని ఆతన్సిప్రయత్నం విఫలం అయ్యేసరికి నోరు
వెళ్ళబెన్పేడు. 1940లో
జైలుశిక్షకి తయారయి అన్నీ సిద్దం చేసుకొన్నప్పుడు కలక్టరు తన్నువొదలి, సత్యాగహం చూడ్రానికి
వచ్చిన జనాన్ని తెచ్చిన
బస్సులమీద కేసుపెటినప్పుడుకూడా ఆతడంత దిగ్రుమ చెందలేదు.
ఆ రోజున గాంధీజీ పిలుపుకై కాం[గైెసనువాదులు వ్యక్తి సత్యాగహం చేస్తున్నారు. శేఖరం ఆ
సత్యాగ్రహానికి పెద్ద ఆడంబరంచేశాడు.
సత్యాగహంతేదీ నిర్ణయించి కలక్షరుకు, పోలీసులకు తెలియబరచేడు. పెళ్ళికి చేసినంత హడావిడి
చేశాడు. ఎక్కడెక్కడున్న
బంధుమిత్రులకు ఆహ్వానాలు పంపేడు. చుట్పప్రక్కల నాలుగూళ్ళజనాన్ని ఆహ్వానించేడు. అరెస్టు
చేసినాక తననూ, తనను
సాగనంపేజనాన్నీ రాజమండ్రి జైలుదాకా జేరవేసేటందుకు మూడుబస్సులు మాట్లాడేడు.
సనత్యాగహంరోజున వచ్చేజనానికి విందులు ఏర్పాటు
చేశాడు.
అనుకొన్నతేదినాటికి అధికార్లుమినహా అందరూ వచ్చేరు. వారిరాక కోసం సత్యాగ్రహం ఒక పూట, రోజు
వాయిదావేశాడు. వచ్చిన జనం
విసుగెత్తి వెళ్ళిపోతున్నారు. విందుఆశ కూడా వారినాపడం లేదు.
చివరకు రెండోరోజు సాయంకాలం నబినస్పెక్టరువచ్చి 'రాంగ్ రూట్'లోకి బస్సులు వచ్చినందుకు
కేసుపెటి వెళ్ళిపోయేడు. ఆ రెండు
రోజుల్లోనూ చేసిన అప్పులూ - ఖర్చులూ సర్హుబాటు చేయడానికై తాను సత్నాగహాన్ని తాత్కాలికంగా
నిలుపుచేసి మిగిలి వున్న
రెండెకరాలూ అమ్మకం చూపవలసివచ్చింది.
ఆనాడుకూడా శేఖరానికంత నిరాశ, నిస్పృహ, దిగ్రుమ కలగలేదు.
"నాపెద్దఅల్లుడిక్కూడా నోనిచ్చినదానికన్న నీకెక్కువ ఇస్తున్నా. నీవంటి అల్లుడికింతకన్న ఎక్కువే
యివ్వవచ్చు. కాని,
నీకిస్తే పెదఅల్లుడికివ్వాలి. తర్వాత ఎల్లాగూ మా పిల్లలకు పెట్టుకుంటాం."
స్కూల్ మైనలు అయితే పదివేలు. బి.ఏ. పదిహేనువేలు. ఎం. బి. బి. ఎస్. ఏభయివేలు.
ఇంజనీరు ముప్పుయివేలు.
ఇది వట్టి చదువేవుండి ఆస్తి ఏమీ లేనివాళ్ళ విషయంలో. ఆస్తికూడా వుంకే రేటు హెచ్చుతుంది.
తెలుగుదేశంలోని కమ్మ కుటుంబాల
కంటాక్టరు మనస్తత్వం పెద్రపులిలా నోరు తెరిచింది. ఈవేళ వాళ్ళనే కాదు. దేశంలోని ఆడపిల్లల
తండులందర్నీ మింగేసేటట్లు
పళ్యుకొరుకుతూంది. దానినిచూసి భయపడేస్టితి వాళ్ళకీ, దేశానికీకూడ సిద్దపడిందన్న శేఖరమే
తనవరకు వచ్చేసరికి
మనస్సునదుపుచేసుకోలేకపోతున్నాడు.
"ఆలోచించు. శభమైన పిల్లనిస్తానంకు కులంతక్కువ అన్నట్లు చెయ్యకు. ”- అనికూడా
"హెచ్చురించేడు.
ముష్పయ్యయిదో ప్రకరణం
సాయంకాలం మామూలుగా హోటలుకు పోయివచ్చేసరికి ముందు వరండాలో తండి కూర్చుని
కనిపించేడు. గుమ్మంలోనే కాలు ఆగిపోయింది. ఆయన
వస్తాడనే విషయం తెలియదు. రావలసిన కారణమూ కనబడదు. ఈమధ్య ఉత్తర ప్రత్యుత్తరాలలో
కనబరుస్తున్న ముభావం ఇంత
హఠాత్తుగా మారి తనను చూసేటందుకే తండి వచ్చేడంకే ఏదో గట్టి విశేషమే వుండాలనిపించింది.
తండ్రి పట్టుదలలు అతనికి తెలుసు.
ఆ క్షణంలో ఆయనను సమీపించేటందుకు మనసు ఒప్పులేదు. ఎదటివానికి కష్టం
కలిగిస్తున్నానేమోనన్న మృదుత్వం లేదాయనలో.
కల్యాణిని గురించి ఆయనకెటువంటి అభ్మిప్రాయం వుందో [క్రిందటిసారే తెలిసిపోయింది. ఇప్పుడాయన
మళ్ళీ అదే ఎత్తుతే సహించేటంత ఓరిమి
మనస్సుకి లేదనిపించింది.
కాని తప్పుదు. తండి వచ్చి కూర్చున్నప్పుడు మొగం చాటుచేసేటంత ధైర్యం లేదు. చేతిలోవున్న
సిగరెట్టు సైడ్ కాలవలో పారేసి
లోపల అడుగుపెళ్తేడు.
తీరాచేసి ఆయన ప్రసంగం వినేసరికి నవ్వాలో- బాధపడాలో తెలియలేదు. తండ్రి తన వివాహ
విషయంలో కులం పట్టింపులు
వదులుకొనటందుక్కూడా సిద్ధమవుతున్నాడు.
"కులాంతరురాలిని చేసుకోవాలని కాదూ నీ కోరిక! చేసుకో. కానీ, ఆ బాహ్మణపిల్ల వద్దు. మన్ని
ససిపెట్టదు. *
అసలు తానిప్పుడు పెళ్ళి చేసుకొనధోరణిలో తేనేలేనని నచ్చుచెప్పుడానికి రాజగోపాలం
ప్రయత్నెంచేడు. కాని, ఇక్కడ
జరుగుతున్న్నాయన్నవీ, జరిగినాయన్నవీ ఆయనకు అవసరమైన మార్పులతో తెలిసినాయని [గ్రహించేక
అతడు నిరుత్తరుడే అయ్యేడు.
కల్యాణీ జబ్బుపేరుతో ఇతరుల కళ్స్రుగప్పి అతనితో కాప్రరం చేస్తూంది. అతడిని తనతో వూళ్ళవెంబడి
తిప్పుతూంది-- అనేది
ఆయనకర్ణమైన విషయం.
అసలుపరిఫ్రతులు చెప్పి ప్రయోజనంలేదని గోపాలం [గగ్రహించేడు. ఆయన కొన్ని విషయాలు
విన్నాడు. దానికి అనుగుణంగా పథకంకూడా
తయారుచేసేశాడు. అదేమిటో తెలుసుకొనేసరికి రాజగోపాలం ఆశ్చర్యానికి పరిమితిలేదు.
నుజాతను పెళ్ళిచేసికోడానికి ఆయన అభ్యంతరం చెప్పుడు. అంతేకాదు, చేసుకోవాలనోది ఆయన
ఆజ్బ.
సుజాత పచ్చునిపిల్ల.
"కోడలు నలుక్రైతే కులం అంతా నలుపంటారు-"” కల్యాణి నల్లనిది-అని ఆయన చెప్పకపోయినా ఆ
అబ్మిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.
అందులో దాపరికంలేదు.
ఏభయి అరవై వేల రూపాయలు కట్నంరూపంలోనూ, లాంచనాల రూపంలోనూ ఇస్తున్నారు.
కల్యాణీ తండ ఆస్తికలవాడు కాదు. ఆ అమ్మయి చేతిలో పసుపుకొమ్ముకూడా పెట్టలేడు- ఈ మాటా
ఆయన వాచ్యంగా చెప్పులేదు.
కాని, ఆ బేదం తన మనస్సుకు తోచేటట్లు చేయడంలో ఏమీ లోపం వుంచలేదు.
కల్యాణి వయస్సులో అతనికన్న పెదదయి వుంటుంది. పెళ్ళాం పెద్దది కావడం ఆయుః క్షీణం.
కులం రీత్యా తమకన్న గొప్పవాళ్ళ మనుకొనేో బ్రాహ్మణులింటిపిల్ల.
ఈమారు సుజాత కులాన్ని తాము సన్నదిగా చూనస్తామనో అబ్మిప్రాయాన్ని బవైటపడనివ్వలేదు.
కాని వీటన్నింటికన్న కృష్ణంరాజు మనస్సులో సర్వ ప్రథమంగా మెదులుతున్న ఆలోచనవేరు.
శేఖరంగారి కొడుకులు మంచి ఉద్యోగాల్లో వున్నారు. ఈ దిక్కు మాలిన గవర్నమెంటులో ఎంతకాలం
ఏడిస్తే ఏముంది? రాజగోపాలం
మెకానికల్ ఇంజనీరు. ఏ కంపెనీలోనన్నా నెత్తిన పెట్టుకొంటారు. ఆ అవకాశం వారు బావమరదికి
కలిగిస్తారు.
"నీకీవేపున సాయం ఏమీ వుండదు. మెగా ఆ అమ్మాయి రెండో అన్న కమ్యూనిస్టట. వాళ్ళనుంచి నీకు
లభించే సహాయం అల్లూ ఈ
వున్నవుద్యోగంకూడా వాడడం.”
రాజగోపాలం నిన్తబ్దుడే అయ్యాడు.
తండి తేగల యుక్తులు అయిపోయాయనుకొన్నప్పుడు శేఖరం ప్రవేశించేడు. తన తండి ఎదటనో
ఆయన టప్రశ్నించేడు.
"అంత ఆలోచన పనేముంది? నువ్వెరగని అమ్మాయి కాదు.”
"నా కూతురులో ఏలోపం వుందని సందెహిస్తున్నావు?”
జంటకవుల్లా చెరోపాదం ఎత్తుకున్నారు. రాజగోపాలంవటద సమాధానం ఏంవుంది? సుజాతలో లోపం ఏం
వుందని చెప్తాడు? అసలు ఏం వుంది?
ఆరోగ్యం, అందం, తెలివి, చురుకుదనం - అన్నీ వున్నాయి.
"డబ్బు! ”
ఆమె తండ్రి బంగారు పిచ్చిక.
” హూదా?”
అన్నలు మంచిమంచి ఉద్యోగాలలో ఉన్నారు.
అన్నింటికీ మూలం ఆమె తనంకే ప్రాణం ఇస్తూంది.
కాసి...
ఆ కాని. ..ఒక పెద్ద అగాధం. అది పూడదు. అందం, గుణం, ధనంకూడా దాన్ని భర్తీ
చేయలేదు. అవి దానికి వంతెన
వెయ్యలేవు.
తనకామెమీద మనమస్సులేదు!
ఆ రోజుకూడా అతడిల్లు వదలలేదు.
తండి అతనిని వదలలేదు.
ఇరవైనాలుగుగంటలు వూదరపెట్టాక రాజగోపాలం సహనం పరాకాష్టకు చేరింది.
"మీకు కావలసిందేమిటి? మీయడ భక్తి చూపించి, మీరుచెప్పేమాట వినడం. అంతేనా?”
"నువ్వు నుఖపడడం. .”
తండి యిచ్చిన సమాధానం అతనిని నిరుత్తరుజ్ణి చేసింది. ఇంతకాలం పెంచాం. పొషించాం.
చదువు చెప్పించాం. ఈవేళ నువ్వు మమ్మల్ని
' ఎగర్తిన్తావా' అంటాడనే వృద్దేశంతో సమాధానం తయారుచేసుకొన్నాడు. కాని, ఆయన తన సుఖం
కోరుతున్నాడు.
ఒక్క మారు నిరుత్సాహమే కలిగింది.
"అదింక సాధ్యం కాదు. నా చేజేతులా వొదులుకున్నా.”
కృష్ణంరాజు ఒక్క మారు అగ్గిపుంతయిపోయాడు. మరుక్షణంలో నీటి బుగయి కారిపోయేడు.
అటువంటి మొండివాడిని తనకు కొడుకుగా ఇచ్చిన భగవంతుళజ్లీ స్మరించి చేతులు జోడించడంతప్పు
ఆయనకు చేయగలిగింది తోచలేదు.
ముపష్పుయ్యారో ప్రకరణం
తెల్లవారేసరికి కల్యాణి గుమ్మంలో దిగింది. దిగిన క్షణంనుంచి శతుమథ్యంలో అడుగు పెడుతున్నహ్తు
అనిపించింది. రిక్రాలోంచి [క్రింద
అడుగు పెడుతూండగా అటూ-ఇటూ వున్న రెండువాటాల గుమ్హాల లోనూ ఎవరివో ముఖాలు
కనబడ్డాయి. చటుక్కున వెనక్కి తగ్గేయి.
ఆమె సరాసరి ఇంట్లోకి వెళ్ళిపోయింది. ఇరుగుపొరుగు వాటాల్లో ఏవో కొత్త కంఠాల గుసగుసలు
వినిపిస్తున్నాయి. అవి కేవలం
కొత్తవి కావు. వెనక ఎరిగినవే. ఆ కంఠాలు తననీవేళ ఆప్యాయంగా పలకరించగల ఫ్రితిలో లేవని ఆమె
గ్రహించింది.
ఎంతో ఆప్యాయంగా పిలుస్తూవచ్చే రామలక్ష్మమ్మ తన రాకను పట్టించుకోలేదు. సుజాత
వచ్చినట్లుంది. ఆమే రాలేదు. ఈ
వెపునవున్న రాజగోపాలం తనతో ఏలాగూ సన్నిహితత్వం చూపడు. ఆమెకు దొడ్సిలోకున్న తలుపు
తియ్యడానిక్కుూడా సందేహం అనిపించింది.
తన గదిలో మంచంమీదనే కూర్చుండిపోయింది.
సినీమాహాలు వద్ద ఆ దుర్దటన జరిగిన రాత్రి రాజగోపాలం తన గదిలో వన్నాడు. ఆ కథ
అచృమద్వారా పాకుతుంది. ఆసంగతి
తెలుసు. కాని, దానినారోజున తాను లక్ష్యం చేయలేదు. రాజగోపాలం తన ప్రక్కనున్నాడు. తాము
పెళ్ళిచేసుకోదలచారు.
కాని, ఈ రోజున తనకా దైర్యం లేదు. రాజగోపాలం తన్ను పలకరించనుకూడా అసహ్వించుకొనో స్థితికి
వచ్చేడు- అనుకొంటూంది. తనకు
మిగిలిందేమిటి? ప్రపంచం వేలుపెట్టి చూపించే అవకాశం.
న.
హఠాత్తుగా ఆనందరావు రంగంలో ప్రత్యక్షమైనాడు.
"కల్యాణీ! నేనిక్కడే వుంటున్నా.”
ఆమె ఆ స్వరానికీ, ప్రతిపాదనకూ దిగ్రుమ చెందినట్లు చూసింది. తనవాళ్ళో, తనయింట్లో అతనితో
ఖండితంగా మాట్లాడగలిగిన
దైర్యం ఇప్పుడు కనబడలేదు.
అతడు ఏదో అల్లరిచేయడానికి కృతనిశ్చయుడై వచ్చినట్లనిపించింది. పెప్పై సావట్లో పెట్టించేడు.
వాకిట్లో కుర్చీలో కూర్చుని
సిగార్ కాలుస్తూ ఎవరితోటో మాట్లాడుతున్నాడు.
” రల్యాణీ నా భార్య అండి. ఎప్పుడో చిన్నప్పుడే చేసుకున్నా. తెలివిమాలి ఇన్నాళ్లూ
తీసుకెళ్ళలేదు. ఇప్పుడు తీసుకెళ్ళడానికి
వచ్చేను.”
అతడొక్కమాట అబద్దం చెప్పులేదు. ఆమెనేమీ అనలేదు. పెద్ద వుద్యోగస్తుడుగా తన హోదాను
కించపరచుకోలేదు. కల్యాణి
తనభార్య. ఆమెకు ఏ మాత్రం మాటవచ్చినా తనకే మాటఅన్నట్లు ఆమెయెడ అతిగౌరవం, _పేమ,
అభిమానం వొలకబోస్తూ
మాట్లాడుతున్నాడు. వారికి వీరు- రెండు వాటాలనుంచీ జనం చేరేరు. ప్రశ్నలువేసి
తెలుసుకుంటున్నారు. అందరికీ ప్రాణాలు
రుదుటపడినట్ట్లు వారి కంఠాలను పట్టి తెలుస్తూంది.
రామలక్ష్మమ్మ కల్యాణీ యోగ్యతనూ, ఆమె భవిష్యదదృష్టాన్న్ కూడ అభినందించింది. అందరూ
తన్ను
వదల్సుకొనటందుకుత్సాహపడుతున్నట్లు అనిపించింది.
తాను వ్యతిరేకత తెల్పుడానికీ, (పప్రతిఘటించడానికీకూడ అవకాశం లేనంత నేర్పుగా వల
తయారయిపోతూంది. తానూరుకొంకే ప్రమాదం,
ఊరుకోక అల్లరిచేస్తే తనకే అప్రతిష్ట. ఇంకా వాళ్ళో వుండలేదు. అందరూ తన్ను వేలెట్టి
చూపిస్తారు. తల ఎత్తుకోలేదు.
ఒక అరగంట పోయాకరూడా ఆమె అలాగే కూర్చుండి వుంది. మనస్సంతా అల్లకల్లోలంగా వుంది. తన
నిస్సహాయతకు ఏడ్పు వస్తూంది.
కాని, ఏడవడం లోకువైపోతుంది. నిశ్శబ్దంగానే కూర్చుంది.
సుజాత వచ్చింది.
"ఒంట్లో బాగులేదంది లచ్చమ్మ! బాగున్నావా?”
ఆ మాటలో నీ రహస్యం మాకు తెలిసిందిసుమా అన్న అభిప్రాయమే, వెక్కిరింతే వినిపించింది. కాని,
కల్యాణీ ఏమీ అనలేదు.
"రా. ఎప్పుడొచ్చేవు?”
"మొన్ననే. ”
"అల్లా వున్నావేం? బాగా చిక్కిపోయావు. ” ఒక్కనిముషం వూరుకుని మళ్ళీ అంది.
"ఈ ఏడాది చదువు పాడుచేసుకున్నావు. అనవసరంగా అక్కడుండిపోవడం మంచి పని జరగలా."
అది సానుభూతో, ఎత్తిపొడుపుకు ప్రతిసమాధానమో సుజాతకు అర్ధం కాలేదు. తానెందుకు
నాలుగునెలలు పారుగూళ్ళో వుండిపోయిందో తెలియదూ?
దానికి కారణం తానేకదూ? -అనుకుంది.
కల్యాణి నెమ్మదిగా లేచింది. స్నానం వగైరాలు ప్త్రూర్తి చేసుకొంది. నారాయణరావు మధ్యలో వచ్చేడు.
"నోను స్నానం చెయ్యలి.”
"దొడ్లో నుయ్యి వుంది.”
"వేల్లీళ్ళు పెట్టించు. ”
కల్యాణికి ఆ ఆజ్ఞాపించేధోరణి చాలా అసహ్యం కలిగించింది. స్పష్టంగా చెప్పాలనుకొంది. కాని,
తమాయించింది. ఇప్పుడు అల్లరి
చేసుకోకూడదు.
ఆమె వేబ్లీళ్లు పెట్టలేదు. అతడు అడగలేదు. భోజనంవిషయం ఏంచెయ్యాలో ఆమెకు అర్దంకాలేదు.
వంట వండినా, కారియరు తెప్పించినా
అతడు పీటవేసుక్కూర్చునేలా వున్నాడు.
జ్యగత్తగా ఆలోచించుకొనేవరకూ ఆమె తొందరపడకూడ దనుకుంది.
పనిమనిషిని కారియర్లు తెమ్మని పంపుతూ తండికి శెల్నిగ్రాం ఇవ్వడానికై డబ్బులూ, కాగితమూ
ఇచ్చింది.
నారాయణరావు ఆ కాగితం తీసుకొన్నాడు. చదివేడు. లోపలికి వచ్చేడు.
"మీ నాన్నగారికి శెల్నిగ్రాం ఇవ్వటం మంచిపనే. కారణంకూడా వ్రాస్తే బాగుంటుంది.”
కల్యాణికి హోధం ఆగిందికాదు.
"ఏమని? ఓ...”
నారాయణరావు చాల అమాయకంగా నటిస్తూ నోరు కొట్టుకొన్నాడు.
"మ, మనది మార్దాలదాంపత్యమని పక్కవాళ్ళుకి తెలియడం అవసరమా?”
అతని ధూర్తత్వానికి ఒళ్ళు వుడికిపోతున్నా చేయగలది కనిపించక కల్యాణి దాసీ లచ్చుమ్మమీద కోపం
చూపింది.
"వెళ్ళు. అల్లూ నిల్చున్నావేం? ముందు కైల్నిగ్రాంఇచ్చి మరీ వెళు హోటలుకి. ”
నారాయణరావు అదివరకే శైల్మిగ్రామును తన సవరణలతో పూర్తి చేశాడనే విషయం తెలియకనో కల్యాణి
దాసీని పంపేసింది. అతడు
మనస్సులోనే సంతృప్తిపడ్రాడు. అతడి పథకం చక్కగా నడుస్తూంది. కల్యాణి కాలుచేతులు
బిగిసిపోతున్నాయి. ఆమె ఎరుగును.
ఏమీచేయలేకుండా వుంది. తనకు సాయం ఎవ్వరూ లేరు. స్నగ్రామంలోలాగ ధైర్యం చూపలేదు.
పొరుగూరు. తానొంటరికత్తె. లోకభయం.
నారాయణరావు తిరిగి సావడిలోకి పోయాక కల్యాణి ఒక్క నిట్టూర్పు విడిచింది. నుదుటిచెమట
తుడుచుకుంటూ మంచంమీద కూలబడిపోయింది.
హఠాత్తుగా పదిగంటలవేళ భాస్కరరావు బండిదిగి లోపల అడుగు పెడుతూవుంకే నారాయణరావే
స్వాగతం పలికేడు.
"చిన్నబావగారా! దయచేయండి. ఏమిటి హఠాత్తుగా వచ్చేరు?”
భాస్కరం ఆ కంఠం, చొరవ, పిలుపుచూసి దృిగ్రుమ చెందినట్లు నిలబడ్డాడు. అతనికేమీ అర్దం
కాలేదు.
చెల్లెలిని చూసేక అర్హ్ధంఅయింది. కాని ఏమి చెయ్యడానికీ తోచలేదు. సంఘం తనకిచ్చే బలంమీద
కల్యాణిని బలవంతంగా తనకు
లొంగేటట్లుచెయ్యాలని ప్రయత్నం. పళ్ళుకొరికేడు. లోలోపల తిట్టుకున్నాడు.
"రాస్కెల్. స్కాంప్.”
తెలుగు, ఇంగ్లీషుభాషలలోని తెట్టుపదాలన్నీ ప్రయోగించినా పరిస్థితిని చక్కబరచలేవు.
భాస్కరం మంచితనంగానే నారాయణరావును తన దుష్టప్రయత్నంనుంచి విరమింప
చెయ్యాలనుకొన్నాడు. కాని, నారాయణరావు చిరునవ్వుతో
అతనిని తోసిపుచ్చేడు. చాలా బేపర్వాగా సమాధానమిచ్చేడు.
"మీతో ఎల్లా వ్యవహరించాలో నాకుతెలుసు. నేను ఏంచేస్తున్నానో...”
ఆయన ధోరణి చూసేక తానూ తొందరపడకూడదనో నిర్ణయానికి భాస్కరరావు వచ్చాడు.
"ఏంచేస్తున్నారో అనుమానం ఎందుకు? రౌడీభదం చేసినపనికీ మీరు...”
రౌడ్రీభ్యదం ఎవరో, వాడేం చేశాడో తెలియకపోయినా నారాయణరావుకు ఆ ఉపమానం కోపకారణమే
అయింది.
"మీ కమ్యూనిస్తులకన్న పెదరౌడీలు ప్రపంచంలో వున్నారా?”
తాను నారాయణరావును రెచ్చగొట్టగలిగేడు. కావలిసిందదే. ఆ వేడి తగ్గిపోనీకూడదు. భాస్కరరావు
అంగీకారం తెలియబరచేడు.
"వచ్చినఇబ్బుంది అక్కడే వుంది. మామీదకు వస్తే తప్పు మా రౌడీతనం చూపించం. దానితో మాకు
పేరే మిగిలింది. జనం భయపడం
మానేశారు. ”
నారాయణరావు కోపంలోంచి బయటపడేసరికి పక్కా పావుగంట పట్టింది. ఆ పావుగంటలో
మూడేళ్ళపాటు కమ్యూనిస్పుల్ని అడవులకు
పట్టించడంలో జరిగినకృషిలో తనపాత్రను ఆతడు వివరించగలిగేడు.
"తెలుగుదేశంలో ఆ రోజుల్లో తలఎత్తిన హేమాహేమీలముందు నువ్వు గోదీకూడా పెట్టుకోలేని
బుడ్డాడ్మికింద అక్క"”- అన్నాడు
భాస్కరరావు నిర్లక్ష్యంగా.
ఇద్దరూ ఒక్క నిముషం నిశ్శబ్దంగా కూర్చున్నారు. భాస్కరం లేచేడు.
"మీరు జరిగిందన్న పెళ్ళిని మేం గుర్తించం. దానిని చూపి మీరు....”
"చట్టమయ్యా స్వామీ. నువ్వు గుర్తించేదేమిటి?”-అన్నాడు నారాయణరావు వెక్కిరింతగా.
"అయితే కోర్పుకెళ్ళి ఆ చట్టాన్ని అమలు జరిపించుకో" మన్నాడు భాస్కరరావు, నిర్లక్ష్యంగా,
ఏకవచనప్రయోగంతో -
ఒక్కనిముషం నారాయణరావు ఆలోచించేడు. అతనికీ ఆ ఆలోచన ఇష్టంకాదని తేలిపోయింది.
"అయితే ఓ తునితగువుకు వద్దాం. నీ చెల్లెలికి మళ్ళీ....”
భాస్కురరావుకు చటుక్కున ఏదోతోచింది. మహాసంతోషం వ్యక్తపరిచాడు. చేయిచాపేడు.
"అల్లా అన్నావు బాగుంది. ఆ ఏర్పాకుదో ఈవేళనో చేస్తా.”
ముప్పుయ్యేడో ప్రకరణం
భోజనానంతరం భాస్కరరావు చెల్లెలిని బజారుకు బయలుదేరతీసేడు.
"సాయంకాలం వివాహానికి ఏర్పాట్లుచేస్తున్నా. దానికి కావలసిన సరంజామా కొనాఠి. *
నారాయణరావుకు ఆ రోజున ముహూర్తంలేదే అని విచారం కలిగింది. "*పిడుక్కి వారరూల ఏమిటి?
సభాముఖంలో జరిగే దండలపెళ్ళికి
ముహూర్తం పట్టింపులేమిటండి.”
భాస్కరరావుపదతి నచ్చకపోయినా నారాయణరావు ఏమీ అనలేకపోయేడు. సుముహూర్తం చూసి
ఓమారు పెళ్ళిచేయనో చేశారు. దాని
ప్రాముఖ్యం ఏం వుందిలే - అని సనంతృప్తిపడ్డాడు.
హఠాత్తుగా అనుకున్న ఈ తతంగానికి డబ్బుందో లేదోననిపించింది.
"కావలిస్తే డబ్బు. ...”
భాస్కరరావు నవ్వేసేడు.
"మా చెల్లెలు పెళ్ళిచేయలేని దుర్దశలో వన్నామంటారా?”
నారాయణరావుకు గుక్క తిరగలేదు. చివరకు అన్నాడు.
"నేను ఎరిగున్నవాళ్ళాకరిద్ధ్దరున్నారు . పిలుస్తా.”
భాస్కరం చాలవుత్సాహం కనబరచేడు.
"సందేహిస్తారేమిటి? ఈవాాళో్ళో మీవాళ్ళావరో వున్నారన్నారు పిలవండి. మా స్నేపితుల్ని నే
పిలుస్తున్నా.”
కల్యాణీ అన్నీ వింటూంది. తన అన్నచెప్పిన ఒక్కమాటతప్పు ఆమెకాతని ప్రయత్నం ఏమీ
తెలియదు.
"ఈవేళ సాయంకాలం రాజగోపాలం వివాహం ఏర్పాట్లు చేస్తున్నాడు. "”
కల్యాణికి ఆశ్చర్యమే కలిగింది. రెండురోజుల[కితం వెళ్ళివచ్చిన గోపాలం ఏంచేస్తున్నాడో ఇప్పుడే
వచ్చిన తన అన్నకేం తెలుసు?
ఆమెకు నమ్మకంలేదు. తాను వచ్చేసరికి రాజగోపాలం ఇంట్లోలేడు. తర్వాత రాలేదు. తాను
వచ్చినట్లే తెలియనివ్యక్తి తనతో
పెళ్ళిఏర్పాట్లు చేస్తున్నాడూ?
ఆమె కళ్ళలోనే ఆ ప్రశ్నలు చదివి భాస్కరం సంజ్దితో వారించేడు.
గంటవరకూ ఆమెకా ప్రశ్నలకు సమాధానం రాలేదు. బయలుదేరతీసేముందుకూడా నోరుతెరిచింది.
కాని భాస్కరం ఆ అవకాశం ఇవ్వలేదు.
"నువ్వేమీ డబ్బుతేనక్స్కర్లేదు. ఈ ఘట్టం వస్తుందని ఎరిగే నాన్నగారు నాలుగువందలిచ్చి పంపేరు."
ఆమె నోరుకుక్పేసుకుంది. బయలుదేరబోయేముందు భాస్కరరావు ఇరుప్రక్కల వాటాలలోని వారినీ
సాయంకాలం జరిగే పెళ్ళికి ఆహ్వానించేడు.
"డాబామీదే జరుగుతుంది. తమరుండాలి.
"” వరుడెవ్వరు?”
అంతా ఏమీఎరగనట్సే ప్రశ్నించేరు. భాస్కరం చిరునవ్వు నవ్వేడు.
"చూస్తూ, ఎరిగివండి అడుగుతారేమిటండీ”
కృష్టంరాజూ, శేఖరం పెడనవ్వు నవ్వేరు. రామలక్షమ్మ సానుభూతి ప్రకటించింది.
"బాగుంది నాయనా! ఇన్నాళ్ళుకి....”
భాస్కరం ఆమెమాట పూర్తికాకుండానే వీధిలోకి నడిచేడు.
"అంతేలేండి. అంతేలేండి. దేనికైనా వేళ రావాలి,"
తనకొడుకుమీది ప్రమాదం దూసుకుపోతూందన్న సంతృప్తితో కృష్ణంరాజు భాస్కరాన్ని హాస్యం చేశాడు.
"మీ కమ్యూనిస్రులకూ వుందన్నమాట ఈ వేళావిశేషాలమీద పిచ్చినమ్మకం. ”
"అదేమిటండోయ్ అల్లూ అంటారు. మేమూ అందరితోటివాళ్ళమే. మీ ప్రక్కనున్నాక ఆ మాత్రమన్నా
అంటకుండా వుంటుందా. ...ఆ6....”
తనవాక్కం మధ్యలోనో ఆపి రిక్షా ఎక్కేడు. రిక్షా కదలగానే జేబులోంచి కెలిగ్రాంతీసి చెల్లెలిచేత
పెశ్పేడు.
ఆమె నాలుగుమార్లు చదివినా దానిని అర్దం చేసుకోలేకపోయింది.
కల్యాణిని వెంటనే పంపమంటూ డాక్టరు మంజులత ఆతనికి పంపిన శైల్నిగ్రాం అది. సందేహం
తీరడానికి బదులు ఆమె మనస్సులో
సవాలక్ష ప్రశ్నలుదయించాయి. మంజులతకు తనఅన్న ఎల్లా తెలుసు? ఆమెకు తన అవసరం
అంత ఏముంది? అసలు తాను వూళ్ళో
లేనట్లు, తండి యింటికి వెళ్ళినట్లు ఏం తెలుసు?
"నాకూ సందేహాలెన్నో కలిగేయి. కాని ప్రధానమైన సందేహం వేరు. ఆమె యిచ్చిన కెలిగ్రామును
పట్టి ఏదో వుందనిపించింది. తెల్లవారి
5 గంటల బండి ఎక్కే తోమ్మిదిన్నరకి దిగా. డాక్టరును కలుసుకున్నా.”
రాజగోపాలం అక్కడేవున్నాడని చెపూ హాస్యం ఆడేడు.
"ఆయన తండికి అండర్[గ్రాండ్. ఆతడి తరఫునే డాక్టరు కులిగ్రాం ఇచ్చింది.”
రాజగోపాలం తనకోసం కెలిగ్రాం పంపేడన్నమాట. సంతృప్తి కలిగించినా డాక్టరు మంజులత యింట్లో
వున్నాడన్నప్పుడు ఏదో బాధ
చురుక్కుమన్నట్లయింది.
"మంచిచోకే దొరికింది.”
ఒక్క క్షణం క్రితం రాజగోపాలం ఎక్కడున్నాడనే విషయాన్ని ఆలోచించడం అనవసరంగా భావించిన
కల్యాణి ఆతడిప్పుడు
మంజులతయింట్లోవుండడం మంచిదికాదంటూంది. ఆమె 'జెలసీ*కి నవ్వువచ్చింది.
"ఆతడిని చూసేకచెప్పు, అంతకంకు మంచిచోటు మరొకటుంటుందేమో. "”
కల్యాణీ ఏమీ మాట్లాడలేదు.
గుమ్మంలోనే మంజులత వారిని అహ్వానించింది.
"మేడమీదికి వెళ్ళండి. "
"నేను డాక్టరుగారితో మాట్లాడుతూంటాను. నువ్వు కైకి వెళ్ళమ్మా! ”
"గది తెలుసుగా.” అని డాక్టరు అడిగింది.
కల్యాణి తలవూపింది. వెనుదిరిగికూడా చూడకుండా నడిచింది.
గదిలో, తలకికట్టుతో మంచంమీద కూర్చున్న రాజగోపాలాన్ని చూసి కల్యాణి విస్తుపోయింది.
తలుపుచప్పుడుకు తలఎత్తిన రాజగోపాలం ఆమెనుచూసి, మహానందంతో మంచందిగి ఎదురువచ్చేడు.
"నిన్ను కష్టపెట్టినందుకు వెంటనే కలిగిందోయి శిక్ష.”
గతర్యాతి భోజనంచేసి వస్తూండగా హోటలుప్రక్కనే బిసెంటు రోడ్డుమీద పదిమంది మీదపడి కొశ్వేరు.
కాని జనం వెంటనే చుట్టాచేరడంతో
పారిపోయారు. రెండు దెబ్బలే తగిలేయి.
కొట్టినవాళ్ళావరో, ఎందుకుకొన్పేరో తెలుసు. భజనసమాజంవాళ్ళుని చాలమంది గుర్తు పశ్వేరు.
తానెవ్వరినీ ఎరగడు. చూడలేదు
రూడా. ఏమనికేస? ఎవరిమీద? చూసి కేసుపెట్టినా పోలీసులచేతిలో అది సరిగ్గా నడుస్తుందనే
నమ్మకం లేదు. తిన్నగా రిక్షా
చేసుకొని డాక్టరు మంజులత ఇంటికి వచ్చేడు.
"కల్యాణీ! లాభంలేదు. మంజులతా నేనూ ఆలోచించాం. నీకభ్యంతరంలేకుంకే వెంటనే పెళ్ళి
చేసుకోమంది. నాకు నచ్చింది. కశైులిగ్రాం
ఇచ్చాను. నువ్వు కాదనకు, కల్యాణీ! నిన్న, మొన్న నా హితచింతకులు పెట్టిన ఇబ్బంది ఈ
కరదెబ్బల కన్న ఎక్కువబాధ
కలిగించింది. నేను ఆ క్షణంలో ఏమన్నా అనివుంకే క్షమించు....”
కల్యాణి ఆతనిహృుదయంమీద తలవాల్సి కన్నళ్ళుతోనే తన మనస్సును సూచించింది.
"కల్యాణీ! 77
రాజగోపాలం ఆమెగడ్డం పట్టుకొని తలకైకెత్తేడు.
ముష్పయ్యునిమిదో ప్రకరణం
నాలుగున్నరకే జనం డాబామీదకు చేరుకున్నారు. ఆకాశం మబ్బుకమ్మి చల్లగావుంది. ఎండ
తెలియడంలేదు.
"మళ్ళీ వర్తంవస్తుందేమో, ఆలస్యం ఏమిటి?” - అని నాలుగుదిక్కులనుండీ ప్రశ్నలు వచ్చాయి.
భాస్కరరావు క్రిందినుంచి వచ్చేడు.
"పారంభిద్దామా?”
సభ ఆమోదం తెలియబరచగానే ఆతడే నారాయణరావును కుర్చీలోకి ఆహ్వానించేడు.
"వీరు మా బావగారు. పెద్దవుద్యోగస్తులు. "
ఉద్యోగస్తుని ఠీవి ప్రకటిస్తూ నారాయణరావు చిరునవ్వుతో బల్లవద ఒకకుర్చీలో కూర్చున్నాడు.
భాస్కరరావు యథ్యాకమంలో ఆతనిని సభికులకు ఎరుకపరచేడు. ఆతని గాథనంతనూ సవివరంగా
చెప్తూంకే ఏమిటిదంతా అనిపిస్తున్నా
సభామర్యాదకు భంగం కలిగించలేకపోయేడు.
ఒకటిరెండుమార్లు భావసూచకంగా బల్లమీద వేలితో వాయించేడు. కాని భాస్కరం వినిపించుకోలేదు.
ఆతని దృష్టి అంతా మెట్లమీద వుంది.
పెళ్ళికూతురు వచ్చేవరకూ బాతాఖానీ వేస్తున్నట్లు [గ్రహించి నారాయణరావు ఇంక తొందరపెట్టడం
మానోడు.
"వీరు పదిహేనేళ్ల అనంతరం దేశంలోకి వచ్చేరు. ఈమథధ్యలో ఒకమారు వచ్చేరట. కాని వారిదర్శనం
చెనుకోగలభాగ్యం మాకు
లఅభించలేదు....”
మెట్లమీద మంజులత తల కనబడింది. ఇంక తొందరగా విషయానికి దిగవలసిన అవసరం కలిగింది.
"ఈవేళ వుదయమే మా చెల్లెలియింటికి వచ్చారు. పెదతవ్వరూ లేరు. నోనో చొరవ తీసుకున్నా.
వారంగీకరించారు. వెంటనే ఈ
ఏర్పాట్లు చేయవలసివచ్చింది. ఏమంకే వారు రేపు వెళ్ళిపోతామన్నారు. ఈ అల్పువ్యవధిలో. ...”
మెట్లమీద తలకట్టు కనబడింది.
"మిమ్శుల్నుందర్నీ పిలిచాను. దయవుంచి వచ్చిన మీ అందరికి కృతజ్ఞత.”
"మాచెల్లెలు కల్వాణికీ, చిరంజీవి రాజగోపాలానికీ ఇప్పుడు వివాహం జరుగుతుంది. అధ్యక్షులు శ్రీ
నారాయణరావుగారు ప్రథమంలో
దంపతులనాశీర్వదిస్తారు. వారు తమ సూచనను స్వయంగానే అమలుజరపగల అవకాశం
లభించినందుకు వారితోపాటు మాకూ చాలసంతోషంగా
వుంది.”
వధూవరులు చిరునవ్వుతో సభ్యుల శుభాకాంక్షలనందుకుంటూ కేబిలువద్దకు వస్తున్నారు. సభ
కరతాళథధ్వనులతో దద్దరిల్లిపోతూంది.
నారాయణరావు దిగ్రుమచెందేడు. కోపం వచ్చింది. మోసపోయానని దుఃఖం కలిగింది. కాని,
చేయగలదిలేదు. ఆ సమయంలో తాను ఏమాత్రం
అల్లరి చేయబోయినా అపహాస్యం పాలయిపోతాడు. తన హోదా, ధనం ఏవీ తనను కాపాడలేవు.
భాస్కరరావు తనను పరిచయం చేస్తూనో
తనను తన్నినా ఎవ్వరూ విచారపడకుండేటంత వాతావరణం సృష్టించి పెక్పేడు. చప్పుట్లు కోలాహలం
మధ్య భాస్కురానికే వినబడేటంత
నెమ్మదిగా పళ్ళు కొరికేడు.
"దొంగదెబ్బు తీసేవు. రాస్కెల్! మీరు కమ్యూనిస్తులున్నారే దేశానికే కాదు, హిందూధర్మానిక్కుడా
శత్రువులే. (దోహులు!”
భాస్కరరావు చిరునవ్వు నవ్వేడు.
"కట్టుకొన్న పెల్లాన్ని వదితఆయ్యడం, ఇష్టం లేని పడుచుల్ని బెదిరించి, 'బ్లాక్మైల్' చేసి
లొంగతీసుకోవడం
హిందూధర్మం బోధిస్తూన్నట్లయితే నోచేస్తున్నదాంట్లో ఏం తప్పులేదు.”
Leave a Comment